రాబోయే ఐదేళ్ల కాలంలో నిరంతరము గ్రామాభివృద్ధికి కృషి
సర్పంచుల చేతుల్లోకి పాలన పగ్గాలు
స్వాగతం పలుకుతున్న సమస్యలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో మూడో విడత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. దాదాపు రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీల పాలకవర్గానికి నేడు గ్రామపంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు మెజార్టీ గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుక నున్నాయి 22 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక ప్రగతి పనులు కుంటుపడ్డాయి ఇక సమస్యల సమయం ప్రజలకు ఇచ్చిన హామీలు అభివృద్ధి పనులు ప్రధమ పౌరులకు సవాలుగా నిలువనున్నాయి.
ప్రమాణమే ప్రామాణికం
కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారమే ప్రామాణికంగా గుర్తిస్తారు పంచాయితీ ఎన్నికల చట్టం కింద మూడో విడత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారికి ప్రిసైడింగ్ అధికారులు గుర్తింపు పత్రాన్ని మాత్రమే ఇస్తారు ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎజెండా, రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. అనంతరం సర్పంచులు, ఉపసర్పంచులు వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత రిజిస్టర్ లో సంతకాలు చేసిన తర్వాతనే వారినీ పాలక వర్గాలుగా గుర్తిస్తారు ఈరోజు నుండి పదవీకాలం లెక్కలోకి వస్తుంది.
స్వాగతం పలుకుతున్న సమస్యలు
కొత్తగా కొలువు తీరుతున్న పంచాయతీ పలకవర్గాలకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి దాదాపు రెండేళ్లుగా పంచా యతీల ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నా యి. సోమవారంతో ప్రత్యేక అధికారులపాలన ముగిసి కొత్త పాలకవర్గాలు అధికారంలోకి వచ్చారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించనీ కారణంగా ప్రత్యే క అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి 22 నెలలుగా వారి పాలనలో పంచాయతీలు కొనసాగుతున్నాయి ఇంత కాలం పాలక వర్గాలు లేకపో వడంతో గ్రామాల్లో అనేక సమస్యలు పెరిగిపోయాయి. ఎన్నికలు సకాలంలో నిర్వహిం చక పోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయా యి రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఇవ్వలేకపోయింది పేరుకే ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ పంచాయతీల నిర్వహణ భారం అంతా కార్య దర్శులు మొయ్యకతప్పలేదు పంచాయతీ కార్య దర్శులు కూడా తమకు సాధ్యమైనంత వరకు నెట్టు కోచ్చారు కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకా రంతో కార్యదర్శులకు ఇబ్బం దులు తప్పనుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలయితే గాని పంచాయతీల సమస్యలు తీరుతాయి
