రాబోయే ఐదేళ్ల కాలంలో నిరంతరము గ్రామాభివృద్ధికి కృషి…

రాబోయే ఐదేళ్ల కాలంలో నిరంతరము గ్రామాభివృద్ధికి కృషి

సర్పంచుల చేతుల్లోకి పాలన పగ్గాలు

స్వాగతం పలుకుతున్న సమస్యలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో మూడో విడత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. దాదాపు రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీల పాలకవర్గానికి నేడు గ్రామపంచాయతీలో ప్రమాణ స్వీకారం చేశారు సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు మెజార్టీ గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుక నున్నాయి 22 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక ప్రగతి పనులు కుంటుపడ్డాయి ఇక సమస్యల సమయం ప్రజలకు ఇచ్చిన హామీలు అభివృద్ధి పనులు ప్రధమ పౌరులకు సవాలుగా నిలువనున్నాయి.

ప్రమాణమే ప్రామాణికం

కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారమే ప్రామాణికంగా గుర్తిస్తారు పంచాయితీ ఎన్నికల చట్టం కింద మూడో విడత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారికి ప్రిసైడింగ్ అధికారులు గుర్తింపు పత్రాన్ని మాత్రమే ఇస్తారు ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎజెండా, రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. అనంతరం సర్పంచులు, ఉపసర్పంచులు వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత రిజిస్టర్ లో సంతకాలు చేసిన తర్వాతనే వారినీ పాలక వర్గాలుగా గుర్తిస్తారు ఈరోజు నుండి పదవీకాలం లెక్కలోకి వస్తుంది.

స్వాగతం పలుకుతున్న సమస్యలు
కొత్తగా కొలువు తీరుతున్న పంచాయతీ పలకవర్గాలకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి దాదాపు రెండేళ్లుగా పంచా యతీల ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నా యి. సోమవారంతో ప్రత్యేక అధికారులపాలన ముగిసి కొత్త పాలకవర్గాలు అధికారంలోకి వచ్చారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించనీ కారణంగా ప్రత్యే క అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి 22 నెలలుగా వారి పాలనలో పంచాయతీలు కొనసాగుతున్నాయి ఇంత కాలం పాలక వర్గాలు లేకపో వడంతో గ్రామాల్లో అనేక సమస్యలు పెరిగిపోయాయి. ఎన్నికలు సకాలంలో నిర్వహిం చక పోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయా యి రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఇవ్వలేకపోయింది పేరుకే ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ పంచాయతీల నిర్వహణ భారం అంతా కార్య దర్శులు మొయ్యకతప్పలేదు పంచాయతీ కార్య దర్శులు కూడా తమకు సాధ్యమైనంత వరకు నెట్టు కోచ్చారు కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకా రంతో కార్యదర్శులకు ఇబ్బం దులు తప్పనుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలయితే గాని పంచాయతీల సమస్యలు తీరుతాయి

విద్యుత్ షాక్‌ కు గురైన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే…

విద్యుత్ షాక్‌ కు గురైన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మాందా రిపేట గ్రామంలో ఇటీవల ప్ర మాదవశాత్తు దారంగుల పాణి విద్యుత్ షాక్‌కు గురై ఆసు పత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటు న్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు స్వయంగా బాధి తుడి ఇంటికి వెళ్లి పరామ ర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసు కున్నారు. బాధిత కుటుం బానికి అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై సంబం ధిత అధికారులు సమగ్ర విచా రణ చేపట్టి తగిన చర్యలు తీ సుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలిం చారు. ఇళ్లపై నుండి ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ ను చూశా రు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఉన్నతాధికా రులకు ఫోన్ చేసి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగింది.

శాయంపేటలో నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభం

*బుజ్జగింపులు..బేరసారాలు*

*నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ*

*గెలుపు గుర్రాలపై పార్టీల దృష్టి*

 

శాయంపేట నేటిధాత్రి;

 

శాయంపేట మండల కేంద్రంలో ఎన్నికల నామినేషన్ల ఉపసం హరణ కోసం బుజ్జగింపులు బెరసారాలు మొదలయ్యాయి గెలిచే అభ్యర్థులపై పార్టీలు దృష్టి పెట్టారు దీంతో బుజ్జగిం పులు బేరసారాలు కొనసాగు తున్నాయి మండలం మొత్తం మూడో విడత సర్పంచ్ స్థానా లకు మొత్తం 183 నామినే షన్లు, వార్డు స్థానాలకు 562 నామినేషన్లు అందాయి. ఉప సంహరణ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగియనుంది నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఆందోళన మొదలైంది ప్రతి పార్టీ నుంచి ఆయా గ్రామాల్లో రెండు లేదా మూడు అభ్యర్థు లు బరిలో ఉన్నారు గ్రామస్థా యి కార్యకర్తలు ఎండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోసం ఎదురుచూస్తున్నారు నామినే షన్ల పర్వం ముగియడానికి తక్కువ సమయం ఉంది కావు న సీనియర్లు బుజ్జగింపు పర్వా న్ని ముమ్మరం చేశారు. గెలుపు గుర్రాల పై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి.

సoగ్రామానికి వేళాయే..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T155614.418.wav?_=1

 

 

సoగ్రామానికి వేళాయే..

పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు షురూ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొద లైంది జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఇటీవల ఎన్నికల తేదీలు ప్రకటించడం వల్ల మండలం, గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పార్టీ బలాబలాలు, వారి ఊహాలు రచించడంలో ముందున్నారు. మూడో విడుదల ఎన్నికల్లో భాగంగా మండలంలో 24 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల కోసం రేపు బుధవారం రోజున నామి నేషన్లు స్వీకరిస్తారు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలు ఏర్పాటు చేశారు

లోకల్ ఫైట్ షూరూ

శాయంపేట మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి భాగంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గ్రామ సర్పంచ్ ఎన్నికలు మరింత రసవత్తంగా మారాయి అభ్యర్థులు ఓట ర్లను ఆకర్షించేoదుకు ముం దుకు రావడం ఎప్పుడు చర్చనీయంగా అంశంగా మారాయి. పార్టీ లందరూ ప్రజలందరిని ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల కేటాయింపు ప్రజల ఆధారంగా ఇవ్వాలని ప్రముఖ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి కాబట్టి లోకల్ ఫైట్ రసవత్తంగా సాగుతుంది ప్రజలు ఆలో చనలో పడ్డారు.

ఉద్యోగులు ప్రచారం జోలి కెళ్లొద్దు

గ్రామపంచాయతీ ఎన్నికల వేల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే. విద్య, వైద్య ఆరోగ్యశాఖ, ఐకెపి, ఆరోగ్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు పి ఆర్టీలు రిసోర్స్ పర్సనల్ పనిచేసే వారందరికీ ఎన్నికల నియమావళి వర్తిస్తుంది వీరు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన వీరి ఓటు హక్కును సాధారణ ఓటరుగా మాదిరిగా వినియోగించుకోవచ్చు. కానీ సాధారణ ప్రజానీకం మాదిరిగా ఏ పార్టీకి అనుకూలంగా ప్రచా రం చేయకూడదు. కానీ నచ్చి న పార్టీకి వ్యక్తి వెంట ప్రచారం లో సభలు సమావేశాలు విం దులు, వినోదాల్లో పాల్గొంటే వేటుపడుతుంది.

తెలంగాణ ఒలంపియాడ్‌లో జడ్ పిహెచ్ఎస్ బాలికల మెరిసిన ప్రతిభ

ప్రతిభ కనబరిచిన జడ్ పిహెచ్ఎస్ బాలికలు

శుభాకాంక్షలు తెలిపిన ఉపాధ్యాయులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో ఆంగ్ల భాష ఉపాధ్యాయులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి తెలంగాణ ఒలంపియాడ్ పరీక్షలో శాయంపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠ శాల పదవ తరగతి చదువు తున్న దీవెన మొదటి బహు మతి సాధించి, ఎడ్యుక్వాస్ట్ సీనియర్ విభాగంలో ఎండి రేష్మ మొదటి బహుమతి సాధించగా,జూనియర్ విభాగంలో రుక్మిణి ప్రథమ బహుమతి సాధించింది. నాలుగు బహుమతులకు గాను మూడు బహుమతులు పాఠశాల విద్యార్థులు సాధిం చారు. ఈ విద్యార్థులు జిల్లా స్థాయికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు శేఖర్ బాబుకు, బహుమతులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు శ్రీలత శుభాకాంక్షలు తెలియజేశారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T154510.495.wav?_=2

 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కేంద్రాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి

భూపాలపల్లి ఎమ్మెల్యేగండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏండ్లుగాఎన్నడూ లేని
విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యానికి రూపాయలు 500 బోనస్ ప్రకటించారని అన్నారు రైతుల పండించిన పంటను 17% తేమ మించ కుండా ప్రభుత్వం ద్వారా కేటా యించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల న్నారు రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టు బాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారు లకు ఎమ్మెల్యే సూచించారు.

లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శాయంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.62,07,192 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేద, నిరుపే ద కుటుంబాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభు త్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుం దని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేటమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 16 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.5,70, 600 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకో లేక ఆర్ధిక ఇబ్బందులు పడు తున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమ యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అనంతరం రైతులకు మొక్కజొన్న సబ్సిడీ విత్తనా లను అందజేశారు. ఈ కార్యక్ర మాలల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా, మం డల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చారి పై విమర్శలు సరికా దు…అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం…

చారి పై విమర్శలు సరికా దు…అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

శాయంపేట నేటిధాత్రి;

కాంగ్రెస్ అంటేనే మోసమని అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అందర్నీ గోసపెడుతున్నదని టిఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తారు మాజీ స్పీకర్ మధుసూదనా చారి పై విమర్శలు సరికాదని సూచించారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలతో అబద్దాలు ఏర చూపి
ప్రజల ఓట్లతో గెలిచి రైతులను మభ్యపెట్టి ఇచ్చిన హమీలు అమలు చేయక రైతాంగాన్ని నిట్ట నిలువునా దోపిడీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.700 మంది రైతుల ఆత్మ హత్యలకు, 400 మంది ఆటో కార్మికుల ఆత్మహ త్యలకు, గురుకుల విద్యార్థుల మరణాలకు కారణం, మేధా తుఫాన్ వల్ల వేలాదిఎకరాలలో వరిధాన్యం పత్తి మిర్చి పంటలకు జరిగిన నష్టాన్ని చూసి చలించి పరామర్శిం చడానికి వచ్చిన శాసనమం డలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనచారిని నిత్యం పార్టీలు మార్చే వంగి మాధులు విమర్శిచడం సిగ్గుచేటు అన్నారుబీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్ అన్నారు
ప్రతిపక్ష నేత ఆకాల వర్షానికి పంట నష్టాపోయిన రైతుల వ్యవసాయ వరిపోలాలను ఇప్పటివరకు ఏ నాయకుడు మరియు అధికారులు పర్యావే క్షించిన దాఖలాలులేవు పంట నష్టాన్ని క్షేత్రస్ధాయిలో అధికా రులు తిరిగి నష్టపోయిన రైతాంగాన్ని అదుకోని ఏకరానికి 25000 ల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ కానీ భూపాలపల్లి ని జిల్లా స్ధాయికి తీసుకవచ్చి 3000 ల కోట్లాతో అభివృద్ధి చేసిన ఘనత మధుసూధ నచారి.కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే చిల్లర మాటలు మానుకొని ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు కాంగ్రెస్ పార్టీ లో గతంలో పోటిచేసిన నాయకులు డిపాజిట్ రాని వారు కుడా ఉన్నారు అది మరిచి స్ధానాల గురించి మాట్లడటం వారి విజ్నతకే వదిలేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్ పల్లేబోయిన సారయ్య. మార్క సుదర్శన్. గజ్జి శంకర్
యువనాయకులు కొత్తగట్టు సాయిక్రిష్ణ అరికిళ్ల విజయ్ బూర విజయ్ తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల పనులు పరిశీలన…

ఇందిరమ్మ ఇండ్ల పనులు పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి

శాయంపేట నేటిధాత్రి;

 

శాయంపేట మండలం ఆరేపల్లె, శాయంపేట మండల పరిధిలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులు శుక్రవారం సిఈఓ జెడ్పి ఇన్చార్జ్ రవి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పై ఏమాత్రం రాజీపడకుండా ప్రతి దశలో పనులు వేయంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక మట్టి లబ్ధిదారులకు అందజే యాలని అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇళ్ళను ప్రతి ఒక్క లబ్ధిదా రుడు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర, మండల అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు.

జోగంపల్లిలో పశువైద్య శిబిరం…

జోగంపల్లిలో పశువైద్య శిబిరం

శాయంపేట నేటిధాత్రి;

 

శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్.సునిల్ మరియు ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 105 తెల్లజాతి పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం ప్రజ్వాల్ సంస్థ ప్రతినిధి ఎండి అనిఫా మాట్లా డుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పలేవని ముందు జాగ్రత్తగా రైతులు నివారణకు టీకాలు వేసుకొని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రమేష్ బాబు వి ఎల్ వో, రవి జె వివో సదానందం వి ఏమరియు గ్రామ రైతులు ఏదుల. గంగయ్య లక్కం రవీందర్ గోరంటల. ఓదెలు, శంకరయ్య ఈజీగిరి. రవి గోరంటల. సాంబ య్య పల్లెబోయిన రఘు కౌటం. ప్రభాకర్ మారబోయిన మల్ల య్య చెక్క కొమురయ్య నవయుగ సొసైటీ డైరెక్టర్ లక్కం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రే షియా ప్రకటించాలి

*బిజెపి మండల అధ్యక్షుడు
నరహరిశెట్టిరామకృష్ణ*

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్య క్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ మండల పరిధిలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పత్తి, మొక్కజొన్న, మరియు వరి పంటలు తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. పంటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశె ట్టి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన మాట్లాడుతూ రైతు కష్టానికి విలువ ఇచ్చే ప్రభు త్వం కావాలి కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైపో యింది. వేలాది ఎకరాల్లో పంటలు నాశనం అయినా, ఇప్పటివరకు ఎలాంటి పంట నష్ట నివారణ చర్యలు తీసు కోలేదని ప్రభుత్వం రైతుపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం అని తెలిపారు. బిజెపి తరఫున డిమాండ్లు ప్రతి నష్టపోయిన రైతుకు నష్టపరిహారం తక్షణం ప్రకటించాలి, పంట బీమా పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి,రాబోయే పంట సీజన్ కోసం విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలి, నష్టపోయిన గ్రామాలను సర్వే చేయించి మండలాన్ని దుర్ఘట ప్రభావిత మండలంగా గుర్తించి రాష్ట్ర బృందం ద్వారా అంచనా వేయించాలి.ప్రభుత్వం స్పందించకపోతే, బిజెపి రైతులతో కలిసి రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. రైతు అన్నదాత అతనిని రక్షించడం ప్రభుత్వ ధర్మం. ఈ ధర్మాన్ని విస్మరించిన ప్రభుత్వా నికి రైతులు తగిన గుణపాఠం చెబుతారు. బిజెపి ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుందని
రైతుల కష్టాన్ని గుర్తించని ప్రభుత్వం, ప్రజల కష్టాన్ని ఎలా గుర్తిస్తుందని తెలపడం జరిగింది.

మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం….

మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

మహిళలు ఆర్థికపరంగా అన్ని రంగాల్లో ముందుండాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సబ్సిడీపై మత్స్యకారులకు వాహనాన్ని అందించారు మత్స్యకారులకు 10.5 లక్షల విలువ గల వాహనాన్ని సబ్సిడీపై 6 లక్షలకు ప్రభుత్వం అందించింది మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి పెట్రోల్ బంక్ , మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ వ్యాపా రుల అభివృద్ధి చెందే విధంగా మహిళలు ఆర్థికంగా ఎదగ డానికి మహిళలకు తోడ్పడు తుంది మహిళలు వ్యాపార పరంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేస్తుంది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలు, మహిళలు అధిక మొత్తంలో పాల్గొన్నా

.స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం…

.స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2000- 2001 పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ తోటి స్నేహితుడు కరీం పాషా తండ్రి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా మిత్రులందరు కలసి పదివేల ఆర్థిక సాయంను అందించారు. వారు మాట్లాడుతూ తమ మిత్రుల కుటుంబాల్లో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగిన తమ వంతు సహాయం అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిత్రులు కొమ్ముల భాస్కర్, శ్రావణ్, రమేష్ , చందర్ , దేవేందర్ , రమేష్ , కిషన్ తదితరులు  పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం: బీసీ జేఏసీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T133719.365.wav?_=3

 

బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం: బీసీ జేఏసీ

బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బిజెపిదే :మండల కాంగ్రెస్ కమిటీ

శాయంపేట నేటిధాత్రి:

 

బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు కల్పించకుండా రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని నిర సిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘా లను కలుపుకొని శాయంపేట మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటు వంటి అన్ని పార్టీలు బిసి బంద్ ను స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడంతోనే 100% బీసీలకు బంద్ విజయవంతం చేయడం జరిగింది. దానికి తోడు అన్ని సంఘాలు ఏకమవడం బిసి ఉద్యమానికి మరియు బందు కు మరింత బలాన్ని చేకూ ర్చింది, కామారెడ్డి డిక్లరేషన్ లోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% శాతం కల్పించాల్సిన అవసరం ఉంది బంద్ ఫర్ జస్టిస్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది స్వచ్ఛందంగా దుకాణాలు,

విద్యాసంస్థలు బందు పాటిం చి మద్దతు ఇవ్వడాన్ని హర్షి స్తూ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఈ ఉద్యమం జరిగిందని భవి ష్యత్తులో బీసీల హక్కులను సాధించేందుకు తోడ్పడుతుం దని అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు కలిసికట్టుగా బిసి హక్కుల కోసం పోరాడాలని స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో 42% వాటా అమలు ఆయ్యేదాకా పోరాటం ఆగదని మనమెంతో మనం మనకంత వాటాన్ని సాధిం చేవరకు ఉద్యమం ఆపద్దని పిలుపునివ్వడం జరిగింది అనంతరం వివిధ పార్టీల నాయకులతో పెద్ద ఎత్తున మాందారిపేట ప్రధాన రహ దారిపై రాస్తా రోకో నిర్వహిం చడం జరిగింది

ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల మెంబర్ బాసాని చంద్రప్రకాష్, మాది మార్కెట్ చైర్మన్ పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల మార్కె ట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీం దర్, మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి, అబ్బు ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కొమ్ముల భాస్కర్ దుబాసి కృష్ణమూర్తి, మారేపల్లి రాజు, మారపల్లి రాజేందర్, చిందం రవి, నిమ్మ ల రమేష్, బండారి పైడి, జిన్నా రాజేందర్, రేణికుంట్ల సదానం దం, రవి పాల్ వివిధ గ్రామాల నుం చి వచ్చిన కాంగ్రెస్ నాయ కులు మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

బాబోయ్… కుక్కలు, కోతులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T124926.707.wav?_=4

 

బాబోయ్… కుక్కలు, కోతులు

మనిషి కనిపిస్తే చాలు వెంటాడుతూ దాడులు

ప్రభుత్వ దావాఖానాలో పెరుగుతున్న కేసులు

జంకుతున్న ప్రజలు…. పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలంలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా మండలంలో కుక్కలు ,కోతుల బెడద తీవ్రంగా మారింది ఏ గ్రామంలో చూసినా కుక్కలు కోతుల దాడులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మనిషి కనిపిస్తే చాలు వెంటప డుతూ ఉన్నాయి దీంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కోతుల, కుక్కల బెడద తీవ్రం గా ఉన్న అధికారులు తమ కేమి పట్టనట్లుగా వ్యవహ రిస్తున్నారని విమర్శలు వెలు వెత్తుతున్నాయి. చిన్నారులు మరియు వృద్ధులు కుక్కల కోతుల దాడులకు బలవుతు న్నారు రాత్రి అయితే చాలు చెప్పనక్కర్లేదు వీధులు ప్రధాన రహదారిపై గుంపులు గుంపు లుగా సంచరిస్తూ మనిషి కని పిస్తేచాలు వెంటపడుతున్నా యి ద్విచక్ర వాహనాలను వదలడంలేదు మండలము మరియు పలు గ్రామాల్లోని ప్రజలు 300నుంచి 350 మంది దాకా ఆస్పత్రులు పాలయ్యా రు దీంతో రాత్రి వేళల్లో బయ టకు వెళ్లాలంటే ప్రజలు భయ పడుతున్నారు ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T124134.174.wav?_=5

 

ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం నేరేడుపల్లి గ్రామంలో గత రబీ సీజన్లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొను గోలు కేంద్రాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు విచారణలో తేల్చారు నేపథ్యంలో అధికా రుల ఫిర్యాదు మేరకు శాయం పేట పోలీస్ స్టేషన్ లో 21 మందిపై కేసు నమోదు కాగా ఇటీవల ఇద్దరినీ అరెస్ట్ చేశారు ఈ అక్రమాలకు ప్రధాన సూత్ర దారులైన ఒకటైన బండ లలిత ప్రధాన సూతదారి బెజ్జంకి శ్రీనివాస్ బంధువు వడ్లూరి రాజేందర్ బుధవారం పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్ తర లించారు మిగతావారు పరారీ లో ఉన్నారని మిగతా వారిని గాలిస్తున్నామని సీఐ రంజిత్ రావుఎస్సై పరమేష్ తెలిపారు.

వరి ధాన్యం సేకరణలో రూ.1.86 కోట్ల భారీ మోసం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-12T123741.088.wav?_=6

 

వరి ధాన్యం సేకరణలో రూ.1.86 కోట్ల భారీ మోసం

రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్ (టి జి ఎస్ సి ఎస్ సి ఎల్ ) చర్యలు

21 మందిపై శాయంపేట పిఎస్ లో కేసు నమోదు

శాయంపేట నేటిధాత్రి:

 

2024 – 25 రబీ సీజన్ కు సంబంధించి శాయంపేట మండల కేంద్రంతో పాటు శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యాలు కొనుగోలు కేంద్రాల్లో భారీ అవినీతి జరిగినట్లు గుర్తిం చారు సీజన్ ఐకెపి ఆధ్వర్యం లో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పెద్ద మోసం బయటపడింది. కొందరు అధికారులు మరియు ప్రైవేట్ వ్యక్తులు నకిలీ రైతు లను సృష్టించి ప్రభుత్వానికి నిజమైన రైతుల కోసం కేటా యించిన నిధులను మోసపూ రితంగా దోచుకున్నారు. నమ్మదగిన సమాచారంపై ఆధారంగా ఎన్‌ఫోర్స్‌ మెంట్ టాస్క్ ఫోర్స్(ఈ ఎఫ్ టి)చీఫ్ సీవీ & ఇ.ఓ. పర్యవే క్షణలో కమిషనర్ (సివిల్ సప్లైస్) ఆదేశాల మేరకు ఈ ఎఫ్ టి టీమ్-IV సమగ్ర విచారణ చేపట్టింది.ఈ విచారణలో శాయంపేట మరియు కాట్రపల్లి గ్రామాల ఐకెపి ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలలో (పీపీసీఎస్) పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది.ఈ మోసానికి బెజ్జంకి శ్రీనివాస్ సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ కమలాపూర్ (వి & ఎం) యజమాని ప్రధాన సూత్రధారి అని తేలింది. ఇతను తన కుటుంబ సభ్యు లు, మధ్యవర్తులు, వ్యవసా య శాఖ సిబ్బందితో కలిసి ఆన్‌లైన్ ప్యాడీ ప్రోక్యూర్‌ మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఒపీఎంఎస్) ద్వారా 12 నకిలీ రైతుల పేర్లను సృష్టించాడు.

ఈ నకిలీ రైతులు 278 ఎకరాల్లో పంట పండించారని, 8,049.6 క్వింటాళ్ల ధాన్యం సరఫరా చేశా రని రికార్డుల్లో చూపించారు. కానీ వాస్తవానికి ఒక్క క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చెయ్యలేదు.ఈ మోసపూరిత లావాదేవీల ద్వారా రూ.1,86,63,088/- (ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు) ప్రభుత్వ ఖాతాల నుంచి నకిలీ రైతుల పేర్లతో మోసపూరితంగా బదిలీ చేయబడ్డాయి.వీరిలో బండ లలిత మధ్యవర్తిగా పనిచేసి ఒపీఎంఎస్ లో నకిలీ ఎంట్రీలు చేయడంలో సహకరించింది. వంకుదోత్ చరణ్ – ప్రైవేట్ ట్యాబ్ ఆపరేటర్, వ్యవసాయ అధికారుల లాగిన్ వివరాలు దొంగిలించి ఒపీఎంఎస్ లో అక్రమంగా లాగిన్ అయ్యాడు. హైమావతి ఐకెపి శాయంపేట పిపిసి ఇన్‌చార్జ్,తన అధికారిక ట్యాబ్‌ను అనధికారికంగా ఇత రులకు వినియోగానికి ఇచ్చిం ది..అనిత –ఐకెపి కాట్రపల్లి పి పి సి ఇన్‌చార్జ్, ఇదే విధంగా తన ట్యాబ్‌ను ఉపయోగించేం దుకు ఇచ్చింది.వ్యవసాయ అధికారులు (ఎ ఓ & ఎ ఈ ఓ లు)కె. గంగా జమున (ఎ ఓ), అర్చన మరియు ఎం. సుప్రి యా (ఎఈఓ లు) లాగిన్ వివరాలు పంచుకోవడం మరియు ధృవీకరణ నియమాలను లెక్కచేయకపో వడం ద్వారా మోసానికి పాల్పడ్డారు.రవాణా కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్ రావు 27 ట్రక్ షీట్లకు రవాణా చార్జీలు క్లెయిమ్ చేసుకున్నాడు, కానీ వాస్తవంగా ఒక్క ట్రక్ కూడా రవాణా చేయలేదు. నకిలీ ట్రక్ షిట్లు, టోకెన్ బుక్స్ తయారు చేసి బియ్యం రవాణా జరిగిన ట్టు రికార్డుల్లో చూపించా రు.ఇలా కాగితాలపై మాత్రమే రవాణా చూపి కార్పొరేషన్ నుంచి భారీ మొత్తాలను అక్రమంగా పొందారు. నకిలీ రైతుల సంఖ్య 12, తప్పుడు భూ సమాచారం 278 ఎకరా లు, తప్పుడు ధాన్యం పరిమా ణం 8,049.6 క్వింటాళ్లు
అక్రమంగా క్లెయిమ్ చేసిన మొత్తం ₹1,86,63,088/-,
బోనస్ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం ₹500 ప్రతి క్వింటా కు. భారతీయ న్యాయ సంహిత (బి ఎన్ ఎస్), సంబం ధిత చట్టాల ప్రకారం అందరి మీద న్యాయపరమైన చర్యలు సిఫార్సు చేయబడ్డాయి. అక్ర మంగా పొందిన రూ.1.86 కోట్లు మరియు రవాణా చార్జీలు వెంటనే వసూలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.12 నకిలీ రైతు లకు బోనస్ చెల్లింపులు నిలిపి వేయబడ్డాయి.నకిలీ భూసమా చారాన్ని ఓపిఏం ఎస్ పోర్టల్ నుండి తొలగించాలని ఆదేశిం చారు.ఈ కేసు ధాన్యం కొను గోలు వ్యవస్థలో ఉన్న మిల్లర్లు, మధ్యవర్తులు, వ్యవసాయ అధికారులు, పీపీసీ ఇన్‌చా ర్జీలు కలసి చేసిన అవినీతిని బహిర్గతం చేసింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రజా నిధులను కాపాడేందుకు, పారదర్శకతను కాపాడేందుకు కఠిన చర్యలు చేపట్టింది.ఇలాం టి వ్యక్తుల ఉనికి కొనుగోలు వ్యవస్థను దెబ్బతీస్తుంది. నిజమైన రైతుల ప్రయోజనా లను దెబ్బతీస్తుంది. అందు వల్ల, కేవలం అధికారిక సిబ్బంది, నమోదు చేసిన రైతులు, పీపీసి సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మాత్రమే పి పి సి ఆపరేషనల్ ప్రాంతా లకు ప్రవేశం కలిగి ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలి. తదుపరి విచారణ మరియు క్రిమినల్ కేసు దర్యాప్తు హనుమకొండ జిల్లా సివిల్ సప్లైస్ శాఖ పర్యవేక్షణలో శాయంపేట పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు

పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత

ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ

కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ

ఒక్కొక్క దరఖాస్తుకు 3 లక్షల రూపాయలు

శాయంపేట నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

2025- 27 లైసెన్స్ కాలానికి మద్యం దుకాణాల నిర్వహ ణకు నోటిఫికేషన్ జారీ చేసింది గతంలో మాదిరిగా 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫి కేషన్ వెల్లడించారు రెండు సంవత్సరాల కాలపరిమితికి లాటరీ ద్వారా మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానించడం జరుగుతుంది ఈ ఏడాది 1 డిసెంబర్ 2025 నుండి 30 నవంబర్2027 రెండేళ్ల వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. జతపరచవలసిన పత్రాలు దరఖాస్తు ఫారం, మూడు లక్షల రూపాయల డీడీ లేదా చాలాన్, మూడు కలర్ పాస్ ఫోటో సైజు, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ( గౌడ్, ఎస్ టి, ఎస్ సి) దరఖాస్తుల సమ ర్పణ జిల్లా ఎక్సైజ్ అధికారి కార్యాలయం తారా గార్డెన్ దగ్గర సుబేదారి హనుమకొండ. చివరి తేదీ 18 అక్టోబర్ 2025 సాయంత్రం ఐదుగంటల లోపు సమర్పించవలెను.

బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్…

బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్

పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం

గాడిన పెడ్తున్న ప్రభుత్వం పై విమర్శలు సిగ్గుచేటు

కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త నాటకా నికి తెరలేపారని కాంగ్రెస్ మం డల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి విమర్శిం చారు. శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బాకీ కార్డులు పంపిణీ చేసిన నేప థ్యంలో సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి పిఎసిఎస్ భవన నిర్మాణం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భూ మి పూజ చేసిన శిలాఫలకం వరకు పాదయాత్ర చేసి అట్టి శిలాఫలకం వద్ద పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించారు .

తదనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయాలని ఉద్దేశంతోటే ఇస్తారన్నారు మిగులు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశా రని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్న క్రమంలో పాలనలో కనీసం రెండేళ్లు పూర్తికాకుండానే తమ ఉనికి కోసం బురద జల్లే ప్రయ త్నం చేస్తున్నారని అన్నారు. 22 నెలల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు రుణ మాఫీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్, సుమారు 60 వేల ఉద్యోగ కల్పన, రేషన్ కార్డుల పంపిణీ హామీలు అమలు అవుతున్నాయని, మేనిఫెస్టోలో లేని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం సైతం అమలు జరుతుందని, ఈ పథకాలు బీఆర్ఎస్ నాయకులకు కూడా అమలయ్యాయని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ బాకీలు:

పదేళ్లు అధికారంలో ఉండి ఇంటికొక ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ లు, కేజీ టు పీజీ విద్య, పోడు భూముల పట్టాలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ముస్లిం లకు రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణరెడ్డి బాకి

శాయంపేట మండలానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎంతో బాకి పడ్డారు. కాంగ్రెస్ కార్య కర్తల కష్టంతో గెలిచి,వారి సతీమణికి పదవితెచ్చుకు న్నారే తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పిఎసిఎస్ భవనానికి శిలాఫలకం వేసి నిధులున్నా కట్టించలేని అసమర్థులు. పిఎసిఎస్ లో మాజీ పాలకవర్గ సభ్యులు అయిన గండ్ర వెంకట రమణా రెడ్డి అనుచరులు 15 లక్షల రూపాయల అవినీతికి పాల్పడి సొసైటీకి బాకీ పడితే అవి రికవరీ చేయించలేని అసమర్ధ నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి . అట్టి రూపాయ లను వెంటనే రికవరీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లా డాలని మేము డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన వారికి 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రొసీ డింగ్స్ తెచ్చి కట్టిస్తా అన్నారు. కట్టించారా!డ్రైనేజీలు లేని రోడ్డు వేసి స్థానికులను ఇబ్బం దులు పెట్టడం వాస్తవం కాదా!సుమారు 200 డబుల్ బెడ్రూ మ్ లకు శిలాఫలకాలు వేశారు కట్టించారా!జిపి భవనాలకు శిలాఫలకాలు వేశారు కట్టించారా.మండల ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే అంబులెన్స్ కావాలని అడిగితే డీజిల్ ఎవరు పొయ్యాలి. ఎవరు నడపాలి.అని అవహేళనగా మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీటికి సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-27T143317.126.wav?_=7

 

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

అధిక సంఖ్యలో పాల్గొన్న పద్మశాలి కులస్తులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుక లను పద్మశాలి కులస్తులతో పాటు, బీసీ కులస్తులు పాల్గొని నివాళులర్పించారు. అనంత రం గ్రామ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బేసి కులాల హక్కుల సాధనకోసం పోరా డిన మహనీయుడని, తెలంగా ణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను గుర్తించి ఆయన జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతరత్న బిరుదును కూడా ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభు త్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మండల శాఖ అధ్యక్షులు వంగరి సాంబయ్య, పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, పద్మశాలి జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ బాసని బాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు బాసని ప్రకాష్, నాయకులు రంగు మహేందర్, చిందం రవి,బాసని మార్కండేయ, శాంతా రవి, వలపదాసు చంద్రమౌళి,మామి డి మారుతి, బాసని సాయి కృష్ణ, తుమ్మ ప్రభాకర్, బాసని చంద్రమౌళి, శ్రీనివాస్, పరిమ ళ్ళ నోములేష్, చిందం సాయి బాసని అఖిల్, చల్లా శ్రీనివాస్, బత్తుల శ్రీధర్,బీసీ నాయకులు వినుకొండశంకరాచారి, తదిత రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version