జోగంపల్లిలో పశువైద్య శిబిరం…

జోగంపల్లిలో పశువైద్య శిబిరం

శాయంపేట నేటిధాత్రి;

 

శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్.సునిల్ మరియు ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 105 తెల్లజాతి పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం ప్రజ్వాల్ సంస్థ ప్రతినిధి ఎండి అనిఫా మాట్లా డుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పలేవని ముందు జాగ్రత్తగా రైతులు నివారణకు టీకాలు వేసుకొని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రమేష్ బాబు వి ఎల్ వో, రవి జె వివో సదానందం వి ఏమరియు గ్రామ రైతులు ఏదుల. గంగయ్య లక్కం రవీందర్ గోరంటల. ఓదెలు, శంకరయ్య ఈజీగిరి. రవి గోరంటల. సాంబ య్య పల్లెబోయిన రఘు కౌటం. ప్రభాకర్ మారబోయిన మల్ల య్య చెక్క కొమురయ్య నవయుగ సొసైటీ డైరెక్టర్ లక్కం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలకు చెందిన 69,427 ఆవు జాతి పశువులకు 62,758 గేద జాతి పశువులకు మొత్తం 1,32,185 పశువులకు ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి ఆసోడా తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న పశు వైద్య వైద్య అధికారులు పశు వైద్య సిబ్బందితో మంగళవారం రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి టీకాల కార్యక్రమం గురించి రివ్యూ చేయడం జరిగినది. టీకాలు వేసేందుకు గాను 22 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 15వ తారీకు నుండి నవంబర్ 4వ తారీఖు వరకు మొత్తం 29258 తెల్లజాతి పశువులకు 34,902 నల్లజాతి పశువులకు మొత్తంగా 64,160 పశువులకు విజయవంతంగా గాలికుంటు టీకాలు వేయడం జరిగినది. దీనిలో భాగంగా 14387 రైతులు లబ్ధి పొందడం జరిగింది. రైతులకు పశుపోషకులకు మరొకసారి విన్నవించేది ఏమనగా మిగిలిన 10 రోజులలో అనగా నవంబర్ 15వ తారీకు వరకు జరిగే ఈ టీకాల ప్రోగ్రాంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీకు సంబంధించిన అన్ని పశువులకు టీకాలు వేయించుకోవాలని అలాగే పశుపోషకులు ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాగస్వామ్యం కావాలి. అలాగే ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం అయినది. జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాజరై ఈ కార్యక్రమంలో విజయవంతం చేయుచున్నందుకు పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి సూచించడం జరిగింది.

టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి…

టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండల కేంద్రంలో పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. పశువులకు టీకాలు వేయించటం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల ప్రభావం తగ్గుతుందన్నారు. గాలికుంటు వంటి వ్యాధులు పశువుల పాలు, ఉత్పత్తితో పాటు రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ప్రతీ ఒక్క రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మంత్రి సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…. పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఇళ్లల్లో పశుసంపద ఉంటే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా మరియు మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించడం తప్పనిసరి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ జిల్లా అధికారి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి గండ్ర సత్యనారాయణరెడ్డి పున్నమి రవి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version