గెలుపుకు దగ్గరలో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అస్మితచంద్రకాంత్ రెడ్డి…

గెలుపుకు దగ్గరలో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అస్మితచంద్రకాంత్ రెడ్డి.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అస్మిత చంద్రకాంత్ రెడ్డి వార్డు గెలుపు దగ్గరలో ఉన్నారు తన సొంత మేనిఫెస్టోను రూపొందించి వార్డు సభ్యులకు తన సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని వార్డు సభ్యులకు హామీ ఇచ్చారు సీసీ రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలైన అర్హులకు అందే విధంగా చూస్తానని తెలియజేశారు వార్డు సభ్యులందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు.

28 వ వార్డులో రజిని భారతి గెలుపు ఖాయమే..

28 వ వార్డులో రజిని భారతి గెలుపు ఖాయమే..

ప్రజాసేవే ద్యేయంగా గతంలో నర్సంపేట సర్పంచ్ గా సేవలు

స్వయంకృషి పట్టుదలతో అనేక సంక్షేమ,మహిళా సాధికారిత కార్యక్రమాలు

28 వ వార్డును కౌన్సిలర్ గా ఆశీర్వదించండి..మోడల్ వార్డుగా అభివృద్ధి చేస్తా..

నర్సంపేట 28 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరు రజిని భారతి రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికలలో 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చిలువేరు రజినీ భారతి రమేష్ గెలుపు ఖాయమే అయ్యింది. ప్రజాసేవే ద్యేయంగా గత 30 సంవత్సరాలుగా రజని భారతి రమేష్ కుటుంబం నర్సంపేట పట్టణంలో సుపరిచితులే. గతంలో నర్సంపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా రజినీ భారతి ప్రజలకు అనేక విధాలుగా సేవలు అందించారు. తన భర్త వ్యాపారవేత్త చిలువేరు రమేష్ సహకారంతో స్వయంకృషి పట్టుదలతో ప్రజలకు సేవలు చేస్తూ… అనేక మహిళ సమన్వయ సమితి, సంక్షేమ,మహిళా సాధికారిత కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ మహిళగా రజనీభారతి ప్రశంసలు పొందారు. చిలువేరు రజినీ భారతి రమేష్ కుటుంబం నిత్యం ప్రజల వెంట ఉంటూ వారికి చేదోడువాదోడుగా సహకారాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా 28వ వార్డులో బరిలోకి దిగిన రజనీభారతి గత వారం రోజులుగా గడపగడపన ప్రచారం చేపట్టగా ఆ వార్డు ప్రజలు ఆమెకు స్వాగతాలు పలుకుతూ రజనీ భారతి గెలుపుకు మద్దతుపలికారు. 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీతో కలిపి ప్రముఖ పోటీ ఉన్నప్పటికీ రజిని భారతి వైపే ప్రజలు మొగ్గుచూపుతూ ఆమె గెలుపు ఖాయమే అని ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.

28వ వార్డు ప్రజల అభివృద్ధే నా లక్ష్యం..

నా వార్డు ప్రజల అభివృద్ధే లక్ష్యమని 28 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరు రజిని భారతి రమేష్ తెలిపారు. గతంలో నర్సంపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ప్రజలు అవకాశం ఇస్తే.. వారి అభివృద్ధే లక్ష్యంగా ఎనలేని సేవలు అందించానని అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇప్పటికే రూ.80 కోట్ల నిధులతో ప్రధాన అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో 28 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే పట్టణంలోని అన్ని వార్డులలో..

28వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.ప్రజల నుండి ఏలాంటివి ఆశించకుండా వార్డు ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో అందిస్తానని,చెయ్యి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరు రజిని భారతి రమేష్ ప్రజలను కోరారు.

ప్రజల తీర్పు స్పష్టం, కోహిర్ మునిసిపాలిటీ కైవసమే లక్ష్యం…

ప్రజల తీర్పు స్పష్టం, కోహిర్ మునిసిపాలిటీ కైవసమే లక్ష్యం

◆-: మునిసిపల్ ఎన్నికల ప్రచార భారీ ర్యాలీలో మరియు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నా

◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ పట్టణంలోని మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీతో ప్రారంభమై 16 వార్డుల అభ్యర్థులకు మద్ధతుగా బీదర్ బేస్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ 10 ఏండ్ల బి.ఆర్.స్ పాలనలో కోహిర్ పట్టణం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు, ఎ బస్తీకి కి వెళ్లినా ఆ ప్రాంత ప్రజల బాధలు వర్ణనాతీతం,ఒక్కరు కూడా వారి పాలనలో వారిని పట్టించుకున్నా పాపాన పోలేదు. అందుకని మీకు మాట ఇస్తున్నాం మన పార్టీ ప్రకటించిన 16 వార్డు సభ్యులను మీరు ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధిని మీ ముందుకు తీసుకువచ్చి గెలిచిన సభ్యులతో పని చెప్పించే బాధ్యత నాది.అందుకని రాష్ట్రంలో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమా పథకాలు అమలుఅవుతున్నాయి..ఈ అభివృద్ధి పరంపర ఇలాగే కొనసాగలంటే అధికార పార్టీకి ఓటు వేసి కోహిర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఓటర్లను కోరడం జరిగింది.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శంషీర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసియోద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్,16 వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోహిర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

21 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ చైర్ పర్సన్ జంగం కళ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

స్థానిక 21వ వార్డ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని 21 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ చైర్ పర్సన్ జంగం కళ స్పష్టం చేశారు.21 వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలో లో సింగరేణి ఖాళీ స్థలాల్లో పట్టాలు ,76 జీవో ద్వారా ఇళ్లపట్టాలు రానివారికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అన్ని వీధుల్లో రోడ్లు, డ్రైన్లు, సరైన మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నేరేడుపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటన..

నేరేడుపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటన

సర్పంచ్ అభ్యర్థి మడికొండ ఇందిరా రాజును గెలిపించాలని పిలుపు

శాయంపేట, నేటిధాత్రి:

 

గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరముందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఆయన శాయంపేట మండలంలోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసింగారం, కాట్రపల్లి, సాధనపల్లి, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం, వసంతాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, ఇతర నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అయ్యాయి. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలపరచడం ద్వారా ఈ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది,” అని పేర్కొన్నారు. ప్రజల పాలనలో ప్రజల భాగస్వామ్యమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక నాయకులు పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన..,

నేరేడుపల్లి గ్రామంలో ప్రజలకు “సీరియల్ నంబర్ 5లో ఉన్న లేడి పర్సు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి మడికొండ ఇందిరా రాజును గెలిపించండి” అని గ్రామస్థులను కోరారు.

గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాలన అవసరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version