జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 16.63% పోలింగ్…

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 16.63% పోలింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 37 వార్డుల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 9 గంటల వరకు 16.63 శాతం పోలింగ్ నమోదైంది.
మొత్తం 78,819 మంది ఓటర్లలో 13,112 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూల్లో నిలబడి ఓటు వేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో 29వ వార్డు లో ఓటు వేసిన బిఆర్ఎస్, సీనియర్ నాయకులు షేక్ ఫరిద్ తమ నాయకులు కార్యకర్తలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు,

ప్రజలు ఆశీర్వదిస్తే సుభాష్ కాలనీ అభివృద్ధి చేస్తా….

ప్రజలు ఆశీర్వదిస్తే సుభాష్ కాలనీ అభివృద్ధి చేస్తా

బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఆపిల్ బాల్

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజలు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే సుభాష్ కాలనీ 29 వార్డు అభివృద్ధి చేస్తానని ఆపిల్ బాలు అన్నారు
మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో భాగంగా 29వార్డు బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి యాపిల్ బాల్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుభాష్ కాలనీ 29వ వార్డు ప్రజలు ఒక్కసారి నేను గతంలో ఓడిపోయాను రెండోసారి బిజెపి పార్టీ నుండి కమలం పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను గెలిచిన వెంటనే సుభాష్ కాలనీ సైడ్ డ్రైనేజీలు సిసి రోడ్లు వాటర్ సమస్య లేకుండా చేస్తాను అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రచారంలో దూసుకుపోతున్న కౌన్సిలర్ అభ్యర్థి పద్మ వెంకటనారాయణ గౌడ్

ప్రచారంలో దూసుకుపోతున్న కౌన్సిలర్ అభ్యర్థి వెంకటనారాయణ గౌడ్

అన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తా

29 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అవార్డు అభ్యర్థి నాగేల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రజలు స్వాగతాలు పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు.

కారు గుర్తుకే మీ ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టగా పలువురు వార్డు ప్రజలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి పద్మ వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన నర్సంపేటలో అభివృద్ధి చేయడంలో శూన్యంగా మారిందని తెలిపారు.

ప్రస్తుతం అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులు గత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి తెచ్చిన విధులేనని ఇప్పుడు కొత్తగా స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి తెచ్చిన నిధులు ఏమి లేవని ఎద్దేవా చేశారు. 29 వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ప్రజలు గమనించాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఓటర్లకు చూపుతూ ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ప్రజలను కోరినట్లు తెలిపారు.

ఈ ప్రచారంలో ఎన్నికల ఇన్చార్జి మనోహర్ గౌడ్, స్థానిక ఇన్చార్జి కుమారస్వామి, ఇర్ఫాన్, అరవింద్ గౌడ్ పలు వురు బిఆర్ఎస్ యూత్ విభాగం నాయకులు,మహిళా నాయకులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

29వ వార్డులో పుల్ల మహేష్‌కు మద్దతుగా ఎమ్మెల్యే గండ్ర

29 వార్డులో పుల్ల మహేష్ ను గెలిపించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేషు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29వ వార్డు స్థానిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి ఇతర వార్డులో వాళ్లు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కావున స్థానికుడు పుల్ల మహేషు కావున ప్రజలందరూ మహేష్ చెయ్యి గుర్తుపై ఓటు వేయాలని ఓటర్ మహాశీలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version