మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు…

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు

ఏటూరునాగారం, నేటిధాత్రి

బుట్టాయిగూడెం బిఆర్ఎస్ మండల నాయకుడు సునార్కాని కొమురయ్య తండ్రి
సునార్కని బతకయ్య 80 వయసు
గత వారం రోజుల క్రితం వృద్ధాప్యం అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు వారి కుటుంబ సభ్యులను ఈరోజు పరామర్శించి ఆయన తండ్రి పెద్దకర్మ కోసం బియ్యం వంట సరుకులు అందజేసి వారి కుటుంబ సభ్యులకు భారత రాష్ట్రసమితి తరపున ప్రగాఢ సానుభూతిని విశ్వాసాన్ని తెలియజేసి వారు ఎక్కడ ఉన్నాఆత్మశాంతి చేకూరాలని దేవుని కృప ఉండాలని కోరుకుంటూ
ఈ కార్యక్రమంలో
సీనియర్ నాయకులు కావేరి చిన్ని కృష్ణ గారు
గ్రామా కమిటి అధ్యక్షులు
దేవర సుధాకర్
మావూరి వెంకటయ్య ఎస్సి సెల్ మండల అధ్యక్షులు
సర్పంచ్
కాంటెస్టుడ్ కొండగుర్ల వెంకటయ్య
జనగాం రవీందర్ మండల నాయకులు
కుమ్మరీ నర్సింగరావు మండల నాయకులు
బోసోలా విజయ్ మండల యూత్ నాయకులు
జనగాం సత్యం మండల నాయకులు
యూత్ నాయకులు దుర్గం రాజు
జనగాం సీతయ్య ప్రజలు
మరియు వాడ పెద్దలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు…

జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం…

జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

◆ -: పట్టణాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని నిరూపించిన ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్‌, కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని నమ్మి, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టిన జహీరాబాద్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్‌రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్‌రెడ్డి గార్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని,అభివృద్ధి, పారదర్శక పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌పై ఉంచిన నమ్మకానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు పార్లమెంట్ ఇంచార్జిగా మంత్రివర్యులు అజారుద్దీన్, కో-ఆర్డినేటర్‌గా TMREIS చైర్మన్ మహమ్మద్ ఫహీమ్ ఖురేషి,పార్లమెంట్ సభ్యులు సురేష్‌కుమార్ శెట్కార్‌‌ మార్గదర్శకత్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగలిగామని వివరించారు.ఈ అద్భుత విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చంద్రశేఖర్,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్,సిడిసి చైర్మన్,ఆత్మకమిటి చైర్మన్ గార్లకి మరియు పట్టణ&మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ నాయకులకు,యూత్ కాంగ్రెస్ నాయకులకు జహీరాబాద్ పట్టణ ప్రజల తరపున,పార్టీ కార్యకర్తల తరపున వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, పట్టణంలో మౌలిక సదుపాయాల విస్తరణ, సమగ్ర అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లు సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రతి వర్గానికి అందుబాటులో ఉంటూ విశ్వసనీయమైన పాలనను అందిస్తామని, జహీరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు హామీ ఇచ్చారు

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక…

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక

వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు17 సిపిఐ1 మొత్తం 18 మంది కౌన్సిలర్ల గెలుపొందడం జరిగింది ఆర్డిఓ హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ జోన ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిలర్ సభ్యులు అందరూ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది అనంతరం 2వార్డ్ కౌన్సిలర్ సభ్యుడు బుర్ర కొమురయ్యను ఏకగ్రీవంగా భూపాలపల్లి పురపాలక సంఘం చైర్మన్ గా ఎన్నుకున్నారు అలాగే వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎక్సెప్షన్ నెంబర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుల దేవన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

సర్పంచుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్..-

సర్పంచుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్

#సర్పంచుల విజయంలో కీలక పాత్ర పోషించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్

ములుగు, నేటిధాత్రి:

 

రాష్ట్ర మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు
ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో 12 కి 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ బలపరచిన వార్డు సభ్యులు విజయం సాధించి 806 ఓట్ల భారీ మెజారిటీతో బిఆర్ఎస్ బలపరచిన అభ్యర్థిపై గెలుపొందిన ధారావత్ సరిత & సారయ్య,ఉప సర్పంచ్ పోరిక భద్రు నాయక్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అదే విధంగా
దేవగిరిపట్నం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి ఇస్లావత్ పూలమ్మ &సంతోష్ మరియు ఉప సర్పంచ్ ఇట్టబోయిన రాజు యాదవ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పొట్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి కందికొండ భాగ్యలక్ష్మి & రమేష్ ఉప సర్పంచ్ పాలడుగుల మురళి,వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికయిన సర్పంచులు గ్రామంలోని ప్రతి సమస్యనీ పరిష్కరించే విధంగా పని చేస్తూ గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సహకరించాలని సూచించారు
ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క ఇచ్చిన ప్రతి హామీని తొందరలోనే ప్రారంభించి ప్రతి హామీ పూర్తి చేస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పాక్స్ మాజీ వైస్ చైర్మన్ మర్రి రాజు యాదవ్,ములుగు మాజీ ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,యూత్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల రేవంత్ యాదవ్,పత్తిపల్లి మాజీ సర్పంచులు బుర్రి రజిత,శ్రీలమంతుల రవీంద్రాచారి,దేవగిరిపట్నం మాజీ సర్పంచ్ ఎన్నారెడ్డి,పొట్లపూర్ మాజీ సర్పంచ్ అంకిరెడ్డి ములుగు పట్టణ యూత్ అధ్యక్షుడు అభినయ్ చారి,మైనారిటీ నాయకులు అజ్జు,యూత్ నాయకులు చందు, కన్ని,ఆయా గ్రామ కమిటీల అధ్యక్షులు సీనియర్ నాయకులు, యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొత్తకాపు కోటను బద్దలు కొట్టిన కుడిముస్కుల కుటుంబం..

కొత్తకాపు కోటను బద్దలు కొట్టిన కుడిముస్కుల కుటుంబం

◆-: నువ్వా నేనా అన్నట్టు సాగిన ఇరువురి హోరాహోరీ రాజకీయలు

◆-: సజ్జపూర్ సర్పంచ్ గా 254 ఓట్లతో విజయం సాధించిన కె పద్మావతి

◆-: రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తయారు చేయడమే తమ లక్ష్యం

◆-: అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించి సమన్యాయం చేస్తాం

◆-: సామాజిక సేవలతో నిత్యం ప్రజల మనసులు గెలుచుకున్న కె ప్రసాద్ రెడ్డి

◆-: సర్పంచ్ పదవి తమపై మరింత బాధ్యత పెంచింది

◆-: పేదల కోసం త్వరలో మరిన్ని సేవ కార్యక్రమలు చేపడతం

◆-: తమ విజయం గ్రామ ప్రజలకు అంకితమన్న నాయకులు కె ప్రసాద్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, స్వగ్రామంలో అడుగుపెట్టగానే గ్రామంలో సమస్యలు స్వాగతం పలకడంతో “శ్రీమంతుడులి సినిమాను ఆదర్శంగా తీసుకొని గ్రామస్తులను తన దగ్గరికి పిలుచుకొని గ్రామం కోసం తన వంతు సహకరంగా గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు గ్రామస్తులతో చర్చించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ప్రమాణం చేస్తూ లక్షల రూపాయల తన సొంత ఖర్చులతో గ్రామంలో నెలకొన్న పరిశుధ్యాన్ని, దాని వల్ల వచ్చే రోగాలను అరికాడతనని మాట ముందుకు సాగిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిముస్కుల ప్రసాద్ రెడ్డి. వస్తువస్తునే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ అన్ని మతాల వారికి తన సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేశారు. గ్రామస్తుల సమస్యలను తమ సమస్యలుగా భావించి ఒక్కొక్కటిని పరిష్కరిస్తూ గ్రామంలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో పెరుగాంచారు.

కేవలం గ్రామంలోనే కాకుండా మండలంలోని పిచారేగడి పాత తండా, కొత్తూర్ పట్టి కోహిర్, చింతల్ ఘాట్ గ్రామాల్లో మురికి కాలువలను తన సొంత ఖర్చులతో నిర్మించి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. కోహిర్ మండలంలోని సజ్జపూర్ గ్రామంలో దశాబ్దాలు రాజకీయాన్ని తమ అధిపత్యంలో పెట్టుకున్న కొత్తకాపు కుటుంబనికి పెట్టని కోటగా ఉన్న సజ్జపూర్ గ్రామంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళ స్థానంలో తన తల్లి అయిన కుడిముస్కుల పద్మావతి ని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిపి సమీప ప్రత్యర్థిని 254 ఓట్ల తేడాతో ఓడించి సజ్జపూర్ గ్రామంలో కుడిముస్కుల కుటుంబ రాజకీయ విజయాన్ని నమోదు చేసి ఔరా అనిపించుకున్నారు. గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు తమపై మరింత బాధ్యత పెంచిందని, త్వరలో మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు కొనసాగుతాయని, గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతమని, కులమతలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, తమ విజయం సజ్జపూర్ గ్రామ ప్రజలు మార్పు కోరుకోవడానికి సూచిక అని, తమ విజయం గ్రామ ప్రజలకు అంకితమన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version