మంత్రికి ప్రత్యేక పూజలు, ముగ్గుల పోటీలలో ఎమ్మెల్యే పాల్గొన్నాడు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో బోగి పర్వదినం సందర్భంగా కొత్తపల్లి(బి) గ్రామానికి చెందిన క్యాతం ఐలయ్య – వసంత మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే అట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముగ్గులు మన సంస్కృతి, సంప్రదాయాలకు మహిళల సృజనాత్మకతను ప్రతిబింబించే కళారూపమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సంప్రదాయాలు భావి తరాలకు చేరుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మహిళల భాగస్వామ్యంతో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరింత విస్తరించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జహీరాబాద్‌లో ఘనంగా గోదా రంగనాథుల కళ్యాణం

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోదా రంగనాథుల చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఉదయం భోగి పళ్ళు కార్యక్రమం అనంతరం గోదా కళ్యాణం నిర్వహించగా, అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఈ వేడుకలో భక్తిశ్రద్దలతో గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది.

భూపాలపల్లిలో ఘనంగా భోగి సంబరాలు

భూపాలపల్లిలో భోగి మంటలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో సంక్రాంతి భోగి పర్వదినం సందర్భంగా భోగిమంటలు వేసి భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామునే ప్రజలు వాడవాడలా భోగి మంటలు వేసి పండగను ఆనందోత్సవంలో నిర్వహించుకున్నారు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ముంగిళ్లలో రంగువల్లులు తీర్చిదిద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. రేగుపళ్లు, నవధాన్యాలు కలిపిన నీటితో చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకల్లో మునిగితేలారు. ఈ పండుగ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు

జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భోగి, సంక్రాంతి కనుమ పండుగలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి ప్రతి ఇంటిలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రకృతిని ప్రేమించే, రైతన్నను గౌరవించే గొప్ప పండుగ సంక్రాంతి అని ఆయన తెలిపారు. కొత్త ఆశలు, కొత్త వెలుగులతో ప్రజలు జీవితాలను ప్రారంభించాలని కోరారు.
పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత పునరుత్తేజాన్ని అందించాలని ఆకాంక్షించారు.
పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కొత్త ఏడాదిలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జిల్లా ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.

తంగళ్ళపల్లిలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఘనంగా సంక్రాంతి సంబరాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి……

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి ముందస్తు సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తూ. శుభోదయం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరగగా దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్. తమిళనాడు. తెలంగాణలో. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవడం. జరుగుతుందని .ముందుగా భోగి పండుగ రోజున ప్రతి మనిషి. తలంటు స్నానం చేయాలని చిన్నపిల్లలకు భోగి పండ్లతో.స్నానం చేయించాలని కుటుంబానికి పట్టిన నరదృష్టి తీసివేయడానికి భోగి మంటలు మండించాలని ఇంటిముందు మధ్యలో రంగులు వేసి మధ్యలోభోగి పండ్లను గొబ్బెమ్మలను పెట్టాలని దానివలన గోవు ప్రత్యేకత తెలుపుతుందని భోగి మంటలు కాలిన తర్వాత బూడిదను చిన్న పిల్లలకు బొట్టు పెట్టినట్లయితే ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరైన తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి మాట్లాడుతూ ముందస్తుగా ఇట్టి సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా మమ్మల్ని సిబ్బందిని పిలవడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పండగలను పిల్లల మధ్య జరపకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెబుతూ రెండవ రోజు మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడం దాంట్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మూలంగా పండగ జరుపుకోవడం జరుగుతుందని శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడం మూలంగా మంచి ఫలితం వస్తుందని చరిత్ర చెబుతుందని పితృదేవతలకు సంబంధించిన శ్లోకం చదివినట్లయితే పితృ దేవతలకు సంబంధించిన పండుగలు ఒకటి దీపావళి రెండవది దసరా మూడవది అమావాస్య పే త్రమాస్య ఈరోజుల్లో పితృదేవతలను పూజించినట్లయితే కుటుంబానికి అనుగ్రహం వలన మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు పెద్దలకు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెబుతూ ఇలాంటి సంక్రాంతి సంబరాలు పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన రంగోలి కార్యక్రమంలో బహుమతులు మా చేతుల మీదుగా అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు మూడవరోజు అయినటువంటి కనుమ రోజున గోవులను సంరక్షించడం జరుగుతుంది ఆరోజు గోవులకు స్నానం చేయించి పసుపు కుంకుమ లాంటివి శరీరానికి రాసి వాటికి కొత్త దుస్తులు కప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న పేర్లు పెట్టి వాటిని పిలవడం జరుగుతుంది దేశాన్ని సైనికులు ఏ విధంగా రక్షిస్తారో మనము కూడా రైతుల రక్షించుకునే బాధ్యత అందరి పైన ఉంది ఎందుకనగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతు మనందరికీ అన్నం పెట్టలేకపోవడం జరుగుతుందని అప్పుడు పెద్ద ప్రళయం వస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు పండించిన పంటలు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఆలోచించి మనము వెన్నుదన్నుగా ఉండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా పాఠశాల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అది కూడా పిల్లల మధ్యల దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక తంగళ్ళపల్లి మండల ఎస్సై ఉపేంద్ర చారి సిబ్బందితో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి సంబరాల కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవి లతా రెడ్డి. ప్రీ ప్రైమరీ ఇన్చార్జి పద్మశ్రీ. పి ఈ టి అజయ్ కుమార్. కంప్యూటర్ శ్రీనివాస్. సిరిసిల్ల బ్రాంచ్ పాఠశాల ఇన్చార్జి లావణ్య. అకాడమిక్ ఇన్చార్జి సాయి ప్రియ . విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ముందస్తు సంక్రాంతి సంబరాలు…

ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

మండలంలోని వర్ష కొండలో మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఎంతో ఆనందోత్సాహాలతో నిర్వహించడం జరిగింది ఈ పండుగ వేడుకలకు గ్రామ సర్పంచ్ పొనకంటి వెంకట్ ఉప సర్పంచ్ తుమ్మల జయ,సామెల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు
భోగి పండుగ సందర్భంగా భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించి, చిన్నారులకు భోగి పళ్ళను పోయడం ద్వారా పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు
సంక్రాంతి పండుగ సందర్భంలో విద్యార్థులతో కలిసి రంగురంగుల గాలి పాటలను ఎగురవేసి, ఆనందాన్ని పంచుకున్నారు
కనుమ పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆవులను, లేగ దూడలను పూజించడం ద్వారా రైతు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించారు
ఈ విధంగా సంప్రదాయాలు, సంస్కృతి, ఆనందం కలిసిన సంక్రాంతి వేడుకలను విజయవంతంగా ముగించారు
ఈ సంబరాలు విద్యార్థుల్లో పండుగల పట్ల ప్రేమను, గౌరవాన్ని పెంపొందించాయి.
మరొక్కసారి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు అచ్చం విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version