జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సరికాదు.

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సరికాదు.

◆-: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్ కు కౌన్సిలర్ స్రవంతి రవి కిరణ్ ఫిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో తీవ్ర అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ ఎన్నికను రద్దు చేసి, తిరిగి కొత్తగా ఎన్నిక నిర్వహించాలని వార్డు నంబర్ 27 కౌన్సిలర్ స్రవంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం, స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు గురువారం ఆమె తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య కలిసి రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల నిబంధనలు (2020) ప్రకారం..చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఓటింగ్ కోసం కౌన్సిలర్ల పేర్లను ఖచ్చితంగా అక్షర క్రమంలో పిలవాలి. అక్షర క్రమం ప్రకారం తన పేరు మొదటి స్థానంలో రావాల్సి ఉండగా, రిటర్నింగ్ అధికారి నిబంధనలను పక్కనబెట్టి తమకు నచ్చిన విధంగా పేర్లను పిలిచారని స్రవంతి ఆరోపించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల అధికారులు వ్యవహరించారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని దుయ్యబట్టారు.
తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019, సెక్షన్ 14(3), రూల్ 4 నిబంధనలను రిటర్నింగ్ అధికారి ఉల్లంఘించారని, తద్వారా ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం చట్టవిరుద్ధంగా మారిందని ఆమె తన ఫిర్యాదులో వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికైన మొహమ్మద్ యూనుస్ ఎన్నికను తక్షణమే చెల్లనిదిగా ప్రకటించాలని పారదర్శక పద్ధతిలో మళ్ళీ కొత్తగా ఎన్నిక నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడే వరకు తన పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని స్రవంతి విజ్ఞప్తి చేశారు.

ఎట్టకేలకు జహీరాబాద్…మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం…

ఎట్టకేలకు జహీరాబాద్…మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం

◆-: మున్సిపల్ ఛైర్మన్ గా మహమ్మద్ యూనుస్, వైస్ చైర్మన్ గా కొత్తకాపు శిరిష..

◆-: కాంగ్రెస్ ఖాతాలోకి జహీరాబాద్, కోహీర్ మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు..

◆-: రెండు మున్సిపాలిటీలల్లో ఎగిరిన కాంగ్రెస్ జెండా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఎట్టకేలకు జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠకు తెరపడింది. కోరమ్ లేక సోమవారం నాడు వాయిదా పడిన ఈ ఎన్నిక చివరకు మ్యాజిక్ ఫిగర్ రాజకీ యాలతో ముగిసి మంగళ వారం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వివరాలలోకి వెళితే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మున్సి పాలిటీలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 స్థానాలు గెలుచుకోగా, జహీరాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ లు ఈ మున్సిపాలిటీలో ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా నమోదు కావడంతో మొత్తం 39 మంది సభ్యులు కాగా, చైర్మన్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20 సభ్యుల మద్దతు దక్కించుకోవడం కీలకంగా మారింది. సోమవారం నాడు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరమ్ లేక ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలతో కలిసి ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిపి 19 మందితో బిఆర్ఎస్ మద్దతు కూడగట్టగా, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఇద్దరు, ముగ్గురు స్వతంత్రులను తమవైపు తిప్పుకుని ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరుకోగా, ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 15 వ వార్డు నుంచి ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్ మహమ్మద్ యూనుస్ చైర్మన్ గా, 16 వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికైన కొత్త కాపు శిరీష వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు..a

ఆ పార్టీ మద్దతుతో గెలుపు.. కాంగ్రెస్ ఖాతాలో కోహీర్ మున్సిపాలిటీ…

ఆ పార్టీ మద్దతుతో గెలుపు.. కాంగ్రెస్ ఖాతాలో కోహీర్ మున్సిపాలిటీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహీర్: సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 8 వార్డులను గెలుచుకున్నప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ దక్కలేదు. ఎంఐఎం పార్టీకి చెందిన 8వ వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ మద్దతు పలకడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 4వ వార్డ్ కౌన్సిలర్ మ్యాథరి అశోక్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో నూతనంగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది.డిప్యూటీ చైర్మన్ గా అదే పార్టీకి చెందిన 7 వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్ హన్నాన్ జావిద్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎంపికైన చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కౌన్సిలర్లతో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోహీర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేస్తానని తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక…

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక

వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు17 సిపిఐ1 మొత్తం 18 మంది కౌన్సిలర్ల గెలుపొందడం జరిగింది ఆర్డిఓ హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ జోన ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిలర్ సభ్యులు అందరూ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది అనంతరం 2వార్డ్ కౌన్సిలర్ సభ్యుడు బుర్ర కొమురయ్యను ఏకగ్రీవంగా భూపాలపల్లి పురపాలక సంఘం చైర్మన్ గా ఎన్నుకున్నారు అలాగే వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎక్సెప్షన్ నెంబర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుల దేవన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

◆-: ఆల్ఫాబెట్స్ ఆధారంగా కౌన్సిల్ సభ్యులకు బల్లాల ఏర్పాటు

◆-: చైర్మెన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జైత్రం నాయక్, డీఎస్పీ సైదా నాయక్ లు తెలిపారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. మొదట కౌన్సిల్ సభ్యులందరికీ ప్రమాణం చేయించిన అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నిక కేంద్రం పరిసరాల్లో అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిఐలు శివలింగం, హనుమంతు, ఎస్సై వినయ్ కుమార్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version