జైభీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

జైభీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

 

పరకాల,నేటిధాత్రి

 

 

వెల్లంపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జై భీమ్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో కజెండా పండుగ ఘనంగా నిర్వహించారు.అధ్యక్షులు బొట్ల అరుణ్ కుమార్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం వారు భారత రాజ్యాంగం, అంబేద్కర్ గురించి మరియు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.గ్రామంలోని అంగన్వాడి,ప్రాథమిక మరియు సెకండరీ పాఠశాలల విద్యార్థులకు వారి యొక్క యూత్ తరఫున ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సలహాదారు కాకి సతీష్, ఇంచార్జ్ కాకి శరత్ చంద్ర, యూత్ ఆర్గనైజర్ భవేష్, కార్యదర్శి మచ్చ టెనమ్, కోశాధికారి సుమంత్, సభ్యులు భవంత్,గ్రామ యువకులు మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం హాజరు కావడం జరిగింది.

మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయం వద్ద సూపర్డెంట్ అబిద్ ఆలీ, పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి బన్న రజిత, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, మహిళ సమైక్య కార్యాలయంలో ఏపీఎం సుధాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, బిజెపి కార్యాలయం వద్ద తడుక వినయ్ గౌడ్, వి ఎఫ్ జి సొసైటీ వద్ద అధ్యక్షుడు పోలు దాసరి శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ ఆచార్య, వివిధ గ్రామాలలో సర్పంచులు, కుల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి.

మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి.

#గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

దేశ స్వాతంత్ర్య కాంక్ష సాధనలో ఎంతోమంది మహనీయుల త్యాగం ఉంది వారి జీవిత పోరాటా స్ఫూర్తి మన అందరికీ ఆదర్శం అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికీ 77 ఏళ్లు పూర్తి చేసుకోవడం హర్షనీయమని దేశాన్ని హక్కుల సాధన దిశగా మార్పు గావించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పనకు ఎంతో కృషి చేశారు. ఇప్పటికీ మన దేశాలు భారత రాజ్యాంగంలోని అనేక అంశాలను ఆదర్శంగా తీసుకొని పాలన చేయడం భారతీయులకు ఎంతో గర్వకారణం. ఈ దేశానికి ఎంతోమంది మహనీయులు చేసిన సేవ వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని వాళ్ళ ఆశయ సాధన కొరకు మనమంతా పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్,ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, మాజీ మండల అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, నాయకులు నాన బోయిన రాజారాం, పాండవుల రాంబాబు, ఖ్యాతం శ్రీనివాస్, గుండాల కుమారస్వామి, పోడేటి ప్రకాశం, జన్ను జయరాజ్, సట్ల శ్రీనివాస్ గౌడ్, మంద రాజన్న, బూస సదయ్య, వేల్పుల రవి, మహేందర్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. అలియాబాద్, ముడుచుతులపల్లి ఎల్లంపేట, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్లు చంద్రశేఖర్, పవన్ కుమార్, స్వామి నాయక్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తో పాటు అధికారులు, మేడ్చల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రష్యా యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి లతోపాటు వివిధ కార్మిక సంఘాలు ఆటో యూనియన్ ప్రైవేట్ సంస్థల వద్ద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అలియాబాద్ శ్రీరామ ఆటో యూనియన్ వద్ద అధ్యక్షుడు పులి జగదీష్ జెండాను ఎగరవేశారు.

లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

లయన్స్ క్లబ్ గోపాలరావుపేట మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రామడుగు మండల శాఖల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ జండాను అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జండాను అధ్యక్షులు కర్ర శ్యాంసుందర్ రెడ్డి ఎగరవేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముదుగంటి రాజిరెడ్డి, కర్ర రాంచంద్రారెడ్డి, కర్ర రాజిరెడ్డి, ముదుగంటి సత్యనారాయణ రెడ్డి, పాకాల మోహన్, గొడుగు అంజియాదవ్, కోట్ల మల్లేశం, చాడ దామోదర్ రెడ్డి, కర్ర ప్రభాకర్ రెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, దుద్దెనపెల్లి లచ్చయ్య, ముదుగంటి లక్ష్మారెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, ఎడవెల్లి ముకుందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం…

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సరిత

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సరిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులు ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు
అనంతరం సర్పంచ్ సరిత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సొంత ఖర్చులతో బహుమతులు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మరికొంత మంది నాయకులతో కలిసి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యానికి రాజ్యాంగ నిర్మాణానికి తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, రాష్ట్రం దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చల్లూరు మధు అప్పన్ కిషన్ గాజర్ల అశోక్ తిరుపతి విజయ్ తదితరులు పాల్గొన్నారు

ఎస్టిపిపి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక

ఎస్టిపిపి ఉత్తమ ఉద్యోగుల ఎంపిక

జైపూర్,నేటి ధాత్రి:

సింగరేణి సంస్థలో విశేష సేవలందించిన ఉత్తమ ఉద్యోగులను 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున యాజమాన్యం వారికి ఘనంగా సన్మానాలు చేపడుతున్నట్లుగా జైపూర్ ఎస్టిపిపి అధికారులు తెలిపారు.వివిధ ఏరియాల నుంచి ప్రతిభావంతులైన కార్మికులు,అధికారులను గుర్తించి ఉత్తమ సింగరేణీయులుగా ఎంపికలో భాగంగా ప్లాంట్ నుండి నలుగురు ఎంపికయ్యారని ప్లాంట్ ఈడి సిహెచ్ చిరంజీవిలు వెల్లడించారు.ఉత్తమ అధికారిగా జి.ఎం మదన్మోహన్,ఉత్తమ సింగరేణియన్ గా సీనియర్ అసిస్టెంట్ శశిధర్ ఎంపిక కాగా,వీరిని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో సి అండ్ ఎండి కృష్ణ భాస్కర్ సింగరేణి డైరెక్టర్ల తో కలిసి సన్మానిస్తారని తెలిపారు. స్థానిక ప్లాంట్ లో జరగబోయే గణతంత్ర వేడుకల్లో సీనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, వార్డ్ అసిస్టెంట్ తిరుపతి ఉత్తమ ఉద్యోగులుగా సన్మానించబడతారని తెలిపారు.

మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రమదానం

మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది “శ్రమదానం
మెట్ పల్లి జనవరి 24 నేటి ధాత్రి

సోమవారం జరుగనున్న “రిపబ్లిక్ డే” ఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య నేతృత్వంలో వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న అధ్వర్యంలో శనివారం రోజున కళాశాల సిబ్బంది శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై అమర్చిన కళాశాల బోర్డు నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోనికి వెళ్ళే రోడ్డుపై పెరిగిన గడ్డి, ముళ్ళ చెట్లు తదితర పిచ్చి మొక్కలతో పాటు చెత్త, చెదరాన్ని పారలు,గడ్డ పారలు,గొడ్డలి,ప్లాస్టిక్ బుట్టలు వంటి పరికరాల సహాయంతో శుభ్రం చేశారు.దాంతో ఈ ప్రాంతమంతా ఆకర్షణీయంగా తయారయ్యింది. అనంతరం చెత్త, చెదారానికి సిబ్బంది నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెచ్.ఓ. డి.మనోజ్ కుమార్ బోధనా సిబ్బంది అంజయ్య, శ్రీకాంత్, దశరథం లతో పాటు బోధనేతర సిబ్బంది లక్మినారాయణ, బాబు, శ్రీనివాస్, లక్ష్మి, లింగం తదితరులు పాల్గొన్నారు.

అమరావతిలోనే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..

అమరావతిలోనే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..

 

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రతి ఏటా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాత్రం రాజధాని అమరావతిలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాయపూడి సీఆర్డీఏ ఆఫీసు సమీపంలో 20 ఎకరాల్లో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version