వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది…

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

జాతీయ గేయం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు,(1875 నవంబర్ 7 న వందేమాతరం గేయం, రచించిన బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉరకలేసింది. మార్కెట్ ఆవరణలో, పాఠశాలల్లో, కాలనీల్లో, ప్రజా వేదికలపై వందేమాతరం గీతాలాపన ప్రతిధ్వనించింది.
పల్లె నుంచి పట్టణం దాకా “వందేమాతరం” నినాదాలు మారుమ్రోగాయి.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తల్లి భారతమాతకు వందనములు అర్పించారు.
నెక్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గేయాన్ని ఆలపించారు.
తమ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల వేదికపై నిలిచి గీతం పాడిన పూర్వ విద్యార్థులు మాణిక్యం తొ పాటు సీఐ సన్నాయిల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
“వందేమాతరం 150వ వసంతం మనందరికీ గౌరవ దినం” అంటూ వారు గర్వంగా తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈడునూరి సాయికృష్ణ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ
వందేమాతరం కేవలం గేయం కాదు, ఇది దేశాత్మక గౌరవానికి ప్రతీక. తల్లి భారతమాతకు మన అర్చన.”
అని అన్నారు.
పిల్లలు జాతీయ పతాకాలతో ఊరంతా దేశభక్తి నినాదాలు చేశారు.
సంస్కృతి, భక్తి, ఐక్యత సమన్వయమై నెక్కొండ మొత్తం “వందేమాతరం” స్వరంతో మార్మోగింది.

అయ్యప్ప పూజలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్…

అయ్యప్ప పూజలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలోని శ్రీ అయ్యప్ప స్వామి.. శుక్రవారం మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఝరాసంగం మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ తన దంపతులతో హాజరయ్యారు. అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. భక్తితో ముక్తి లభిస్తుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో. పెద్ద స్వామి సంఘటన
పప్ప స్వామి జగదీశ్వర్ స్వామి నరేష్ స్వామి రెడ్డి స్వామి తదితరులు పాల్గొన్నారు,

ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలు…

ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

కార్తీక పౌర్ణమి రోజున జన్మించిన గౌడ కులగోత్రం,గౌడవంశం మూల పురుషుడు కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలను గౌడ కుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోపా వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రామగోని సుధాకర్ గౌడ్ నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యుగంలో ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన వినాశకరమైన విపత్తులు వచ్చినప్పుడు మానవ వినాశనం, దైవ వినాశనం, వృక్ష వినాశనం నుంచి ప్రజల్ని కాపాడడం కోసం అవతరించిన పరమేశ్వర ప్రసాది కౌండిన్య మహాముని అని పేర్కొన్నారు. దైవ గౌడ జాతి ఆవిర్భావానికి మూలపురుషుడు గౌడ గోత్రదారి నేటికీ ఏకకుల గోత్రనామ దయంతో దేశవ్యాప్తంగా గౌడ జాతి పిలవబడుతుందని తెలిపారు.కార్తీకమాసంలో గౌడ కుల గోత్ర పూజ, గౌడ కులదైవాలను ప్రసన్నం చేసుకొని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సకల సంపదలతో దేశవ్యాప్తంగా వర్ధిల్లేల ఆశీర్వదించే పవిత్రదినం కార్తీక పౌర్ణమి రోజు అని తెలియజేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో వచ్చే నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవములు(జాతర) – 2025 గోడ పత్రికను ఈరోజు ఉదయం గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

 

రెండో తిరుపతిగా పేరుగాంచిన బుగులోని వెంకటేశ్వరస్వామి వారి జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. భక్తి, సేవ, సాంస్కృతిక పరంపరలను ప్రతిబింబించే ఈ జాతర ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యార్థం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రూ.200 లక్షల నిధులు కేటాయించినట్లు, అట్టి అన్ని పనులు పూర్తి కావస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఒకే వేదికపై రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాసుల కలయిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-27T125929.355.wav?_=1

 

ఒకే వేదికపై రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాసుల కలయిక

సేవే లక్ష్యం-ధర్మ పరిరక్షణే ధ్యేయం: శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివారులోని ఒక ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం తెలంగాణ శ్రీనివాసుల సమ్మేళనం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈసమ్మేళనంలో జగిత్యాల వాసి శ్రీనివాసుడి వేషధారణ సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తలపించింది. అయోధ్య రాముడి పాదుకలను శ్రీనివాసుల దర్శనార్థం వేదికపై ఉంచి, కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వాహకులు, చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి సురేశ్ ఆత్మారాం మహారాజ్, తాటిచర్ల హరికిషన్ శర్మలు శ్రీనివాస్ పేరు గొప్పతనాన్ని వివరించారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీతో పాటు దేశవిదేశాల్లో ఉంటున్న రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాస్ పేరు గల వ్యక్తులు ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈసందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సహాయార్థం తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రెండు వందల యాభై మంది శ్రీనివాసులు రక్తదానం చేశారు. శ్రీనివాస్ పేరుగల రెండు వేల ఐదు వందల మంది ఒకే వేదికగా కలవడం అరుదైనదిగా గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలంగాణ డైరెక్టర్ మడుపు రాంప్రకాశ్ తమ రికార్డ్స్ లో చోటు కల్పించి

శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డికి అవార్డును అందజేశారు. ఈసందర్భంగా సేవా సమితి ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవే లక్ష్యంగా, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తామని, శ్రీనివాస్ అనే పేరున్న వారంతా ఒక సమూహంగా ఏర్పడాలనే లక్ష్యంతో శ్రీనివాసుల సేవాసమితి ఏర్పడిందని, నలబై ఆరు వాట్సాప్ గ్రూపులతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇరవై ఆరు వేల మంది సభ్యులు వాట్సాప్ గ్రూపుల్లో చేరారని, టీఎస్ఎస్ఎస్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, శ్రీనివాస్ పేరు ఉన్నవారు పేదరికంలో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా చేయూత అందిస్తున్నామని,రోజు వారి కూలీ నుండి మొదలుకొని ఏరంగంలో ఉన్న వారినైనా, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా శ్రీనివాస్ పేరు ఉన్న వారందరనీ టీఎస్ఎస్ఎస్ లో చేర్చించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

కార్తీక మాసంలో దీప దానంతో లక్ష్మీదేవి అనుగ్రహం…

కార్తీక మాసంలో దీప దానంతో లక్ష్మీదేవి అనుగ్రహం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

కార్తీక మాసంలో మహిళలు వేకువనే లేచి స్నానం ఆచరిస్తారు.ఈ మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలంతో బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించాలి.తర్వాత దీపారాధన చేయాలి.దీప దానానికి ఈ పవిత్ర మాసంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో లేదా ఇంట్లో తులసి మొక్క దగ్గర ప్రతిరోజూ దీపదానం చేయాలి.ఇలా చేస్తే జీవితంలో,ఇంట్లో చీకటి తొలగిపోతుందని,లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరిసంపదలు లభిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

అతి త్వరలోనే శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T132848.714.wav?_=2

 

అతి త్వరలోనే శ్రీ శివ భక్తమార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం

శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పద్మశాలి కులబంధు వులకు హిందూ బంధువులకు సిరిసిల్ల మార్కండేయ వీధిలో అత్యంత పురాతనమైన విశిష్టమైన శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కై శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యచరణను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ రోజు ప్రెస్ క్లబ్లో శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో, హిందు బంధువులతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతి నగర్ ‘నుండి భూపతినగర్’ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించింది. దేవాలయ పునర్నిర్మాణం హిందూ సంఘటనా శక్తికి, ఆత్మ గౌరవానికి, సమరసతకు చిహ్నంగా శ్రీ లలితా పరమేశ్వరీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మా ణములో సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావించి అందుకు నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభించి తెలియజేపింది వారి అభిప్రాయాలను సేకరించింది.ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అతి త్వరలోనే దేవాలయ నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభం. చేస్తున్నామని అది కూడా వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
ఇటీవల అయోధ్య లో భవ్యమైన దిన్యమైన అయోధ్య రామమందిర నిర్మాణముకై జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరం దేవుడి ముందర సమానమే అనే భావనతో ప్రయత్నం చేసి సిరిసిల్ల లో దివ్యమైన భవ్యమైన
శ్రీ మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఇది మనందరి సంఘటితశక్తికి, స్వాభిమానా ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా తను మన ధనాన్ని భగవంతునికి దేవాలయానికి సమర్పించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని
శ్రీ మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి తెలిపింద త్వరలోనే నిధి సమర్పణ ప్రారంభం తేదీని మీకు మీడియా ద్వారా తెలియపరుస్తాం.దేవాలయానికి “ఇచ్చే ఒక ఇటుక కానీ, ఒక రూపాయి కానీ సమర్పణ చేస్తే తర తరాలకు పుణ్యం లభిస్తుంది . కావున ప్రతి ఒక్కరూ సమర్పణకి తను మన ధన ని సమర్పించి భాగస్వాములై భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ మాదాస శ్రీనివాస్. నాగుల శ్రీనివాస్,కోడం రవి,గుంటుక పురుషోత్తం, చిమ్మని ప్రకాష్, గాజుల సదానందం, గుడ్ల విష్ణు, జిందం రవి, ఎనగంటి నరేష్,తదితరులు పాల్గొన్నారు.

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు…

 

ఆనందోత్సాహాలతో మధ్య కౌండిన్యుల అభిషేకాలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలో గల పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు రెండో రోజు ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతి ఒక్కరూ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి డప్పుచప్పుల్ల మధ్య ఇంటింటి నుంచి తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ ,జలాలతో అభిషేకాలు చేశారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని ఆ దేవున్ని ప్రార్థించారు. అంతకు ముందు పట్టణంలోని పలు వీధులలో పూజారులచే పలు విన్యాసాలు నిర్వహించారు.కొత్త వస్త్రాలను ధరించిన గౌడులు పట్టణంలోని వారి ప్రతి ఇంటి నుంచి బిందెలతో జలాలు మంగళహారతులతో తరలివచ్చి పూజలను నిర్వహించారు.పట్టణంలోని గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పూజ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు.ఆలయ కమిటీ భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లను చేసింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్ ,మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్ గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళ పెళ్ళి చంద్రమౌళి గౌడ్, కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, పంజాల రాజు గౌడ్, గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, పుల్లూరి స్వామి గౌడ్ వల్లాల శ్రీహరి గౌడ్, వీరయ్య గౌడ్, వేముల రవి గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తుల్జా భవాని ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T130019.858.wav?_=3

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని తుల్జా భవాని ఆలయం వరకు భక్తుల పాదయాత్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుండి భక్తులు లోక కళ్యాణర్ధం పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని తుల్జా భవాని ఆలయ వ్యవస్థాపకులు జాదవ్ మహేందర్ మహారాజు ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా తుల్జాపూర్ అమ్మవారి చెంతకు సుమారు 220 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది దీపావళి పర్వదిన అనంతరం పాదయాత్ర చేపడుతున్నట్లు గోపాల్ పేర్కొన్నారు.తుల్జా భవాని దేవస్థానానికి పాదయాత్రగా వెళ్లిన గ్రామస్తులు నర్సాపూర్ మాజీ సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ తుల్జా భవాని ఆలయం మహారాష్ట్రలోని ధరాశివ్‌లో ఉంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు శక్తి స్వరూపిణి అయిన భవాని దేవికి అంకితం చేయబడింది. ఈ దేవిని అనేకమంది భక్తులు, ముఖ్యంగా మరాఠాలు, రాజపుత్రులు, దేశస్థ బ్రాహ్మణులు, మరియు అగ్రిలు వంశ దేవతగా పూజిస్తానన్నారు,

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

కళ్లకు గంతలు కట్టి అమ్మవారి ప్రతిరూపం…

కళ్లకు గంతలు కట్టి అమ్మవారి ప్రతిరూపం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : మన దేశంలో దసరా పండుగను ధనిక-బీద తేడా లేకుండా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన ప్రఖ్యాత శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అమ్మవారి పై ఉన్న భక్తితో కళ్లకు గంతలు కట్టి, కేవలం ఒక గంట పది నిమిషాల వ్యవధిలో మట్టితో మూడు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. తన మదిలో తలచుకున్న అమ్మవారి రూపాన్ని ప్రతిష్టాత్మకంగా మలిచినట్లు తెలిపారు. “ప్రతి కళాకారుడి మదిలో రకరకాల కళారూపాలు దాగి ఉంటాయి. మనిషి ఏ విషయం పై ఎక్కువగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయన్నారు. విశ్వాసం, నమ్మకం ఉంటే ఏ పని సాధ్యమే. భగవంతుని కరుణ ఉంటే విజయవంతం అవుతాం” అని శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అన్నారు.

తుల్జా భవానీ మాత దర్శించుకున్న యువకులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T123507.930.wav?_=4

 

తుల్జా భవానీ మాత దర్శించుకున్న యువకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహారాష్ట్రంలోని తుల్జాపూర్లో తుల్జా భవానీ మాత శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. బుధవారము జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలానికి చెందిన వైద్య నాగేష్ సాయి కృష్ణ తుల్జా భవాని మాత శక్తి పీఠాన్ని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయం భూగా వెలసిన అమ్మవారి దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో…

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో
పొత్కపల్లి యువత ..

సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న యువత..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం లోని పొత్కపల్లి గ్రామానికి యువత గత దశాబ్దకాలంగా దుర్గాభవాని కమిటీగా ఏర్పాటై భవాని మాత సేవలో తరిస్తూ మన సనాతన ధర్మాన్ని ,భక్తి మార్గాన్ని భావి తరాలకి అందిస్తుంది.యువత అంటే మనకు ఉండే ఆలోచనలకి ఆమడదూరంలో ఉంటూ సనాతన ధర్మానికి, భక్తిగా చిరునామాగా నిలుస్తూ పొత్కపల్లి యువత భవాని సేవలో దశ్జబ్దకాలంగా త్రికరణశుద్ధిగా ముందుకు సాగుతుంది.ఓదెల మండలంలోని ఎంతో ప్రాచుర్యం పొందిన పొత్కపల్లి శ్రీ రాజ వేణుగోపాలస్వామి మరియు భవాని సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత దశాబ్ద కాలంగా భవాని మాత ఉత్సవాలు స్థానిక యువత ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తు హిందూ ధర్మ పరిరక్షణకు మేము సైతం చెడుపై పోరాటానికి సిద్ధం అంటూ భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు పొట్కపల్లి గ్రామంలో నీ యువత కులాల కతీతంగా భవాని మాత కమిటీగా ఏర్పడి,భవాని మాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తు ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నారు.ఆనాడు మరాఠా రాజ్య స్థాపకుడైన చత్రపతి శివాజీ మహారాజ్ భవాని మాత ఉత్సవాలను ప్రారంభిస్తే దానిని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లడానికి పొత్కపల్లి యువత సంకల్పించారు. సమాజ హితమే తమ అభిమతంగా దశాబ్దకాలంగా భవాని మాత ఉత్సవాలని అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క భవాని మాలలు ధరించి భక్తిని ,బాధ్యతలని సమపాళ్లలో నిర్వర్తిస్తూ యువతకి ఒక మార్గాన్ని జీవనవిధానాన్ని చూపిస్తున్నారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజాన్ని మంచి దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క భక్తి భావంతో పాటు సామజిక స్ఫూర్తిని రగిలిస్తున్నారు భవాని కమిటి గ్రామ కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల లో అయిన హెల్మెట్ ధరించాలని, స్థానిక వ్యాపారులని ప్రోత్సహించాలని,స్వదేశీ ఉత్పత్తులు కొనడం దేశభక్తికి శోభా అని,విద్యతోనే వెలుగు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని గుర్తు చేస్తూ అందరిలో చైతన్యం తీసుకువస్తున్నారు. మాదకద్రవ్యాలు,మద్యం, జూదం జీవితం చెడగొట్టే మార్గాలు కావున వాటికీ దూరంగా ఉండి భవిష్యత్తుని వెలిగించండి అని యువతకి హితబోధ చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవం ఒక ఆనందం మాత్రమే కాదు మన గ్రామాన్ని ఒకటిగా నిలబెట్టే శక్తి అని చెబుతు రాక్షస సంహారానికి ప్రతీక అయిన నవరాత్రులని ఘనంగా నిర్వహిస్టు నవ సంకల్పంతో ముందుకు సాగుతూ యువత అంటే ఇలానే ఉండాలి అనే స్ఫూర్తిని ప్రతివో ఒక్కరిలో కలిగిస్తూ పోత్కపల్లి యువత ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి
సామజిక కార్యకర్త

కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట…

కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట

చీఫ్ ఇంజనీర్ ప్రకాష్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లో బాగంగా చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో కెటిపిపి దుర్గాదేవి ఉత్సవ కమిటీ వారు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ కెటిపిపి విద్యుత్ కేంద్రం లో దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు అన్ని కుటుంబాలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆడుతూ పాడుతూ విధులు నిర్వహించేలా క్షేమంగా ఉండేలా చూడాలని ఆ దుర్గాదేవి ని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్స్, దుర్గాదేవి ఉత్సవ

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T142630.089.wav?_=5

భక్తుడు భగవంతునికి దాసునిగా మారాలి – విభిషణ్ ప్రభుజీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్) : భగవంతునికి నిత్య దాసునిగా మారి నిజస్థితిని తెలుసుకోవాలని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభిషణ్ ప్రభుజీ ఉద్బోధించారు. కృష్ణ భక్తి భావన మినహా సమస్త కలాపములను త్యజించువారే భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రులవుతారని పేర్కొన్నారు. జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు వీధిలో 173 వ నగర సంకీర్తన వైభవంగా జరిగింది. అనంతరం హనుమాన్ మందిర్ లో జరిగిన సత్సంగ ప్రవచన కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రవచించారు. భగవంతుని దివ్యమైన ప్రేమ యుక్తమైన సేవయే జీవులకు నిజమైన కర్మ అని వివరించారు. కృష్ణ పరమైన కర్మలు తప్ప మిగిలిన కర్మలన్నీ జనన, మరణ చక్రబంధంలో బంధించబడుతాయని తెలిపారు.

ప్రతి కర్మను శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే ఆచరించాలని హితవు పలికారు. ఈ సందర్బంగా భగవద్గీత సాంఖ్య యోగంలోని 48 వ శ్లోకాన్ని ఉటంకిస్తూ పలు ఉపమానాలను వివరించారు. భక్తులు అడిగిన పలు ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేశారు. అంతకుముందు శ్రీకృష్ణ కీర్తనలు ఆలపిస్తూ బసవేశ్వర వీధి లో శోభాయాత్ర నిర్వహించారు. కీర్తనలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తులు తన్మయ్యత్వంలో మునిగిపోయారు.భువన సంగీత మోహనంగా సాగిన ఈ సంకీర్తన లో బెజుగం లక్ష్మణ్, స్వస్తిక్ రెస్టారెంట్ మహేందర్ గోడకే ప్రసాద వితరణ చేశారు.

ఇదిలాఉండగా మండలంలోని హుగ్గెల్లి గ్రామంలోనూ 138 వ పల్లె సంకీర్తన అట్టహాసంగా జరిగింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గ్రామం ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T140342.321.wav?_=6

ఓదెల మండలం లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటి ధాత్రి

 

ఓదెల మండలం లోని ఓదెల, పోత్కపల్లి, మడక , కనగర్తి, గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్య పల్లి, కొలనూర్, గోపరపల్లి, హరిపురం, లంబాడి తండా, నాంసానిపల్లి, అబ్బిడిపల్లి, జీలకుంట, శానగొండ, రూపు నారాయణపేట, ఇందుర్తి, గుంపుల, గూడెం, బాయమ్మపల్లి, భీమరపల్లి, ఉప్పరపల్లి గ్రామాలతో పాటు ఇతర గ్రామాలలో తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదనీ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ అని మహిళలు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నేటి నుండి 9 రోజులు ఆడే బతుకమ్మ పండుగ ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు కోలాటం,ఆట పాటలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే ఆట పాటలతో పాడారు.

రేవన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T135042.836.wav?_=7

 

రేవన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో శ్రీ రేవన సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు శ్రీ చండికాంబ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం. మరియు దుర్గా హోమం నిర్వహించినారు ఆలయ అర్చకులు శ్రీ రేవన సిద్దయ్య స్వామి బసవరాజ్ స్వామి లింగం గౌడ్ దంపతులు పూజలు నిర్వహించినారు.

 రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..

 రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..

 

 

ఆ గుడిలో ఏకంగా 230 తలైవా ప్రతిమలు ఉన్నాయి. వాటిని 15 వరసల్లో ఏర్పాటు చేశాడు. పది వరుసల్లో రజినీకి సంబంధించిన టాప్ ఫొటోలు ఉన్నాయి.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తలైవాకు ప్రపంచం నలుమూలలా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్‌కు రజినీ అంటే పిచ్చి అభిమానం. ఆయన కోసం ఏదైనా చేసేస్తారు. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ ఫ్యాన్ తన అభిమాన హీరో రజినీకాంత్ కోసం కొన్నేళ్ల క్రితం గుడి కట్టాడు. రజినీ విగ్రహానికి ప్రతీరోజూ పూజలు చేస్తున్నాడు. ఇప్పుడు నవరాత్రి సందర్భంగా ఏకంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని మధురైకి చెందిన కార్తీక్ అనే వ్యక్తికి రజినీకాంత్ అంటే చిన్నప్పటినుంచి పిచ్చి అభిమానం. అతడు పెరిగేకొద్దీ అభిమానం పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే అతడు ఓ వినూత్న పనికి తెరతీశాడు. కొన్ని నెలల క్రితం తలైవా కోసం ఓ చిన్న గుడిని నిర్మించాడు. అందులో రజినీ విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తూ ఉన్నాడు. అయితే, ఈసారి మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశాడు. నవరాత్రి సందర్భంగా రజినీ గుడిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు.

ఘనంగా ఊరంతా బొడ్డెమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T145718.954.wav?_=8

 

ఘనంగా ఊరంతా బొడ్డెమ్మ సంబరాలు…!

మొదలాయే… ప్రకృతిని ఆరాధించే పండగ…

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ లోని కేసముద్రం విలేజ్ బస్టాండ్ సెంటర్ తోట బజార్ లో తొమ్మిది రోజులపాటు నిర్వహించే బొడ్డెమ్మ పండగ వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బొడ్డెమ్మ మరియు బతుకమ్మ పండగ రానే వచ్చింది.

 

 

 

ఈ పండగ వస్తే తెలంగాణ మహిళలకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పొద్దంతా ఎన్ని పనులు చేసి అలసిపోయిన సాయంత్రం సంధ్యా సమయం అయిందంటే వారి ఆనందాలకు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా వాళ్ళ యొక్క సంబరాలు భక్తి పాటలతో జానపద గేయాలతో లయబద్ధంగా ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలవుగా అన్నట్టు ఊరు ఊరంతా వాడవాడలా బొడ్డెమ్మ సంబరాలు మహిళలు ఎంతో జోరుగా హుషారుగా బొడ్డెమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. మహిళలు ఎంతో ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు అమావాస్యకు పితృపక్ష రోజులలో గౌరీ దేవికి అత్యంత పవిత్రమైన రోజులుగా భావించి నిర్వహించే బొడ్డెమ్మ పండుగ వేడుకలను కన్నె పిల్లలు,మహిళలు సాయంత్రం సంధ్యా సమయములో పుట్ట మట్టి తీసుకొని వచ్చి తొమ్మి దొంతరలు లేదా ఐదు లేదా మూడు అమ్మవారి ప్రతిరూపంగా భావించి (గద్దెలుగా) పేర్చి తయారుచేసి ఎర్రమట్టితో అలికి, పసుపు, కుంకుమ పూలతో అలంకరించి గౌరీ దేవి రూపంలో తల్లికి తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఆటపాటల కోలాటాలతో నిర్వహిస్తారు. బొడ్డెమ్మ చరిత్ర కొన్ని కథనాల ప్రకారం బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ కంటే ముందు నుంచి ఉంది అని చరిత్ర చెబుతోంది, క్రీస్తుశకం 8వ శతాబ్దంలో అంతకంటే ముందు నుంచే ఈ పండుగ ఆచరణలో ఉందని భావిస్తున్నారు. రామాయణ ,మహాభారత, భాగవత ఘట్టాలను, శివపార్వతి, సీతారాముల కళ్యాణ ఘట్టాలను జానపదుల పాటల రూపంలో బొడ్డెమ్మ పండుగలో కోలాటాల ఆటపాటలతో జరుపుకున్నారని.ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిలో ప్రకృతిని ప్రకృతి ఇచ్చే పూలతో ప్రకృతిని ఆరాధించడమే ఈ బొడ్డెమ్మ, బతుకమ్మ పండగ అని పురాణాలు చెబుతున్నాయి, ఈ బొడ్డెమ్మ పండగ ఒక భాగం ఇది మహిళలు తమ సాంస్కృతిక సాంప్రదాయాలను గుర్తించుకోవడానికి ఆనందించడానికి ఒక వేదికగా అందిస్తుంది.

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version