వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-17T124044.112.wav?_=1

 

వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో చలి తాండవిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో ఈ ప్రాంతాల గ్రామాలు, పట్టణాలు గజగజ వణుకుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి మరింతగా వణికిస్తోంది. సోమవారం జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ పట్టణంలో 7.1 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్ల గాలులు వీయడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రంగా ఉండడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికాలం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జిల్లాలో అత్యల్పంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి:

సదాశివపేట్ 7.9°, న్యాల్‌కల్ 8.0°, ఝరాసంగం 8.1°, మొగుడంపల్లి 8.2°, జహీరాబాద్, నల్లవల్లి, సత్వార్ 8.6°, మల్‌చల్మె 9.1°, దిగ్వాల్ 9.3°, పుల్కల్, కంగ్టి 9.8°, నిజాంపేట్ 9.9°, రాయికోడ్ 10.3°, జిన్నారం 10.4°, కొండాపూర్, హత్నూర్ 10.6°, నాగలిగిద, మునిపల్లి, కంది 10.9°, చౌటకూర్ 11.0°, గుమ్మడిదల 11.2°, అందోల్ 11.3°, కల్హేర్ 11.4°, ముక్తాపూర్, అన్నసాగర్ 11.5°, సంగారెడ్డి (కలెక్టరేట్) 11.6°, కంకోల్ 12.1°, వట్టిపల్లి 12.2°, పాశమైలారం 12.5°, రామచంద్రపురం (గీతం) 12.6°, పటాన్‌చెరు 14.4°, బీఏచ్‌ఈఎల్ 15.1°, అమీన్‌పూర్ (సుల్తాన్‌పూర్) 15.5° కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి.. డాక్టర్ రమ్య, మండల వైద్యాధికారిణి, ఝరాసంగం

దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు సరైన సమయానికి మందులు వేసుకోవాలి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, చిన్నారులు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీక్యాప్‌లు ధరించాలి. వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.

మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ..

మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

ఈరోజు మందమర్రి సింగరేణి ఉన్నత పాఠశాల మనోవికాస పిల్లలకు

బెల్లంపల్లి నివాసి గుండేటి అంబదాస్ లత గార్ల కుమారుడు శివరాంప్రసాద్ ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా
మనోవికాస పిల్లలకు అరటి పండ్లు బ్రెడ్డు, నోట్ బుక్స్ పెన్ను లు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క వైష్ణవి మేనమామ మేనత్త ఆడేపు అశోక్ కుమార్ సరోజన సహకరించిన స్కూల్ టీచర్ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.

అంగన్వాడి ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం సనుగుల గ్రామస్తురాలైన గొట్టే పరిమళ వయసు 36 సంవత్సరాలు, ప్రస్తుతం దేవుని తండా గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు మరియు భర్త ఆర్టీసీ హయర్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పరిమళ గత 8 నెలల నుండి గర్భసంచిలో గడ్డలు అయినవని పలు హాస్పిటల్లో తిరిగి ఎన్ని మందులు వాడినా కూడా కడుపునొప్పి తగ్గడం లేదని బాధపడుతుండేది. ఇట్టి విషయంలో మనస్థాపానికి గురై ఈరోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో బెడ్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందుర్తి ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది.

ప్రజలను అందుబాటులో ఉంటున్న వైద్యాధికారి అరిఫ్…

ప్రజలను అందుబాటులో ఉంటున్న వైద్యాధికారి అరిఫ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల బర్దిపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలను రోగులను అందుబాటులో ఉంటూ వైద్య సేవలందిస్తున్న డాక్టర్ ఆరిఫ్ మాట్లాడుతూ సాధారణంగా చలికాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలు ముక్కు కారడము, అస్తమ, శ్వాస కోస వ్యాధులు, హార్ట్ ఎటాక్స్, చర్మ సంబంధిత వ్యాధులు మొదలగునవి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్న పిల్లలకు, వృద్ధులకు షెటర్స్, బ్లౌజెస్, దుప్పట్లు నిండుగా కప్పుకొని చలికి గురి కాకుండా ఉండాలని కోరారు.

తంగళ్ళపల్లిలో గర్భిణీ స్త్రీలకు పోషక ఆహార అవగాహన

పోషక ఆహారాలపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

Vaibhavalaxmi Shopping Mall

తంగళ్ళపల్లి మండలంలో. పోషణ మాసం కార్యక్రమం పురస్కరించుకొని. సరైన పోషణ ఆహారంతో. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా. తీర్చిదిద్దాలని నినాదంతో.C.D.P.O. ఉమారాణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు 0….6. పిల్ల తల్లులకు. పోషణ ఆహారంపై. అవగాహన చేస్తూ. ఉమారాణి మాట్లాడుతూ ఆరోగ్యం మనది కొనుక్కునేది కాదు అని. సంపాదించుకునేదని. ఆరోగ్యం అనేది అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారమని. పోషకరమైన ఆహారాలు తీసుకున్నప్పుడు. ఆరోగ్యం బాగుంటుందని. అంగన్వాడి కేంద్రం నుంచి వచ్చే. ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని. అలాగే ఫ్రీ స్కూల్ లోకి అంగన్వాడి కేంద్రాలకు పిల్లలను పంపించాలని. ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను. అందిస్తారని. వీటిని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో.C.D.P.O. ఉమారాణి. సూపర్వైజర్ అంజలి. అంగన్వాడీ టీచర్స్.B. సత్యవతి. P. శోభ.R. లతా. G. పుష్పలత.N. పద్మ.S. శారదా. గర్భిణీలు స్త్రీలు బాలింతలు.పిల్లలు తదితరులు పాల్గొన్నారు

పిల్లలకు పౌష్టికాహారం అందివ్వాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T130809.774.wav?_=2

 

పిల్లలకు పౌష్టికాహారం అందివ్వాలి

అంగన్వాడి సూపర్వైజర్ పి అరుణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీలో పోసిన మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ స్వప్న సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన అంగన్వాడి సూపర్వైజర్ పి అరుణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్ల తల్లులు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందివ్వాలి ఆకుకూరలు పప్పు అంగన్వాడి నుండి వచ్చే ఫుడ్డును పిల్లలకు అందివ్వాలి భోజనానికి ముందు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఈగలు రాకుండా ఇంటి ఆవరణ చుట్టుపక్కల శుభ్రంగా చేసుకోవాలి లా చేయడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం…

చిరుధాన్యాలు మొలకెత్తిన గింజలతో సంపూర్ణ ఆరోగ్యం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండలంలోని అందుకు తండ గ్రామ పరిధిలోని పోషణ మాసంలో భాగంగా అందుకు తండా గ్రామపంచాయతీ పరిధిలో ఐదుగురు టీచర్లు ఏర్పాటు చేసిన సమావేశమునకు జయప్రద సూపర్వైజర్ హాజరై ప్రతిరోజు చిరుధాన్యాలతో కూడిన భోజనం, మొలకెత్తించిన గింజలను భుజించి, సేంద్రియ ఎరువులు వాడి, పంటలు పండించాలని, వ్యక్తిగత శుభ్రత ,పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు ప్లాస్టిక్ నివారణ గూర్చి వివరించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ప్రతాప్ గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలంటే చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచుతూ,మొబైల్స్ కు దూరంగా ఉంచుతూ బయట తిను బండారాలు పిల్లలకు పెట్టకుండా ఇంటిలో తయారు చేసిన సమతుల హారము అందించినప్పుడు అన్ని రంగాలలో రాణిస్తారు అని సూచించారు. ఈ ప్రోగ్రాం లో నలుగురు పిల్లలకు అక్షరాభ్యాసము, ముగ్గురు పిల్లలకు అన్నప్రాసన చేయించి అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామ్ సింగ్ గ అంగన్వాడి టీచర్లు కస్తూరి, రజిత ప్రమీల, మమత, ఉమాదేవి, అనూష ,స్వప్న ,ఏఎన్ఎం లావణ్య, ఆశ వర్కర్స్ ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరైనారు. టీచర్స్ ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ చాలా చాలా, ఉపయోగకరమైనది అని మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

పోలియో చుక్కలతో పిల్లల శరీర వికాసానికి తోడ్పాటు:…

పోలియో చుక్కలతో పిల్లల శరీర వికాసానికి తోడ్పాటు:

◆:- ఏఐబీఎస్సెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://youtu.be/noKiE2XIQfg?si=L7oOaMMyR-BikAwq

 

జహీరాబాద్. పోలియో చుక్కలతో పిల్లల శరీర వికాసానికి తోడ్పాటు ఉంటుందని, రహిత రాష్ట్రం నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పుట్టిన నాటి నుంచి 5 ఐదేళ్లు పూర్తయ్యే చిన్నపిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టిందని అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ నాయకులు పవార్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఆదివారం నాడు పట్టణంలోని చిన్న హైదరాబాద్ వార్డులో జరిగిన పోలియో చుక్కల కార్యక్రమనికి శ్రీనివాస్ నాయక్ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, పుట్టిన చిన్న పిల్లల నుంచి ఐదేళ్లు పూర్తయ్యే వారికి వీర్యాలని, గతంలో పోలియో ఇంజెక్షన్, చుక్కలు వెయ్యకపోవడం వల్ల శారీరకంగా బలహీనులు అయ్యేవరని, 2004 సం రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలియోను దేశవ్యాప్తం చేసి ఇంటింటికి తిరిగి ప్రజలకు పోలియో కార్యక్రమన్ని ప్రారంభించి అమలు చేశారని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఘన పోషణ మాస కార్యక్రమం

ఘన పోషణ మాస కార్యక్రమం

సూపర్వైజర్ అరుణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి రూరల్ మండలం పెద్దాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ గర్భిణీలు స్త్రీలు బాలింతలు చిన్న పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంగన్వాడి కేంద్రం నుండి వచ్చిన ఫుడ్డును పిల్లలకు తినిపించాలి దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని అన్నారు అనంతరం అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ విజయలక్ష్మి. వనిత బీ లక్ష్మి రమాదేవి అంగన్వాడి ఆయా రమ ఆశ వర్కర్స్ సుకన్య కోమల గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

నిండు జీవితానికి రెండు చుక్కలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T112042.576.wav?_=3

 

నిండు జీవితానికి రెండు చుక్కలు.

మహేంద్ర కాలనీ లో పల్స్ పోలియో కార్యక్రమం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీ లో ని కేంద్రాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం లో యువ నాయకులు మీదొడ్డి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు ఈ కార్యక్రమం లో .అంగన్వాడీ టీచర్లు తుక్కమ్మ అనిత, ఆశ వర్కర్ జ్ఞానలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత

ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం….

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం:-

వరంగల్, నేటిధాత్రి, (లీగల్):-

 

శుక్రవారం నాడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) ను పురస్కరించుకొని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి యం.సాయి కుమార్ అధ్యక్షతన “మిషనరీస్ ఆఫ్ ఛారిటి”, కాశిబుగ్గ, వరంగల్ లోని మేథో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ మరియు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ హాజరై, మాట్లాడుతూ “మానసిక దివ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు.

దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్తులో వీరికి కావలసిన అన్ని రకాల వైద్య సేవలకు మమ్మల్ని సంప్రదించవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా మేథో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లను అందించి, వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, డిప్యూటి లీగల్ ఏయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, ఇంతెజార్గంజ్ సబ్ ఇన్స్పెక్టర్లు టీ.తేజ, ఎన్.వెంకటేశ్వర్లు డా.క్యూరీ, డా.అనూహ్య, సిస్టర్ సవీన మరియా, సిస్టర్ అంజలిక మరియా తదితరులు పాల్గొన్నారు.

హన్మంత్ రెడ్డి — రజిత వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హన్మంత్ రెడ్డి — రజిత వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall

ఝరాసంగం మండల కేంద్రంలో కక్కెరవాడ గ్రామానికి చెందిన హన్మంత్ రెడ్డి — రజిత కుమార్తెల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో చిన్నారులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి సర్పంచ్ లు బస్వరాజ్, శ్రీనివాస్ రెడ్డి,సంగారెడ్డి, నాయకులు డాక్టర్ నాగన్న,సోహైల్, దత్త రెడ్డి నాయకులు ,కార్యకర్తలు తదితరులు.

పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం…

పోషణ మాసం ఆరోగ్యం రక్షణే లక్ష్యం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల అంగన్వాడి కేంద్రంలో లో పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ..గర్భిణీ, బాలింతలు,పిల్లలు,కిషోర బాలికలతో పాటుగా ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.తాజా పండ్లు,కూరగాయలు,పాలు తీసుకోవాలని,రక్త హీనత బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని కోరారు.అలాగే పిల్లలకు బయటి జంక్ ఫుడ్ కొనివ్వకూడదని,వాటి వల్ల తరచూ అనారోగ్య బారిన పడి ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. పిల్లలు వయసుకు తగిన ఎదుగుదల ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం గర్భిణీ మహిళతో పోషణ మాసం ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి,అంగన్వాడి టీచర్స్ వరలక్ష్మీ,సునీత,శ్రీవాణి,ఆయా పిల్లలు,గర్భిణీలు,బాలింతలు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.

చెరువులు, కుంటలు నిండాయి…..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T142146.202.wav?_=4

 

చెరువులు, కుంటలు నిండాయి..
• ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
• ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల మారాయని బతుకమ్మ, దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై రాజేష్ సూచించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు చెరువులు కుంటలు అధికంగా నిండడంతో రాబోయే బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సమయంలో మహిళలు, చిన్నపిల్లలు చెరువుల వద్దకు గుమి గూడి వెళ్ళవద్దన్నారు. చిన్నపిల్లలు చెరువుల వద్ద ఇష్టానుసారంగా తిరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘ పెట్టాలన్నారు. ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకోవడమే కాకుండా.. సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ మదర్సాలో పుడ్ పాయిజన్ కలకలం..

మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ మదర్సాలో పుడ్ పాయిజన్ కలకలం..

రామాయంపేట సెప్టెంబర్ 22 నేటి ధాత్రి (మెదక్)

చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో పుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది.ఈ సంఘటనలో 10 మంది చిన్నారులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న అధికారులు వారిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆసుపత్రిలో వైద్యులు,సిబ్బంది పర్యవేక్షణలో చిన్నారులు చికిత్స పొందుతూ,ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం.

 

మరో 25 మంది పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు.చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారులందరూ బాగానే ఉన్నారు.వైద్యులు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి,సరైన వైద్యం అందిస్తున్నారు.

ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లలకు ఎల్లప్పుడూ నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వంటగదులు పరిశుభ్రంగా ఉంచుతూ,ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి అని స్పష్టం చేశారు.అదేవిధంగా ఆహారం విషయంలో నాణ్యత నిబంధనలు పాటించని హోటళ్లపై,రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.అయన వెంట ఇంచార్జి డిఎంహెచ్వో సృజన,ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి,జిల్లా స్పెషల్ ఆఫీసర్ కోఆర్డినేటర్ శివ

మీ పిల్లలు మారం చేస్తున్నారని చేతికి ఫోన్ ఇస్తున్నారా…

మీ పిల్లలు మారం చేస్తున్నారని చేతికి ఫోన్ ఇస్తున్నారా?

◆:- అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్ల

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

పిల్లలు మారం చేస్తున్నారని ఫోన్లు చూపిస్తూ లాలిస్తున్న తల్లిదండ్రులు – ఫోన్లలో వచ్చే ఆటలు, రీల కు ఆకర్షితులౌతున్న చిన్నారులు – పజ్జీ, ఫ్రీఫైర్ వంటి ఆటలతో లోకాన్నే మరచిపోతున్న చిన్నారులు

కొన్నేళ్లుగా యువత, చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారు. పిల్లలు మారం చేస్తున్నారని తల్లిదండ్రులు ఫోన్లు చూపిస్తూ లాలిస్తున్నారు. వాటిలో వచ్చే చిత్రాలు, వీడియోలు అవి ఇచ్చే సందేశాలకు పసితనంలోనే వాటికి ఆకర్షితులై మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. కొందరు బడి ఈడు పిల్లలను గతంలో కరోనా సమయంలో వచ్చిన ఆన్​లైన్ తరగతులు ఫోన్లకు కట్టిపడేశాయి. ఇప్పుడు ప్రాజెక్టు వర్క్ పేరిట వివిధ అంశాల పరిశోధనకు ఫోన్లనే వాడుతున్నారు. కాగా తమ పిల్లలు ఫోన్​తో ఏం చేస్తున్నారని గమనించకపోవడంతో చిన్నారులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటిలో పబ్జీ, ఫ్రీఫైర్ ఆటలు ఎదుటి వారిని ఓడించడంలో వచ్చే పాయింట్ల వేటలో పొందే ఆనందంలో వారు లోకాన్నే మరిచిపోతున్నారు.

కొన్ని సంఘటనలు : 

 

 

 

 

తాజాగా భైంసా పట్టణంలో అగ్నిమాపక కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న హైదరాబాద్​కు చెందిన సంతోశ్, సాయిసుప్రజ దంపతుల కుమారుడు రిషేంద్ర (13) పబ్జీ ఆటకు బానిసై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఆకలి, నిద్ర మరిచి గంటలు తరబడి ఆటలో నిమగ్నమవ్వడంతో మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడింది. తల్లిదండ్రులు వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లోకుండా పోయింది. మూడ్రోజుల నుంచి కుటుంబీకులు వారించిగా జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

 

 

 

గతంలో కుభీరు మండల పార్టీ గ్రామానికి చెందిన ఒకరు ఆన్​లైన్​లో వచ్చే ఆటలు ఆడుతూ పెట్టుబడులు పెట్టాడు. రూ.లక్షల్లో సొమ్ము కోల్పోయాడు. దీంతో చేసేదేమీ లేక, ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తల్లిదండ్రులు గమనించాలి :

చిన్నారులు, యువత ఫోన్లను వినియోగిస్తున్నప్పుడు పెద్దలు గమనిస్తుండాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

◆:- పాఠశాలలో ఇచ్చే ప్రాజెక్టు వర్కుల సాకుతో వాడుతున్న ఫోన్​లను పిల్లలు ఎలా వినియోగిస్తున్నారో గమనిస్తూ ఉండాలి.

◆:-ఫోన్​ల వినియోగంతో ఎదురయ్యే దుష్ప్రభావాలను వారికి తెలియజేయాలి.

◆:- స్మార్ట్ ఫోన్​ వినియోగిస్తున్న పిల్లలు సరిగ్గా తినరు, నద్రపోరు. చిన్న చిన్న మాటలకు కుంగిపోతుంటారు. ఒత్తిడికి లోనవుతుంటే ఓ కంట కనిపెట్టాలి. అలాంటి లక్షణాలు ఉంటే మానసిక వైద్యులను సంప్రదించాలి.

సముదాయించి నచ్చజెప్పండి : 

 

 

 

 

ఫోన్​లలో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు డా.సురేశ్‌ అల్లాడి తెలిపారు. ఆ ఆనందంలో లోకాన్ని మర్చిపోయి వారు ఫోన్లకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అలా జరగకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకుని సముదాయించాలని తల్లిదండ్రులకు సూచించారు.

“ఫోన్​లలో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. ఆ ఆనందంలో లోకాన్ని మరచిపోయి వారు ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా జరగకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకుని సముదాయించాలి.

దోమ చిన్నదే కానీ ప్రమాదం పెద్దది…

దోమ చిన్నదే కానీ ప్రమాదం పెద్దది

డెంగీ జ్వరంపై డి ఎం హెచ్ ఓ అప్పయ్య సూచనలు

నడికూడ,నేటిధాత్రి:

 

 

ఈరోజు స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా కంఠాత్మకూర్ ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభహోత్సవం అనంతరం
హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు
ఈరోజు పి హెచ్ సి రాయపర్తి సిబ్బంది నడికూడ మండలం కంఠత్మకూర్ గ్రామము లో డోర్ టూ డోర్ విస్తృత స్థాయి ఫీవర్ సర్వే ను
చేపట్టడం జరిగింది.ఈ సర్వే ను డి ఎం ఎచ్ ఓ పరిశీలన చేశారు గ్రామం లో సిబ్బంది నిర్వహించిన సర్వే ను కొన్ని ఇండ్లకు వెళ్లి చూసారు. ప్రజలతో మాట్లాడుతూ డెంగీ ఫీవర్ భారిన పడకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
డెంగీ జ్వరం వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన వ్యాధి.ఇది ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.ఈ దోమలు ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కుడుతాయి. డెంగీకి ప్రత్యేకమైన మందు లేకపోవడంతో నివారణే ప్రధాన ఆయుధం అన్నారు.
ఇంటి చుట్టూ వుండే పిచ్చి మొక్కలు,గడ్డి పొదలు
ఇళ్ల చుట్టూ నీరు నిల్వ లేకుండా శుభ్రంగా ఉంచాలి
వారానికి రెండుమాడుసార్లు మంగళవారం మరియు శుక్రవారం డ్రై డే నిర్వహించి, కూలర్లు,డబ్బాలు,కొబ్బరి చిప్పలు,ట్యాంకులు,టైర్లు శుభ్రం చేయాలి.నీరు నిలువ ఉండకుండ చూసుకోవాలి. దీనితో దోమలు పుట్టకుండా చేయవచ్చు.
పిల్లలు,పెద్దలు పూర్తి బట్టలు వేసుకోవాలి.
దోమలు కుట్టకుండ
దోమ తెరలు,కాయిల్స్, లిక్విడ్స్,కాళ్లకు చేతులకు పూత మందులు వాడాలి.
డెంగీ వ్యాధిని నివారించడం మన చేతుల్లోనే ఉంది.
ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, తమ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచితే దోమలు కుట్టకుండా నివారించినవారం అవుతామని అన్నారు.నీటి గుంతలు,వాటిలో ఆయిల్ బాల్స్ వేయాలి అన్నారు. మన గ్రామం డెంగీ రహితంగా ఉంటుంది అని అన్నారు.
ఈ కార్యక్రమం లో స్థానిక పి హెచ్ సి వైద్యధికారిని డాక్టర్ దివ్య మరియు హెల్త్ ఎక్స్టెంషన్ ఆఫీసర్,సూపర్ వైజర్స్,ఏ ఎన్ ఎం లు,హెల్త్ అసిస్టెంట్ లు,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

భారీ వర్షాలకు అప్రమత్తంగా…

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఝరాసంగం పంచాయతీ కార్యదర్శి వీరన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంగళవారం అయన మాట్లాడుతూ. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని, పిల్లలను బయటికి పంపవద్దని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

పంచాయతీ ఎన్నికలు..

పంచాయతీ ఎన్నికలు.. BIG UPDATE

TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్‌ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version