సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి…..

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి..

దహన సంస్కారాల కోసం ఇబ్బంది పడుతున్న కార్మికులు

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు…

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు

జైపూర్,నేటి ధాత్రి:

 

సింగరేణిలో సీఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి కమాండెంట్ సంచల్ సర్కార్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ జరిపించారు.విధి నిర్వహణలో భాగంగా ప్రాణ త్యాగాలు అర్పించిన పోలీస్ వీరులకు కమాండెంట్ చంచల్ సర్కార్ నివాళులు అర్పించారు.సెప్టెంబర్ 1. 2024 నుండి ఆగస్టు 31.2025 మధ్యకాలంలో ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మొత్తం 191 పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాలని వారు తెలిపారు. అలాగే అమరవీరులైన పేర్లను చదివి వినిపించి వారి గౌరవం సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్ బలగాల ధైర్య సహసాలను అంకిత భావాన్ని గౌరవించడం వారి సంక్షేమం దేశ భద్రత పట్ల మన నిబంధతను తెలియజేయడమే మన లక్ష్యము అని తెలిపారు.

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ…

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ

ఏరియా జియం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

వోల్వో డంప్ ట్రక్కు ఆపరేటర్ కోసం పదవ తరగతి ఉత్తీర్ణులై, కనీసం మూఢు సంవత్స రాల,అనుభవం కలిగివున్న హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి నిరుద్యోగ యువకులైన సింగరేణి ఉద్యోగుల పిల్లలు, మాజీ ఉద్యోగుల పిల్లలు, పరిసర గ్రామాల ప్రజలు, భూనిర్వాసితుల కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు . దీనికి ముడునెలలకు ఒక బ్యాచ్ కు 60 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు పదవ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరం, మెరిట్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు . ఎస్సీ, ఎస్టీ వారికి రూల్ ఆఫ్ రిజర్వేషన్, వయస్సు మినహాయింపు ఉంటుందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారికి ఎటువంటి స్టెఫండ్ కానీ భృతి కానీ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తిగా వారి సొంత పూచికత్తు మీదనే ఆధారపడి ఉంటుందని తెలియజేశారు.ఈ దరఖాస్తులను అక్టోబర్ 20 లోపు సంబంధిత భూపాలపల్లి సింగరేణి ఎంవీటీసీ (మైన్ వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్) లో అందజేయాలని తెలియజేశారు .

ఖమ్మం జిల్లాలో తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి…

ఖమ్మం జిల్లాలో తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామంలో తాటిచెట్లు నరికినవారిపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ
మాదారం గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి కల్లు వృత్తిపై జీవనాధారం కొనసాగించే వందల కుటుంబాలు ఆ గ్రామంలో గీత కార్మికులు ఉన్నారన్నారు.మాదారం గ్రామంలో ఒక పెద్ద మనిషి పంట పొలాన్ని కొనుగోలుచేసి గత సంవత్సరం కొన్ని తాటిచెట్లను తీసివేయగా గీత కార్మికులు వెళ్లి నిరసన వ్యక్తంచేయగా ఆరోజు ఆపేశారన్నారు. ఈ నెల 8న మరలా వందల తాటిచెట్లను జె.సి.బిలతో కూల్చివేయడం
మొదలుపెట్టారన్నారు.గీత కార్మికులకు విషయం తెలిసి అడ్డుకోగా చెట్లను
కూల్చడానికి సిద్ధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.చెట్లను నరికి గీత కార్మికులు పొట్టకొట్టొద్దని వేడుకున్నా ఆపలేదని అవేదన వ్యక్తం చేశారు.
జీవనాధారం మొత్తం కల్లువృత్తిపై ఆధారపడి ఉంటున్న గీత కార్మికులు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా ఆబకారిశాఖ అధికారులు స్పందించి గీత కార్మికులకు తగిన న్యాయం చేయాలని, లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్,జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్, గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్,కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, తాళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగానిసురేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్, జునూరి నరేష్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,రమేష్ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పల్లకి సేవ

ఘనంగా పల్లకి సేవ

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ

సింగరేణి యాజమాన్యం ముక్కు పిండి కార్మికుల జీతాలు వసూల్ చేస్తాం

సింగరేణి యాజమాన్యం పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన మహేష్ వర్మ

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా,నిరసన కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది.కాంట్రాక్ట్ కార్మికులకు 4నెలల జీతాలను ఇవ్వకుండా,విధులకు తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తూన్నారన్న విషయంపై టీఆర్పీ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు మహేష్ వర్మ మాట్లాడుతూ.. సిఆర్ఆర్ కంపెనీ,ఉదయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాంట్రాక్ట్ కార్మికులతో 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, కార్మికులను విధులకు కూడా తీసుకోకుండా కంపెనీ పూర్తిగా ఎత్తేశారని అన్నారు.కాంట్రాక్ట్ యాజమాన్యానికి సంబంధించి ఎవరు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలని కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ విషయం పై సింగరేణి జనరల్ మేనేజర్ ని కలవగా డబ్బులు ఇప్పిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు మాకు సంబంధం లేదని మాట మార్చారని మండిపడ్డారు.కార్మికుల జీతాలు ఇప్పిస్తానని మాటమార్చిన జనరల్ మేనేజర్ అధికారిగా అనర్హుడని అన్నారు.కీలక బాధ్యత ఉద్యోగంలో ఉండి కార్మికుల జీతాలు ఇప్పించడం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.ఇలాంటి మోసపూరిత కంపెనీలకు కాంటాక్ట్ ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు.కార్మికుల శ్రమ దోచుకున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని,వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని,వాటి లైసెన్సులు పేపర్ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల జీతాలు వడ్డీతోసహా చెల్లించాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింగరేణి యాజమాన్యంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంటాక్ట్ కంపెనీల,సింగరేణి యాజమాన్యం ముక్కు పిండి వసూల్ చేస్తామని,బాధిత కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాకాల దినకర్,దాస్యపు దీపక్ కుమార్,పడాల శివతేజ, సిపతి సాయి కుమార్,ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి…

సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి

ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి వ్యాప్తంగా లాభాల వాటా ప్రకటనపై ప్రతి కార్మికుడికి అసంతృప్తి ఉందని, వాస్తవ లాభాలు ప్రకటించాలని ఏఐటీయూసీ గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తుందని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. లాభాల వాటా పై రకరకాల చర్చలు, కామెంట్లు వస్తున్న నేపధ్యంలో వాస్తవ లాభాలను ప్రకటించకుండా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం గోప్యతతో లాభాలను ప్రకటించడం కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా వాస్తవిక లాభాలను ప్రకటించాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తుందని అన్నారు. లాభాలను సింగరేణి ప్రాంతంలో అభివృద్ధికై కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వం,యాజమాన్యం సింగరేణి ప్రాంతాలలో ఏం అభివృద్ధి చేశారో తెలియచేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి సింగరేణికి ఇప్పటికే 40 వేల కోట్ల బకాయిలు రావాల్సింది ఉందని గుర్తు చేశారు. లాభాలు ఎన్ని వచ్చాయో యాజమాన్యం ప్రకటించకుండా ఇన్ని రోజులు నాన్చుతూ వచ్చి చివరకు కేవలం 34% లాభాల వాటా మాత్రమే అందించడంతో కార్మిక లోకం తీవ్ర అసంతృప్తికి లోనైందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సైతం సరైన లాభాలు ప్రకటించకపోవడంతో వారు కూడా నిరాశ చెందుతున్నారని తెలిపారు. ఏఐటియుసి సంఘం తరఫున లాభాల వాటపై ప్రభుత్వం పై,యాజమాన్యం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రతి కార్మికుడికి చెందాల్సిందేనని డిమాండ్ చేశారు. లాభాల వాటాపై యాజమాన్యం పునరాలోచించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

భూపాలపల్లిలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…

దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి, మునిసిపల్, పోలీసు అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
దసరా ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ స్టేడియంలో గతేడాది జరిగిన దసరా ఉత్సవాల్లో కొంతమంది అల్లరి మూకలు గొడవ చేశారని, ఈసారి అలాంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకి సూచించారు. ఉత్సవాలు ప్రజాస్వామ్య పండుగలా అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిఎస్పి సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి మధు అప్పం కిషన్ ముంజల రవీందర్ తదితరులు పాల్గొన్నారు

స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలకు సర్క్యులర్ జార్ చేయాలి..

స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలకు సర్క్యులర్ జార్ చేయాలి..

ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ
రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి యాజమాన్యం మూడుసార్లు జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పందాలకు వెంటనే సర్క్యులర్ జారీ చేసి సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో పిట్ సెక్రటరీ ఎన్. రమేష్ అధ్య క్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ మోటాపలుకుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి యాజమాన్యం గతంలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ సమస్యలను పరిష్కరించకపోవడంతో సింగరేణి సి.ఎం.డితో జరిగే స్ట్రక్చర్ మీటింగ్ ను బహిష్కరించడం జరిగిందన్నారు. అట్లాగే యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 35శాతం లాభాలవాటా ఇవ్వాలని కోరారు. గతంలో సింగరేణిలో ఎన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం ఎక్కువైందని దాంతో కార్మిక సమస్యలు పెండింగ్ పడుతున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా యాజమాన్యం కార్మిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ గేట్ మీటింగ్ లో బ్రాంచ్ కమిటీ నాయకులు తాళ్ల పోషం, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ జి. రవికుమార్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎన్, సతీష్, టెంపుల్ కమిటీ చైర్మన్ ధనుంజయ్, సలహాదారులు రమేష్, పిట్ కమిటీ సభ్యులు. ఎన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కోసం ఓటింగ్..

సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ఓటింగ్ ద్వారా అభిప్రాయ సేకరణ

కంపేటి రాజయ్య, బంద్ సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత రెండు రోజులపాటు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కార్మికుల అభిప్రాయాల సేకరణ చేపట్టారు.
ఈ మేరకు శనివారం స్థానిక శ్రామిక భవనంలో విలేకర్ల సమక్షంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పెట్టారు. ఈనెల 11, 12 తేదీలలో నిర్వహించిన ఓటింగ్ లో సొంతింటి కల నెరవేర్చాలని 3000 మంది కార్మికులు పాల్గొని వారీ అభిప్రాయాన్ని బ్యాలెట్ పత్రంపై తెలియజేశారు. 21 మంది సొంతిల్లు, క్వార్టర్ కావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటీ రాజయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ… 40 వేల మంది సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా వేలకోట్ల రూపాయల లాభాల్లో సింగరేణి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు డివిడెంట్ రూపంలో సింగరేణి చెల్లిస్తూ ఉన్నదనీ, ఇంత శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికులకు మాత్రం సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 వేల సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని, 3200 క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకున్నయని తెలిపారు. వేలాదికరాల భూమి సింగరేణి ఆధీనంలో ఉందని కార్మికులకు సొంతింటి నిర్మాణానికి ఇంటి స్థలం కేటాయించి, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చే వరకు కార్మిక సంఘాలు సంఘాల కతీతంగా పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు బాధ్యత తీసుకోవాలని, మిగతా కార్మిక సంఘాలను ఏకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం దేవేందర్, దీకొండ ప్రసాద్, ఎం రాజేందర్, తోట రమేష్, బిక్షపతి, రవి కుమార్, రాజాకు, శంకరు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జె.ఎ.సి..

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జె.ఎ.సి

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి
లాభాలవాట 20 వేలు చెల్లించాలి
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల విజ్ఞప్తి.

సమస్యల పరిష్కారానికి మంత్రుల హామీ

ఈరోజు ప్రజాభవన్ లో సింగరేణి వ్యాప్తంగా వచ్చిన వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ యొక్క వేతనాలను పెంచాలని, లాభాల వాటా 20, వేలు చెల్లించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారిని ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.

సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలనుండి వందలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉదయం ప్రజాభవన్ కు చేరుకున్నారు. కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి , గుమ్మడి నరసయ్య ప్రజాభవన్ కి వచ్చి ప్రజావాణి ఇంచార్జి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారితో కలిసి కాంటాక్ట్ కార్మికుల ప్రతినిధులను తీసుకొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి సమస్యలపై చర్చించడం జరిగింది.
సింగరేణిలో కాంటాక్ట్ కార్మికులకు శ్రమతోనే లాభాలు వస్తున్నాయని అటువంటి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు 1285 రూపాయలు చెల్లిస్తుంటే సింగరేణిలో కేవలం రూళ541 మాత్రమే చెల్లిస్తున్నారని ఫలితంగా ఒక్కొక్క కాంట్రాక్ట్ కార్మికుడు రోజుకు 744/- రూపాయలు నెలకు 19 344 /-రూ పాయలవు నష్టపోతున్నారని మంత్రిగారికి తెలియజేశారు. ఇతర ప్రభుత్వ , ప్రైవేట్ రంగ పరిశ్రమలైన ఎన్టిపిసి, ఓఎన్జిసి , హెచ్ పి సి ఎల్ , ఐ ఒసిఎల్ , ఏపీఎండిసి స్టీల్ ఐటిసి సిమెంటు తదితర పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జిఒ కు అదనంగా మూడు వేల నుండి 5000 రూపాయలు చెల్లిస్తున్నారని కానీ సింగరేణిలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని, సెలవులు వైద్య సదుపాయం, ప్రమాద ఎక్స్ గ్రేసియా తదితర చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు చేయడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస వేతన జీఒల విడుదలలో కూడా జాప్యం జరుగుతున్నదని ఫలితంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెరగడం లేదని వారు తెలియజేశారు. ఇతర ప్రభుత్వ పరిశ్రమంలో చెల్లిస్తున్న విధంగా సింగరేణిలో కూడా జీవో కు అదనంగా వేతనాలను చెల్లించాలని దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రూపాయి కూడా భారం పడదని వారు తెలియజేశారు. సింగరేణి సాధిస్తున్న లాభాలను కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగానే 20 వేలు లాభాల వాటా చెల్లించాలని వారు కోరారు. గతంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చినటువంటి సెలవులు ఈఎస్ఐ, క్యాటగిరి ఆధారంగా వేతనాలు తదితర సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు తెలియజేశారు.

వేతనాల పెంపుదల సమస్యల పరిష్కారానికి ఉపముఖ్యమంత్రి హామీ:

కార్మికుల వినతి పై స్పందించిన ఉపముఖ్య మంత్రి గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగా వారి యొక్క వేతనాలు పెంచేందుకు,లాభాల వాటా పెంచెందుకు, ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీనికొసం అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను పిలిచి యాజమాన్యం సమక్షంలో చర్చలు జరుపుతానని హామీ ఇచ్చారు.

Singareni

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి జేఏసీ నాయకత్వం సింగరేణి సి అండ్ ఎండి ఎన్ బలరాం నాయక్ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకట స్వామి ని కలిసి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు కనీస వేతనాలు జి.ఒల పై చర్చించడం జరిగింది.

త్వరలో జి.ఒ లు ఇస్తాం కార్మిక శాఖా మంత్రి హామి :
ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ త్వరలోనే రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను పెంచుతామని. రాష్ట్ర ప్రభుత్వం పెంచాల్సిన వేతనాలను పెంచిన అనంతరం సింగరేణిలో అదనంగా చెల్లించాల్సాన వేతనాల గురించి చర్చిస్తామని. మిగతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ అనుగుణంగా వేతనాలు అమలు చేస్తామని మిగతా సమస్యలైన ఈఎస్ఐ అమలు, పెయిడ్ హాలిడేస్ , 15 లక్షల నష్టపరిహారం కేటగిరి ఆదారంగా వేతనాలు చెల్లించడం తదితర అంశాలను త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
కనీస వేతనాలు సలహా మండల చైర్మన్ ఐన్ టి యు సి నాయకులు జనక్ ప్రసాద్ కార్మికులకు మద్దతు ప్రకటించి మాట్లాడుతూ కనీస వేతనాల బోర్డులో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపామని జీవోలు వచ్చేంతవరకు ప్రభుత్వంపై జిఒశకుళ అదనంగా వేతనాలు పెట్టించేందుకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తానని, జేఏసీ పోరాటాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, భూపాల్ టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యంలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు అండగా ఉంటామని తెలియజేశారు.

Singareni

మంత్రులు, సి & ఎండి గార్లు కాంటాక్ట్ కార్మికుల సమస్యలపై స్పందించిన హామీలు ఇచ్చినందుకు సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వారికి ధన్యవాదాలు తెలియజేశరు. ఇచ్చిన హామీలను అమలు చేయని , పక్షంలో హామీల అమలు కోసం భవిష్యత్ పోరాటాలకు కార్మికుల సిద్ధంగా ఉండాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమానికి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బి మధు , యాకూబ్ షా వలి ,కరుణాకర్ ,యాకయ్య , బాబు ,మల్లెల రామనాథం ,రామ్ సింగ్, భూక్యా రమేష్ , వేల్పుల కుమారస్వామి, అరవింద్, మహేందర్, ఒదేలు, రాజశేఖర్ , అరవింద్ , స్వామి , క్రాంతి, శరత్, రఘు, సాజిద్, అనిల్ , విజయ్, మధుసూదన్ రెడ్డి , సమ్మన్న , తిరుపతమ్మ , లక్ష్మి సారయ్య, సక్రం , రాజేష్, క్రాంతి, రాజేందర్ , రవి , రమేష్, నాగేశ్వరరావు, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు.

అభినందనలతో.

సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి…

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి 
భూపాలపల్లి నేటిధాత్రి 

డబ్ల్యూపిఎస్ అండ్ జి ఎ (వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్  గేమ్స్) క్రీడలలో భాగంగా భూపాలపల్లి  ఏరియా  రామగుండం -3 లను కలుపుకొని బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ రీజినల్ మీట్ పోటీలను  సింగరేణి కృష్ణ కాలనీ మినీ ఫంక్షన్ హాల్ లో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా
 జి‌ఎం మాట్లాడుతూ  డబ్ల్యూపిఎస్ అండ్ జి ఎ క్రీడలు సింగరేణి సంస్థలో ప్రతి ఒక్కరిలో ఒక సెలబ్రేషన్ లాగా నిలుస్తాయన్నారు . క్రీడలు మనందరిలో మానసిక ఉల్లాసం, సానుకూలతను నింపుతాయి. మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్‌ వర్క్ ను వికసింపజేస్తాయి. నేటి ఆధునిక జీవన విధానంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం క్రీడల పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. 
మహిళ ఉద్యోగులు క్రీడల్లో రాణించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా ఆఫీసర్లు నియమితులయ్యారు. వీరు పురుషులతో సమానంగా భూగర్భ గనుల్లో పనులు నిర్వహిస్తున్నారు. సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు అయ్యాయి. ఈ అవకాశాలతో మహిళలు సింగరేణి లో అన్ని రంగాల్లో, ముఖ్యంగా క్రీడలలో, స్ఫూర్తిగా ముందుకు రావాలని సూచించారు. మహిళల పాత్రను మరింత ప్రోత్సహిస్తూ, మహిళా ఉద్యోగులు క్రీడల్లో విజయం సాధించాలని చెప్పారు. త్వరలో జరిగే  కోల్ ఇండియా క్రీడా పోటీలలో  సింగరేణి ని ముందు వరుసలో నిలబెట్టాలని,  ఆత్మవిశ్వాసంతో పతకాలను గెలుచుకు రావాలని  కోరారు సింగరేణి సంస్థలో ప్రతి ఏడాది లాగే ఈ క్రీడలను నిర్వహించడం ఆనందకరం. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా వుండి, క్రీడలు రోజు వారి మన కార్యకలాపాలలో భాగం చేసుకోవాలని సూచించారు.మనం   ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పాల్గొనే ఉద్యోగులకు, అభినందనలు తెలియజేశారు.  
ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్ కుమార్ ,స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, అర్జీ-3 స్పోర్ట్స్ ఆర్డినేటర్, అంజయ్య, న్యాయ నిర్ణేతగా జిమ్ సమ్మయ్య, సీఎం ఓ ఐ ఏ ప్రతినిధి నజీర్, ఏఐటీయూసీ ప్రతినిధి  ఆసిఫ్ పాషా, ఐఎన్టియుసి ప్రతినిధి హుస్సేన్, శ్రీనివాసరెడ్డి, పాక శ్రీనివాస్, ఆఫీసుద్దీన్, బానోతు రమేష్,   తదితర క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సింగరేణి కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి..

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-08T131535.150.wav?_=1

 

సింగరేణి కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి..

సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో 35% వాటాను వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి డిమాండ్ చేశారు. పట్టణం లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు పూర్తయినప్పటికీ లాభాల వాటా ప్రకటించక పోవడం దుర్మార్గం అన్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎన్నికల కోడ్ అమలు అయితే కార్మికుల లాభాల వాటా చెల్లించడం మరింత ఆలస్యం అవుతుందని వెంటనే గుర్తింపు సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 35% వాటా చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల సాధన కోసం ఈనెల 11,12 తేదిలలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంటు లలో వినూత్న రీతిలో కార్మికు ల అభిప్రాయాల సేకరణ కోసం ఓటింగ్ నిర్వహించడం జరుగు తుందని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటింగ్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కమిటీ నాయకులు రామగిరి రామస్వామి, వైస్ ప్రెసిడెంట్ రమేష్, సంజీవ్, సురేష్, మల్లేష్, తాజుద్దీన్, శ్రీధర్, కుమారస్వామి, ఆదర్శ్ లు పాల్గొన్నారు.

రాజకీయ జోక్యంతో సింగరేణి అభివృద్ధి ముప్పు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T152004.621.wav?_=2

రాజకీయ నాయకుల జోక్యంతో సింగరేణి అభివృద్ధి నిర్వీర్యం

సింగరేణి భూములను రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటున్నారు

ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణిలో రాజకీయ నాయకుల జోక్యంతో అభివృద్ధి దినదినం నిర్వీర్యం అవుతుందని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు క్రమ పద్ధతిగా ఎక్కువైతున్నారు పర్మనెంట్ కార్మికులు దినదినం తగ్గుతున్నారు కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి సింగరేణిలో ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులన్నీ కూడా 1998లో సింగరేణిలో ఎన్నికల పక్రియ తీసుకొచ్చి గెలిచిన కార్మిక సంఘాలు తమ ఆర్థిక రాజకీయ నాయకుల స్వలాభం కోసం ప్రభుత్వాలతో కుమ్మక్కై పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటిగా కొల్లగొట్టుక పోయినాయి
ఈరోజు సింగరేణి తల్లి ప్రమాదంలో ఉంది సింగరేణి తల్లిని రక్షించుకునే బాధ్యత యూనియన్ల తో పాటు యువ కార్మికులపై ఆధారపడి ఉంది కార్మిక వర్గం ఏకంగ కాకపోతే సింగరేణి ని కనుమరుగు అవుతుంది
కేంద్ర ప్రభుత్వం త్వరలో బొగ్గు బ్లాక్ లను వేలం వెయ్యబోతున్నది మన రాష్ట్రప్రభుత్వం సింగరేణి కంపెనీ తో పాటు కొన్ని యూనియన్లు వేలంలో పాల్గొనాలని ఈ వేలంలో బిజెపి పార్టీ పెంచి పోషిస్తున్న ఆదాని అంబానీ తోపాటు జిందాల్ వేదంతా కంపెనీలో ఇతర కార్పొరేట్ సంస్థలు బహుళ జాతి కంపెనీలకు తో పోటీపడి వేలంపాటలో మనము నెగ్గగలమా
కార్పొరేట్ శక్తులతో తట్టుకోలేనందున కొత్త బొగ్గు బ్లాక్ లను గతంలో లాగా నేరుగా కేంద్ర ప్రభుత్వం బేషరతుగా సింగరేణి సంస్థకే అప్పగించాలి ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ గనుక
సింగరేణి సంస్థకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కుట్రలను ఎండగడుతూ ఐక్య పోరాటాలు నిర్మిద్దాం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ దుర్మార్గమైన చర్యలను ఖండిద్దాం తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి తల్లిని కాపాడుకుందాం బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం యూనియన్లకు అతీతంగా సింగరేణి పరిరక్షణకై కార్మికులు పోరాడాలని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ పిలుపునిచ్చారు

భారతదేశ సంస్థగా సింగరేణి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T123359.080.wav?_=3

 

భారతదేశ సంస్థగా సింగరేణి…

సింగరేణి వివిధ దేశాలలో విస్తరిస్తాం…

రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే ప్రధాన లక్ష్యం…

గనుల్లో భద్రత పెంపుకు పటిష్ట చర్యలు…

సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్…

ప్రమాద రహిత సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దాలి…

డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, సంస్థలో పనిచేసే కార్మికులే సింగరేణికి కొండంత బలమని, కార్మిక సంఘాలు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలను తక్షణమే తీసుకుంటామని సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్ అన్నారు. మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఎంఎన్ఆర్ గార్డెన్ లో సింగరేణి 55వ రక్షణ పక్షోత్సవాల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి డీజీఎం ఎస్ ఉజ్వల్ థా, సౌత్ జోన్ డీజీఎం కన్నన్ లతో కలిసి ముఖ్య అతిథులుగా సీఎండీ ఎన్ బలరాం నాయక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థను భారతదేశంలో విస్తరింప చేసేందుకు కృషి చేస్తున్నామని, సోలార్ రంగంలో అడుగు పెట్టడం జరిగిందని, ఒడిశా రాజస్థాన్లో ఇప్పటికే విస్తరించగా రానున్న రోజుల్లో కర్ణాటకలో బంగారం, రాగి గనుల తవ్వకం పనుల్లో నిమగ్నం అవుతుందని తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్న సింగరేణి సంస్థ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో కొత్త గనులు రాకుంటే సంస్థ మునగడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడుతుందని, సంస్థ మనుగడను కాపాడుకోవాలంటే బొగ్గు గనుల వేలం పాటలో పాల్గొనాల్సిందేనని అన్నారు. విదేశాల్లోనూ సంస్థ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంస్థ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే గని కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సంస్థలో బొగ్గు ఉత్పత్తి కన్నా సంస్థను కాపాడే కార్మికుల ప్రాణాలు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రమాదాలు పనిలో అప్రమత్తంగా లేకుండా ఉన్న సమయాలలోనే జరుగుతున్నాయని అన్నారు. ప్రమాద రహిత సంస్థగా సింగరేణినీ తీర్చిదిద్దరమే కాకుండా, ఆరోగ్యకరంగా కూడా మార్చాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడి పై, ఉద్యోగి పై ఉందని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే సింగరేణిలో ప్రమాదాలు చాలావరకు తగ్గాయని, రక్షణపై సింగరేణి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. సింగరేణి సంస్థలోకి మహిళా ఉద్యోగులు రావడం శుభ సూచకమని పేర్కొన్నారు. కార్మికులకు దసరా, దీపావళి పండుగల బోనస్ లు సకాలంలో అందేలా చూస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన భద్రత పక్షోత్సవాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆయా డిపార్ట్మెంట్ లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకన్న, పోట్రూ, గౌతమ్, సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్, శ్రీరాంపూర్ జిఎం ఎం శ్రీనివాస్, సిఎంఓఏఐ లక్ష్మీపతి గౌడ్, గుర్తింపు సంఘం అధ్యక్షులు సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం అధ్యక్షులు జనప్రసాద్, వివిధ ఏరియాల జిఎంలు, అధికారులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి…

సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సొంత ఇంటి కోసం 200 గజాల స్థలం ఇవ్వాలి
కార్మికుడి సంవత్సర జీవితంలో మూడు నెలలు ఇన్కమ్ టాక్స్ కట్టడానికే సరిపోతున్నది అందువలన కనీసం అధికారులలాగా పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ను మాఫీ చేయాలని కోరుతున్నాం.
సింగరేణిలో రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక భూగర్భగనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు గత 18 నెలల నుండి జరగకపోవడం వలన రక్షణ విషయంలో వెనుకబడినట్లుగా భావిస్తున్నాం. నూతన బదిలీ విధానం కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
మెరుగైన క్యాడర్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతప్రమోషన్ పాలసీని తీసుకురావాలని కోరుతున్నాము
ఏరియా ఆసుపత్రులలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రిఫరల్ సిస్టంను మార్చలని మైన్ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్కు గురైన కార్మికుడిని ముందుగా డిస్పెన్సరీకి తీసుకువెళ్లడం తర్వాత ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం తర్వాత రిఫరల్ చేయడంతో చాలా సమయం వృధా అయి విలువైన ప్రాణాలను కోల్పోతున్నందున ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రి నుండే డైరెక్టుగా రిఫరల్ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
40/ లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం
ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేరుల సమస్యను వెంటనే తీర్చాలని కోరుతున్నాం
పై సమస్యల పరిష్కారానికి తగు చర్యను వెంటనే తీసుకొని సింగరేణి కార్మిక లోకానికి న్యాయం చేయాలని కోరుతున్నాం వివిధ కారణాల వలన ఉద్యోగాలను కోల్పోయిన డిస్మిస్డ్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అన్ని డివిజన్లో ఉన్న వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ లో ఇవ్వాలి సింగరేణి కార్మికుల ఎన్నికలలో వాగ్దానం చేసి ఇప్పటివరకు వాటిని అమలు చేయలేకపోతున్నారు వెంటనే అమలు చేయాలి చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు జీతాల కోసం డిమాండ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-46-4.wav?_=4

కాంటాక్ట్ కార్మికులకు ఎస్ వి ఎస్ యజమాన్యం జీతాలు ఇవ్వడం లేదు

సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

ఎస్ వి ఎస్ సింగరేణి కాంటాక్ట్ యజమాన్యం కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేసిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బందు క్రాంతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ వి ఎస్ సింగరేణి కాంటాక్ట్ యజమాన్యం జూలై నెల గడిచి
ఆగస్టు నెల 20వ తారీకు వచ్చిన ఇంతవరకు జీతాలు ఇవ్వడం లేదు అని కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చెందుతున్నారని ప్రతి నెల 7వ తారీకు చెల్లించాల్సిన జీతాలు నేటికీ 20వ తారీకు వచ్చిన జీతాలు వేయడం లేదు
దీంతో బ్లాస్టింగ్ కార్మికులు. వోల్వో ఆపరేటర్లు. హెల్పర్లు మిషన్ ఆపరేటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ కే టికే ఓసి2. ఓసి 3. కాంట్రాక్టర్ ఒకే కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ కావడం వలన అధికారులు పట్టించుకోవడం లేదు
సేఫ్టీ విషయంలో పట్టించుకునే అధికారులు కార్మికుల జీతాల విషయాల్లో ఎందుకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ప్రతినెల 10వ తారీఖు లోపు వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో
జిఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు
అంతేకాకుండా ఈనెల 22వ తారీకు నాడు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసమై కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 22 సింగరేణిలో అమలు చేయాలని నిర్వహించిన చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ దంపతులకు ఘన సన్మానం…

సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ దంపతులకు ఘన సన్మానం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయబోతున్న సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ సత్యనారాయణ దంపతులను మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సబ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో కమిటి సబ్యులు చేసిన కృషి అభినందనీయమన్నారు. దేవాలయంతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అయినప్పటికీ ఆలయ అభివృద్ధిలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జిఎం ఎం.శ్రీనివాస్ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కృష్ణ, కుమారస్వామి, పాల్గొన్నారు.

“సింగరేణి గిరిజన ఉద్యోగుల సమస్యలపై కొత్త కమిటీ సమావేశం”…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T154558.767-1.wav?_=5

 

సింగరేణి సిఎండి బలరాం నాయక్ ని కలిసిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దారావత్ పంతుల నాయక్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నుకున్న సందర్భంగా సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దారావత్ పంతుల నాయక్ ఆధ్వర్యంలో సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం, డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రు తదితరులను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నట్లు తెలిపారు.అధ్యక్షుడు దారావత్ పంతుల,జనరల్ సెక్రటరీ భూక్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియను వివరించి, రోస్టర్ వెరిఫికేషన్,ప్రమోషన్ పాలసీ వంటి గిరిజన ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చర్చించారు.వాటి పరిష్కారానికి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.సిఎం డి బలరాం,డైరెక్టర్ గౌతమ్ పోట్రు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ,గిరిజన ఉద్యోగుల న్యాయపూరితమైన సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.జనరల్ మేనేజర్లు, లైజాన్ సెల్ అధికారులు కూడా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఆంగోత్ భాస్కరరావు,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోకాళ్ల తిరుమలరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ దశరథ్, వైస్ ప్రెసిడెంట్ భూక్య వెంకట్రామ్,డిప్యూటీ జి.ఎస్. బి.కృష్ణ,జాయింట్ సెక్రటరీ ఏ.ఉపేందర్,ఇల్లందు ఏరియా ప్రెసిడెంట్ బి.కిషన్,కొత్తగూడెం ఏరియా సెక్రటరీ హీరోలాల్, మణుగూరు ఏరియా లైజాన్ ఆఫీసర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.గిరిజన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు తెలిపారు.

కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-7.wav?_=6

కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి కాంట్రాక్టర్ దివంగత కోనేరు వీరభద్ర రావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వీరభద్ర రావు(కోనేరు) ట్రాన్స్ పోర్ట్ పేరుతో సుపరిచితుడైన కాంట్రాక్టర్ కోనేరు వీరభద్రరావు గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం విజయవాడలో ఆయన కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రథమ వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ప్రాంతానికి చెందిన పలువురు హాజరై, వీరభద్రరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వీరభద్రరావుతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరభద్ర రావుకు సింగరేణి తో విడదీయరాని బంధం కలదని తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

వీరభద్ర రావు సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ గా మందమర్రి పట్టణం తోపాటు సింగరేణి వ్యాప్తంగా మంచి పేరు గడించారని తెలిపారు. అప్పట్లో కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ అంటే సింగరేణి వ్యాప్తంగా వీరభద్ర రావు ట్రాన్స్ పోర్ట్ కు మంచి పేరు కలదన్నారు. పట్టణంలోని ఎంతో మందికి తన ట్రాన్స్ పోర్ట్ లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు తన లాగే కోల్ ట్రాన్స్ పోర్ట్ లో రాణించాలనే అనుకునే ఔత్సాహికులకు అవకాశాలు కల్పించడం తోపాటు, వారికి వెన్నుదన్నుగా నిలిచి, సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా ఎంతో మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఆయన సతీమణి వెంకటరమణమ్మ, కుమారుడు కోనేరు ప్రసాద్ బాబు, మనవళ్లు డాక్టర్ ఫణికుమార్, కృష్ణకాంత్, వికాస్, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version