వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం

వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనమని, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు రాష్ట్రాన్ని సంక్షేమ యుగం వైపు తీసుకెళ్లిన మహానేత వైయస్సార్ అని ఎమ్మెల్యే అన్నారు. రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

 

 

 

గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యేభావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయ ఆవరణలో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… విరివిరిగా మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. అంతేకాకుండా, విరివిగా వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పండుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.

దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..

దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సేవలు తినలేనివని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైయస్అర్ ముఖ్యమంత్రిగా విద్యా, వైద్యం, ఉపాధి ఉచితంగా పేదలకు అందించారన్నారు.ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేద ప్రజలను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, మాజీ ఎంపీపీలు చుక్క రమేష్, బూర్గు రవీందర్, మండల నాయకులు కామ శోభన్, జంగిలి నగేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొలిపాక బిక్షపతి చెన్నారపు రాజు కామిశెట్టి రమేష్ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ నాయకులు
పాల్గొన్నారు.

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
మహాదేవపూర్ నేటి ధాత్రి :

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వారు మాట్లాడుతూ పేద ప్రజల మన్ననలు పొందిన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిఅని పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ పథకం, ఫీజు రియంబర్నమెంట్ 108 వాహనం ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు చేరవేసిన మహానేత అని కొనియాడారు వైయస్సార్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ గారు, ఫ్యాక్స్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి గారు, మాజీ ఎంపీపీ బాన్సువాడ రాణి బాయి రామారావు గారు,మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్ గారు,మాజీ పాక్స్ చైర్మన్ వామన్ రావు గారు,అంబట్ పల్లి మాజీ సర్పంచ్ ఎరవెల్లి విలాస్ రావు గారు, దేవస్థానం డైరెక్టర్ పద్మ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తడకల జగదీశ్,దాగం సంతోష్, రాఘవేంద్ర,కడర్ల నాగరాజు, చెక్రధర్,పోత రామకృష్ణ, చెంద్రశేఖర్ రెడ్డి,అయిత తిరుపతి రెడ్డి, శంకర్, బాపు లక్ష్మయ్య తదితరులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పరిపాలన ప్రతి ముఖ్యమంత్రికి ఆదర్శమని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్, 108 వాహనం, పేదలకు ఆరోగ్యశ్రీ ,ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు ప్రజలకు చేరవేసిన మహానేత అని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల వేణు, బుడిగ శ్రీనివాస్, గోపతి బానేష్,గోపు రాజం,రామ కృష్ణ,బొద్దుల ప్రేమ్ సాగర్,పసరకొండ కృష్ణ,గోళ్ళ మల్లేష్,రామ్ సాయి,రవీందర్,గూడ సత్తయ్య, లచ్చులు, మహిళ నాయకురాళ్లు పందుల సునీత, కమల,జాలిగపు రాజేశ్వరి, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైయస్సార్. ‌

తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైయస్సార్. ‌

ఓటమి ఎరుగని నాయకుడు ‌ మొగులపల్లి కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులుక్యాతరాజు రమేష్ ‌

మొగుళ్లపల్లి నేటి ధాత్రి. ‌ ‌

దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా విలేకరుల సమావేశంలో మొగులపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైయస్సార్ ఆయనవ్యక్తిగతం ఎందరికో ఆదర్శం రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడే వారు కొందరే ఉంటారు అలాంటి వారిలో వైఎస్ఆర్ ముందుంటారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు ఎప్పుడు తెలుగు వారి సంప్రదాయమైన పంచ కట్టు లోనే కనిపించేవారు పంచకట్టుకి ఆయన గుర్తింపు తీసుకువచ్చారు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేటప్పుడు నవ్వుతూ పలకరించేవారు ఆయన నడవడిక మాటల్లో హుందాతనం ఉండేది నిత్యం నవ్వుతూనే కనిపించేవారు ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వైయస్సార్ చేపట్టిన సేవలు చాలా గొప్పగాని వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్తో పాటు రైతు జీవితాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఉచిత విద్యుత్తు నీటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధి పదం వైపు నడిపి నడిపారని తెలిపారు జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ఏనాడు ఓటమి ఎరుగని నేత రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతు జన బాంధవుడు లక్ష కోట్లు ఖర్చయిన కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత పింఛన్లుదారులకు ప్రతి ఒకటో తారీకు నే పింఛన్ అందించడం వైయస్ పాలనలోనే మొదలైంది పేదలకు కుటుంబాలకు విద్యార్థులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని 108ను స్థాపించిన గొప్ప మహానుభావుడు అని ఏరంగాన్ని ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్ఆర్ మహానేత ఆదర్శం తోనే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పేదలకు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు సన్నబియ్యం అనేక సంక్షేమ పథకాలతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ దిశగాసాగుతుంది అని తెలిపారు

నిరుపేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్ఆర్

నిరుపేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్ఆర్

నర్సంపేట,నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ అన్నారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ 76 వ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన నాయకులు ఘన నివాళులర్పించారు.

 

 

 

 

 

రాజేందర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా సంక్షేమమే నిదానంగా ప్రభుత్వం నడవాలని ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజ్ రియింబర్స్ మెంట్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు, పావలా వడ్డీకే రుణాలు, వడ్డీ లేని రుణాలు, జలయజ్ఞంతో, సహా ఎన్నో గొప్ప పథకాలను తీసుకువచ్చి పథకాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు.తన పాదయాత్రతో 2004, 2009, వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన గొప్ప నేత దిగంగత వైయస్ఆర్ అని కొనియాడారు.

 

 

 

ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,మాజీ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్,ములుకల సాంబయ్య,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్,పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, మాజీ సర్పంచ్ చిలువేరు రజిని భారతి, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ పద్మాబాయి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శులు నూనె పద్మ, తక్కళ్ళపెల్లి ఉమా, పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు చిప్ప నాగ, నాడెం నాగేశ్వర్లు, మాజీ వార్డు మెంబర్లు పేరం బాబు రావు, కొయ్యడి సంపత్ గౌడ్, గండి యాదగిరి గౌడ్, లక్కార్సు రమేష్, పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి శ్రీనివాస్, కోల చరణ్ గౌడ్,గద్ద జ్యోతి,దేశి లక్ష్మీ, బైరి మురళి, దండెం రతన్ కుమార్, ఖాజాబీ, వేల్పుల శ్రీలత, కటారి ఉత్తమ్ కుమార్, నాగేల్లి సారంగం గౌడ్,దేశిసాయి పటేల్, సామల ప్రశాంత్, వరంగంటి సాయి విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల హృదయాల్లో నిత్యం నిలిచే నేత “,వైఎస్సార్ ‘

ప్రజల హృదయాల్లో నిత్యం నిలిచే నేత “,వైఎస్సార్ ‘
రాయికల్ నేటి ధాత్రి. .

పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద జన హృదయ నేత ప్రజా బంధు సర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కేసు కట్ చేసి ఒకరికి ఒక్కరు తినిపించుకున్నారు ఇట్టి సందర్భం,జిల్లా నాయకులు గోపి రాజారెడ్డి మాట్లాడుతు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా గతం వై ఎస్ ఆర్ చేప్పట్టిన సేవలు చాలా గొప్పవని వృద్దులకు దివ్యాంగులకు పెన్షన్ తోపాటు రైతుల జీవితాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఉచిత విద్యుత్ ,నీటి ప్రాజెక్ట్ లు,రాష్టాన్ని అబివృద్ది పథం వైపు నడిపారని అయన మరణ అనంతరం అదే లక్ష్యంతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ,ఉచిత కరెంట్ సబ్సిడీ సిలెండర్ లాంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ,అనంతరం పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ మాట్లాడుతూ మహిళకు పావలా వడ్డీ రుణాలతో అభివృద్ధి పథంలో నిలిపి పేదలకు అండగా ఆరోగ్య శ్రీ పథకం తోపాటు పాటు 108,104 పథకాలను ప్రవేశ పెట్టి పేదలకు వైద్యం అందించిన మహానేత ఆదర్శంతోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు ,పేదలకు ఉచిత విద్యుత్ ,ఆరోగ్య శ్రీ ,లతోపాటు రైతు భరోసా ,రేషన్ కార్డు లు మంజూరు ఇందిరమ్మ ఇండ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమమంలో కొయ్యడి మహిపాల్ రెడ్డి ,తంగెళ్ల రమేష్ తలారి రాజేష్ , గుజ్జులా మోహన్ రెడ్డి ,దాసరి గంగాధర్ ఎండి షాకీర్ ,మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ ,తాటిముల రవి, సుంకరి భూమయ్య భుమాగౌడ్ , పొన్నం శ్రీకాంత్ కిరణ్ రెడ్డి ,శామీర్ ,కిరణ్ ,రాంకీ ,శివకుమార్ ,సాగర్ ,రాకేష్ నాయక్ ,మురళి ,నందునాయక్ ,గోపాల్ ,అశోక్ ,కటుకం సాయికుమార్ ,రమేష్ ,శివ ,రవి , రాజీవ్ ,కె నరేష్ , బి నవీన్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version