కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే…!

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే… మడమ తిప్పదు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి విడత లక్ష మంజూరు

డి సి సి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం సప్పిడి గుట్ట గ్రామపంచాయతీ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద 6 గురు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను మంజూరు చేయగా 4 గురు లబ్ధిదారులు బానోతు నీలా, సపావట్. కౌంసల్య, బానోతు రజిత, తేజావత్ కాంతమ్మ లు బేస్మెంటు బెడ్ నిర్మాణం పూర్తి అయి వారి ఎకౌంట్లో మనిషికి లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద జమ చేయడం జరిగింది. జమ అయిన లక్ష రూపాయలకు సంబంధించిన వారి ఎకౌంట్ స్టేట్ మెంటును లబ్ధిదారులకు ఇస్తూ విషయాన్ని చెప్పిన కేసముద్రం సింగిల్ విండో వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి వి .వినయ్ కుమార్, ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డికి, మహబూబాబాద్,శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఇందిరమ్మ కమిటీ సభ్యులు బానోత్ బద్రు నాయక్,బానోత్ వాలు, రవీందర్, లచ్చిరాం, లాలు, సుమన్ పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన లబ్ధిదారులకు..

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన లబ్ధిదారులకు

◆:- శాసనసభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు

◆:- డీసీఎంస్ చైర్మన్ శివకుమార్

◆:- మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు 12 చెక్కులను గాను ₹5,11,000 విలువ గల చెక్కులను *క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం .గార్లతో కలిసి అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:-ఝరాసంగం గ్రామానికి చెందిన సాయంలా లక్షికాంత్ గారికి ₹.60,000, బేగరి లక్ష్మయ్య గారికి ₹.33,000 వనంపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహాదేవ్ గారికి ₹.22,500, & ₹.37,500 మచ్నూర్ గ్రామానికి చెందిన టంటం దశ్రత్ గారికి ₹.17,000 నర్సాపూర్ గ్రామానికి చెందిన భూత్నపిల్లి సిద్దన్న గారికి ₹.33,000 & ₹.12,500
ఈదులపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల వీరేంద్ర గారికి ₹.60,000 కృష్ణ పూర్ గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ గారికి ₹.60,000 ప్యారవం గ్రామానికి చెందిన బి వెంకటేశం గారికి ₹.60,000 కుప్పనగర్ గ్రామానికి చెందిన గడ్డబాది మైబూబ్ అలీ గారికి ₹.60,000
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, మాజీ సర్పంచ్ లు బస్వరాజ్ పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కిషన్,అమిత్ కుమార్, ప్రభు పటేల్, నాయకులు శశి వర్ధన్ రెడ్డి, సంతు పటేల్, నాగన్న, మూసాపటెల్, అసిఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు *ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ గారికి,మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారికి బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు ..

కేసముద్రం లోఇందిరమ్మ లబ్ధిదారుల సంబరాలు..

కేసముద్రం లోఇందిరమ్మ లబ్ధిదారుల సంబరాలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ కి చెందిన వెన్ను పార్వతి రాంబాబు కి ఇందిరమ్మ ఇల్లు బిల్లు మొదటి విడత లక్ష రూపాయలు వచ్చిన సందర్భంగా లబ్ధిదారులైన వెన్ను పార్వతీ రాంబాబులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లబ్ధిదారుల ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కు కృతజ్ఞతలు చెప్పుతూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మిఠాయి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ మండల ఓబీసీ ప్రెసిడెంట్ చిట్ల సంపత్ మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సొసకండ్ల సుభాష్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ బోళ్ల కట్టయ్య పెండ్యాల లక్ష్మణ్ గుబ రాజు జీలకర్ర బాబు కీర్తి వేణు తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇంటి బిల్లు మొదటిసారి రావడంపై మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి కి మరియు మున్సిపల్ సిబ్బంది ప్రభాకర్ రోమన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ.

తాట్లవాయి. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ. . .

రాయికల్, జూలై 16, నేటి ధాత్రి. . .

రాయికల్ మండలంలోని తట్లవాయి. గ్రామపంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోసరి మహేష్ చెట్లపల్లి రాజు కెల్లెటి స్వాతి కొండవేని లక్ష్మి బద్ది శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ ఆకుల మల్లేశం పంచాయతీ కార్యదర్శి బాణావతి తిరుమల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ తిరుమల కారోబార్ మహిపాల్ లబ్ధిదారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి.

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్ టౌన్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో శనివారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు
న్యాల్కల్ మండలం సంగమేశ్వర్ -న్యాల్కల్
(₹55,000/-) నర్సింహులు- కాకిజన్వాడ
(₹24,000/-) అశ్విని – హద్నూర్
(₹60,000/-) మాణిక్ – కాకిజన్వాడ
(₹60,000/-)మొత్తం ₹ 199,000 /- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులను ఆయన స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ కార్యక్రమo లో అశ్విన్ పాటిల్,రాజేంద్ర,జగన్నాథ్ రెడ్డి,వేంకట్ రెడ్డి,వెంకట్, సందీప్,ఫయీమ్, ఇస్మాయిల్,సందీప్ రెడ్డి, సునీల్ రెడ్డి మరియు లబ్దిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన..

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ శివారు హోతి(కె)లో కేటాయించిన ఇళ్లను అప్పగించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గృహ సముదాయాల వద్ద శనివారం బైఠాయించారు. ఇవాళ ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా తాళాల అప్పగింత ఉంటుందని ప్రకటించి మళ్లీ వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల్లో ఇళ్లు అప్పగించకపోతే తాళాలు పగలగొట్టి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

డబుల్ బెడ్ రూమ్ ల వద్ద లబ్ధిదారులు.

డబుల్ బెడ్ రూమ్ ల వద్ద లబ్ధిదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి కే వద్ద డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు చేరుకున్నారు ఈ రోజు లబ్ధిదారులకు గృహాలు అందజేస్తున్న విషయం తెలుసుకున్న వారు అక్కడికి చేరుకోవడం వల్ల అధికారులు ఇవ్వకుండా వెనకు పంపినట్లు తెలిసింది.

పారదర్శకంగా లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల.!

 

పారదర్శకంగా లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

పారదర్శకంగా లబ్దిదారులకు లాటరీ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముస్తాబాద్ మండల కేంద్రం మాతృశ్రీ గార్డెన్స్ లో ముస్తాబాద్ , గూడెం, కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్ల లాటరీ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

 

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, 94 ఇందిరమ్మ ఇండ్లను లబ్దిదారులకు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు నేడు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రొసీడింగ్స్ అందిస్తామని, ఇండ్లు పోందిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్ల వద్ద రోడ్డు, ప్లంబింగ్ పనులు నిర్మించాల్సి ఉందని వీటి నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు కలెక్టరేట్ నిధుల నుంచి మంజూరు చేసి నెల రోజుల లోపు పూర్తి చేస్తామని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల వద్ద మౌలిక వస్తువుల కల్పనకు ఇసుక, మోరం (మట్టి) సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా వేగవంతంగా లబ్ధిదారులు పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ సంబంధిత లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

 

 

పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో సాండ్ ట్యాక్సీ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 200 మంది యువకులకు వాహనాలు అందించే వారి ద్వారా ఇసుక మట్టి తరలింపుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం గూడెం గ్రామం పరిధిలోని నూతనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కేకే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ తాలారీ రాణి పీడీ,హౌసింగ్ శంకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి ఎంఏ భారతి, తాసిల్దార్, ఎంపీడీవో సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు.

నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సుల సమస్యలు పరిష్కారం ఎలా

◆ ఎమ్మెల్యే మాణిక్ రావు నేటి ధాత్రి:

ఝరాసంగం నేటి ధాత్రి:

ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో రైతులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు ఇవ్వడం జరిగిందని అవి ఎలా పరిష్కరిస్తున్నారని అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనేంటి మాణిక్ రావు తహ సీల్దార్ తిరుమలరావు ను ప్రశ్నించారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ధరణి స్థానంలో నూతన ఆర్ ఓ ఆర్ 2025 చట్టం భూభారతి పేరుతో తీసుకువచ్చిందని ఇందులో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు 100 ఆప్షన్స్ ఇస్తామని ప్రకటించిందని అవి ఆన్లైన్లో ఉన్నాయా అని ఎమ్మెల్యే అడిగారు. దీనికి తహసిల్దార్ మాట్లాడుతూ ఇంకా ఆన్లైన్లో ఆ అవకాశం లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ల విషయంలోసర్వర్ కనెక్షన్ సమస్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నా దృష్టికి వచ్చినట్లు ఎమ్మెల్యే అడగగా పైనుండే సర్వర్ సమస్య నెలకొన్నదని స్లోగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని తహసిల్దార్ సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే సీసీ ఎస్ఏ కార్యాలయానికి ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించారు. ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాయకులు ప్యాలవరం మాజీ ఉప సర్పంచ్ మాణిక్యం యాదవ్, నర్సింలు, తదితరులు ఉన్నారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

జిల్లా కలెక్టర్..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. మండలంలో. పలు గ్రామాలకు చెందిన. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు రెండో విడత కింద 500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే దసరా దీపావళి పండుగలకు నూతన గృహప్రవేశం జరుపుకోవాలని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండలంలో ప్రజలకు రెండో విడత ఇండ్ల మంజూరు జారీచేశామని పెట్టుబడి లేని నిరుపేదలకు స్వయం మహిళ సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం మంజూరు చేశామని. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. లబ్ధిదారులు విడుదల విధిగా నిర్మించుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.

లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.

అన్ని పేద అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు.

కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం.

గతంలో డబుల్ బెడ్రమ్ ఇండ్లు కేటాయింపులో 50 వేలు తీసుకున్నారు,

డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత.

నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా ఎగరడమే, లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా.

దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించే ప్రయత్నం.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద బడుగు బలహీన వర్గాల కు సొంతింటి కల నెరవేర్చుటకు శ్రీకారం చుట్టి, స్థానిక వ్యక్తులచే కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణ తో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేడు కమిటీలు అందించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు వారి నిర్ణయం శభాష్ అనిపించేలా అందించడం జరిగింది అని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కావడం, ప్రభుత్వ అధికారులు ఇండ్ల మంజూరి కై నిష్పక్షంగా సర్వే నిర్వహించడం, అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం వంద శాతం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నియామక కమిటీ, అధికారుల జాబితా నుండి అర్హులకు ఎంపిక చేయడం తో లబ్ధిదారుల, ఆనందానికి అంతులేకుండా పోయింది. మండలంలో 321 ఇండ్లను మంజూరు చేయగా, ప్రభుత్వ ఆదేశాల అనుసారం గూడు లేని నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు అందించడమే లక్ష్యంగా ఇంటింటికి అధికారుల సర్వే, కుటుంబాల వివరాలు నేరుగా అధికారులు పరిశీలించి నమోదు చేయడం జరిగింది.తిరిగి ఇందిరమ్మ గృహాల మంజూరు కమిటీలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నిర్ణయం మండలంలోని అన్ని వర్గాలకు చెందిన అర్హులైన నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు అనర్హులకు చెందకుండా పటిష్టమైన విచారణ,విధి విధానాలతో, ముందుకు సాగడమే కమిటీ లక్ష్యంగా, అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి కల త్వరలో ఆ పేద కుటుంబాలకు తీరనుంది.

కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం.

ఇందిరమ్మ సొంతింటి కల నిర్మాణంపై స్థానిక కమిటీల ఎంపిక 100% నిరుపేద గూడు లేని అర్హులకు కేటాయించడం జరిగిందని లబ్ధిదారులు చెప్తున్నప్పటికీ, నిరుపేద కుటుంబాల గూడును కొల్లగొట్టే ప్రయత్నంలో, కమిటీల పై కక్ష సాధింపు చర్యగా, దుష్ప్రచారాలు చేయడానికి లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కమిటీల ఎంపిక అధికారుల జాబితాలోని అర్హులకు ఎంపిక చేయడం జరిగిందని, లబ్ధిదారులు చెప్తున్న క్రమంలో, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై, బురద జల్లి పబ్బం గడుపుకోవాలని కొందరు, లబ్ధిదారుల ఎంపికను తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మండలంలో 321 ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లబ్ధిదారుల ఎంపికై అధికారుల సర్వే ఆధారంగా,,ఇంద్రమ్మ ఇండ్ల కమేటి, నిష్పక్ష పర్యవేక్షణతో లబ్ధిదారుల పేర్లను అందించడం జరిగింది, గతంలో డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో పేరుతో 50వేల రూపాయలు తీసుకొని, అర్హులకు కాకుండా ధనవంతులకు కేటాయించడం జరిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు స్థానికుల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇండ్ల మంజూరుకు ప్రతిపాదించడం జరిగిందని,కానీ స్వలాభాల కోసం నిరుపేద గూడు లేని కుటుంబాలకు ఇల్లు లేకుండా చేసే ప్రయత్నం జరగడంతో, లబ్ధిదారులు తమ ఇండ్లు ఏక్కడ కోలిపోతామని ఆవేదనతో, ప్రభుత్వం మరియు రాష్ట్ర మంత్రివర్యులు మేము పేద అర్హులము మాపై కరుణించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.

డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత.

పది సంవత్సరాలపాటు డబుల్ బెడ్ రూమ్ కొరకు తమ కండ్లు కాయలు కాసి వేల దరఖాస్తులను ఇవ్వడం జరిగింది కానీ, అర్హులుగా ఉన్న పేదలకు గూడు లేకుండా డబుల్ బెడ్ రూమ్ పేరుతో వేల రూపాయలు వసూలు చేసి ధనవంతులకు కేటాయించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో స్థానికుల పర్యవేక్షణలో అధికారులు అందించిన జాబితాల ఆధారంగా 100% అర్హులుగా ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ కలగాలనే మిగిలిన, ఆ గూడు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి భరోసా కలిగించడం, సంవత్సరాల తరబడి జెండా వాననక పెంకుటిల్లు గుడిసెల్లో తమ పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తున్న మాకు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ప్రభుత్వం ఆదుకోవడం, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు చెప్తున్నారు.

తన నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా.

ఆ అర్హులు గూడు లేని నిరుపేదవారు, కూలి నాలి చేసుకోవడంతో పాటు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా, మండలంలో లబ్ధిదారుల జాబితాలో నిరుపేద లబ్ధిదారులు అయినప్పటికీ, సుమారు 50 సంవత్సరాలుగా వ్యవసాయ కూలీతోపాటు కాంగ్రెస్ జెండా నెత్తిన మోయడం, తమకు ప్రభుత్వ పథకం అనర్హుడుగా చేస్తుందా, తమ ఇంటిపై పెంకలు లేకున్నా పరవాలేదు, వర్షాకాలం ప్లాస్టిక్ కవర్ లేకున్నా పరవాలేదు, కానీ తమ లక్ష్యం గాంధీభవన్ పై జెండా ఎగరడంతోపాటు తమ ఇంటి పైన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు జెండా సంవత్సరాల కాలం పాటు తగిలి ఉండాల్సిందే, అనే ఏకైక లక్ష్యంతో ఉన్న ఆ నిరుపేద కాంగ్రెస్ కార్యకర్త వంద శాతం అర్హుడే కదా, పేద వ్యవసాయ కూలీ మా కుటుంబాన్ని పోషిస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా నా హృదయంలో ప్రాణం పోస్తుంది, అని పేద లబ్ధిదారులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం, తో వారి పేర్లు తలుచుకుంటూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో, విషపచారాలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ప్రజలు ఎవరైనా, ఏ పార్టీ అభిమాని అయిన ప్రభుత్వ పథకాలకు, పార్టీలను ప్రేమించే కార్యకర్తలకు పథకం వర్తించదని, రాజ్యాంగం లో ఏమైనా రాసి ఉందా, కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా, వ్యవహారించడం జరుగుతుందని, లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు కేటాయిస్తే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే, లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పొంతన లేని మాటలతో దుష్ప్రచారాలు చేయడాన్ని లబ్ధిదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించే ప్రయత్నం.

మండలంలో ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు కమిటీల పర్యవేక్షణ అనంతరం లబ్ధిదారుల పేర్లు ఎంపిక చేసి లిస్టును అందించడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక విషయంపై, ప్రభుత్వ ఆదేశాల అనుసారం అర్హులుగా అధికారులు గుర్తించి తిరిగి ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పర్యవేక్షణలో నిష్పక్షంగా ఎంపిక ప్రక్రియ జరిగినప్పటికీ, అమాయకులను రెచ్చగొట్టి, వారి పేర్లు నమోదు చేయలేదని, కమిటీలపై బురద జల్లుతూ, అమాయక ప్రజలను రెచ్చగొట్టి, మండలంలోని కమిటీ సభ్యులపై అసభ్యకర పదజాలాలతో, అవమానించేలా ప్రయత్నించడం, సమాచార సాంకేతిక మాధ్యమాల్లో మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, స్వలాభం కోసం అమాయకులను ప్రభుత్వ పథకం నుండి మిక్ కావాలని దూరం చేశారని రెచ్చగొడుతూ, దౌర్జన్యానికి దిగేలా ప్రోత్సహించడం, ల్యాండ్ అడర్ ను విఘాతం కలిగించే, విధంగా ప్రవర్తించడం జరుగుతుందని, లబ్ధిదారులు చెప్పుకొస్తున్నారు, జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ ఉన్నత అధికారులు, ఇలాంటి వారిపై దృష్టి సాధించి, శాంతి భద్రతకు భంగం కలగకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మండల ప్రజలు అలాగే లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల ఏంపికలో నిజమైన.!

ఇందిరమ్మ ఇండ్ల ఏంపికలో నిజమైన లబ్ధిదారులకు మొండి చెయ్యి…

తుడుం దెబ్బ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

 

మండల కేంద్ర పరిధిలో గల 15గ్రామ పంచాయతీ లలో ఇందిరమ్మ ఇండ్ల ఏంపిక లో నిరుపేదలకు మొండి చేయి చూపే విధంగా ఇందిరమ్మ కమిటీ లు వ్యవహారిస్తున్నాయని కరకగూడెం మండల తుడుం దెబ్బ, అధ్యక్షులు, పోలేబోయినా ప్రేమ్ కుమార్ ఆరోపించారు.గ్రామ సభ లో మాట్లాడిన విధంగా కాకుండా ఇందిరమ్మ కమిటీలు వాళ్ళ ఇష్టనుసారంగా వాళ్లకు నచ్చినవాళ్లకు కేటాయిస్తున్నారని, నిరుపేదలు కనీసం గుడిసెలలో వారికీ కేటాయించక పోవటం చాలా బాధాకరం, అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు, కనీసం ఎంపికైనటువంటి లబ్ధిదారుల జాబితాను కూడా తెలుపకుండా పంచాయతీ సెక్రటరీలు వ్యవహరించడం తగదుఅన్నారు. అదేవిధంగా మండల ఎంపీడీవో ఆయా పంచాయతీ కార్యదర్శులు ఇంత జరుగుతున్న చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు దారితీస్తుందని వాపోయారు తక్షణమే దీనిపై విచారణ చేపట్టి అసలైన అర్హులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలుతీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు సుతారి నాగేష్ మాట్లాడుతూ. ఐదవ షెడ్యూల్ ఏరియా లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏజెన్సీ చట్టాలకు, హక్కులకు అనుకూలంగా నే ఎంపికలు జరగాలని పీసాగ్రామసభ తీర్మానాలు జరిపి గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి కలం సంపత్, కార్యవర్గ సభ్యులు, పోలె బొయిన కార్తీక్, రేగ కిరణ్ పోలిబోయిన శ్యాం ప్రసాద్, కొమరం వెంకట్, తోలేo హరికృష్ణ, గోగ్గల వేణు పోలే బోయిన రఘు పోలేబోయిన సురేష్ కుమార్, పోలే బోయిన సంతోష్ పూణేo రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధం.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధం ..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి సుమారు 3500 వరకు మంజూరి అయినవి ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంతకు ముందు ప్రభుత్వం నుండి లబ్దిపొందిన వారు కాకుండా, ఇల్లు లేని వారికి,స్వంత ప్లాటు ఉండి ఇల్లు కట్టే స్థోమత లేని వారికి,దివ్యాoగులకు,ఒంటరి మహిళలకు,వితంతువులకు,అనాదలకు,పాకిపని వారికి,మొదటి ప్రాధాన్యత ఇచ్చి గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది కానీ ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జరిగిన తీరును పరిశీలిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు ఉన్న వారికి,ఇంతకు ముందు లబ్దిపొందిన వారికి కేటాయించినట్లు తెలుస్తున్నది. ఈ ఇండ్లకు ప్రభుత్వం ఇచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే దానికి అధికారులు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టాలని నిర్బంధం చేస్తున్నారు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టితే 2రేట్లు అధిక వ్యయం అయ్యే అవకాశం ఉంది మిగతా డబ్బులు వారు ఎక్కడి నుండి తేవాలి వారు ముందే బీదవారు ఇల్లు కట్టలేని పస్థితిలో ఉన్నప్పుడు ఈ అధిక వ్యయం ఎక్కడినుండి తేవాలి అదనపు భారం కొరకు తప్పని సరి అప్పులు చేయాల్సిన పరిస్థితి అంటే ఇండ్లు పొందిన వారు అప్పుల పాలు కావల్సిందేన కాబట్టి ప్రభుత్వం,అధికారులు కేవలం నాయకులు చెప్పిన వారికి కాకుండా నిబంధనల ప్రకారం అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని,మరియు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు సరిపడే విధంగా ఇంటి ప్లాన్ కుదించాలని,ఆపై ఇల్లు కట్టు కుంటే లబ్ధిదారుల ఇష్టానికి వదలాలని డిమాండ్.ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్శింలు,యస్.గోపాల్,పాల్గొన్నారు.

అర్హులైన లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

అర్హులైన లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

బిజెపి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి రాజేశ్వర్.

బెల్లంపల్లి, నేటిధాత్రి:

 

 

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని బెల్లంపల్లి బిజెపి మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి రాజేశ్వర్ అన్నారు.బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కేవలం ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ నాయకులకు సిఫారసు చేసిన జాబితానే సర్వే చేస్తూ అధికార దుర్వినియోగానికి పాలు పడుతున్నారని ఆమె మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చేసిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే చేసినప్పుడే అధికారులు అర్హుల జాబితాను తప్పుల తడకగా అనర్హులతో తయారు చేశారన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి వారికి మాత్రమే ఇండ్లను మంజూరు చేయాలని, ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో లబ్ధిదారులయిన నిరుపేదలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల.!

లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి

– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

– ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని సర్వే చేశారు? ఎన్ని దరఖాస్తులు ఆన్లైన్ చేశారో హౌసింగ్ పీడీ శంకర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా మున్సిపాలిటీలు, మండలాల వారిగా లక్ష్యం మేరకు ఎంత పూర్తి చేశారో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. అర్హులైన పేదల సొంత ఇంటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, అర్హులకే అందేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో మొత్తం 7690 దరఖాస్తులు అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, వీటిలో ఇప్పటిదాకా 5776 వారి వివరాలు ఆన్లైన్ చేశారని వెల్లడించారు. మిగతా వివరాలు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలని సూచించారు. వచ్చే నెల 2వ తేదీన ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల వార్డుల్లో దరఖాస్తుదారు జాబితా ప్రదర్శిస్తారని, 5వ తేదీన తుది జాబితా ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.
సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో.!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

జహీరాబాద్: నేటి ధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
కొన్నింటి.నర్సింలు డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్ ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వికలాంగులతో ప్రత్యేకంగా శ్రమ శక్తి సంఘాలు ఏర్పాటు చేసి జాబ్ కార్డ్స్ ఇచ్చి 150 రోజులు పని కల్పించాలని అన్నారు. .రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు 5 శాతం ఎస్సి ఎస్టీ బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలో కేటాయించాలని కోరుతున్నాము.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాము అన్నారు.మండలంలో వికలాంగులను కించపరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జహీరాబాద్ మండల అధ్యక్షుడు ఎం రాజ్ కుమార్
అల్గోల్ మచ్చేందర్ బిస్మిల్లా శోభమ్మ వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన.!

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి తనప సుశీల ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పరు బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్న వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను పూర్తి చేయాలని యజమానులు దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీ వాణి , తిరుపతయ్య గారు,యర్ర సురేష్ , రాందాస్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన
• మండల ఎంపీడీఓ రాజిరెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పై అధిక డబ్బు వెక్షించి అప్పుల పాలు కావద్దని మండల ఎంపీడీఓ రాజీరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడారు… ప్రజలు ఇండ్లకు అధిక డబ్బు పెట్టి అప్పులపాలు కావద్దని ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులతో ఇండ్లను నిర్మించుకోవలన్నారు. గ్రామంలో 16 ఇండ్ల పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఏపీఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామస్తులు జీవన్ రెడ్డీ, పిట్ల నర్సయ్య, భూపతి రెడ్డీ, మల్లేశం గౌడ్, ఏనుగంటి పోచయ్య, మమ్మద్ షాయదా, మ్యాదరి రజిత లు ఉన్నారు.

లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ.

లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

 

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సన్నబియ్యం పంపిణీ రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.పేదల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటికీ ప్రజలు ఎవరు తినలేని పరిస్థితి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల సమస్య ను గుర్తించి నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలుపరచడం జరిగిందని,అదేవిధంగా ప్రజలందరూ కూడా సన్నబియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కొరకు మిట్టపల్లి గ్రామంలో 35 లక్షల అంతర్గత సీసీ డ్రైనేజీలు,ఈజిఎస్ నిధుల నుండి 15 లక్షలు,రెండు కోట్ల రూపాయలతో నర్వ నుండి మిట్టపల్లి వరకు రోడ్డు నిర్మాణం,వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడుతున్నారనీ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు,ప్రజలు త్రాగునీరుకి ఇబ్బంది కలుగకూడదని ఐదు బోర్లుమంజూరు చేయడం జరిగిందనీ తెలిపారు.ప్రజల సమస్యలను క్షణక్షణం పరిశీలిస్తూ పేద నిరుపేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఏ కష్టం వచ్చినా సమస్యను తీర్చుకుంటూ వారికి అండదండ నిలుస్తున్న ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం లింగయ్య,కామెర మనోహర్,అల్లూరి స్వామి,జంబిడి కిష్టయ్య,దూట శీను, చంద్రయ్య,మల్లేష్,గోదారి తిరుపతి,భిమిని తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి

ఎంపీడీవో కల్పనకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

పరకాల,దామెర నేటిధాత్రి

పరకాల నియోజకవర్గంలోని దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కల్పన కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇండ్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి,నియోజకవర్గ కో కన్వీనర్ పిఎసిఎస్ డైరెక్టర్ మాదారపు రతన్ కుమార్,ఓబీసీ మోర్చా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం జిల్లా కోశాధికారి సూర చంద్రర్,వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ కొట్టే రమేష్, కో కన్వీనర్ గండు ముఖేష్, సీనియర్ నాయకులు గువ్వ సాంబయ్య,ఆలేటి పోషాలు, దామెర పృథ్వీరాజ్,శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు ఎక్కలదేవి రమేష్, గోగుల సమ్మిరెడ్డి,గండు పరుశురాం,బూత్ అధ్యక్షులు బి.రమేష్,చెల్పూరి రాజు, గూడూరు శ్రీనివాస్,మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version