యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లిసత్యం జన్మదిన వేడుకలు

యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలోని ప్రశాంతి భవన్ లో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవాజి హరీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాపురాజు, నేరేళ్ల మల్లేశం, చొప్పదండి అనిల్, మధు, సంతోష్ , అజయ్, మహేష్, సాయి, సాగర్, ఎండి. ముషూ, తదితరులు పాల్గొన్నారు.

కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు

— కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు
• యువత కాంగ్రేస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజాంపేట: నేటి ధాత్రి

కులం, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని పట్టభద్రులు నమ్మవద్దనీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల సమావేశానికి హయారై మాట్లాడారు.. బీజేపీ పార్టీ నీ నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గెలిచిన వెంటనే నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంజయ్య, సరాఫ్ యాదగిరి, చెప్పేట ముత్యం రెడ్డి, బెజవాడ నాగరాజు, బక్కన్న గారి లింగంగౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ, గుమ్ముల అజయ్, బాజా రమేష్, రాంచందర్ నాయక్, అందె స్వామి, మ్యాదరి నర్సిములు, కుమార్ లు ఉన్నారు.

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని కలిసిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల జెమిని

పరకాల నేటిధాత్రి
హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కె.ఆర్ దిలీప్ రాజ్ ని హనుమకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని యువతే ఈ దేశానికి వెన్నుముక అని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రజలకు బీసీ కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నివేదికలను శాసనసభలో ఆమోదించ చేయడం చరిత్ర ఆత్మకు,సాహసోపేతం అని అన్నారు.అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల రేవంత్ రెడ్డికి ఎంమ్మార్పిఎస్ మందకృష్ణ మాదిగ కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరలో జరగబోయే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,బొచ్చు అనిల్, పేరుక చరణ్,బొచ్చు రాజు, బొచ్చు నాగరాజు,కోడపాక రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version