రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన.

రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బిజెపి నాయకులు
కొద్దిపాటి వర్షానికే గుంతల మయమైన కొత్త పెల్లి భట్టుపల్లి రోడ్డు
నెలలు గడుస్తున్న పూర్తికాని రోడ్డు పనులు
కంకరపై ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

నేటి ధాత్రి అయినవోలు :-

వర్ధన్నపేట నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో భాగంగా మంజూరైన కొత్తపెళ్లి బట్టుపల్లి రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలల క్రితం రోడ్డు వెడల్పు లో భాగంగా కంకర పోసి వదిలేసిన అధికారులు ఇప్పటికీ తారు రోడ్డు పనులు పూర్తి చేయలేదని తద్వారా చిన్న వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి గుంతలు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాల గురవుతున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు. బుధవారం అయినవోలు భాజపా మండల పార్టీ అధ్యక్షుడు మాదాస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన బురద నీటిలో వరి నాట్లు వేయడం ద్వారా నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి కోట కిరణ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్ , మహేష్, భరత్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

అన్నం పెట్టిన పరిశ్రమకు అండగా ఉంటా..

అన్నం పెట్టిన పరిశ్రమకు అండగా ఉంటా

‘నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన చిత్రం నిర్మించి, ఒడుదొడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్‌ని…

‘నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన చిత్రం నిర్మించి, ఒడుదొడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్‌ని వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. అలాంటి పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను’ అని అన్నారు పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘ఒక సినిమా చేయడమంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. అది ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. ప్రాంతీయ స్థాయి సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఏ.ఎమ్‌.రత్నం. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రత్నం పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతిపాదించాను. ఆయన నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని ఈ సినిమాని నా భుజాలపైకి తీసుకున్నాను. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. ‘భీమ్లానాయక్‌’ విడుదలైనప్పుడు అందరి సినిమాల టిక్కెట్లు వందల్లో ఉంటే, నా సినిమాకు పదుల్లో ఉండేవి. నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించను. అసలు నేను యాక్టర్‌ అవ్వాలనే కోరుకోలేదు. ఒక సగటు మనిషిగా జీవించాలనే ఆలోచన తప్ప నాలో ఏం లేదు. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం. హిట్లు, ఫ్లాప్స్‌ కాకుండా నేను అభిమానులు చూపే ప్రేమనే నమ్మాను. నా బలం మీ అందరి అభిమానమే. కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మనోజ్‌ పరమహంస ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. చిత్రీకరణకు వారానికి ఐదు రోజుల్లో రోజూ రెండు గంటలే కేటాయించినా, దానికి తగ్గట్లు వర్క్‌ చేసిన టీమ్‌ కృషి వెలకట్టలేనిది. చిత్ర ప్రమోషన్స్‌ కోసం నిధి అగర్వాల్‌ ఎంతో కష్టపడ్డారు. ఈ విషయంలో ఆమెను అభినందించాలి.

ఈ సినిమా సబ్జెక్ట్‌ నాకు చాలా ఇష్టమైనది. ఇందులో నేను నేర్చుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ ఉపయోగించిన క్లైమాక్స్‌లో 18 నిమిషాల ఫైట్‌ కంపోజ్‌ చేశా’’ అని అన్నారు. చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ‘ఽ17వ శతాబ్దం మొఘల్స్‌ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. ఆ సమయంలో ఔరంగజేబుకి, వీరమల్లు అనే కల్పిత పాత్రకి మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా’ అని చెప్పారు. నిర్మాత ఏ.ఎమ్‌ రత్నం మాట్లాడుతూ ‘‘నేను ఇన్ని సినిమాలు నిర్మించినా, ఇది చాలా స్పెషల్‌. ఇందులో పవన్‌కల్యాణ్‌ విశ్వరూపం చూస్తారు. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉంది’’ అని తెలిపారు. నిర్మాత దయాకర్‌ రావు మాట్లాడుతూ ‘‘అభిమానులకు ఈ సినిమా విందుభోజనంలా ఉండబోతోంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదం అందివ్వబోతున్నాం’’ అని చెప్పారు. నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌తో పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణం రాజు, కర్టాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ కండ్రే, నటులు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యమైతే మాకేంటి..

సన్న బియ్యమైతే మాకేంటి..?

◆:-గ్రామాల్లో జోరుగా అక్రమ దందా

◆:-ద్విచక్ర వాహనాలపై తరలింపు

◆:-మరమరాల పేరిట కొనుగోళ్లు

◆:-కోళ్లపారాల దాణాగా సరఫరా

◆:-రాష్ట్రాలు దాటుతున్న పేదల రైస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్య్ర
రేఖకు దిగువ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. రాష్ట్ర ప్రభు త్వం మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసింది. రేషన్ షాపు నుంచి ప్రజల వద్దకు వెళ్లిన బియ్యం కాస్త అక్రమార్కుల ఒడిలోకి వెళ్లి కాసుల కురిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు వెళితే సంగారెడ్డి జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన నారాయణఖేడ్, కంగ్జి, మనూర్, నాగలిగిద్ద, కల్హేర్ మండలాలకు చెందిన కొందరు అక్రమార్కులు మోటార్ వాహనా లు, టీవీఎస్, మోటార్ సైకిల్, హీరో హోండా వాహనాలపై ఉదయం 6గంటలకే న్యాల్ కాల్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, మండలాల్లోని వివిధ గ్రామాలకు తరలివచ్చి ప్రజల వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు లేదా తెల్ల మురమురాలు తయారు పేరిట దొడ్డు బియ్యం కొనుగోలు చేసిన మాదిరిగానే సన్నబియ్యాని సైతం సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం కోసం రూ.23, రాష్ట్రం ఒక కిలో సబ్సిడీ సన్న బియ్యం పంపిణీ కోసం సుమారుగా రూ.40 నుంచి రూ.50 వరకు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, రవాణా, ఇతర నిర్వహణ ఖర్చులు ఉంటాయి.

Free Ration Rice.

రాష్ట్రం దాటిస్తున్న అక్రమార్కులు..

బియ్యాన్ని కోళ్ల ఫారాలకు, రాత్రివేళ కర్ణాటక, మహా రాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు వందల క్వింటాల బియ్యం తరలిపోతున్నా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్లు విమర్శ లు ఉన్నాయి. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ తరలిం పు వ్యవహారం చూసీచూడ నట్లు వదిలేస్తున్నారు. వీరి దందా ఉదయం 6గంట లకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల వరకూ కొనసాగుతోంది. అయితే ఇవి కోళ్లపారాలకు కూడా పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా అక్రమా ర్కులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు విజ్ఞప్తి చేశారు.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.

మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.

దుగ్గొండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

నిరుపేదలు,సామాన్య ప్రజలు,ధనికుల ఓకె రకమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశ్యంతో దేశంలో మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభించారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ అన్నారు.ఇటీవలే నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్సు చేసి దేశంలో చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపరించిన విధంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నదని వాటి అమలును ప్రజల్లోకి మండల పార్టీ సహకారంతో తీసుకెళ్తానని పేర్కొన్నారు. తనకు గత 30 ఏండ్లుగా రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో దుగ్గొండి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకుంటానని రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు.తమపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా బాధ్యత ఇచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి,సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య..

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య.. లెడ్ పాయిజనింగ్తో ఆస్పత్రి పాలైన భర్త

జహీరాబాద్ నేటి ధాత్రి:

Lead Poisoning | వంట( Cook ) చేసేస్తుంటారు. ఎందుకంటే వంట పని అయిపోతే రిలాక్స్ గా ఉండొచ్చని. ఇక త్వరగా వంట అయ్యేందుకు చాలా మంది మహిళలు ప్రెజర్ కుక్కర్ లను వినియోగిస్తుంటారు. అన్నం వండే సమయంలో ఒక రెండు విజిల్స్ పెడితే.. ఐదు నిమిషాల్లో అన్నం రెడీ. ఇక కూరల విషయంలో ఓ ఐదారు విజిల్స్ పెడితే.. 10 నిమిషాల్లో కూర రెడీ. ఇలా ఓ అర గంటలో నాలుగైదు రకాల వంటలు తయారు చేస్తారు.కానీ ఈ ప్రెజర్ కుక్కర్లో వంటలు చేయడం ఏ మాత్రం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకే ప్రెజర్ కుక్కర్ ను ఏండ్ల తరబడి వినియోగించొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఓ మహిళ 20 ఏండ్లుగా ఒకే ప్రెజర్ కుక్కర్లో అన్నం వండుతుంది. ఆమె భర్త ఆ కుక్కర్లో వండిన అన్నం, ఇతర పదార్థాలను తిని లేట్ పాయి జనింగ్ గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.ముంబైకి చెందిన ఓ 50 ఏండ్ల వ్యక్తి.. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్ గబాలే.. బాధిత వ్యక్తిని పరిశీలించి షాక్ అయ్యాడు. అతని శరీరమంతా లెడ్ పాయిజనింగ్ అయిందని వైద్య పరీక్షల్లో తేలింది. అతను మెమోరీ కోల్పోవడం,కాళ్లల్లో తీవ్రమైన నొప్పి, కడుపు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇదంతా లెడ్ కెమికల్ టాక్సిసిటీ వల్ల జరుగుతుందని డాక్టర్ తెలిపారు.బాధిత రోగిని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయి. కానీ హెవీ మెటల్ స్క్రీనింగ్లో అతను లెడ్ పాయిజనింగ్కు గురైనట్లు నిర్ధారణ అయింది. లెడ్ స్థాయిలు డెసిలీటర్కు 22 మైక్రోగ్రాముల చొప్పున అతని శరీరంలో ఉన్నాయి. ఇది దీర్ఘకాలిక లెడ్ పాయిజనింగ్కు దారి తీసిందని డాక్టర్ గబాలే పేర్కొన్నారు. లెడ్ పాయిజనింగ్ వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. బ్రెయిన్, కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

మరి లెడ్ పాయిజనింగ్కు ఎలా గురయ్యాడంటే..?

రోగితో పాటు అతని భార్యను విచారించినప్పుడు లెడ్ పాయిజనింగ్కు గల కారణాలు బయటపడ్డాయని డాక్టర్ తెలిపారు. గత 20 ఏండ్ల నుంచి రోగి భార్య ప్రెజర్ కుక్కర్లోనే వంట చేస్తుందని తేలింది. పాత, పాడైన అల్యూమినియం కుక్కర్లలో సీసం ( Lead), అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోతాయని, తద్వారా లెడ్ పాయిజనింగ్కు గురవుతారని నిర్ధారించారు. దీంతో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, మెదడు పని నెమ్మదిస్తుందన్నారు. రోగికి కీలేషన్ థెరపీ నిర్వహించామని, ప్రస్తుతం కోలుకుంటున్నాయని డాక్టర్ గబాలే పేర్కొన్నారు.

మృతురాలు కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ.

మృతురాలు కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

దుర్గం అశోక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు 14వ వార్డులో నోముల సంపత్ తల్లి ఇటీవల మృతి చెందింది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దుర్గం అశోక్ టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ దుర్గం రాజ సమ్మయ్య నేతకాని సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు గజ్జ రాజ్ కుమార్ కాంగ్రెస్ యూత్ నాయకులు వినయ్ బోడికల సంపత్ నరేష్ యాదవ్ అశోక్ చందు దుర్గం అనిల్ తదితరులు పాల్గొన్నారు

రేషన్ బియ్యం పంపిణీ పై సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల ఆరా.

రేషన్ బియ్యం పంపిణీ పై సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల ఆరా…

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలంలో పలు రేషన్ డిపోలను సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారులు తనిఖీ నిర్వహించారు రేషన్ డిపోలు వివరాలను తెలుసుకొని సరుకులను పరిశీలించారు ఈ తనిఖీలు సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జయప్రకాశ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అధికారులు తనిఖీలు చేపట్టారు బియ్యం పంపిణీ పై ఆరా ఈ సందర్భంగా సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జై ప్రకాష్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఘనపురం షాపు నెంబర్ మూడు రేషన్ డిపో తనిఖీ చేశామన్నారు ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్న విధానం రేషన్ బియ్యం వివరాలు నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నామని చెప్పారు ప్రజలకు సక్రమంగా రేషన్ బియ్యం అందించకపోతే రేషన్ షాపులపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వారి వెంట భూపాలపల్లి జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ పలు మండలాల తాసిల్దార్లు అధికారులు ప్రజలు పాల్గొన్నారు

రామ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ.

రామ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ

అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యం వల్ల అకస్మాత్తుగా మరణించిన రామ సమ్మక్క జరిగింది 9వ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని ఇచ్చారు అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయసి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించిన చంద్రమౌళి మాదిగ రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులందరికీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి గాజుల బిక్షపతి మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామ్ చందర్ మాదిగ వికేసి విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు మారపల్లి చిన్న రాయకొమూరు గ్రామ సభ్యులు బండ బిక్షపతి రామ యాకుబ్ రామ్ సమ్మక్క కుటుంబ సభ్యులు రామ్ కృష్ణ కుమార్ రామ్ ధనుష్ రామ్ వర్ధన్ బొట్ల రవి రామ్ దేవేందర్ రామ్ ప్రశాంత్ బోట్ల కేశవులు బొట్ల అఖిల్ ఎలుకటి అన్వేష్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!

అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!

రాష్ట్ర వ్యాప్తంగా “కోర్టులలో ప్రజా వాజ్యాలు” వేయాలని సమాలోచనలు!

త్వరలో “కోర్టులను” ఆశ్రయించనున్న “ప్రజా సంఘాలు”.

 

అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు.

“రైతులను” మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై “ప్రజా సంఘాల” ఆగ్రహం

హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.

“జాయింట్ కలెక్టర్” కూడా మోసం జరిగినట్లు “కమీషనర్‌”కు నివేదిక పంపడం జరిగింది.

ఖమ్మం “జేసి” సదరు మిల్లర్‌పై చర్యలకు సిఫారసు చేయడం కూడా జరిగిపోయింది.

ఇంకా మిల్లర్ పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు ప్రశ్నిస్తున్న “ప్రజా సంఘాలు”.

రైతులను మోసం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని “ప్రజా సంఘాల” హెచ్చరిక.

హన్మకొండ జిల్లాలో రైతులను మోసం చేసిన మిర్లర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని “ప్రజా సంఘాల” డిమాండ్.

“సివిల్ సప్లయ్” అధికారులు స్పందించకపోతే ఆందోళనకు “ప్రజా సంఘాల” కార్యాచరణ.

మీ “నేటిధాత్రి”లో ఎక్స్ క్లూజివ్ గా.

మృతునికుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

మృతునికుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

shine junior college

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బంట్రోజు లక్ష్మీపతి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి బియ్యం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి పరామర్శించి నా వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందచేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారుఈ o దుకుగాను వారి కుటుంబ సభ్యులు బియ్యం అందజేసినందుకు గాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఎఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. కృష్ణారెడ్డి. తిరుపతి. మనోజ్
శ్రీనివాస్ గౌడ్. నర్సింలు తదితరులు పాల్గొన్నారు

రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ.

రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలల రేషన్‌ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ జూన్ 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయన్నారు.ఝరాసంగం గ్రామంలో ఉదయం,7.00 సాయంత్రం 10.00 వేళల్లో చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంచుతున్నారని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ తెలిపారు.సమస్యలు ఉత్పన్నం కాకుండా వెంట వెంటనే పరిష్కరిస్తూ రేషన్ లబ్ధిదారుల డీలర్లు ఇబ్బంది పడకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా జరిగేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

30 శాతం పంపిణీ పూర్తి

ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 15 శాతం మందికి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేశామని రేషన్ డీలర్ బొగ్గుల సంగమేశ్వర్ ఆయన తెలిపారు.
ఝరాసంగం మండల కేంద్ర పరిధిలోని రేషన్ షాపుల్లో 30 శాతం పంపిణీ పూర్తయిందని అధికారి తెలిపారు.

దుకాణాల వద్ద క్యూ కడుతున్న లబ్ధిదారులు

సన్న బియ్యం పంపిణీకి తోడు ఒకేసారి మూడు నెలల సరుకు పంపిణీ చేస్తుండడంతో దుకాణాల వద్ద భారీ రద్దీ ఉంటోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ పీడీఎస్ను అందుబాటులోకి తీసుకురావడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. బియ్యం పంపిణీకి ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా ఒక్కో నెలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్రలు పీఓఎస్ యంత్రంపై ఇవ్వాల్సి ఉండడంతో పంపిణీ నెమ్మదిగా కొనసాగుతోంది.

25 కేజీల బియ్యం వితరణ.

25 కేజీల బియ్యం వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి జంగేడు 14వ వార్డులో అట్కాపురం కోటి వల్ల అమ్మమ్మ చనిపోయి 6వ రోజున కాంగ్రెస్ జిల్లా నాయకులు దుర్గం అశోక్ &టీమ్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన భూమయ్య మాకోటి ప్రభాకర్ కూనమళ్ళ రాజా కొండముచ్చుల నాగరాజు గారు, మరియు యాత్ నాయకులు ఆకుల సాయి చరణ్, దొంగల అనిల్,బొద్దుల వినయ్,కటకం చందు, దుర్గం అనిల్, దుర్గం సాగర్ పాల్గొన్నారు,

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం.

ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని బియ్యం చేసే మిల్లులపై కఠిన చర్యలు

పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లులు సగానికి పైగా డిఫాల్ట్ అయి ఉండటం ధాన్యం సేకరణకు ప్రధాన సమస్యగా మారిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్ అన్నారుమంగళవారం ఉదయం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐ.డి. ఒ సి. సమావేశ మందిరంలో వరి కొనుగోలు పై వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు, మిల్లర్లు ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల సమీక్ష సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. చౌహాన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నాగర్ కర్నూల్ వనపర్తి అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్య నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల్లో వస్తుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం వనపర్తి జిల్లాలో 184 రైస్ మిల్లులు ఉండగా సగానికి పైగా డిఫాల్ట్ అయి ధాన్యం తీసుకోవడంలో దూరంగా ఉండటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారున్నాగర్ కర్నూల్ జిల్లాలో సైతం సగానికి పైగా మిల్లులు డిఫాల్ట్ అయ్యాయన్నారువనపర్తి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అయితే మిల్లింగ్ చేయడానికి మిల్లులు లేకపోతే
బియ్యం ఎవరు చేస్తారని మిల్లర్ల ను ప్రశ్నించారు తాత్కాలికంగా గోదాముల్లో నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేయాల్సిందేనని
స్పష్టం చేశారు.ప్రభుత్వం నుండి వడ్లు తీసుకోకుండా గట్టిగా ప్రైవేట్ వడ్లు తీసుకొని మిల్లింగ్ చేస్తున్న డిఫాల్ట్ మిల్లుల పై చర్యలు కఠినంగా ఉంటాయని మిల్లర్లను హెచ్చరించారు.
మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు మిల్లుకు రాకపోవడం వల్ల క్వింటాలుకు 67 కిలోలు రావాల్సిన బియ్యం 62 కిలోలు మాత్రమే వస్తుందని, తద్వారా మిల్లరు నష్టపోతున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తెచ్చారు సమీక్షలు పాల్గొన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా రైతులు వరి పండిం చారని అన్నారు.జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం లు, జిల్లా అధికారులు, మిల్లర్లు, ఐ.కే.పి, పి. ఎ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి.

— వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి
• వానపాము ఎరువుల ద్వారా దిగుబడి అధికం
• సైంటిస్ట్ చిన్నబాబు నాయక్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

వర్షాకాలం వరి సాగు పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ చిన్న బాబు నాయక్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. వర్షాకాలంలో పంటలపై వచ్చే రోగాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పురుగులు నారిమడి పోసినప్పుటి నుండి వరి ఆకులపై గుడ్లను పెట్టి వాటి ఉత్పత్తిని పెంచుకుంటుందన్నారు. వాటి నివారణకు మందులను వాడాలని సూచించారు. వానపాము ఎరువుల ద్వారా వరి పంట అధిక దిగుబడిని ఇస్తుందన్నారు. ఎరువులపై కూడా రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ఆధునిక పరిజ్ఞానం పరిధిలోని కూలీ, సమయం తగ్గించే విధంగా డ్రోన్ సహాయంతో మందును పిచ్కారి చేయవచ్చన్నారు. డ్రోన్ మిషన్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలత, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రైతులు ఊడెడు రాజయ్య, కూడవెల్లి చంద్రం, ఊడెపు శ్రీశైలం, కోమ్మిడి రాజు, బురాని మల్లేశం, మంగలి అమర్, మ్యాదరి కనకరాజు, సౌడ స్వామి, పాతూరి రాంరెడ్డి, రాకేష్, వేణు తదితరులు ఉన్నారు.

50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు.

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి.మండలం కస్పే కట్కూరు గ్రామానికి చెందిన శనిగరం దిలీప్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా. వారి. తల్లిదండ్రులను . కుటుంబ సభ్యులను. పరామర్శించి. మనోధైర్యం ఇచ్చి. వారి కుటుంబానికి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ. సత్తు శ్రీనివాస్ రెడ్డి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేసిన సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఈ oదుకుగాను బాధిత కుటుంబ సభ్యులు బియ్యం అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి. వారి కుటుంబానికి. పార్టీ పరంగా కాను ప్రభుత్వపరంగా కాను. అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి. బాధిత కుటుంబానికి సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్. కే రాజేశ్వరరావు. కిషన్ కుటుంబ సభ్యులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని సి.పి.ఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముషాం రమేష్ మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరిగినది. అని తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. అన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి మొత్తం కొనుగోలు చేయాలని సి.పి.ఎం పార్టీ డిమాండ్ చేస్తుంది
ప్రతి సీజన్లో పంట పండించిన రైతుకు మొత్తం పంట ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా పంటకు ఎప్పుడు ఏమైతదో అని భయం గుప్పిట్లో బతకవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న రైతుల రైతుల బతుకులు ఎలాంటి మార్పు జరగడం లేదు.
బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల. జెండాలు వేరైనా మోసాలు ఒకటే. విధానాలు ఒకటే రైతే రాజు అని
రైతులను మోసం చేసి రైతుల ఓట్లతో అధికారం లోకి వస్తున్నాయి. రైతులు పండించిన పంటకు నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళిక చేయకపోవడంతోనే ప్రతి పంట సీజన్ లో వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.ఇప్పటికైనా రైతులకు నష్టాలు జరగకుండా పండిన పంటను వెంట వెంటనే కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి,కోడం రమణ పాల్గొన్నారు

తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా కొనుగోలు చేయాలి

తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా కొనుగోలు చేయాలి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

నర్సంపేట నేటిధాత్రి:

అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కోరారు.రాష్ట్ర ఆహార,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హైదారాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలో అకాల వర్షంతో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని ఆ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన మంత్రి బాయిల్డ్ రైస్ పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే దొంతి తెలిపారు. ఈ
కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,వరంగల్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వైస్ చైర్మన్.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా ఆమనగల్ మార్కెట్ శనివారం నాడు కమిటీ వైస్ ఛైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి ఆకస్మిక పర్యటన సందర్భంగా ఆమనగల్ PACS ఆధ్వర్యం లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం సేకరణ వివరాలను సంబధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డు లో నిర్మినా దశలో ఆగిపోయిన పనులను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని పరిశీలించారు.కూరగాయల మార్కెట్ .మాటెన్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సమస్యను MLA గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చెయ్యడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ప్రజలకు కూడా అన్ని సదుపాయాలు ఒకే దగ్గర ఉంటాయని వైస్ చైర్మన్ వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ తాళ్ల రవీందర్ ,నరేష్ నాయక్ , సంపత్ కుమార్ ఉన్నారు.

మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.

మృతురాలు ఎల్లవ్వ కుటుంబానికి బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన. గ్రామపంచాయతీ కార్మికురాలు పోచ ఎల్లవ్వ. మృతిచెందగా. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక వారి కుటుంబాన్ని చూసి చదివించి వారి కుటుంబానికి. సత్తు శ్రీనివాస్ రెడ్డి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లవ్వ అర్థిక స్థితి బాగోలేక వారి కుటుంబానికి చూసి చలించి వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన దాతలు ఇందులో భాగంగా.తన వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. అలాగే మృతి చెందిన. గ్రామపంచాయతీ. కార్మికురాలు . ఎల్లవ్వ కుటుంబ పరిస్థితి బాగా లేనందున. ప్రభుత్వ పరంగా గాని గ్రామపంచాయతీ పరంగా గాని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఫిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. గ్రామ శాఖ అధ్యక్షులు ఆసరి మహిపాల్ రెడ్డి. మండల మహిళా అధ్యక్షురాలు హరిక రెడ్డి. రాజేష్. బాలయ్య. తంగళ్ళపల్లి రవి. పెద్ది పరిసరం గౌడ్. బుర్ర బబ్లు. చెక్కపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’

‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’ 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి, చిన్నరేవల్లి, మోదంపల్లి, హేమాజీ పూర్ తదితర గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దరేవల్లి రైతు వేదిక వద్ద ఈదురు గాలులకు ఆరబెట్టిన ధాన్యం స్వల్పంగా తడిసింది. ఈదురు గాలులకు కుప్పలపై కప్పిన టార్పలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిందని రైతులన్నారు. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ సైతం కూలిపోయిందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version