ఆదరిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుట…

ఆదరిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుట

గూడెల్లి సదన్ కుమార్ 11వ వార్డు అభ్యర్థి

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపల్ ఎన్నికల సందడిలో భాగంగా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పరకాల మున్సిపాలిటీ 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గూడెల్లి సదన్ కుమార్ ఇంటింట ప్రచారం గురువారం రోజున నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆ దేవుడి దీవెనలు,తన వార్డులోని ప్రజల ఆశిస్సులు తనపై ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ తోనే పట్టణం వార్డు అభివృద్ధి చెందుతాయని తమ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై ఓటువేసి ఆదరించి గెలిపించాలని గెలిపిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుంటానని మీ కష్ట సుఖాలలో తోడుంటానని హామీఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

దాట్ల విజయ శ్రీనివాసుని గెలిపించండి…

దాట్ల విజయ శ్రీనివాసుని గెలిపించండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 16 వ వార్డు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల విజయ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల విజయ శ్రీనివాసుకు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలరు అని వారు అన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి…

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

స్థానిక మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గ్యాదoగి
తిరుపతి ఇంటింటి ప్రచార నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 వ వార్డు లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను కాలనీలో సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు తాగునీరు సమస్యలు తలెత్తకుండా పరిష్కరిస్తానని వారు ప్రజలకు హామీ ఇచ్చారు కావున 18వ వార్డు ప్రజలు అందరూ గ్యాదoగి తిరుపతి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

5.6వార్డులలో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్…

5.6వార్డులలో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5, 6 వార్డులలో ఎన్నికల ప్రచారంని నిర్వహించిన ఎమ్మెల్యే జిఎస్సార్ అనంతరం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 5, 6 వార్డులకు సంబంధించిన వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఇంతర ముఖ్య నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి, వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉడుత సరోజన రాయమల్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ ఉడుత మహేందర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version