రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్సార్

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

మంగళవారం రేగొండ మండలంలోని భాగుర్తిపేట క్రాస్ నుండి బుద్ధారం గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల నాణ్యత,వేగం గురించి అధికారులను అడిగి తెలుసుకుని,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే పనులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్థులు పాల్గొన్నారు.
అనంతరం మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి స్వాగతం పలికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version