బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బీర్తీ కమల మధునయ్య కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్తీ కమలను మధునయ్య 17వ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కావున వార్డు ప్రజలు అందరూ ఆలోచించి బీర్తీ కమల చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి వార్డు అభివృద్ధికి అందరూ సహకరించండి అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 17వార్డు ఇన్చార్జి టౌన్ యూత్ అధ్యక్షుడు పృథ్విరాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
