రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు
నిధులు తెచ్చే దమ్ము లేక ప్రజలను శిలాఫలకలు వేసి ఏమార్చుతున్నావ్
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ ను ఒప్పించి కొప్పుల గ్రామం నుండి పరకా ల నేషనల్ హైవే మధ్యన చలి వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్టిహెచ్డిఎఫ్ 2023-24 నుండి రూ.574 లక్షలు మరియు కొప్పుల గ్రామం నుండి పరకా ల వరకు బిటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.585 లక్షలు మం జూరు చేయించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిం చడం జరిగింది. పనులు జరుగు తుంటే వాటిని వేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సిగ్గుచేటు.నేను నిధులు తెచ్చిన అంటూ మేము వేసిన శిలా పలకాల పక్కనే శిలాఫలకాలు వేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం ఏంటని ఏద్దేవా చేసిన భూపా లపల్లి మాజీఎమ్మెల్యే మండ లంలో పర్యటించిన భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లా డుతూ జోగంపల్లి గ్రామం నుండి మైలారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు హుస్సేన్ పల్లి నుండి మైలారం వరకు వయా పెద్ద చెరువు కట్ట మీదుగా కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా పనులు చేస్తున్నారు.కాంగ్రెస్ నాయ కుల వ్యవసాయ భూమి ఉందని రోడ్డు పక్కన ఉన్న చెరువుని ఆక్రమిస్తూ రోడ్డు వేస్తున్నారు.కాంగ్రెస్ నాయకు లకు సహకరించని అధికారు లను ట్రాన్స్ఫర్ చేయిస్తూ వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు.అదే విదంగా ఎస్సిలకి సంబంధించిన స్మశాన వాటికను కూడా ఆక్రమించుకు న్నారు.అంటే అధికార పార్టీ నాయకులు ఏదీ చేసిన మాఫ్ అనే ధోరణి నడుస్తుంది.
కావున ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం కొప్పుల గ్రామంలో వేసిన శిలా ఫలకాలను చూసి శిలాఫల కాల మోజులో ప్రజలను ఏమార్చుతున్నారు అంటూ చురకలు అంటించాడు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.