గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
అధైర్యపడొద్దు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, బుద్దారం గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ముందుగా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి కోమల కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమల అంతిమ యాత్ర లో పాల్గొని పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్దారం గ్రామంలో పెరుమాండ్ల మొగిలి, బండి శాంతమ్మ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే వారి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటానని, దైర్యంగా ఉండాలని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

సేవ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట ఉత్తరముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలొ శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి మంగళవారం రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వారికీ చందనోత్సవం తమలపాకుల తోరణాలు జిల్లేడు దండలతో పాటు సామూహిక చాలీసా పారాయణం చేయడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు వచ్చిన భక్తులకు సకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు బెనికి రాజేందర్ అందించారు. ఈ సంవత్సరం పాడిపంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరిపై ఆ స్వామి కరుణకటాక్షలు మెండుగా ఉండాలని ఉత్తరముఖ ఆంజనేయ స్వామిని కోరామన్నారు.ఈ కార్యక్రమంలొ కమిటీ సభ్యులు వాలా నర్సింగరావు బెతి రవీందర్ దూలం శంకర్ ఆకుల దామోదర్ బాపని సాంబయ్య పనికెలా శివకృష్ణ సింగం రాజవిరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

79వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

79వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

గణపురం సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ గణపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు పోలీసు లాంఛనాలతో జెండా ఎగర వేయడం జరిగింది అనంతరం సీఐ మాట్లాడుతూ గణపురం రేగొండ కొత్తపల్లి గోరి మండలాలకు సర్కిల్ గా అపాయింట్మెంట్ చేసినందుకు ఎస్పీ కిరణ్ కార్కే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజల శాంతి భద్రతలను సమర్థవంతంగా పనిచేస్తానని గణపురం పోలీస్ స్టాప్ ఎస్సై రేఖ అశోక్ ఆధ్వర్యంలో పోలీస్ అందరూ సహకరించాలని వారిని కోరడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version