దండు రమేష్ కు రాష్ట్ర ఈ జీ సి కౌన్సిలర్ గా సన్మానం

దండు రమేష్ కు రాష్ట్ర ఈ
జీ సి కౌన్సిలర్ గా సన్మానం

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ బుధవారం రోజు జయశంకర్ భూపాలపల్లి భారత్ ఫక్షన్ హాల్ లో జరిగే దండు రమేష్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర ఈ. జి.సి. కౌన్సిల్ మెంబర్ గా నియమించిన సంధర్బంగా “సన్మాన మహోత్సవ” కార్యక్రమానికి
ముఖ్య ఆతిథులుగా విచ్చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, నాగరిగారి ప్రీతం తెలంగాణ రాష్ట్ర ఎస్.సి.కార్పొరేషన్ చైర్మన్,గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి శాసనసభ్యులు, అయిత ప్రకాష్ రెడ్డి , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంభ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మనవి

బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి…

బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి

పంచాయితీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు పడుతున్నారు

ఇప్పటికైనా గత బకాయిలు విడుదల చేసి వారిని ఆదుకోవాలి

లేని పక్షంలో జిల్లాలోని మినరల్ ఫండ్ డి ఎం ఎఫ్ టి / సిఎస్ఆర్ నిధుల నుండి

బతుకమ్మ ఏర్పాట్లకు నిధులు ఇవ్వాలి

గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, పి ఎ సి ఎస్ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం తెలంగాణలో ఆడబిడ్డలు అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ, మరియు దసరా పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో పరిశుద్ధ పనులు, ఇతర పనులు చేయించలేక కార్యదర్శులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గత బకాయిలు చెల్లించి కార్యదర్శులను ఆదుకోవాలని గండ్ర యువసేన జిల్లా అధ్యక్షులు, గణపురం సొసైటీ మాజీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ పంచాయతీ కార్యదర్శుల పట్ల అనవసర భారం వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని, పని భారంతో అప్పుల బాధతో కొందరు కార్యదర్శులు చనిపోతున్నారని ఇప్పటికైనా వస్తున్న బతుకమ్మ దసరా పండుగ లను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామ పంచాయతీకి పదివేల నుండి లక్ష రూపాయల వరకు ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేయాలని, ఇప్పటివరకు కార్యదర్శులు ఖర్చుపెట్టిన మొత్తం డబ్బులను అందించాలని కార్యదర్శుల పట్ల ప్రభుత్వం మానవత దృక్పథం తో వ్యవహారించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, జిల్లా కలెక్టర్ మంచి మనస్సుతో స్పందించి మన జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలకు జిల్లా మినరల్ ఫండ్ డి ఎం ఎఫ్ టి/ సి ఎస్ ఆర్ నిధుల నుండి డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
పండుగ వేళ కార్యదర్శులు అప్పుల పాలు కాకుండా చూడాలని అన్నారుఅలాగే గ్రామాల్లో గ్రామ పంచాయితీ సిబ్బందికి కూడా పండగ పూట ప్రభుత్వం అండగా ఉండాలని పూర్ణచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట…

కెటిపిపి లో దుర్గాదేవి ప్రతిష్ట

చీఫ్ ఇంజనీర్ ప్రకాష్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లో బాగంగా చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో కెటిపిపి దుర్గాదేవి ఉత్సవ కమిటీ వారు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ కెటిపిపి విద్యుత్ కేంద్రం లో దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు అన్ని కుటుంబాలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆడుతూ పాడుతూ విధులు నిర్వహించేలా క్షేమంగా ఉండేలా చూడాలని ఆ దుర్గాదేవి ని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్స్, దుర్గాదేవి ఉత్సవ

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్…

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని భూలక్ష్మి వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిచి దారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది
అలాగే నిన్న విపరీతంగా కురిసిన భారీ వర్షానికి గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతాల్లో చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుకోవడం జరిగింది ఇది కేవలం ఊర కాలువను శుభ్రం చేయకుండా చెత్తాచెదారం పిచ్చి మొక్కలు పేరుకోవడం వల్ల వచ్చిన వరద నీరు కిందకు పోకపోవడం వలన ఇళ్లలోకి చొరబడడం జరిగింది అది తెలుసుకున్న బిజెపి పార్టీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఫోన్లో మాట్లాడి సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెలుమల్ల ప్రవీణ్ కుమార్, బిజెపి మండల ఉపాధ్యక్షులు మధాసు మొగిలి, డాకురి కృష్ణ రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు,దుగ్గుషెట్టి.పూర్ణ చందర్ , మండల మహిళా నాయకురాలు బొల్లం అరుణ,బిజెపి మండల నాయకులు మంధల రాజు తదితరులు పాల్గొన్నారు.

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
అధైర్యపడొద్దు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, బుద్దారం గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ముందుగా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి కోమల కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమల అంతిమ యాత్ర లో పాల్గొని పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్దారం గ్రామంలో పెరుమాండ్ల మొగిలి, బండి శాంతమ్మ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే వారి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటానని, దైర్యంగా ఉండాలని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

సేవ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట ఉత్తరముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలొ శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి మంగళవారం రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వారికీ చందనోత్సవం తమలపాకుల తోరణాలు జిల్లేడు దండలతో పాటు సామూహిక చాలీసా పారాయణం చేయడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు వచ్చిన భక్తులకు సకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు బెనికి రాజేందర్ అందించారు. ఈ సంవత్సరం పాడిపంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరిపై ఆ స్వామి కరుణకటాక్షలు మెండుగా ఉండాలని ఉత్తరముఖ ఆంజనేయ స్వామిని కోరామన్నారు.ఈ కార్యక్రమంలొ కమిటీ సభ్యులు వాలా నర్సింగరావు బెతి రవీందర్ దూలం శంకర్ ఆకుల దామోదర్ బాపని సాంబయ్య పనికెలా శివకృష్ణ సింగం రాజవిరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

79వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

79వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ

గణపురం సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ గణపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఐ సిహెచ్ కర్ణాకర్ రావు పోలీసు లాంఛనాలతో జెండా ఎగర వేయడం జరిగింది అనంతరం సీఐ మాట్లాడుతూ గణపురం రేగొండ కొత్తపల్లి గోరి మండలాలకు సర్కిల్ గా అపాయింట్మెంట్ చేసినందుకు ఎస్పీ కిరణ్ కార్కే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజల శాంతి భద్రతలను సమర్థవంతంగా పనిచేస్తానని గణపురం పోలీస్ స్టాప్ ఎస్సై రేఖ అశోక్ ఆధ్వర్యంలో పోలీస్ అందరూ సహకరించాలని వారిని కోరడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version