సన్నబియ్యం పంపిణీ పరిశీలన….

సన్నబియ్యం పంపిణీ పరిశీలన

 

చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఉన్న చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి.. ఆన్లైన్ లో లబ్దిదారుల వివరాల నమోదు .. సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు.

ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు అందించింది. ఈ సందర్భంగా పలువురు రేషన్ కార్డుల లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఇప్పటిదాకా ఎందరు లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకువెళ్ళారు? పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రేషన్ డీలర్ ను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.

పరిశీలనలో సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రజలకు మూడు నెలల రేషన్ కోటా అందుబాటులోకి.

ప్రజలకు మూడు నెలల రేషన్ కోటా అందుబాటులోకి.
ప్రారంభించిన 29 వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్.
శ్రీరాంపూర్: నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ సంగ మల్లయ్య పల్లె షాప్ నెంబర్-2లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రేషన్ బియ్యం మూడు నెలల కోటాను కార్పొరేటర్ బండారి సుధాకర్ గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‌ పేద ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని అర్హత కలిగిన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రేషన్ బియ్యం సరఫరా ద్వారా ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు మహిళా సోదరీమణులు, కార్యకర్తలు, రిటైర్డ్ కార్మికులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ…

*మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ
పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు సంతోషం వ్యక్తo చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం అందించడం పట్ల మొగుళ్లపల్లి మండలకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయమని వారు తెలిపారు.ప్రజలకు సకాలంలో అవసరమైన ఆహార భద్రత కల్పించడంలో ఇది కీలక నిర్ణయమని పేర్కొన్నారు.ఈ సందర్బంగా నడిగోటి రాము మాట్లాడుతూ,మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించడం వల్ల ప్రజలకు సౌలభ్యం కలుగుతుందని,ముఖ్యంగా కూలీ వర్గాలకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్‌ను పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. తదితరులు పాల్గొన్నారు.

కొత్త రేషన్ దుకాణం ప్రారం భించిన ఎమ్మెల్యే/….

కొత్త రేషన్ దుకాణం ప్రారం భించిన ఎమ్మెల్యే

గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి :

శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన బడుగు అశోక్ నూతన రేషన్ దుకాణంను ఎమ్మెల్యే గండ్ర సత్యనార యణరావు ప్రారంభించా రు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర సరుకు లను సమయానికి, పారద ర్శకంగా ప్రభుత్వంఅందిస్తుంది గ్రామస్థాయిలో రేషన్ దుకా ణాల ఏర్పాటు ద్వారా ప్రజల కు సులభంగా సరుకులుఅందే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు.ఈ కొత్త రేషన్ షాప్ ద్వారా మాందా రిపేట గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికా రులు కృషి చేయాలని సూచించారు.ప్రజలు కూడా రేషన్ సరుకులను సద్వి నియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ ,శాయంపేట మండలం ఎమ్మార్వో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

 

 

వంటనూనెల జీఎస్టీ రీఫండ్స్ ఆంక్షలు ఎత్తేయండి – ఐవీపీఏ విజ్ఞప్తి.

వంటనూనెల జీఎస్టీ రీఫండ్స్‌పై విధించిన ఆంక్షలు ఎత్తేయండి.. ఐవీపీఏ విజ్ఞప్తి

 

 

వంటనూనెలకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్‌పై ఆంక్షలను ఎత్తేయాలని ఇండియన్ వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ ఆంక్షల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: వంటనూనెలకు సంబంధించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్స్‌‌పై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని వెజిటెబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీఫండ్స్ లేని కారణంగా వర్కింగ్ క్యాపిటల్, నగదు లభ్యత తగ్గి చిన్న,మధ్య తరహా సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొంది. ఈ రంగంలో పెట్టుబడులు తగ్గుతున్నాయని కూడా పేర్కొంది.

రీఫండ్స్‌కు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ 2022 జులైలో ఆంక్షలు విధించిందని ఐవీపీఏ తెలిపింది. వంటనూనెలకు సంబంధించి ఇన్‌వర్టెడ్ సుంకాలు, ఆంక్షల కారణంగా తమ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుకుపోతున్నాయని తెలిపింది. ఫలితంగా నగదు లభ్యత తగ్గుతోందని, ఇది చిన్న, మధ్య తరహా సంస్థలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. ‘వర్కింగ్ క్యాపిటల్‌కు కొరత ఏర్పడుతోంది. నగదు లభ్యతకు అవాంతరాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా మారింది’ అని ఐవీపీఏ ఓ ప్రకటనలో తెలిపింది.

రీఫండ్స్ లేని కారణంగా ఈ అదనపు ధరాభారం వినియోగదారులకు బదిలీ కావడంతో వంట నూనెల రేట్లు పెరుగుతున్నాయని ఐవీపీఏ తెలిపింది. రేట్లు తట్టుకోలేక కొందరు వినియోగదారులు తక్కువ నాణ్యత గల ప్రత్యామ్నాయాలవైపు మళ్లుతున్నారని తెలిపింది. బటర్, నెయ్యి వలెనే వంటనూనెలకు సంబంధించి ట్యాక్స్ క్రెడిట్స్ రీఫండ్ తక్షణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రీఫండ్స్ విధానంలో సుస్థిరత వస్తే దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుందని ఐవీపీఏ తెలిపింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2030-31 నాటికి దేశంలో వంటనూనెలకు డిమాండ్ 30 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. ఆహార నూనెల మార్కెట్ 2023-28 మధ్య కాలంలో 5.26 వార్షిక వృద్ధి రేటుతో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సహేతుకమైన రీఫండ్ పాలసీ దేశంలో ఆహారభద్రతకు బాటలు వేస్తుందని కూడా ఐవీపీఏ పేర్కొంది.

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

ప్రతి పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణంలోని రేషన్ షాప్ లో నూతన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకొని ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డులను అందించిందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి,గుండాల నర్సయ్య,జలకం శ్రీనివాస్, వెంకటాచారి,తాళ్లపల్లి బిక్షం గౌడ్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ శ్రీనివాస్,కల్లూరి కుషాల్, రాజేష్ యాదవ్, జింజిరాల మనోహర్,ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, జలీల్,గూడేల్లి రామచంద్రయ్య, జలగం వెంకన్న,మహేష్ యాదవ్, యశోద,దేవేందర్, రేషన్ షాప్ డీలర్లు సోమిరెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు మురళి, అజయ్, నరేష్, సురేష్, బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

పేదల ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం

“పేదల ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం”

రాజాపూర్ మండలానికి 433 కొత్త రేషన్ కార్డులు.

జడ్చర్ల /నేటి ధాత్రి

 

రాష్ట్రంలోనీ పేదల ఇళ్లల్లో ఆకలికేకలు లేకుండా చూడటమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని జెకె ప్యాలెస్ లో నిర్వహించిన నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని,మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో వేస్తున్న సిసి రోడ్డు మరియు అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది ప్రతి పేద కుటుంబానికి భరోసా అని ప్రస్తావించారు. భవిష్యత్తుకు ఆర్థిక బలంతో పాటు, పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఈ ప్రక్రియ కీలకమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రాజాపూర్ మండలానికి 433 కొత్త రేషన్ కార్డులు,1667 పాత కార్డులకు ఆడిషన్స్ పూర్తయ్యాయని తెలిపారు. గతంలో అర్హులు ఎన్నో ఏళ్లు రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version