కొత్త రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో నూతన రేషన్ షాపును ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ తో కలిసి రేషన్ షాపులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అందించే ఉచిత సన్న బియ్యం పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పిల్లి రాజయ్య ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆదివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఎలబోయిన ఎర్ర మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఎనిమిదవ రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం అంబటి లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందగా మూడవరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుకపెళ్లి రమేష్, ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు కొడారి రవీందర్ సీనియర్ నాయకులు మార్నేని ఉపేందర్ రావు దోమల రాజయ్య కొడాలి రవీందర్ ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ రమా రవీందర్ తదితరులు పాల్గొన్నారు._
