ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని గుంటూరు పల్లి లో మంగళవారం రోజున ఇందిరమ్మ ఇళ్లకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే సత్తన్నకు దక్కిందని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలలను తీర్చలేదని 10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు, అలాగే మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటనలో మాట్లాడుతూ కాలేశ్వరం లో మోటార్లు పెట్టడం లేదని నిరాహార దీక్ష చేస్తామనడం ఎందుకో చెప్పాలని దొరల ఫామ్ హౌస్ లోకి నీళ్లను పంపడం కోసమేనా అని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దన నాగరాజు కాంగ్రెస్ నాయకులు పాశం లక్ష్మీనారాయణ నర్రా శివరామకృష్ణ మునిమాకుల నాగేశ్వరరావు తిరుపతయ్య సాంబయ్య కాంగ్రెస్ పార్టీ యూత్ మండల్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.

బస్సు కారు డి ముగ్గురికి గాయాలు.

బస్సు కారు డి ముగ్గురికి గాయాలు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో అనగా 26 7 2025 రోజున జమ్మికుంట నుండి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిజి 02 జెడ్ 0026 చిట్యాల మండలం లోని కొత్తపేట బస్టాండు వద్ద ఆగి నలుగురు ప్యాసింజర్లను ఎక్కించుకొని అప్పుడే కదులుతున్న సమయంలో గోపాల్పూర్ క్రాస్ నుండి ఒక షిఫ్ట్ కారు ఏపీ 36 ఎక్స్ 9797 అది వేగంగా అజాగ్రత్తగా వచ్చి ప్రభుత్వ బస్సు యొక్క కుడివైపున బలంగా ఢీకొనడంతో బస్సులో ఉన్న ఒక వ్యక్తి మోకాలికి గాయం అయిందని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలు అయినాయి అని అట్టిబస్ డ్రైవర్ (హుజురాబాద్ బస్ డిపో లో ఆర్టీసీ డ్రైవర్) గా పని చేస్తున్న గోలి జనార్ధన్ సన్నాఫ్ పోశెట్టి అను వ్యక్తి దరఖాస్తు ఇచ్చి అజాగ్రత్తగా వచ్చి ప్రభుత్వ బస్సును ఢీకొట్టడంతో బస్సు యొక్క బంపర్ హెడ్లైట్ బాడీ డ్యామేజ్ అయిందని కావున అందుకు కారకులైన కారు డ్రైవర్ (గట్టు రఘు నైన్ పాక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు) పై తగు చట్టారిత చర్యలు తీసుకోవాలని కోరగా చిట్యాల ఎస్ఐ జి శ్రవణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన.

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సిఐటియు బందు సాయిలు ఏఐటియుసి కొరిమి రాజ్ కుమార్ టిబిజికేఎస్ సమ్మయ్య, ఐఎన్ టియుసి మధుకర్ రెడ్డి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజున ఒక బిఎంఎస్ తప్ప అన్ని రకాల కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనడం ఆనందించదగ్గ విషయమని, ఈ సమ్మె కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారని,సార్వత్రిక సమ్మె కార్మిక సంఘం అని చెప్పుకునే బి ఎం ఎస్ కార్మిక సమ్మెలో పాల్గొనకుండా ఇది రాజకీయ సమ్మె అంటూ కుంటి సాకులు చెప్పడం కార్మికులకు ద్రోహం చేయడమేనని పనిగంటలు 8 నుండి 10 గంటలకు అవసరమైతే 12 గంటలకు పెంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడులలో, రాష్ట్ర ప్రభుత్వం జీవో 282 ద్వారా చెబితే వారానికి 48గంటలు దాటదని బిఎంఎస్ చెప్పడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం.. వారానికి 48 గంటలు దాటితే ఓవర్ టైం పేమెంట్ వస్తుందని చెప్పారే తప్ప వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలని కానీ, వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తారని కానీ లేబర్ కోడ్ లలో ఎక్కడా చెప్పలేదని సత్యం కండ్లున్న ఈ కబోధులకు కనబడటం లేదా అని సిఐటియు ప్రశ్నిస్తుంది..

 

 

 

 

 

 

 

రోజుకు 10 నుండి 12 గంటలు పని చేయాలని 6 గంటల తర్వాతే బ్రేక్ ఉంటుందని ప్రభుత్వం రాతపూర్వకంగానే చెబుతుంటే కార్మికుల తరఫున మాట్లాడాల్సిన ఈ దివాలాకోరులు ప్రభుత్వానికి, కార్పొరేట్లకు మద్దతు పలకడం కార్మికుల పట్ల వీరికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.. ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ రోజుకు రూ.178/-(నెలకు 4628/-) ఉంటే చాలని చెప్పిన మోడీ ప్రభుత్వం వీరికి ఆదర్శమట…వేతనాల కోడ్ కు సామాజిక భద్రత కొడుకు తేడా తెలవని ఈ తేడా గాళ్ళకు వేతనాలకోడు రూల్స్ లో కనీస వేతనాల నిర్ణయంలో డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములాను కానీ, సుప్రీంకోర్టు రాప్తా కోస్ & బ్రెస్ట్ కేసులో ఇచ్చిన తీర్పును గాని పరిగణలోకి తీసుకోకపోగా ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం గురించి చెప్పి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెరగాలని పేర్కొనకపోవడం కార్మికులను మోసం చేయడమే…ఇటువంటి కోడ్ ను బిఎంఎస్ సమర్థించడం సిగ్గుచేటు.. వాస్తవాన్ని కప్పిపుచ్చి ఐదు సంవత్సరాలకోసారి కేంద్ర ప్రభుత్వమే కనీసం పెంచుతుందని బిఎంఎస్ వారు చెప్పడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం..

 

 

 

 

 

సామాజిక భద్రత కోడ్ బాగుందని చెప్పే వీరికి ఈ కోడ్ లో 12 శాతంగా ఉన్న పీఎఫ్ ను 10 శాతానికి తగ్గిస్తామని సెక్షన్ 16(1)ప్రకారం ఈ 10 శాతం కూడా తగ్గించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది కనబడలేదా? సెక్షన్ 15(1)(e) ప్రకారం ఈపీఎఫ్, ఈపీఎస్, ఈ డి ఎల్ ఐ లను తనకు అవసరమైన విధంగా మార్చేందుకు, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ రేటును నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వానికే అధికారం కట్టబెట్టిన విషయం వీరు చదవలేదా? అని సిఐటియు ప్రశ్నిస్తున్నది… దీంతో ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డును, ఈఎస్ఐ గవర్నింగ్ బాడీని నామమాత్రం చేస్తున్న విషయం వీరికి అర్థం కాలేదా?

 

 

 

 

గిగ్ వర్కర్స్ కు, కొంతమంది అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు ఫోజు పెట్టి మొత్తం కార్మికుల సామాజిక భద్రతని నాశనం చేసే ప్రభుత్వ విధానం వీరికి నచ్చడం వీరి దివాలా కోరుతనానికి నిదర్శనం..
ఈ కోడ్ ల వల్ల యాజమాన్యాలు పర్మనెంట్ ప్లేస్ లలో ఫిక్స్డ్ టర్మ్ కార్మికులను పెట్టుకొని యదేచ్చగా దోపిడీ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు.. 300 మంది లోపు కార్మికులు ఉన్న కంపెనీలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్మికులను తొలగించడానికి, లే ఆఫ్, మూసివేతలకు యాజమాన్యాలకు లైసెన్స్ ఇచ్చింది పారిశ్రామిక సంబంధాల కోడ్. అంతేకాక మెడికల్ కారణాలతో కార్మికుని తొలగిస్తే అది రిట్రించ్మెంట్ క్రిందికి రాదని సెక్షన్ 2 (3)లో పేర్కొన్నారు. మెడికల్ అన్ ఫిట్ సర్టిఫికెట్ తో సంబంధం లేకుండానే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కార్మికులను తొలగించే అవకాశం యాజమాన్యాలకు ఇస్తే అది బిఎంఎస్ కు నచ్చుతుంది

 

 

 

 

ఈ కోడ్ యూనియన్ల ఏర్పాటును, రిజిస్ట్రేషన్ ను, రిజిస్ట్రేషన్ కొనసాగింపును కఠిన తరం చేస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన అంశాలు పొందుపరిచిన ఈ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు పిలుపునిస్తే అది బి ఎం ఎస్ వారికి రాజకీయ సమ్మెగా కనబడుతుంది అంటే వీరిని ఏమనాలో కార్మికులే నిర్ణయించాలి…బిజెపికి అంటగాగే బిఎంఎస్ వారి నుండి ఇంతకంటే ఏమి కొత్తది ఆశించగలం.. అందుకే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం రూ.26,000 కు పెంచాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు చేయొద్దని తదితర ప్రజోపయోగ డిమాండ్లపై జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెలో కార్మికులంతా పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రమేష్ కంప్యూటర్ రాజయ్య రామచంద్రయ్య సోతుకు ప్రవీణ్ సతీష్ ఆకుదారి రమేష్, నాయకులు వెలిశెట్టి రాజయ్య రవికుమార్, రాజేందర్, శేఖర్, మహేందర్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version