భవిష్యత్తు బి ఆర్ఎస్ దే బిఆర్ఎస్ హయాంలో ఎన్నో గొప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బి ఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్
మొగులపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూ రి కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో భవిష్యత్తు టిఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడ కని విని ఎరుగని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడింది అనేక పరిపాలన సంస్కరణలకు సైతం నాంది పలికింది కొత్త జిల్లాలు మండలాలు పంచాయితీలను ఏర్పాటు చేసి పాలన సంస్కరణకు శ్రీకారం చుట్టింది విధానమైన నిర్ణయాలను తీసుకొని ప్రజలకు చెంతకు పాలనపారదర్శకంగా సేవలను అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది పదేండ్లలో ప్రజల అవసరాల గురించి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు నెలకొల్పింది ప్రజల భద్రత కోసం నేరాలను సమూలంగా అరికట్టేందుకు పోలీసు కమిషన్ లేట్లు సంఖ్యను పెంచింది భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోస్టల్ అందుబాటులోకి తీసుకురావడంలో ఇష్ట రాజ్యాంగ రికార్డులు మార్చే సాంస్కృతికి చెక్కుబడింది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండగా కొత్తగా మరో 76 పురపాలక సంఘాలను ఏర్పాటు చేసింది నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని 2018 సంవత్సరంలో తీసుకువచ్చి గ్రామాల్లో ప్రభుత్వ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించారు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ట్యాంకర్ అందజేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాలేశ్వరం ప్రాజెక్టులు నిర్వహణకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ మొబైల్ ఈ యాప్ లను రూపొందించి రాష్ట్రంలో అన్ని వాగులపై సుమారు 1200 చెక్ డ్యాములు నిర్మించి ప్రజలకు రైతులకు అనేక సేవలు అందించడంలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వెనుకడుగు వేయలేదు కల్యాణ లక్ష్మి పెన్షన్ 2000 రైతు చనిపోయిన పది రోజుల వ్యవధిలోనే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా అందించిన మహనీయుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గత 10 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేశారు అనేక చెరువుల మరమ్మతులు చేసి యాదవులకు గొర్లు ముదిరాజులకు చేప పిల్లలు పంపిణీ చేశారు చేపల విక్రయాలు కొరకు వాహనాలు పంపిణీ చేశారు ఎప్పుడు ఎలక్షన్ జరిగిన బిఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు విజయం సాధిస్తుందని దేవును రి కుమార్ స్వామి తెలిపారు
పాత బాకీలు తీర్చడంతోనే.. సమయం సరిపోతుంది. • గత ప్రభుత్వం అప్పుల కుప్ప తెచ్చిపెట్టింది. • ఇచ్చిన మాట తప్పిన గత ప్రభుత్వం!
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నిజాంపేట: నేటి ధాత్రి
గత ప్రభుత్వం చేసిన పాత బాకీలు తీర్చడంతోనే సమయం సరిపోతుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం లీల గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. గత ప్రభుత్వ హయాంలో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి మరెన్నో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మోసపూరిత మాటలపై అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంచాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తోనే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, నాయకులు కొమ్మాట బాబు, నజీరుద్దీన్, మారుతి, లక్ష్మా గౌడ్ తదితరులు ఉన్నారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఉప సర్పంచ్ గోపాల్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అదుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని, ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామన్నారు.
భారతీయ జనతా పార్టీలో చేరికలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి
మహాదేవపూర్ అక్టోబర్ 8 నేటి ధాత్రి *
Vaibhavalaxmi Shopping Mall
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కంకణాల రాజిరెడ్డి మెరుగు లక్ష్మణ్ సారంగపని బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్బంగా చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్స్ దృష్ట్యా బీజేపీ పార్టీలో చేరికలు అవ్వడం శుభపరిణామం అని, భారత ప్రధాని గౌ ‘శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలు, వారి పరిపాలన ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు అవుతున్న కానీ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని, రాబోయే రోజులలో తెలంగాణనలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో మహాదేవపూర్ అన్నీ స్థానాలలో పోటీ చేసి, గెలిచి తిరుతామణి,కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక భారీ మూల్యం చెల్లించుకుంటుందని వారు చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్,కార్యదర్శి సంతోష్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్, చాగర్ల రవీందర్,దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్, రాము, బల్ల శ్రావణ్ కార్యకర్తలు పాల్గొన్నారు,
కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి
మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు. మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి. రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం. పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు. భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది. మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి. కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని. కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు
ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్
కరీంనగర్, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.
రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిందలు వేస్తూ రేవంత్ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.
ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.
న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశాన్ని నిర్వహించిన
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా ఏ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ అధ్యక్షతన న్యాలకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రి డా||చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంగా ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశగా ఉన్నావారు,పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినవారు మీ మండల అధ్యక్షులు తెలియజేసిన వెంటనే వారు మండలంలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులను పరిశీలించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నా వారి పేర్లను ఇంచార్జ్ డా౹౹చంద్రశేఖర్ ద్వారా జిల్లా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది.మరియు కచ్చితంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను ప్రతి గ్రామంలో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని, నాయకులకు వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి పిఏసిఎస్ ఛైర్మెన్ సిద్దిలింగయ్య ఏ.యం.సి.వైస్ ఛైర్మెన్ తురుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ చంద్రప్ప మాజీ ఎంపీపీ రత్నం కాంగ్రెస్ నాయకులు మాక్సూద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ ఎస్సి సెల్ అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు..
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం మినిగోనిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ వెంకటయ్య, మైబు , శ్రీను, గోవర్ధన్ రెడ్డి , మరియు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు బీజేపీ కార్యకర్తలు శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరామన్నారు. వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తామన్నారు.
ఏడునూతుల నిషిధర్ రెడ్డి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని మంజు నగర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ” జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ హాజరయ్యారు.ముందుగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ..పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సాధారణ ప్రజల కోసం, సమాజంలో చివరి అంచున ఉన్నవారి కోసం ఆలోచించిన మహానుభావుడు,ఆయన అంత్యోదయ తత్వం ‘చివరి వ్యక్తి అభ్యున్నతి’ అనే ఆలోచన నేటికీ దేశానికి మార్గదర్శనం చేస్తోంది. ప్రతి కార్యకర్త ఆయన బాటలో నడవాలి.ఆయన ఆలోచనలే మన బీజేపీకి బలమైన పునాది” అని పేర్కొన్నారు. తరువాత జరిగిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ… భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 11 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని,ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత గౌరవాన్ని సంపాదించిందని, పేదలకు సంక్షేమ పథకాల రూపంలో మోదీ చేస్తున్న సహాయం కోట్లాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తోందని,ఉజ్వల యోజన,జనధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, హర ఘర్ విద్యుత్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. మోదీ 11 ఏళ్ల పాలనలో పారదర్శకత, అవినీతి రహితత, సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధానంగా నిలిచాయి అని వివరించారు.సింగరేణి కార్మికులు రాత్రి పగలు కష్టపడి దేశానికి “బొగ్గు సరఫరా చేస్తున్నారు.వారి శ్రమ వల్ల పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తోంది, భద్రత, వైద్యం, గృహ వసతి, బోనస్ మరియు పింఛన్ సౌకర్యాలను అందిస్తోంది. భవిష్యత్తులో కూడా వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ “దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గారి ఆలోచనలను ప్రతి కార్యకర్త జీవన సూత్రంగా తీసుకోవాలి. బీజేపీ యొక్క ప్రతి అడుగు పేదల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే మనం కూడా ప్రజలతో మమేకమై కష్టనష్టాలను అర్థం చేసుకుంటూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య,పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి లు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, తాటికొండ రవి కిరణ్,జిల్లా కార్యదర్శి భూక్య భాగ్య,జిల్లా మీడియా కన్వీనర్ మునెందర్,కార్యాలయ కార్యదర్శి తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలసాని తిరుపతిరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్,అర్బన్ అధ్యక్షులు గీస సంపత్, రూరల్ అధ్యక్షులు పులిగుజ్జు రాజు నాయకులు సునీత,కొమరన్న, శివకృష్ణ తదితరులున్నారు.
తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక
◆:- కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసిందన్నారు . శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంచనంగా ప్రారంభించారు.
లాంచ్ చేసిన పథకాలు:
ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు ₹50,000 సాయం.రేవంతన్నా కా సహారా – మిస్కీన్ల కోసం ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి రూ.లక్ష గ్రాంట్. రిజిస్ట్రేషన్ల వివరాలు: ప్రారంభం : 19-09-2025 చివరి తేదీ :06-10-2025 ఆన్లైన్ : TGOBMMS 3 (tgobmms.cgg.gov.in) ఆఫ్లైన్ దరఖాస్తులు చేసుకోగలరని కోరిన మాజీ ఉపసర్పంచ్ గోపాల్ అన్నారు,
లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి(11వ వార్డు)లో జరిగిన లంబాడీల తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెళ్లికాని యువతులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులేసి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ…ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకువెళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కుంట పల్లి గ్రామ వాసులు పాల్గొన్నారు
ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే
పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
ప్రజా పాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పై వివరించారు.
ఈ సందర్బంగా విప్ మాట్లాడారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 09/12/2023న కొలువుదీరింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది.
2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డీఆర్డీఓ, మెప్మా ఆద్వర్యంలో జిల్లాలోని ఎస్ హెచ్ జీల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7వేల 111 లక్ష్యానికి గాను ఇప్పటిదాకా 1 వెయ్యి 586 యూనిట్లను గుర్తించి 200 కోట్ల బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా రూ.68 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటిదాకా రూ. 25 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. 5వేల 691 యూనిట్లు లక్ష్యం కాగా, వెయ్యి 607 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. చేయూత పింఛన్లు జిల్లాలో లక్ష 17 వేల 370 మంది పించన్ దారులకు ప్రతి నెలా రూ.25 కోట్ల 73 లక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎస్ హెచ్ జీ మహిళలకు చీరలు: సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షల 7౦ వేల మందికి పైగా ఉన్న ఎస్ హెచ్ జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగినది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది. సన్న బియ్యం పంపిణీ: పీడీఎస్ వ్యవస్థ పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతున్నది. లక్ష 77 వేల 851 కుటుంబాలు, 5 లక్షల 35 వేల 920 మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది.నూతన రేషన్ కార్డులు: జిల్లాలో కొత్తగా 14 వేల 75 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 3౦ వేల 376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్చడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. రైతు రుణమాఫీ: గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు, రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి.. కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. “ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో 393 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాము. రైతు భరోసా కింద లక్ష 26వేల 278 మంది రైతులకు.. 149 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 45లక్షల రుణ మాఫీ చేశాము. రాష్ట్రంలో 7 వేల 178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతున్నది. దీని కోసం రూ.16 వేల 691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లించడం జరుగుతున్నది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష 13 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇండ్లు: తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి రూ.22 వేల 500 కోట్లు వెచ్చించడం జరుగుతున్నది. జిల్లాలో 12 వేల 623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 7 వేల 927 ఇండ్లు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4వేల 696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. 10వేల 234 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5 వేల 305 గృహాలకు లబ్దిదారులు ముగ్గు పోయడం జరిగింది. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 38 కోట్లకు పైగా నేరుగా జమ చేసింది. మహాలక్ష్మీ పథకం: ద్వారా ఆడబిడ్డలకు రూ.6 వేల 790 కోట్లు ఆదా అయ్యింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా రూ. 46 వేల 689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 315 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. గృహజ్యోతి పథకం: ద్వారా మార్చి 2024 నుంచి ఆగస్ట్ 2025 వరకు మొత్తం 17 లక్షల 52 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ. 67 కోట్ల 70 లక్షల లబ్ది చేకూర్చాము. జెగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్ (వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎన్.పీ.డీ.సీ.ఎల్ కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వైద్యారోగ్య శాఖ : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యారోగ్యంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచగా, డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ఆగస్ట్ 2025 వరకు 24 వేల 154 మంది రోగులు రూ. 62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది. జిల్లాలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటిదాకా 4వేల 795 చెక్కుల ద్వారా రూ. 16కోట్ల 85 లక్షలు, అలాగే 275 ఎల్ఓసీల ద్వారా రూ. 5 కోట్ల సాయం అందజేయడం జరిగింది. మత్స్య శాఖ: ధర్తి అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన రుద్రంగి, వీర్నపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్దిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ: యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం.ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీ.జీ.పీ.ఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. పోటీ పరీక్షల్లో రాణించేలా: జిల్లాలోని విద్యార్థులు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ-జేఈఈ, నీట్-యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతున్నది. మొత్తం 13 వేల 564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. పనుల జాతర: జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో రూపాయలు 7 కోట్ల 80 లక్షల విలువ గల 258 పనులు చేపట్టడం జరుగుతున్నది.చివరి ఆయకట్టుకు నీరు అందించేలా: తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బహుజనుల రాజకీయాల ఐక్యతే అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యానికి విరుగుడు… పొన్నం బిక్షపతి గౌడ్ BSP జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మొగులపల్లి నేటి ధాత్రి మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గారు హాజరై మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతూ అందకారానికి దగ్గర చేస్తున్నాయని విద్య- వైద్యం- గూడు కనీస అవసరాలను తీర్చలేని ప్రభుత్వాలను రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో వారి దొంగ నాటకాలను అరికట్టాలని 42% BC రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న బహుజన్ సమాజ్ పార్టీనీ ఆదరించాలని పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా మొగుళ్లపల్లి మండల అధ్యక్షులుగా కళాశ చిరంజీవి మొగుళ్లపల్లి మండల ఉపాధ్యక్షులుగా మురారి మనోజ్ గార్లను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బొచ్చు తిరుపతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా EC మెంబర్ భూపాలపల్లి నియోజకవర్గ కార్యదర్శి పుల్యాల భగత్ మరియు తదితరులు పాల్గొన్నారు
త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం
◆:- యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక సంస్థ ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి గారికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ వినతిపత్రం త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ కోరారు. సంగారెడ్డి పట్టణంలోని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ తో పాటు మున్సిపల్ ఎన్నికలలో 20శాతం కోట యువతకు కేటాయించాలన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. నిర్మల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. వివిధ నియోజకవర్గం అధ్యక్షులు నవీన్, నాగిరెడ్డి, వెంకట్ జింగ, సిద్ధారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, వసిం, ప్రధాన కార్యదర్శులు అక్బర్, శ్రీహరి గౌడ్, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్
వనపర్తి నేటిదాత్రి .
గత ప్రభుత్వం లో 8.19 లక్షల కోట్ల అప్పుల భారం చేసి న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ లను అమలు చేస్తున్నమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ ములో మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభిం చారు ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూన్నామను రాష్ట్రంలో అభివృద్ధి, ఆపలే దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు జేరుగు తున్నదని అన్నారు అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండరు, రూ. 21 వేల కోట్లతో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ, గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 10 వేల చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం 12 వేల చొప్పున ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం వారి వేస్తే ఉరి అని అంటే ఈ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డుల్లో పెళ్ళైన, పుట్టిన వారి పేర్లు కొత్తగా చేర్చడం జరిగిందన్నారు. గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని, కనీసం సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టిన ఐదు సంవత్సరాల్లో 10 లక్షల ఇళ్లు కట్టేవారని కానీ వారికి పేదల సంక్షేమం కంటే కమిషన్లే ముఖ్యమని కాలేశ్వరం కట్టారని దుయ్యబట్టారు. ప్రజాపాలనలో తొలి విడతగా రూ. 22,500 కోట్ల నిధులతో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు . ప్రతి సోమవారం రాష్ల్ వనపర్తి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభి సేవలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు రాష్ట్రంలోని 200 యూనిట్ల లో పు ఉచిత విద్యుత్ వనపర్తి జిల్లా లో 6127 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మహిళల కు ఉచిత బస్ ప్రయాణం రైతులకు భూ భారతి చట్టం అనేక అభివృద్ధి పనులు చేస్తూ న్న మని మంత్రి చెప్పారు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వనపర్తి నియోజకవర్గ ని కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న రాని కొనియాడారుమంగంపల్లిలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు , మంత్రులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి వ్యక్తిగతంగా ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారులకు బట్టలు పెట్టారు డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం. ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు. జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు. స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం
◆:- యువ నాయకులు మహ్మద్ హఫీస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల చిల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మహ్మద్ హఫీస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 18 నెలలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్న లను పొందింది అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో, పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారన్నారు. జరగబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి,రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పంచాయతీలు, వార్డులలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ ఓట్లను అడిగి ఎంపీటీసీ జెడ్పిటిసిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
చర్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు
నేటి ధాత్రి చర్ల
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా చర్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి భద్రాచలం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గా ప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు వైయస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి భారత దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రజలకు అందించారని అన్నారు ప్రజలకు చేరువుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న మహోన్నత వ్యక్తి అన్నారు కాంగ్రెస్ పార్టీ చర్ల మండల యువ నాయకులు విజయ్ నాయుడు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకం విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టిన చిరస్మరణీయుడు అని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండెపుడి భాస్కరరావు మాట్లాడుతూ రైతులకు సాగునీటి కాలువలను పంట పొలాలకు అందించి సాగునీటిని అందించిన మహోన్నత వ్యక్తి అన్నారు మాజీ ఎంపీటీసీ చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మడకం పద్మ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మహోన్నత నాయకుడు వైఎస్సార్ అని అన్నారు చర్ల ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ సాల్మన్ రాజు మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళను ఇచ్చి పేద ప్రజలకు గూడును కల్పించిన మహనీయ దేవుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో చర్ల కాంగ్రెస్ నాయకులు గుండెపుడి భాస్కరరావు ఎస్సి సెల్ మండల ప్రెసిడెంట్ సల్మాన్ రాజ్ సీనియర్ కాంగ్రెస్ యువ నాయకులు విజయ్ నాయుడు సత్తిబాబు మాజీ ఎంపీటీసీ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మడకం పద్మ అంజి బబు మేడి రమేష్ మైపా జోగారావు చింతయ్య మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
అధికారం చేపట్టిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. సోమవారము స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. హనుమంతరావు పటేల్ మాట్లాడుతూ..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నామన్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి రేషన్ కార్డులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ మల్లయ్య స్వామి సంగన్న పటేల్, మల్లికార్జున పాటిల్, అష్రఫ్ అలీ, లియకత్ అలీ, రాజేందర్ సింగ్, డీలర్ సంగన్న, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫక్రోద్దిన్, అనిల్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.