మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య..

మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

 

 

 

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ (Telangana) అటు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ (Panchayat Elections) మరోసారి కుమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో ఉన్న తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాలు తెరపైకి వచ్చాయి.
రెండు ప్రభుత్వాలు ఇక్కడ ఇంటింటికీ రేషన్ కార్డులు ఇచ్చాయి. రేషన్ షాపులూ ఏర్పాటు చేశాయి. రెండు ప్రభుత్వాలు పాఠశాలలను ఏర్పాటు చేశాయి. ఇక్కడ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ఓటరు ఐడీ కార్డులను ఓటర్లు పొంది ఉన్నారు.ఆ గ్రామాల నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆ గ్రామాల్లో అన్నీ డబుల్ ధమాకే..

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వివాదస్పందంగా మారిన ఆ 12 గ్రామాల ప్రజలకు అన్నీ డబుల్ ధమాకే. రెండురెండే ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మొదలుకుని పాఠశాలలు, రహదారులు, తాగు నీటి పథకాల వరకు అన్ని రెండు మంజూరు చేస్తూ వస్తున్నాయి. ఒకే గ్రామానికి ఇద్దరు సర్పం‌చ్‌లు, రెండు పాఠశాలలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నట్లుగా అటెండర్‌ను మొదలుకుని ఐఏఎస్ దాకా అన్నీ డబుల్ ధమాకే. ఆ ఊర్లలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఇంకా విచిత్రమేమిటంటే తెలంగాణ నుంచి సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తే మహారాష్ట్ర ఎన్నికలు రాగానే ప్లేట్ ఫిరాయించి మహారాష్ట్ర నుంచి ఎన్నిక కావడం ఈ గ్రామాల విశిష్టత.

జీవితంపై విరక్తితో ఆత్మహత్య…

జీవితంపై విరక్తితో ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నవంబర్ 23: జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గొయి లో చోటు చేసుకున్నట్లు ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం ఎల్గొయి లావణ్య భర్త వెంకట్ అనే మహిళ తన కూతురు అనారోగ్యం పాలై న్యూమోనియా వ్యాధికి హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందడంతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తన సొంత కూతురు చనిపోయిందన్న బాధతో మానసికంగా కృంగిపోయి జీవితం పై విరక్తితో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి భర్త బోయిని వెంకట్ తండ్రి విట్టల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవా పంచనమనిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పటేల్ తెలిపారు.

ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు..

ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు

 

సన్న బియ్యం కంపెనీలో 90% ఖర్చును భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ప్రధానమంత్రి గారి ఫోటో రేషన్ కార్డు పై లేకపోవడం విడ్డూరం
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట.వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో విచిత్రంగా రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వం పై మహేందర్రెడ్డి విమర్శలు చేశారు.

ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల పోటో ఏంటి. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తి రేషన్ కార్డ్ పై తన ఫోటో ముద్రించుకొని ప్రజలకు ఎలా ఇస్తాడు. అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార కుందూరు మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.

దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇలా తలతిక్క పనులు చేయకుండా చూడాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. అని మహేందర్ రెడ్డి అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T152213.716.wav?_=1

 

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

చిట్యాల నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని ముచినిపర్తి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు మంజూరు ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం రైతులకు రుణమాఫీ మహిళల ఖర్చుతో బస్సు ప్రయాణం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిందని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలుగా చేసి రైతులను ప్రజలను మోసం చేసిందన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాధికారం లోకి వచ్చిన వెంటనే భూపాలపల్లి నియోజకవర్గంలో 3500 మంజూరు చేశామని ప్రస్తుతం గృహప్రవేశాలకు తయారవుతున్నాయని చిట్యాల మండలంలో 430 ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పటికి 290 ఇండ్లు పూర్తికా వస్తున్నాయని మిగతా ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో పేదవాడి ఇంటికల నిజమైందని అన్నారు, అనంతరం ఎమ్మెల్యే కోల కృష్ణవేణి దంపతుల నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహ బంతి భోజనం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూ ట్ల తిరుపతి, మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, హౌసింగ్ పీడీ ఏఈ తాసిల్దార్ ఇమామ్ బాబా కాంగ్రెస్ మండల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్పాయిపల్లి గ్రామం అభివృద్ధి లో ముందంజ…

అప్పాయిపల్లి గ్రామం అభివృద్ధి లో ముందంజ

ఎమ్మెల్యే మెగారెడ్డి సహకారముతో

వనపర్తి నేటిదాత్రి.

 

వనపర్తి నియోజకవర్గం అప్పాయిపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి సహకారంతో 118 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని అప్పాయిపల్లి మాజి ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ రావ్ నేటిదాత్రి దినపత్రిక విలేకరితో చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఇండ్లు పూర్తి కావడానికి నిర్మాణ దిశలో ఉన్నాయని ఆనంద్ రావు చెప్పారు ఒక ఇందిరమ్మ ఇల్లు వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తెలుగు లక్ష్మి కి చెందిన నూతన గృహప్రవేశం చేశారని ఆయన పేర్కొన్నారు అప్పాయిపల్లి గ్రామంలో నిరుపేదలకు రేషన్ కార్డులు ఒంటరి మహిళలకు వితంతువులకు పింఛన్లు ఇప్పిచ్చామని ఆయన తెలిపారు గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిది కొరకు అప్లై చేసుకున్న లబ్దిదారులకు ఎల్ ఓ సి చెక్కులు ఎమ్మెల్యే మెగారెడ్డి ద్వారా ఇప్పించామని ఆయన పేర్కొన్నారు గ్రామంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కరాని కి కృషి చేస్తానని ఆయన తెలిపారు . కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మెగా రెడ్డి సహకారంతో అప్పయ్యపల్లి శివారులో ప్రభుత్వం ద్వారా రవాణా కార్యలయం కార్యాలయానికి స్థలం కేటాయించారని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వపరంగా బడ్జెట్ 9 కోట్ల 50 లక్షలు మంజూరు ఆయన పేర్కొన్నారు ఈమేరకు మాజి ఉప సర్పంచ్ ఆనంద్ రావు అప్పాయిపల్లి గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఎంపీ మల్లు రవికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T135534.081-1.wav?_=2

 

నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించండి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి 94వ డివిజన్ లోని సీతానగర్, వినోభానగర్, ఐక్యమత్యనగర్, ద్వారకానగర్ మారుతినగర్ లలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదర్శభావాలు కలిగిన వ్యక్తి నవీన్ యాదవ్ అని, అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే జూబ్లీహిల్స్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లలో మేము చేసిన మంచి పనులు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామని, బీఆర్ఎస్ మాత్రం అసత్య ప్రచారాలు చేస్తూ, సానుభూతితో ఓట్లు అడుగుతోందని ఎమ్మెల్యే జిఎస్సార్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది….

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది

#పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం.

#అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.

#వెంకటాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన ….

#రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు.
పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని మంత్రి వివరించారు.
ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్…

బాకీకార్డులతో కొత్త నాటకానికి తెరలేపిన బీఆర్ఎస్

పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం

గాడిన పెడ్తున్న ప్రభుత్వం పై విమర్శలు సిగ్గుచేటు

కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త నాటకా నికి తెరలేపారని కాంగ్రెస్ మం డల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి విమర్శిం చారు. శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బాకీ కార్డులు పంపిణీ చేసిన నేప థ్యంలో సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి పిఎసిఎస్ భవన నిర్మాణం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భూ మి పూజ చేసిన శిలాఫలకం వరకు పాదయాత్ర చేసి అట్టి శిలాఫలకం వద్ద పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించారు .

తదనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయాలని ఉద్దేశంతోటే ఇస్తారన్నారు మిగులు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశా రని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్న క్రమంలో పాలనలో కనీసం రెండేళ్లు పూర్తికాకుండానే తమ ఉనికి కోసం బురద జల్లే ప్రయ త్నం చేస్తున్నారని అన్నారు. 22 నెలల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు రుణ మాఫీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్, సుమారు 60 వేల ఉద్యోగ కల్పన, రేషన్ కార్డుల పంపిణీ హామీలు అమలు అవుతున్నాయని, మేనిఫెస్టోలో లేని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం సైతం అమలు జరుతుందని, ఈ పథకాలు బీఆర్ఎస్ నాయకులకు కూడా అమలయ్యాయని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ బాకీలు:

పదేళ్లు అధికారంలో ఉండి ఇంటికొక ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ లు, కేజీ టు పీజీ విద్య, పోడు భూముల పట్టాలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ముస్లిం లకు రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణరెడ్డి బాకి

శాయంపేట మండలానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎంతో బాకి పడ్డారు. కాంగ్రెస్ కార్య కర్తల కష్టంతో గెలిచి,వారి సతీమణికి పదవితెచ్చుకు న్నారే తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పిఎసిఎస్ భవనానికి శిలాఫలకం వేసి నిధులున్నా కట్టించలేని అసమర్థులు. పిఎసిఎస్ లో మాజీ పాలకవర్గ సభ్యులు అయిన గండ్ర వెంకట రమణా రెడ్డి అనుచరులు 15 లక్షల రూపాయల అవినీతికి పాల్పడి సొసైటీకి బాకీ పడితే అవి రికవరీ చేయించలేని అసమర్ధ నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి . అట్టి రూపాయ లను వెంటనే రికవరీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లా డాలని మేము డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన వారికి 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రొసీ డింగ్స్ తెచ్చి కట్టిస్తా అన్నారు. కట్టించారా!డ్రైనేజీలు లేని రోడ్డు వేసి స్థానికులను ఇబ్బం దులు పెట్టడం వాస్తవం కాదా!సుమారు 200 డబుల్ బెడ్రూ మ్ లకు శిలాఫలకాలు వేశారు కట్టించారా!జిపి భవనాలకు శిలాఫలకాలు వేశారు కట్టించారా.మండల ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే అంబులెన్స్ కావాలని అడిగితే డీజిల్ ఎవరు పొయ్యాలి. ఎవరు నడపాలి.అని అవహేళనగా మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీటికి సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులు పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T130338.591.wav?_=3

కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి బి1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

వివేక్ కామెంట్స్

గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు,అక్రమ అరెస్ట్ లతో కేసీఆర్ రాచరిక పాలన సాగించిండు.

60 వేల కోట్లు అప్పును 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చిండు.

8 లక్షల కోట్ల అప్పు కు 5 వేల కోట్ల వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుంది.

కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది.

గత ప్రభుత్వంలో బి ఆర్ ఎస్ లీడర్ల కే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారు.

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను.

9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యానికి పంపిణీ చేస్తున్నాం.

 

గత పది యేండ్ల లో ఒక్క రేషన్ కార్డు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.

కొత్త గనులు రావాలి..కొత్త గనులపై సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు.

వి ఆర్ ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల ఆక్షన్ లో పాల్గొనకుండా చేసింది

దీంతో ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.

గతం లో మందమర్రి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉండేవి.

కానీ నేను వచ్చాక 50 కోట్ల రూపాయల తో అభివృద్ధి పను జరుగుతున్నాయి

కమిషన్ల కోసమే గత ప్రభుత్వం పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించింది.

అమృత్ స్కిం తో మందమర్రి ప్రజల కు శాశ్వత మంచినీటి సౌకర్యం కలుగుతుంది.

42 వేల కోట్ల రూపాయల తో మిషన్ భగీరథ పథకాన్నీ తీసుకు వచ్చి ఒక్క ఇంటికి చుక్క త్రాగు నీరు అందించలేదు.

మిషన్ భగీరథ పథకం అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో వేల కోట్లు దోచుకుంది.

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-62-1.wav?_=4

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్

వనపర్తి నేటిదాత్రి .

గత ప్రభుత్వం లో 8.19 లక్షల కోట్ల అప్పుల భారం చేసి న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ లను అమలు చేస్తున్నమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ ములో మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ప్రారంభిం చారు ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూన్నామను రాష్ట్రంలో అభివృద్ధి, ఆపలే దని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు జేరుగు తున్నదని అన్నారు
అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత శభాస్ అని మెప్పులు పొందుతున్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండరు, రూ. 21 వేల కోట్లతో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ, గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు 10 వేల చొప్పున రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం 12 వేల చొప్పున ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం వారి వేస్తే ఉరి అని అంటే ఈ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పాత రేషన్ కార్డుల్లో పెళ్ళైన, పుట్టిన వారి పేర్లు కొత్తగా చేర్చడం జరిగిందన్నారు.
గత పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని, కనీసం సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టిన ఐదు సంవత్సరాల్లో 10 లక్షల ఇళ్లు కట్టేవారని కానీ వారికి పేదల సంక్షేమం కంటే కమిషన్లే ముఖ్యమని కాలేశ్వరం కట్టారని దుయ్యబట్టారు.
ప్రజాపాలనలో తొలి విడతగా రూ. 22,500 కోట్ల నిధులతో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు . ప్రతి సోమవారం రాష్ల్
వనపర్తి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభి సేవలపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు
రాష్ట్రంలోని 200 యూనిట్ల లో పు ఉచిత విద్యుత్ వనపర్తి జిల్లా లో 6127 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మహిళల కు ఉచిత బస్ ప్రయాణం రైతులకు భూ భారతి చట్టం అనేక అభివృద్ధి పనులు చేస్తూ న్న మని మంత్రి చెప్పారు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వనపర్తి నియోజకవర్గ ని కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న రాని కొనియాడారుమంగంపల్లిలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు , మంత్రులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి వ్యక్తిగతంగా ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారులకు బట్టలు పెట్టారు డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ యాదయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T143950.186.wav?_=5

 

ప్రజా ప్రభుత్వంలో అందరికీ రేషన్ కార్డులు

◆:- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాక్సుధ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T120257.493-1.wav?_=6

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బుధవారము గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో
పెద్ది శ్రీనివాస్ రెడ్డి అమృత్ బాలయ్య బసిరెడ్డి ప్రవీణ్ డీలర్ సత్తార్ తదితరులు లబ్ధి దారులు
పాల్గొన్నారు

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T124959.968.wav?_=7

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

ట్రాన్స్ జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలిసి టెండర్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ ల సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు జారీతో పాటు ఆధార్ కార్డులో పేరు, జెండర్ మార్చుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ట్రాన్స్ జెండర్ లందరికీ గుర్తింపు కార్డులను, రేషన్ కార్డులను అందజేస్తామన్నారు. ట్రాన్స్ జెండాలలో వికలాంగులకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు కి చర్యలు చేపడతామన్నారు.ట్రాన్స్ జెండర్లకు కార్మిక శాఖ ద్వారా లేబర్ కార్డులను అందిస్తామన్నారు.ఎంజిఎం ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ లకు వారంలో ఒకసారి చికిత్స జరిగేలా ప్రత్యేక ఓపిని కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ లకు తెలిపారు. స్వశక్తి మహిళా తరహాలో ట్రాన్స్ జెండర్లు సంఘాలు ఏర్పడితే వ్యాపార యూనిట్లకు ఏర్పాటు రుణాలు అందిస్తామన్నారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ, డి ఆర్ డి ఓ రామిరెడ్డి, డి డబ్ల్యు ఓ రాజమణి, ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ అడ్వైజర్ ఈవి శ్రీనివాసరావు, ట్రాన్స్ జెండర్ ల రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, సభ్యులు అశ్విని, రీమిష, పూర్ణిమ రెడ్డి, నక్షత్ర, త్రిపుర,శాస్త్రి,జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-78-3.wav?_=8

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామ ప్రజా సమస్యలపై ఆ గ్రామ సిపిఎం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు.వృద్ధాప్య పింఛన్స్, కరెంట్ బిల్లు,రేషన్ కార్డు,గ్యాస్ బిల్లు, జాబ్ కార్డు,డ్రైనేజీ,తాగునీటి సమస్యల పట్ల గ్రామస్తులు సిపిఎం నాయకులకు విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య,మండల కార్యదర్శి బోళ్ల సాంబయ్య,మండల నాయకులు పుచ్చకాయల నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పొన్నం రాజు, గ్రామ నాయకులు మహేందర్ రెడ్డి, మాదాసి శీను,శ్రీకాంత్,రమేష్, బత్తిని స్వామి, కొండబత్తుల నరసింహరాములు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సురేఖ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-56-3.wav?_=9

అభివృద్ధి–సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం : మంత్రి కొండా సురేఖ

వరంగల్, నేటిధాత్రి.

అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొత్తం రూ. 5.87 కోట్లు వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ నిధులు, జనరల్ ఫండ్ మరియు ఎస్ఎఫ్సి పథకాల కింద రూ. 4.87 కోట్ల విలువైన పలు పనులను ప్రారంభించారు. వీటిలో బస్తీ దవాఖాన, బీఆర్ నగర్లో సీసీ రోడ్లు, ఎన్ఎన్ నగర్, జ్యోతినగర్లో సీసీ రోడ్లు, అంబేడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బట్టలబజార్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కిచెన్ షెడ్, రంగశాయిపేటలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం ఉన్నాయి. అదనంగా ఆర్అండ్బి శాఖ కింద రూ.

Minister Konda Surekha

కోటి వ్యయం తో మషూఖ్ రబ్బానీ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదనంగా, బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి, మేయర్, జిల్లా కలెక్టర్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్తో కలసి మధ్యాహ్న భోజనం వడ్డించారు. తరువాత కరీమాబాద్ పరపతి సంఘ భవనంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలో 2690 కొత్త కార్డులను జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6815 రేషన్ కార్డులు మంజూరు, వాటిలో 26766 కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ….

Minister Konda Surekha

ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోందని, గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నారని,
లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అదనంగా, జిల్లాలోని విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రామకృష్ణ మిషన్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో 123 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం ప్రారంభించామన్నారు.

Minister Konda Surekha

మొదటి విడతలో కరీమాబాద్ సహా 55 పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో సమగ్ర అభివృద్ధి చేయడానికి మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ముంపు నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.నియోజకవర్గంలో అర్హులైన పేదల కోసం 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు, మరో 3500 ఇళ్లు ఈ సంవత్సరం కేటాయించనున్నట్టు వెల్లడించారు. దేవాదాయ శాఖ ద్వారా జిల్లాలోని అన్ని దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, రెవెన్యూ అధికారులు, బల్దియా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Minister Konda Surekha

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

పేదలకు లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

ప్రతి పేదలకు అన్ని విధాలుగా లబ్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు తొర్రూరు పట్టణంలోని రేషన్ షాప్ లో నూతన లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకొని ఆహార భద్రతతో పాటు రేషన్ కార్డులను అందించిందన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి,గుండాల నర్సయ్య,జలకం శ్రీనివాస్, వెంకటాచారి,తాళ్లపల్లి బిక్షం గౌడ్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి, నడిగడ్డ శ్రీనివాస్,కల్లూరి కుషాల్, రాజేష్ యాదవ్, జింజిరాల మనోహర్,ముద్దసాని సురేష్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన, జలీల్,గూడేల్లి రామచంద్రయ్య, జలగం వెంకన్న,మహేష్ యాదవ్, యశోద,దేవేందర్, రేషన్ షాప్ డీలర్లు సోమిరెడ్డి, సోమయ్య, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు మురళి, అజయ్, నరేష్, సురేష్, బ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-64-1.wav?_=10

“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”

ఊర్కొండలో రేషన్ కార్డుల పంపిణీ.

రూ.12 లక్షలతో అంగన్వాడి భవనాలు మంజూరు.

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల నేటి ధాత్రి

రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. “మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం.

MLA Janampally Anirudh Reddy.

పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలకం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ మంజూరు చేయలేదని విమర్శిస్తూ, అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా.. దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. “మా పాలనలో ఎవరూ ఆకలితో ఉండరని, ప్రతి అర్హుడికి సకాలంలో ప్రభుత్వం అందించే లబ్ధి చేరుస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, 1619 పాత రేషన్ కార్డుల్లో ఆడిషన్స్ పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే గుడిగానిపల్లి, మాదారం గ్రామాలకు రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనాలు మంజూరు అయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ లసమావేశం….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T122230.511.wav?_=11

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ లసమావేశం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లి. మల్లాపూర్ గ్రామంలో. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖల పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు గురించి అవగాహన కల్పిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక అభ్యర్థులని గెలిపించుకోవాలని ప్రచారం చేస్తూ ప్రభుత్వం వచ్చిన 18 నెలల లోపే. ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారంటీలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి. ఇందులో ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీ.10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ తో పాటు 18 నెలలలో ప్రభుత్వం చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను. అందించారని వివరిస్తూ ప్రజలకు. అవగాహన చేయడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని. అభివృద్ధిలో ముందు ఉంచుతూ. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలను అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. జిల్లా సీనియర్ నాయకులు ఆఖరి బాలరాజు.మల్లేష్ యాదవ్. ఎడ్ల తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.!

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో గ్రామసభలు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download.wav?_=12

తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే స్థానిక సంస్థలఎన్నికల లో.కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు పునాదులు. అని. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ప్రవేశపెట్టిన పథకాలే స్థానిక అభ్యర్థులను గెలిపిస్తాయని దానికి ఇందిరమ్మ ఇండ్లు కానీ. సన్న బియ్యం గాని. రేషన్ కార్డులు గానీ. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కానీ. రైతు రుణమాఫీ కానీ. మహిళలకు పావలా వడ్డీరుణాలు గాని
. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 18 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పిస్తూ ఇక ముందు కూడా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కంటే. ఎక్కువగా అమలు చేస్తారని. తంగళ్ళపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తూ. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని రాబోయే కాలంలో మరింత అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలా. ప్రజలు తమ ఓటు హక్కుతో స్థానిక అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగిల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి.లింగాల గుగ్గిళ్ళ భరత్
. బాలరాజ్ కోల మాజీ సర్పంచ్ బానయ్య.జలంధర్ రెడ్డి. సదానందం. శ్రీరామ్. శ్రీనివాస్. అంజయ్య. రాములు. లావణ్య. ప్రమీల. తంగళ్ళపల్లి మండల. ప్రతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version