అంబేద్కర్ కాలనీ15వ వార్డులో రేషన్ కార్డుల పంపిణీ..

సిరిసిల్ల అంబేద్కర్ కాలనీ15వ వార్డులో రేషన్ కార్డుల పంపిణీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్, 15వ వార్డు కాలనీలోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకునూరి బాలరాజు ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగినది. బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలందరికీ ఇలాంటి రేషన్ కార్డులు ఇవ్వ లేదు, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలందరికి ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరమని అంతే కాకుండా పేదకుటుంబలకు రేషన్ షాపులలో అందించే సన్న బియ్యం తింటున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేదురి లక్ష్మణ్,గొల్లపల్లి పరశురాములు,నక్క నరసయ్య, కొమ్ము త్యాగరాజు, ఆకునూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version