గుండంపల్లి మల్లాపూర్ రోడ్డుకు సంబంధించిన పనులను ప్రారంభించిన అధికారులు మల్లాపూర్ మే 22 నేటి దాత్రి
గుండంపల్లి – మల్లాపూర్ మధ్యలో పి ఆర్ రోడ్డుకు సంబంధించిన డిమార్కేషన్ ఎన్యుమరేషన్ పనులను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య , పి ఆర్ ఏ ఈ రాఘసుధ ఫారెస్ట్ ఆఫీసర్ సాయిరామ్ , వీడీసీ గంగాధర్, రాజేందర్ , గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.” దీనికి సహకరించిన జువ్వాడి నర్సింగారావు, కృష్ణారావు కి ఫారెస్ట్ అధికారులకు గుండంపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
కల్వకుర్తి మున్సిపాలిటీలోని 15వ వార్డులో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరైనా సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ , వైస్ చైర్మన్ శానావాజ్ ఖాన్,15కౌన్సిలర్ కుడుముల అష్మితా చంద్రకాంత్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు.ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుస్తకాల రాహుల్, కౌన్సిలర్ లు, కౌన్సిలర్ లు రాజేష్ కుమార్, గణేష్ యాదవ్, రమాకాంత్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, నాయకులు ఖుద్దుస్, జమ్ముల శ్రీకాంత్, శ్రీకాంత్, శివ కుమార్, పడకంటి వెంకటేష్, దున్న సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం రేగొండ మండలంలోని భాగుర్తిపేట క్రాస్ నుండి బుద్ధారం గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల నాణ్యత,వేగం గురించి అధికారులను అడిగి తెలుసుకుని,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే పనులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి స్వాగతం పలికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ వారాంతపు సంత అభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది.
సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్
# నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంత ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ శ్రీకారం చుట్టారు. సంత ప్రాంగణంలో జంగిల్ క్లియరింగ్, అంతర్గత రహదారుల నిర్మాణం, స్థల సమతలీకరణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హరిప్రసాద్ మాట్లాడుతు ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతున్న సంతను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, వ్యాపారులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుడియా తిరుమల్, జిల్లా కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, పట్టణ అధ్యక్షుడు ఈదునూరు సాయికృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొనిజేటి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్, గ్రామ కార్యదర్శి దయ్యాల సదానందం, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. సంత అభివృద్ధితో స్థానిక వ్యాపారాలకు ఊతం లభిస్తుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు తో కలిసి సందర్శించి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన 63, 163జి రహదారుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రూ.49 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు పనుల శంకుస్థాపనలు*
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
*మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రోడ్ల అభివృద్ధి లక్ష్యంగా సిసి రోడ్ల పనులను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.పట్టణంలో 25,27వ వార్డులలో రూ.49 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు నిర్మాణం పనులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపనలు చేశారు.గారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పెండెం రామనంద్, ఓర్సు తిరుపతి,బాణోతు లక్ష్మణ్,చింతల సాంబరెడ్డి,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..
హన్మకొండ, నేటిధాత్రి:
ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరొక ముందడుగు పడింది.శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కొత్తూరులో రూ.30 లక్షల వ్యయంతో, అలాగే 49వ డివిజన్ జూలైవాడా, రెవెన్యూ కాలనీల్లో రూ.1.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాల పరంగా పూర్తిగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లు బాగుంటే ప్రజల దైనందిన జీవితం సులభమవుతుందని, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా సైడ్ డ్రైనేజీ పనులు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పనులు చేపడతామని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రజల సహకారంతోనే సాఫీగా సాగుతాయని, అందరూ భాగస్వాములై పనుల పురోగతిని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
వాసవి సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ వనపర్తి నేటిదాత్రి .
వాసవి సేవా సమితి అద్యర్యము లో ముద్రించి న నూతన సంవత్సరం క్యాలెండర్ ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో శ్రీవాసవి సేవ సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి రైస్ మిల్లర్ భానూరు నాగేంద్రం పూరి బాల్ రాజు మారం బాలీశ్వరయ్య తూనికల కొలతల శాఖ ఉద్యోగి స్వామి నీలేష్ తదితరులు పాల్గొన్నారని పూరి సురేష్ శెట్టి తెలిపారు
90 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం కేంద్రములో శనివారం రోజున 90 ల క్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అందులో భాగంగానే చిట్యాల లోని వెంకట్రావుపల్లి మోడల్ స్కూల్ దగ్గర 20 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి అలాగే చిట్యాల బస్టాండ్ నుండి చలివాగు స్మశాన వాటిక వరకు సిసి రోడ్ నిర్మాణానికి 70 లక్షలతో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు , ఈ కార్యక్రమం లో ఎంపీడీవో జయశ్రీ, పంచాయితీ రాజ్ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య,jజిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు గంగధరి రవీందర్, మాజీ ఎంపిటిసి లు కట్కూరి పద్మ నరేందర్, గుర్రం తిరుపతి, కాంగ్రెస్ నాయకులు బుర్రలక్ష్మణ్ గౌడ్, చిలుముల రాజమౌళి గుర్రపు నరసయ్య, మార్కండేయ, అల్లంరాజు అల్లంరాజు శనిగరపు మొగిలి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం…
#అన్నీ డివిజన్ లలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి..
#శంకుస్థాపన చేసిన ప్రతి పని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నాం..
#ప్రజల భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి…
#నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న..
#కాజీపేట,హనుమకొండ లలో పలు డివిజన్ లలో సుమారు రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..
హన్మకొండ, నేటిధాత్రి:
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.పేర్కొన్నారు.సోమవారం రోజున శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజవర్గ పరిధిలోని 47 వ డివిజ బోడగుట్ట,31 వ డివిజన్ శాయంపేట ఎస్సీ కాలనీ,8 వ డివిజన్ గుడి బండల్ లలో సుమారు రూ.1.70 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్ లలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీలో అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.ఇప్పటికే నియోజవర్గంలోని అన్ని డివిజన్ లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.గతంలో పలు కాలనీల్లో కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న చాలా కాలనీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి జరుగుతున్నదని,రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు. బోడగుట్ట గ్రామానికి ప్రధాన రహదారి నుంచి రోడ్డు వెడల్పు చేయాలని స్థానిక ప్రజలు కోరగా సంబధిత అధికారులకు ప్రణాళికల్ని సిద్ధం చేయాలని సూచించారు. శాయంపేట దళిత కాలనీలో చాలా వరకు నూతన రోడ్లు వేశామని మిగిలిన అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు,అధికారులు ఉన్నారు.
ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా
◆-: గ్రామ అభివృద్దె తమ ఏకైక ధ్యేయం
◆-: సర్పంచ్ అభ్యర్థి నాగేందర్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈనెల 14న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఝరాసంగం మండల పరిధిలో ని బోరేగావ్ సర్పంచ్ అభ్యర్థిగా నాగేందర్ పటేల్ బరిలో నిలిచారు. సోమవారం గ్రామం లో ఇంటింటా ప్రచారం లో భాగంగా అయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు.
అంతేకాకుండా గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వార్డులలో మూరికి కాలువలు సిసి రోడ్లు కనీస వసతులు లేక .ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాడుతున్నారని అన్నారు .ప్రధాన రోడ్డు నుండి బసవేశ్వర స్వామి ఆలయం వరకు తన సొంత నిధులతో రోడ్డు వేయిస్తాను అన్నారు. రోడ్డు సౌకర్యం లేక మనుషులు మరియి పశువుల కు చాలా ఇబ్బందిగా ఉందని గెలిచిన వెంటనే రోడ్డు సౌకర్యం కల్పిస్తాను అన్నారు.
తాము ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే .కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరిగే విధంగా తాము పని చేస్తామన్నారు. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ.
ప్రజల సమస్యల ను పరిష్కరించడమే తమ ధ్యేయమని అన్నారు. కావున గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
* ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లేఖ.
జడ్చర్ల /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా నుంచి దేవుని గుట్ట తండా వరకు నిర్మించిన 1 కిలోమీటర్ బీటీ రోడ్ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీరకంతో నిర్మించడానికి కారణమైన కాంట్రాక్టర్, ఈ రోడ్డు నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కోరారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. దేవునిగుట్ట తండాలో వేసిన బీటీ రోడ్డు ఒక రోజుకే గుంతలు పడిపోవడం, చేతితో లాగితే రోడ్డుపై వేసిన బీటీ పెళ్లపెల్లలుగా రావడం, బీటీ కింద కంకర వేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణం విషయంగా తాండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలోనే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించి నాసిరకంగా వేసిన కొత్త బీటీ రోడ్ మొత్తాన్ని తీసివేసి దాని స్థానంలో పూర్తి నాణ్యత ప్రమాణంతో కొత్త రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించడం ఈ మేరకు అధికారులు నాసిరకంగా వేసిన రోడ్డు మొత్తాన్ని తీసివేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఈఈకి లేఖ రాశారు. ఈ నాసిరకం రోడ్డు కారణంగా ప్రభుత్వం అప్రదృష్ట పాలయిందని ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో బీటీ కింద వేయాల్సిన WBM కంకర లేకపోవడం, కంకర వేయకుండానే రోడ్డు వేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ నాసిరకం రోడ్డు నిర్మాణానికి కారణమైన కాంట్రాక్టర్, పర్యవేక్షించిన అధికారులు, నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు
ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.
సికింద్రాబాద్: ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్ కారిడర్ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని జాయింట్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుండి బాలంరాయ్ వరకు రహదారిని మూసివేస్తున్నామన్నారు. బాలంరాయ్ నుంచి సీటీవో జంక్షన్కు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
బాలనగర్ వైపు నుంచి పంజాగుట్ట ట్యాంక్ బండ్ వైపు వెళ్లేవారు తాడ్బంద్ మస్తాన్ కేఫ్, డైమండ్ పాయింట్ కుడివైపు మలుపు తిరిగి మడ్ఫోర్ట్, ఎన్సీసీ, జేబీఎస్, ఎస్బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. సుచిత్ర వైపు నుంచి పంజాగుట్ట, ట్యాంక్బండ్ వైపు వెళ్లే వారు సేఫ్ ఎక్స్ప్రెస్ ఎడమవైపు మలుపు తిరిగి బాపూజీనగర్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, మడ్ఫోర్ట్, ఎన్సీసీ, జేబీఎస్, ఎస్బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. ట్యాంక్బండ్ రాణిగంజ్, పంజాగుట్ట, రసూల్పురా,
సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తా
– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి
కాప్రా నేటిరాత్రి
ఉప్పల్ నియోజకవర్గంలోని సాకేత్ కాలనీ అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. బుధ వారం కాప్రా డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ లో రోడ్డు నీ అలాగే స్టీమ్ వాటర్ డ్రైన్ నీ 44 లక్ష రూపాయల నిధులతో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భైరీ నవీన్ గౌడ్, సాకేత్ కాలనీ అధ్యక్షులు జిఎస్రావు, జాయింట్ సెక్రటరీ రవీందర్రావు, కోశాధికారి చంద్రశేఖర్, రాజేశ్వర్రావు, నిరంజన్రావు, జగన్నాథరావు, శ్రీనివాసరావు, సాకేత్ స్వర్ణ అధ్యక్షులు సురేందర్రెడ్డి, కళ్యాణ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కోహిర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో మున్సిపాలిటీలో రోడ్లు, మురుగు కాలువలు, మౌలిక వసతుల నిర్మాణాలను చేపడతారు. ఈ నిధులతో ఇప్పటికే మున్సిపాలిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడతామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
బుగులోని జాతర పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
బుధవారం రేగొండ మండలం తిరుమలగిరిలో బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మెట్ల వెడల్పు , కోనేరు, మంచినీరు బావి పనులకు మంజూరి ఇవ్వడం జరిగిందని కొత్తపల్లి నుండి బుగులోని జాతరకు రోడ్డు, తిరుమలగిరి నుండీ బుగులోని జాతర వరకు రోడ్డు జగ్గయ్య పేట నుండి బుగులోని జాతర వరకు రోడ్డు నిర్మాణ పనులకు 5.5 కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగిందని ఇట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు గుత్తేదారులకు సూచించారు
అనంతరం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినారు. అనంతరం దేవాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బుగులోని జాతర చైర్మన్ గంగుల రమణ రెడ్డి భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య, ఎన్ ఎస్ ఆర్ సంస్థల అధినేత నాయినేని సంపత్ రావు పంచాయతీ రాజ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నిధులు తెచ్చే దమ్ము లేక ప్రజలను శిలాఫలకలు వేసి ఏమార్చుతున్నావ్
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ ను ఒప్పించి కొప్పుల గ్రామం నుండి పరకా ల నేషనల్ హైవే మధ్యన చలి వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్టిహెచ్డిఎఫ్ 2023-24 నుండి రూ.574 లక్షలు మరియు కొప్పుల గ్రామం నుండి పరకా ల వరకు బిటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.585 లక్షలు మం జూరు చేయించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిం చడం జరిగింది. పనులు జరుగు తుంటే వాటిని వేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సిగ్గుచేటు.నేను నిధులు తెచ్చిన అంటూ మేము వేసిన శిలా పలకాల పక్కనే శిలాఫలకాలు వేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం ఏంటని ఏద్దేవా చేసిన భూపా లపల్లి మాజీఎమ్మెల్యే మండ లంలో పర్యటించిన భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లా డుతూ జోగంపల్లి గ్రామం నుండి మైలారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు హుస్సేన్ పల్లి నుండి మైలారం వరకు వయా పెద్ద చెరువు కట్ట మీదుగా కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా పనులు చేస్తున్నారు.కాంగ్రెస్ నాయ కుల వ్యవసాయ భూమి ఉందని రోడ్డు పక్కన ఉన్న చెరువుని ఆక్రమిస్తూ రోడ్డు వేస్తున్నారు.కాంగ్రెస్ నాయకు లకు సహకరించని అధికారు లను ట్రాన్స్ఫర్ చేయిస్తూ వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు.అదే విదంగా ఎస్సిలకి సంబంధించిన స్మశాన వాటికను కూడా ఆక్రమించుకు న్నారు.అంటే అధికార పార్టీ నాయకులు ఏదీ చేసిన మాఫ్ అనే ధోరణి నడుస్తుంది. కావున ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం కొప్పుల గ్రామంలో వేసిన శిలా ఫలకాలను చూసి శిలాఫల కాల మోజులో ప్రజలను ఏమార్చుతున్నారు అంటూ చురకలు అంటించాడు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు. గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు
బిటిరహదారి లేక బత్తినపల్లి గ్రామ ప్రజల అవస్థలు వర్ణనాతీతం
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలో గల బత్తినపల్లి గ్రామానికి సరైన రహదారి లేక ఆ గ్రామ ప్రజలు నరకయాతన పడుతున్నారు వర్షం పడితే ఉన్న రహదారి మొత్తం బురదమయంగా మారి మోటార్ వెహికల్ కూడా నడవలేని పరిస్థితి ఆరోగ్యం బాగోలేని వారిని ఈ రహదారి వెంబటి తరలించాలంటే చుక్కలు కనబడుతున్నాయి అని అంటున్నారు గతంలో ఈ రోడ్డు మంజూరు అయినప్పటికీ ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేదని సదరు కాంట్రాక్టర్ రోడ్డు వేయలేదు భద్రాద్రి జిల్లా ఫారెస్ట్ అధికారి పర్మిషన్ లేకపోవడం వలన ఈ రహదారి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ రోడ్డు వేసి మా గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని బత్తిన పల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు గతంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో మరియు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధ్యక్షులు పోదేం వీరయ్యను కలసి ఈ గ్రామ ప్రజలు పలుమార్లు వినతి పత్రాలు అందించినప్పటికీ ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోవడం వలన ఈ గ్రామ ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా బత్తినపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడం వలన తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు ఇకనైనా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ మరియు ఐటీడీఏ రాహుల్ ప్రత్యేక చొరవ తీసుకొని బత్తినపల్లి గ్రామానికి రహదారి నిర్మించి ఈ గ్రామ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుంటున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పొటీ: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో సిపిఎం పోటీ చేస్తుందని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని, ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నామని, ఎవరైనా కలిసి వస్తే ఆలోచిస్తామని ఆయన అన్నారు. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యావని ఆయన అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నేర్మట నుండి బంగారిగడ్డ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, అదేవిధంగా పుల్లెంల నుండి నేర్మట వరకు రోడ్డు నిర్మాణం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బల్లెం స్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, ఈరగట్ల నరసింహ, స్వామి, కలిమెర సైదులు, కొత్తపల్లి వెంకన్న, లక్ష్మమ్మ, ఎన్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.