పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ..

పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ.

#ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘం పిఆర్డియు టి ఎస్.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్న ఏకైక సంఘం పిఆర్టియు టీఎస్ అని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బుధవారం నందిగామ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మండలంలో విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్ టి యు సంఘం ముందు వరుసలో ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య భాస్కర్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్ రెడ్డి, ఎంఈఓ అనురాధ, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్, అంతర్జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర, పిఆర్ టి యు ప్రధాన కార్యదర్శులు ఉడుత రాజేందర్, బానోతు కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చంద్రశేఖర్, రామస్వామి, వెంకటేశ్వర్లు, కృష్ణ, జాకీర్ హుస్సేన్, వెంకటయ్య, సంధ్యారాణి, సుచరిత, వెంకటకృష్ణ, సదా చారి తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి…

ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల పాఠశాల వసతి గృహాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు.ఈ సందర్భంగా వారు పాఠశాలలలోని తరగతి గదులు, వసతి గృహాల గదులు, వంటశాల, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ ఆఫీసు లోని ఐ.డి.ఓ. సి లో జరిగిన వరంగల్ , హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఎస్సీ,ఎస్టీ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థినులు నిర్భయంగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వసతి గృహాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పాఠశాలలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థినుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version