మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయం వద్ద సూపర్డెంట్ అబిద్ ఆలీ, పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి బన్న రజిత, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, మహిళ సమైక్య కార్యాలయంలో ఏపీఎం సుధాకర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, బిజెపి కార్యాలయం వద్ద తడుక వినయ్ గౌడ్, వి ఎఫ్ జి సొసైటీ వద్ద అధ్యక్షుడు పోలు దాసరి శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ ఆచార్య, వివిధ గ్రామాలలో సర్పంచులు, కుల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. అలియాబాద్, ముడుచుతులపల్లి ఎల్లంపేట, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్లు చంద్రశేఖర్, పవన్ కుమార్, స్వామి నాయక్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తో పాటు అధికారులు, మేడ్చల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రష్యా యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి లతోపాటు వివిధ కార్మిక సంఘాలు ఆటో యూనియన్ ప్రైవేట్ సంస్థల వద్ద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అలియాబాద్ శ్రీరామ ఆటో యూనియన్ వద్ద అధ్యక్షుడు పులి జగదీష్ జెండాను ఎగరవేశారు.

లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

లయన్స్ క్లబ్ గోపాలరావుపేట మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రామడుగు మండల శాఖల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ జండాను అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జండాను అధ్యక్షులు కర్ర శ్యాంసుందర్ రెడ్డి ఎగరవేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముదుగంటి రాజిరెడ్డి, కర్ర రాంచంద్రారెడ్డి, కర్ర రాజిరెడ్డి, ముదుగంటి సత్యనారాయణ రెడ్డి, పాకాల మోహన్, గొడుగు అంజియాదవ్, కోట్ల మల్లేశం, చాడ దామోదర్ రెడ్డి, కర్ర ప్రభాకర్ రెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, దుద్దెనపెల్లి లచ్చయ్య, ముదుగంటి లక్ష్మారెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, ఎడవెల్లి ముకుందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బిట్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

బిట్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఘనంగా గణతంత్ర వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలోగల బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, పాఠశాలల్లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన అక్షరధా స్కూల్ అలాగే బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందనీ
అప్పటినుండి ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో జెండాను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం పట్ల గౌరవం దేశభక్తి అలవర్చు కోవాలన్నారు. విద్యార్థులు జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భరతమాత, భగత్ సింగ్ వంటి నాయకుల వేషధారణలో అలరించారు.ఈ సందర్భంగా పిల్లలు వివిధ దేశభక్తి పాటలతో నృత్యాలతో అలరించారు.అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ జ్యోతి గౌడ్,అక్షర ధా స్కూల్ ప్రిన్సిపాల్ జి భవాని,ఉపాధ్యాయ బృందం బాలాజీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామరాజ్, లెక్చరర్స్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బిట్స్ విద్యాసంస్థల్లో…

దేశ సమగ్రతకు తీవ్రవాదం అడ్డంకిగా మారి ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దెబ్బతీస్తోందని వాటిని అధిగమించాలంటే మనం జీవితంలో ఎంతో క్రమశిక్షణను అలవర్చుకోవాల్సి ఉందని బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ. రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. బిట్స్ లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించికొని చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

విద్యార్థులే దేశానికి వెన్నెముక అని.. చదువుతో పాటు నిజాయితీ సత్ప్రవర్తనలతో రానున్న భావితరాలకు ఆదర్శం కావాలని కోరారు. ఎందరో దేశభక్తులు స్వాతంత్రాన్ని సంపాదించి పెడితే మన రాజ్యాంగానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపకల్పన చేశారని, ఎంతో పేదరికాన్ని అనుభవించినా తాను కష్టపడి దేశ రాజ్యాంగాన్ని నిర్మించే శక్తిని సమకూర్చుకున్నారు. అటువంటి కష్టపడే లక్షణాన్ని విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలని హితవు చెప్పారు.ఆ తర్వాత బాలాజీ టెక్నోస్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. దీంతో పాటు విద్యార్థుల కరాటే విన్యాసాలు మరియు పిరమిడ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి.ఎస్. హరిహరన్,డాక్టర్ ఎ. శ్యామ్ సుందర్, డాక్టర్ ఎల్. సంపత్, డాక్టర్ పి. ప్రసాద్, జి. శ్రీనివాసులు, యం. భానురేఖ, కె. సంపత్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి. రాజేంద్రప్రసాద్, ఏ.ఓ.సురేష్ లు పాల్గొన్నారు.

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొమురయ్య భవన్లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురిజేపల్లి సుధాకర్ రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించడం జరిగింది… ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు

నర్సంపేట ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

నర్సంపేట ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని డివిజన్ ప్రెస్ క్లబ్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీనియర్ పాత్రికేయులు ఉగ్గిడి శివుడు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించగా, గత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కామగోని శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్,దీకొండ తిరుమల, పొన్నగంటి స్వామి, సత్య కుమార్, వడ్లకొండ పవిత్రన్,గట్ల అమర్,పిట్టల కుమారస్వామి, బుర్ర వేణు గౌడ్, మహాదేవుని జగదీష్, వడ్లకొండ రాజ్ కుమార్, ప్రశాంత్, శోభన్ , సిద్దు ఆకారపు స్వామి, శోభన్, కార్తీక్, నరేష్,కామిశెట్టి రంజిత్, ముత్తోజు కిరణ్, రమేష్,ఆకారపు మోహన్,గాదం రవి,మైలగాని సందేశ్, మహమ్మద్ ఇబ్రహీం, జట్టబోయిన సాంబమూర్తి, పోశాల రాంబాబు, జూలూరి నరేష్, జనగాం ప్రవీణ్, ఈదుల కృష్ణ, , బుద్ధరత్నం, పెండ్యాల రమేష్,ఇమ్రాన్,రానా,సునీల్, పాల్గొన్నారు.

77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ,జాతీయ జెండాను ఆవిష్కరించిన..

77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ,జాతీయ జెండాను ఆవిష్కరించిన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఝరాసంగం గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని,వార్డ్ మెంబర్లు నవీన్ కుమార్, సంగమేష్ ప్రవీణ్, ప్రకాష్ సింగ్, తేజమ్మ,మాలి పటేల్ సంతోష్ కుమార్, నాగేశ్వర్ సజ్జన్,మాలి పటేల్,ఎజాస్ బాబా, మాలి పటేల్ శ్రీనివాస్,తమ్మలి విజయ్ ప్రకాష్ సింగ్ కుమార్, మహమ్మద్ అజరు, గోపాల్ కుమారి,లక్ష్మీకాంత్,ఉమేష్, ఠాగూర్ సంజు, గాజుల కృష్ణ,పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు వార్డ్ మెంబర్లు తదితరులు
పాల్గొన్నారు.

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం…

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ జోన

 

 

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో జాతీయ పథక ఆవిష్కరణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ఇ. జోన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయపు అధికారులు సిబ్బంది అందరు పాల్గొన్నారు

77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ,జాతీయ జెండాను ఆవిష్కరించిన…

77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ,జాతీయ జెండాను ఆవిష్కరించిన

◆-: జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ.సాయి చరణ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ క్షేత్రంలో 77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ తిరుపతి రెడ్డి,ఏ.యం.సి డైరెక్టర్లు శేఖర్,జఫ్ఫార్,శంకర్ పాటిల్, కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు ఖాజా, మొయిజ్, తదితరులు పాల్గొన్నారు…

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం…

మద్దులపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ సరిత

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సరిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులు ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు
అనంతరం సర్పంచ్ సరిత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సొంత ఖర్చులతో బహుమతులు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మరికొంత మంది నాయకులతో కలిసి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యానికి రాజ్యాంగ నిర్మాణానికి తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, రాష్ట్రం దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చల్లూరు మధు అప్పన్ కిషన్ గాజర్ల అశోక్ తిరుపతి విజయ్ తదితరులు పాల్గొన్నారు

వనపర్తి ఏబీవీపీ 77వ గణతంత్ర దినోత్సవం తిరంగా ర్యాలీ నిర్వహణ

వనపర్తిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ లో విద్యార్థులు
వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీఆధ్వర్యంలో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవo సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహిం చసారు . ఈ ర్యాలీలో విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని త్రివర్ణ పతాకాలతో దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలి లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్ మాట్లాడుతూ, 1950 జనవరి 26న భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని గుర్తు చేశారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు, దేశం పట్ల ఉన్న విధులు, బాధ్యతలను గుర్తు చేసే దినమని తెలిపారు.
రాజ్యాంగ విలువలను పెంపొందించడమే ఏబీవీపీ ప్రధాన లక్ష్యమని, దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఏబీవీపీ నిరంతరం పోరాడుతోందని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులు కాలరాయబడినప్పుడు రాజీపడకుండా ప్రశ్నించడమే నిజమైన గణతంత్ర స్పూర్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ కన్వీనర్ జ్ఞానేశ్వర్, టౌన్ సంయుక్త కార్యదర్శి బంటి, శంకర్, నందకిషోర్, సంతోష్, పరమేష్, మురళి తదితర ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version