శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొత్తి పాశురం దీపోత్సవం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు పొత్తి పాశురం శ్రీ స్వామివారికి దీపోత్సవం మంగళ హారతులు ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు పురోహితులు శ్రీ ఉత్సవ్ ఒక ప్రకటనలో తెలిపారు పూలమాల గోదాదేవి అమ్మవారి సేవలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉoగుళం తిరుమల్ అలేఖ్య దంపతులు మారం విజయ్ దంపతులు శ్రీను దంపతులు పాల్గొన్నారు పొత్తి పాశురం స్వామి వారి దగ్గర స్వామివారి అలంకరణతో ముగ్గును శ్రీమతి అంగడి లావణ్య వేశారని 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అలేఖ్య తిరుమల్ అంగడి నరేందర్ రాజేశ్వరి నర్మదా సరస్వతి లగిశెట్టి సాయి ప్రసాద్ కట్ట సుబ్బయ్య కృష్ణమోహన్ శ్రీదర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు
ధమగ్నాపురం గ్రామ టిఆర్ఎస్ సర్పంచ్ పావన కృష్ణయ్య శెట్టి
దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత ఊరిలో బీ ఆర్ ఎస్ విజయం
వనపర్తి నేటిదాత్రి
దేవర్ కద్ర ఎమ్మెల్యే జి ఎం ఆర్ స్వ oత గ్రామంలో బీ ఆర్ ఎస్ అభ్యర్థి ఆర్యవైశ్య లు పావని కృషయ్య శెట్టి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భారతి పై 126 ఓట్ల తో గెలుపు సాధించారు పరాజయం దేవరకద్ర నియోజకవర్గం సీసీ కుంట మండలం దమగ్నాపురం గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ స్వంత గ్రామం ఆర్యవైశ్యలు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యన్మన్ గండ్ల పావని కృష్ణయ్య శేట్టు మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సహకారంతో సిసి రోడ్లు డ్రైనేజీలు రైతు రుణమాఫీ పెన్షన్లు కళ్యాణ లక్ష్మి సంక్షేమ కార్యక్రమాలు చేశారని వారు గుర్తు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయుటకు కృషి చేస్తామని తెలిపారు ఈ మేరకు ధమగ్నాపురం గ్రామ ప్రజలకు యువకులకు అందరికీ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు
గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో శివాలయం లో విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం హేమంత ఋతువు బహుళ పక్షం సఫల ఏకాదశి రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.. పూజ కార్యక్రమాల అనంతరం వచ్చిన భక్తుల నుద్దేశించి ఆకుల సుభాష్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలనుండి శ్రీ ఉమా మహేశ్వర సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు నుండి సేవ సమితి బాధ్యతల నుండి తప్పుకుంటున్నందుకు కొంత బాధగా వుంది.ఈ గ్రామం అభివృద్ధి కొరకు ధార్మికరంగంలో మరియు అనేక సేవ కార్యక్రమాలు మా సమితి సభ్యుల సహకారంతో చేయడం జరిగింది.నాకు నేనుగా స్వచ్ఛందగా ఒక పర్వదినం రోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుండి ఒక గ్రామ పౌరుడిగా ఎప్పటికి నా గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటానని వారు తెలిపారు
దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రంజోల్ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురువారం దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, ఆరాధన, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త బసంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులకు మహా అన్నపూర్ణ ప్రసాదాన్ని అందజేశారు. దత్త పౌర్ణమి పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణం కారల్ మార్క్స్ కాలనీ లోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే జీఎస్సార్ అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. పూజారులు ఎమ్మెల్యేకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
*గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది…
*ఎమ్మెల్యే పులివర్తి నాని..
*ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది…
*హరిజనవాడలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే…
*ఎమ్మెల్యే గ్రామంలోని మాతమ్మ దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
*కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం అని తెలిపిన ఎమ్మెల్యే..
*బుచ్చినాయుడుపల్లి పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని కి ఘన స్వాగతం పలికిన
*అధికారులు,కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు.
*ప్రతీ నెల 1వ తేదీ క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం…
*లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛను పంపిణీ చేసి..
*కాలనీ లోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే…
*చంద్రగిరి మండలంలో 8292 మందికి పెన్షన్లు మంజూరైనట్లు దానికోసం 3 కోట్ల 41 లక్షల 86వేల రూపాయలు మంజూరైందని…
బుచ్చినాయుడుపల్లి పంచాయతీలో 385 మందికి 15 లక్షల 98 వెలరూపాయలు మంజూరైనట్లు తెలిపిన ఎమ్మెల్యే
చంద్రగిరి(నేటి ధాత్రి)
గత వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని… కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు ఏర్పరుచుకుని ఆర్థిక రాబడిని రాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మన అధినాయకులు గాడిలో పెడుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి డిసెంబర్ 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను అవ్వ,తాత, వికలాంగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా చంద్రగిరి మండలం పరిధిలోని బుచ్చినాయుడుపల్లి పంచాయతీ హరిజనవాడలో అధికారులు, స్థానిక కూటమి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పింఛను పంపిణీ చేసి. కాలనీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.చంద్రగిరి మండలంలో డిసెంబర్ నెలలో 15 నూతన పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో 100% పింఛను పంపిణీ పూర్తి చేయడానికి అధికారులు సహకరించాలని కోరారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలిసినవారు కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగుతుంద ని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అని తెలిపిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీ దేవి అమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలో ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు లక్ష్మీ దేవి అమ్మ వారి ఆలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమలలో పాల్గొని , తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ అమ్మ వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి ,నారాయణ, ఉద్యమకారుడు సీనియర్ నాయకులు షకీల్, వార్డ్ మెంబర్ రాజు, మచేందర్,పార్టీ ప్రెసిడెంట్ రాజు ,నాయకులు ఏ.నారాయణ, సుభాష్,విశ్వనాథ్,గోపాల్ , భద్రనాథ్,హరికాంత్ రెడ్డి,రవి, శరణప్ప , గ్రామ పెద్దలు ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
గుబ్బడి సంఘమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలోని గుబ్బడి సంఘమేశ్వర స్వామి వారిని ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం స్వామి వారిని దర్శించుకున్న వారిలో మాజీ జడ్పీటీసీ పండరీనాథ్, మాజీ సర్పంచ్ శంకర్,బండమీది రాములు, బండమీది శ్రీనివాస్,వై.తరుణ్, బసంత్ పాటిల్, మాణిక్ పాటిల్, చెంగల్ జైపాల్,యాదగిరి,శివ కుమార్,సిద్దేశ్వర్ స్వామి,పవన్ రాథోడ్,మేఘనాథ్,తదితరులు పాల్గొన్నారు,
పట్టణంలోని ప్రముఖ పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్రహ్మశ్రీ జె వెంకటేశ్వర శర్మ,మణిదీప్ శర్మ ల ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు.అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.
గణపురం మండలంలో వచ్చేనెల నవంబర్ తేదీలో 13 14 15 16 జరగనున్న ప్రతిష్టాపన మహోత్సవం ప్రఖ్యాతిగాంచిన కాకతీయుల కాలం నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాబోయే కార్తీక మాసంలో జరగనున్న గణపతి శివలింగ నవగ్రహ అష్ట బలిపీఠ ప్రతిష్టాపన కొరకు తమ వంతుగా గణపురం మండల కేంద్రానికి చెందిన మాదాసు సురేష్ దంపతులు 5000 రూ ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి రూ నగదుగా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ భటిక స్వామి బూర రాజగోపాల్ గౌడ్ మాదాసు మొగిలి గౌడ్ మాదాసు అర్జున గౌడు ఉయ్యాల బిక్షపతి గౌడ్ దయ్యాలభద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ గోరంటల రాజన్న గుప్త పాల్గొన్నారు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల కావాలని 516 కొబ్బరికాయలు కొట్టిన వైఎస్ఆర్ సీపీ నేతలు
పాకాల(నేటి ధాత్రి)అక్టోబర్ :07
Vaibhavalaxmi Shopping Mall
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి’కి త్వరగా బెయిల్ మంజూరు కావాలని,ఆరోగ్యం బాగుండాలని పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో స్వామికి పూజ చేసి 516 కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ప్రార్థించారు.శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిట అర్చన చేయించి,ప్రత్యేక పూజలు నిర్వహించారుచెవిరెడ్డి అక్రమ నిర్భంధానికి 112 రోజులని,చెవిరెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించడం దురదృష్టకరమన్నారు.ఈ కార్యక్రమంలో పాకాల మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు
గణపురం నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.
నర్సంపేట పట్టణ గౌడ గీతా పారిశ్రామిక సహకారం సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వర స్వామి,రేణుక ఎల్లమ్మతల్లి బోనాల ఉత్సవాలు ఈ నెల 7 వరకు జరుగనుండగా పట్టణ గౌడ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన శనివారం వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.ముందుగా పట్టణ గౌడ కులస్తులు ఆ దేవాలయంలో దొర్నపాక అలంకరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టి కంఠమహేశ్వర స్వామి -సూరమాంబదేవి, రేణుక ఎల్లమ్మతల్లి – జమదగ్ని మహారాజ్ ,వనమైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం పట్టణంలోని గ్రామ దేవతల వద్ద పూజలు నిర్వహించారు. అలాగే దేవాలయంలో నిర్వహించిన సూరమాంభదేవి నాటకంలో గౌడ కులస్తులు మహిళలు ఆయా కుటుంబాలు మంగళ నీరాజనాలతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగలగాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్,మున్సిపల్ మాజీ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, పుల్లూరి స్వామి కపిల్ గౌడ్,సోల్తి సారయ్య గౌడ్,గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, వరుస మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్,డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గిరగాని శ్రీనివాస్ గౌడ్,పంజాల రాజు గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో బుధవారం జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
శరన్న నవరాత్రులలో భాగంగా మొగిలిపేట గ్రామంలో దుర్గాదేవి నీ దర్శించుకున్న. టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు మల్లాపూర్ సెప్టెంబర్ 27 నేటి దాత్రి
మొగిలిపేట గ్రామంలో శరన్ననవరాత్రుల భాగంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఈ కార్యక్రమం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్,మండల ఫిషర్మాన్ అధ్యక్షుడు రొడ్డ రాజు,మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు,మొగిలపేట విడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్,మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్, మసుల చిన్నయ్య,మిట్టపల్లి మహేష్, ఎండి సల్మాన్,సుద్దాల సతీష్, దేవ రవి,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,సింగరపు అశోక్,ఇప్పపెల్లి గణేష్,గోపిడి నరేష్, ఎట్టేం మల్లేశ్,పోతు గోపి,సమీర్ సర్కార్,నల్లపు పోతరాజు శ్రీకాంత్ దుర్గాదేవి కమిటీ సభ్యులు ,గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి పట్టణంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం తెలిపారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ పూరి బాల్ రాజ్ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని వెంకటరమణ శ్రీనివాసులు నాగబంది వెంకటరమణ బచ్చు వెంకటేష్ మారం గోవిందు గుప్తా వై వెంకటేష్ కొండ మహేష్ కొండ కిషోర్ కంది కొండ సాయిరాం కూన శ్రీకాంత్ పట్టణ ఆర్యవైశ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు
జగన్మాత కు 11 రోజులకు పట్టు వస్త్రాలు బహుకరించి ఆశీర్వాదం అందుకున్న సమ్మి గౌడ్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామం లో అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు సత్తయ్య గౌడ్,గంగోత్రి సంఘం అధ్యక్షురాలు తీగల సునీత,మహిళా సోదరిమనులతో, కమిటీ సభ్యుల తో కలిసి దేవి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు గౌడ్..విగ్రహ దాతగా ముందుండి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రతీ రోజు అమ్మవారి అలంకరణలో భాగంగా పదకొండు రోజులకు 11 పట్టు వస్త్రాలు బహుకరించారు..ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… ఆ దుర్గామాతతల్లి ప్రత్యేక పూజలలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించే చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ఆ జగన్మాతకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,ఆ తల్లి తాళ్ల పూస పల్లి గ్రామ ప్రజలను, యువతను ప్రతి ఒక్క కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి సంపదలతో సంపన్నులు అయ్యే విధంగా తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… మాకు విగ్రహ దాతగా నిలిచి దుర్గామాతకు పట్టు వస్త్రాలు బహుకరించి మా ఆహ్వానం మేరకు పూజల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆ జగన్మాత ఆశీస్సులు సమ్మయ్య గౌడ్ కి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని వారి ఆశయాలు ఆ తల్లి నెరవేర్చాలా ప్రజలందరికీ అండగా ఉండడమే కాకుండా తనను ఉన్నత స్థాయికి చేరే విధంగా ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్ గౌడ్,రాజు,హరీష్, రాజేష్,విజయ్, మధుకర్,సంతోష్, రాజేష్,నరేందర్,సురేష్, అనుదీప్,సురేష్, ప్రభాకర్,రమేష్,సాయి, హరీష్, బాలరాజు సత్యప్రసాద్, మహేష్,యాకన్న,వల్లాల రాజేందర్ గౌడ్,వంగ సురేందర్ గౌడ్,వల్లాల శ్రావణ్ గౌడ్,తీగల మనోజ్ గౌడ్,మెంచు వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
5వ వార్డులో అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్న ప్రసాదం వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో 15వ వార్డులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని శివ తెలిపారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పాపిశెట్టి శ్రీనివాసులు ఆర్ఎంపీ డాక్టర్ డానియల్ కాగితాల లక్ష్మీనారాయణ సురేందర్ కన్నా భక్తులు పాల్గొన్నారు
భూపాలపల్లి అటవీ గ్రామాలల్లో తీజ్ వేడుకల్లో ఎమ్మెల్యే జి ఎస్ పాల్గొన్నారు
భూపాలపల్లి నేటిధాత్రి
జోరు వర్షంలో సైతం భూపాలపల్లి మండలం కమలాపూర్, గొల్లబుద్దారం, దూదేకులపల్లి అడవి గ్రామాలలో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్.. కమలాపూర్ గ్రామంలో లక్ష్మీ దేవర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే.. లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ డప్పు చప్పుళ్ళతో పెళ్లికాని యువతులు, గ్రామస్తులు సాంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు స్వాగతం.. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే..
ఈ తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకువెళ్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్న ఎమ్మెల్యే అన్నారు లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో లంబాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
భూపాలపల్లి, మంజూరు నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా దుర్గామాత అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అని అన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.