బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మరియు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం అత్యంత హేయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిందితులకు త్వరలోనే చట్టపరంగా కఠిన శిక్షపడేలా చూడాలని జిల్లా ఎస్పీకి సూచించారు.
