ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కూలీలకు మంజూరు కానీ డబ్బులు.

సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల, నేటి ధాత్రి ,

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు నేటి వరకు కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు ఉపాధి ఉపాధి కూలీలు ఎండను సైతం లెక్కచేయకుండా అర్ధాకలితో పస్తులు ఉంటూ ఉపాధి పనులు చేస్తే ప్రభుత్వం కూలి డబ్బులు మంజూరు చేయకపోవడం సరైంది కాదు అని తెలుపుతున్నాం. సంబంధిత మండల ఈజిఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదని ఆరోపిస్తున్నాం. కూలీలు పస్తులు ఉండి పనులు చేస్తే కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలుపుచున్నాం.
ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు రావలసిన కూలీ డబ్బులు మంజూరు చేసే వారి అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం…

ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం

ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనవేన కొమురయ్య ఇంటి వద్ద శుక్రవారం ఇంకుడు గుంత నిర్మాణం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ చేపట్టారు.వారు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు తెలిపారు.ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల వర్షపు నీటిని సంగ్రహించడం ద్వారా భూగర్భ జలాలను పునర్దించడానికి సహాయపడుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో జీవజల పునరుద్ధరణతో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏపీవో వెంకటేశ్వరరావు,పంచాయతీ కార్యదర్శి సురేష్,టెక్నికల్ అసిస్టెంట్ శిరీష,ఫీల్డ్ అసిస్టెంట్ సువర్ణ,కాంగ్రెస్ నాయకులు సుమన్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం..

సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం..

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండలంలోని మల్గి గ్రామంలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు జరిగిన సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.మల్గి శివారులోని మల్లన్న స్వామి ఆలయానికై సీసీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయడం జరిగింది.ఇట్టి రోడ్డును డాక్టర్ రాజశేఖర్ శివ చారి స్వామీజీ పూజలు చేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ మల్గి గ్రామ సర్పంచ్,మల్లన్న స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతి,మాజీ ఎంపీటీసీ శివానంద నాయకులు సిద్ధారెడ్డి, కుశాల్ పాటిల్ ,అర్జున్,వైద్యనాథ్,బీరప్ప, తుకారం,మారుతి,హనుమంత్,నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version