ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్…

ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

 

ప్రజా పాలన–పట్టణ ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం నర్సంపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. కార్యాలయం,పరిసరాలు,రికార్డులకు సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో నిర్వహణలో ఉన్న రికార్డులు, కార్యాలయ పరిసరాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ సమీక్షించారు. రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలన్నారు.

అదేవిధంగా 99 రోజుల కార్యక్రమం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలను వేగవంతంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ప్రజల వినతులను ఆలస్యం చేయకుండా పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి…

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈరోజు నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ళ వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకుల సేవలందించడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్స్,జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మీ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ మూడో వార్డు కౌన్సిలర్ అరుణ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన..

మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన

సృజనాత్మకత పెంపొం దించే దిశగా విద్యార్థులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలకేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు శనివారం స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. పోస్ట్ కార్డు రాసి పంపించే విధాన ము, డబ్బులు జమ, డబ్బు లను తీసే విధానంలో మెలు కువలు అవగాహన కల్పిం చారు. ప్రభుత్వ పథకాల లబ్దికోసం ప్రజలకు ఉపయోగ పడతాయని తెలిపారు అదే విధంగా బ్యాంకు వల్ల ప్రయో జనాలు, రేషన్ షాపు వల్ల ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు ఆలోచించే తత్వం, సృజనా త్మకత పెంపొందించే దిశగా నడవడం కోసం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేవతి, సుభాష్ చంద్రబోస్, పిఈటి దన్ పాల్, మల్లేశం, సుధాకర్ విద్యార్థులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version