సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి….

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి

సిపిఐఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

మరిపెడ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో స్థానిక ప్రజా సంఘాల భవనంలో కామ్రేడ్ బోడపట్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని, పత్తికి కనీస మద్దతు ధర 10075 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరుకాలం కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు, ప్రభుత్వాలు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం అది మాటల్లోనే ఉందని, ప్రతి సంవత్సరానికి పెట్టు పడే రెండింతలు అవుతుందని దానికి తగిన ప్రతిఫలం లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు, పత్తి దిగుమతి పై ఉన్న 11% సుంకాన్ని కొనసాగించాలి, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, పత్తి కొనుగోలు కేంద్రాల బాధ్యతనుండి తట్టుకోవాలనుకుంటున్న ప్రభుత్వ విధానాన్ని ఉపసంహరించుకోవాలి, అనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ విధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే,పక్షంలో రైతుల్ని అందర్నీ కలుపుకొని ఉద్యమం చేపట్టి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఆర్గనైజర్ బాణాల రాజన్న, దొంతు మమత, కందాల రమేష్, కొండ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version