కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కేజీవీబీ టీచర్స్..

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కేజీవీబీ టీచర్స్

భూపాలపల్లి నేటిధాత్రి

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబివి) టీచర్స్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబివి) పథకం 2004లో భారత ప్రభుత్వంచే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసి మైనార్టీ వర్గాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాల బాలికలకు 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన నివాస విద్యను అందించడానికి ప్రారంభించబడింది. అది సమగ్ర శిక్షా అభియాన్ లో భాగంగా కొనసాగుతూ బాలికల అక్షరాస్యతా పెంపునకు దోహదపడాలి. కానీ, ఆచరణలో నేడు కేజీబివిలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల నుండి మొదలు, అందులో పని చేసే అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వరకు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పేరుకే అవి నాణ్యమైన విద్యనందించే నిలయాలు అని చెప్తున్నప్పటికీ అందులో పని చేసే సిబ్బందికి అవి పెట్టి చాకిరి నిలయాలుగా మారాయి. 2004 నుండి ప్రారంభమైన ఈ పాఠశాలల్లో ‘సమాన పనికి సమాన వేతనం” అమలు చేయకుండా అతి తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమను రక్షణ లేకుండా చేయిస్తున్నారు. కేజీబివిలలో పని చేసే టీచర్లు అందరు మహిళ టీచర్లే, కానీ, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని పంచాయితీరాజ్ టీచర్లతో పోల్చినపుడు అన్ని విషయాలలో చాలా వ్యత్యాసం కనబడుతుంది. కేజీబివిలలో పని చేస్తున్న మహిళా టీచర్ల వేతనాలు SOల నెల వేతనం రూ.32,500.00, పేజీసిఆర్టీలకు రూ.29,700.00, సిఆర్జీలకు 26,000.00 వేతనాలు చెల్లిస్తున్నారు. అదే విధంగా సెలవులు కూడా మహిళా టీచర్లకు సాధారణ సెలవులు అకాడమిక్ సంవత్సరానికి 20 మాత్రమే ఇస్తున్నారు. రెగ్యులర్ మహిళా టీచర్లకు 27 ఇస్తున్నారు. ఇంత తేడా ఎందుకు? అనే దానికి సమాధానం లేదు. ఈ 20 సాధారణ సెలవులు కూడా ప్రతి నెల 2 మాత్రమే వాడుకోవాలి. వాడుకోకపోతే ఆ రెండు సెలవులు కోల్పోవాల్సిందే. రెగ్యులర్ టీచర్లు మాత్రము సంవత్సరంలో అవసరం ఉన్నప్పుడు వాడుకొనే అవకాశం కల్పించారు. కేజీబివి టీచర్లకు శిశు సంరక్షణ సెలవులు లేవు. అర కొర వేతనంతో పని చేస్తున్నందుకు, కనీసం వైద్య సదుపాయం కూడా కల్పించడం లేదు. పంచాయితీరాజ్ పాఠశాలలకు కల్పించే 5 ఐచ్చిక సెలవులు, 3 స్థానిక సెలవులు గాని కేజీబివి పాఠశాలలకు లేవు. ప్రతి కేజీబివి రెసిడెన్సిల్ పాఠశాలగా నడుస్తుంది. కాని అందులో హాస్టల్ వార్డెన్ నియమాకం లేదు. అదే విధంగా కేర్ టేకర్ పోస్టు నియమాకం లేదు. ఈ బాధ్యతలన్నీ అందులోనే SO లతో పాటు ఆ టీచర్లే బాధ్యత తీసుకోవాలి. ప్రతి రోజు ఒక టీచర్ నైట్ డ్యూటీ చేయాలి. అ టీచరే మరుసటి రోజు మధ్యాహ్నం’ వరకు ఉండి రిలీవ్ కావాలి. ఈ పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణిస్తే కనీస ఆర్థిక సహాయం లేదు. ప్రమాద బీమా లేదు. వారు అన్నారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి
సుదర్శన్ రాష్ట్ర కోఆర్డినేషన్ వీరేశం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ కేజీబీపీ టీచర్స్ చైతన్య రాధిక సులోచన జ్యోతి రాణి స్రవంతి కవిత సుధా రవళి రజిత తదితరులు పాల్గొన్నారు

పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ..

పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ.

#ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘం పిఆర్డియు టి ఎస్.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్న ఏకైక సంఘం పిఆర్టియు టీఎస్ అని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బుధవారం నందిగామ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మండలంలో విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్ టి యు సంఘం ముందు వరుసలో ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య భాస్కర్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్ రెడ్డి, ఎంఈఓ అనురాధ, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్, అంతర్జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర, పిఆర్ టి యు ప్రధాన కార్యదర్శులు ఉడుత రాజేందర్, బానోతు కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చంద్రశేఖర్, రామస్వామి, వెంకటేశ్వర్లు, కృష్ణ, జాకీర్ హుస్సేన్, వెంకటయ్య, సంధ్యారాణి, సుచరిత, వెంకటకృష్ణ, సదా చారి తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి…

ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల పాఠశాల వసతి గృహాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు.ఈ సందర్భంగా వారు పాఠశాలలలోని తరగతి గదులు, వసతి గృహాల గదులు, వంటశాల, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ ఆఫీసు లోని ఐ.డి.ఓ. సి లో జరిగిన వరంగల్ , హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఎస్సీ,ఎస్టీ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థినులు నిర్భయంగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వసతి గృహాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పాఠశాలలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థినుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version