మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు…

మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

అభివృద్దే ద్యేయంగా పనిచేసే నాయకుడు పావుశెట్టి సునీల్

18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పావుశెట్టి సునీల్ కుమార్‌ను శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా 18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పసుల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒంటేరు రమేష్ చైర్మన్‌ను కలసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా పసుల శ్రీనివాస్ మాట్లాడుతూ పావుశెట్టి సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం పరకాల పట్టణ అభివృద్ధికి మంచి సూచిక అని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేలా ఆయన పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ పావుశెట్టి సునీల్ సమర్థంగా పనిచేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి…

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈరోజు నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ళ వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకుల సేవలందించడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్స్,జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మీ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ మూడో వార్డు కౌన్సిలర్ అరుణ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై నాయిని తీవ్ర విమర్శలు

బీజేపీ, బీఆర్‌ఎస్ విధానాలపై తీవ్రంగా విమర్శించిన ఎమ్మెల్యే నాయిని

హన్మకొండ, నేటిధాత్రి:

 

 

హనుమకొండ డీసీసీ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిఅధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు,శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు. పేదల కోసం రూపొందించి అమలు చేస్తున్న పథకాలను నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టంగా వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది కుటుంబాలు జీవనాధారం పొందుతున్నాయని, అలాంటి పథకాలను అడ్డుకోవడం పేదల పాలిట శాపంగా మారుతుందన్నారు.
పథకాల పేర్లు మార్చాలనే నెపంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోందని విమర్శించారు. అసలు సమస్య పరిష్కారం కాకుండా పేర్ల రాజకీయాలు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. గ్రామాల్లో పనులు నిలిచిపోవడంతో కూలీలు, పేద కుటుంబాలు తీరని అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమని, ఇప్పుడు కూడా దేశ అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోవడమే వారి విధానంగా మారిందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను తుంగలో తొక్కుతూ, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్‌టీఏ యాక్ట్ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసని, అలాంటి చట్టాలను కూడా బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పట్ల చేసిన ద్రోహాలను ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులు కర్తవ్యంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిజంగా అభివృద్ధి జరిగితే, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూపాలని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరగాల్సి ఉందని, ఆ హామీల అమలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పదేళ్లు గడిచినా మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు,ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కంఠాత్మకూర్ సర్పంచ్..

ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కంఠాత్మకూర్ సర్పంచ్

 

నడికూడ,నేటిధాత్రి:

https://youtu.be/G7hDJxL7XBE?si=_ZnV2GVLdYoOlJWo

 

ఇటీవల నూతనంగా ఎన్నికైన నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కోంగంటి తిరుపతి, ఉపసర్పంచ్ కంఠాత్మకూర్ కుమారస్వామి దామెర పోలీస్ స్టేషన్లో ఎస్సై కొంకర అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుష్పం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్,కోశాధికారి బొమ్మ కంటి విజేందర్,మాజీ సర్పంచ్ కంఠాత్మకూర్ కొమురయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు కుమ్మరి నరేష్,టీపీసీసీ పరకాల నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాయిడి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓడిన గెలిచిన ప్రజల మధ్యలో ఉండాలి – మంత్రి శ్రీధర్ బాబు..

ఓడిన గెలిచిన ప్రజల మధ్యలో ఉండాలి – మంత్రి శ్రీధర్ బాబు

ముత్తారం :- నేటి ధాత్రి

ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని ఎన్నికలలో గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో ఉండి సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు.సోమవారం రోజున మండలంలోని పోతారం గ్రామ కాంగ్రెస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బండ సమ్మయ్య ఓటమి చెందగా కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని గెలుపు ఓటములు సహజమని ప్రజల మధ్యలో ఉంటూ సేవలందించాలని సూచించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బండ సమ్మయ్య,కాంగ్రెస్ నాయకులు చెల్కల యుగేందర్ జితేందర్,శ్రావణ్,రమేష్, అనిల్ ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు

“మంత్రి అజారుద్దీన్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు”

మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ ను కలిసిన పలువురు నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి, మాజీ క్రికెట్ లెజెండ్ మహ్మద్ అజారుద్దీన్ను హుగ్గేల్లీ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆదివారం కలవడం జరి గింది. హుగ్గేల్లీలోని మహేంద్ర ప్యారడైస్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రిని ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా. సిద్దం ఉజ్వల్ రెడ్డితో కలిసి మంత్రి అజారుద్దీన్ ను కలిసిన హుగ్గేల్లీ కాంగ్రెస్ నాయకులు పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి అంశాలపై చర్చించారు. మంత్రి అజా రుద్దీన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం తన శాఖ నిరంతరం కృషి చేస్తుం దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుగ్గేల్లీ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పట్లోళ్ళ నర్సింహా రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుమ్మరి రాజు, సీనియర్ నాయకులు నర్సింహులు, తుక్కా రెడ్డి, నరేష్, నాగిరెడ్డి తో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version