భద్రత నియమాలతో ప్రమాదాలకు అడ్డుకట్ట: ఎమ్మెల్యే మాధవరెడ్డి

భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించచ్చు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా విద్యార్థులతో ర్యాలీ.

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్, జిల్లా రవాణా శాఖ అధికారి, శోభన్ బాబు ఆధ్వర్యంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సాహకారంతో బుధవారం నర్సంపేట పట్టణంలోని వరంగల్ కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డు భద్రత ఫ్లకార్డులతో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ ప్రారంభిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు

ముందుగా ఈ ర్యాలీని డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు స్థానిక సిఐ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభం చేశారు.ఈ ర్యాలీ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు భద్రతల పట్ల అధికారులు తెలుపుతున్న అవి పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ప్రభుత్వ భద్రత నియమాలు పాటిస్తే 90 నుండి 100 ప్రమాదాలు జరుగకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని రకాల వాహనదారులకు అవగాహన కల్పించదానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

రోడ్డు భద్రత నియమాల గురించి మాట్లాడుతున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు

డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు గాను జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని చెప్పారు.హెల్మెంట్, ధృవీకరణ పత్రాలతో వాహనాలు నడపాలన్నారు.మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ , పిసిసి సభ్యుడు పెండెం రామానంద్, మాంటిస్సొరి స్కూల్ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, మాథర్స్ ల్యాండ్ పాఠశాల ఛైర్మన్ పాశికంటి రమేష్,పలువురు అధికారులు,పోలీస్ శాఖ ఎస్సైలు,కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో జాతీయ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాల పై అవగాహన కార్యక్రమం. ఇట్టి కార్యక్రమాన్ని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరు చౌరస్తాలో డ్రైవర్లకు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా D.T.O. లక్ష్మణ్ హాజరై. భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులను డ్రైవర్లకు. అవగాహన కల్పిస్తూ రోడ్డు నియమ నిబంధనలపై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వికలాంగుల వీధిన.పడుతున్నాయని. వాహన.దారుడు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించుకోవచ్చు అని. అలాగే జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ అమలులో భాగంగా ప్రతి జిల్లాలలో కలెక్టర్లు అమలు చేస్తున్నారని దీనిని ప్రతి ఒక్క వాహనదారులు తమ బాధ్యతగా తీసుకోవాలన్నారు. రోడ్లపై కి వచ్చే వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు .నడపరాదని వాహనానికి సంబంధించిన పత్రాలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలని ప్రతి వాహనదారులు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని. వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు దృష్టిలో ఉంచుకొని ప్రయాణం సాగించాలని నా కుటుంబం నా బాధ్యత అని బాధ్యతగా వాహనాన్ని నడపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా. ప్రజలు అందరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా. ప్రమాదాలు నివారించాలని అవగాహన కార్యక్రమానికి హాజరైన వారందరిచే ప్రమాణం చేయించారుఈ సందర్భంగా పలు విషయాలపై వాహనాల చట్టాలపై ప్రతి ఒక్కరూ కచ్చితంగా నిబంధనలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. R.T.A. మెంబర్ సంగీతం శ్రీనాథ్
A.M.V.i. రజిని దేవి. సిరిసిల్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి చుక్క రాజశేఖర్. వాహనాల. తనిఖీ సిబ్బంది. ఓనర్స్. డ్రైవర్స్ ఆటో డ్రైవర్ యువకులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

గుడుంబా తయారీపై ఉక్కు పాదం మోపిన ఎక్సైజ్ శాఖ…

గుడుంబా తయారీపై ఉక్కు పాదం మోపిన ఎక్సైజ్ శాఖ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి రూరల్ మండలంలో గుడుంబా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా, అంజన్ రావు, ప్రోహిబిషన్ ఎక్సజ్ డిప్యూటీ కమీషనర్, వరంగల్ డివిజన్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ ఎక్సజ్ ఆఫీసర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదేశాల మేరకు ప్రోహిబిషన్ ఎక్సస్ స్టేషన్ భూపాలపల్లి ప్రోహిబిషన్ ఎక్సస్ స్టేషన్-కాటారం, సంయుక్తగా భూపాలపల్లి మండలంలోని గొల్లభూద్దరం, గ్రామంలో నాటు సారాయి తయారీ స్థావారాలపై దాడులు నిర్వహించి (03) కేసులు నమోదు చేసి,( 02) మంది నిందితులను అరెస్ట్, (30 )లీటర్ల నాటుసాయిరా (08) కేజీల చక్కర ను స్వాధీన పరుచుకొని (900)లీటర్ల చక్కర పానకాంను ధ్వంసం చేయడం జరిగింది. తదుపరి నాటుసారాయి వల్ల ప్రజలకు జరుగు నష్టం గురించి, ఒక అవగాహన కార్యక్రమం చేపట్టటం జరిగింది. తదుపరి ఎవరైనా నాటు సారాయిని, తయారు చేసిన, రవాణా చేసిన, కలిగి ఉన్న అమ్మిన చట్ట రీత్యా చర్యలు వుంటాయని సీఐ రమ్య తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాటారం సిఐ కిష్టయ్య బాదావత్
భూపాలపల్లి భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై షేక్ రబ్బాని సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version