మర్రిపల్లి మల్లంపల్లి బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి…

మర్రిపల్లి మల్లంపల్లి బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి

ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ కు వినతిపత్రం

దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం మర్రిపల్లి, మహ్మదాపురం గ్రామాల ప్రజల రవాణా సౌకర్యార్థం బస్సు సర్వీస్‌ను మర్రిపల్లి/మల్లంపల్లి వరకు పునరుద్ధరించాలని కోరుతూ నర్సంపేట బస్సు డిపో మేనేజర్ ప్రసున్న లక్ష్మికి మర్రిపల్లి గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత,మహ్మదాపురం గ్రామ సర్పంచ్ గోగుల శ్రీనివాస్ రెడ్డి స్థానికులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయా సర్పంచులు మాట్లాడుతూ బస్సు సర్వీస్ పునరుద్ధరణతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు మరియు గ్రామస్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. అధికారులు త్వరితగతిన స్పందించి సేవలను ప్రారంభించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎరుకల పద్మ, కామ సోమలక్ష్మి, కేశవరావు, గాజు శివాజీ, కుక్కమూడి రాజేందర్ పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు పొన్నాల మహిపాల్, బొడిగె రాము తదితరులు హాజరయ్యారు.

మహేశ్వరంలో ప్రతి ఆర్టీసీ బస్సు హల్టింగ్ అవ్వాలి…

మహేశ్వరంలో ప్రతి ఆర్టీసీ బస్సు హల్టింగ్ అవ్వాలి…

డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మికి వినతిపత్రం సమర్పణ..

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణ నూతన విలీన గ్రామం మహేశ్వరంలో ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సు హల్టింగ్ ఇవ్వాలని డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చాలా మంది ఉద్యోగం,విద్యా,వైద్య నిమిత్తం హన్మకొండ, హైదరాబాద్ కి వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులు ఆగడంలేదు ఇందువలన నర్సంపేటకి వచ్చి బస్సు ఎక్కడం అవుతుందని తెలిపారు. అలాగే రాత్రి సమయాల్లో హన్మకొండ నుండి నర్సంపేటకి వచ్చే బస్సులు మహేశ్వరం వద్ద ఆపటం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి సమస్యకి పరిష్కారం చూపించి అన్ని బస్సులు ఆపే దిశగా చూస్తాఅని హామీ ఇచ్చారు. బస్సులు ఆపకుంటే అలాగే డిపో సమాచారం నెంబర్ కి కాల్ చేయాలని తెలిపారు. వినతిపత్రం అందచేసిన వారిలో కౌన్సిలర్లు మాతృ రాథోడ్,భూస శిరీష-రాజు,గ్రామస్తులు చెన్న భాస్కర్,బేతం అఖిల్,చిదురాల చక్రపాణి ,మోర్తాల రాజు,బొల్ల శ్రీకాంత్, చెన్న గణేష్,చేరాల ప్రదీప్,భూక్య సాయి కళ్యాణ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version