కల్వకుర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి .

కల్వకుర్తి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

కల్వకుర్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భగత్ సింగ్ తండాలో 15 లక్షల వ్యయంతో మురుగు కాలువ, కేశవ నగర్ లో 25 లక్షలతో సైడ్ డ్రైనేజీ, రాఘవేంద్ర కాలనీలో రూ. 22 లక్షలతో సీసీ రోడ్ పనులు,బాల్ రాం నగర్ లో సీసీ రోడ్, 8వ వార్డు సుభాష్ నగర్ లో రూ. 25 లక్షలతో సీసీ రోడ్, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ. 10 లక్షలు, ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయం వద్ద వన మహోత్సవం సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కల్వకుర్తి మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో చేతివృత్తుల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి,కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ల సంజీవ్ కుమార్ యాదవ్, కల్వకుర్తి మున్సిపల్ కమీషనర్ మహ్మద్ షేక్, వాస శేఖర్, మాజీ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version