బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి…

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తిరుపతిని గెలిపించాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

స్థానిక మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గ్యాదoగి
తిరుపతిని గెలిపించాలి అలాగే 18 వార్డు లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను కాలనీలో సిసి రోడ్లు సైడ్ డ్రైనేజీలు తాగునీరు సమస్యలు తలెత్తకుండా పరిష్కరిస్తానని వారు ప్రజలకు హామీ ఇచ్చారు కావున 18వ వార్డు ప్రజలు అందరూ గ్యాదoగి తిరుపతి కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రజల కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ ..

ప్రజల కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

* అలియాబాద్ లో రోడ్ షో

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పేదల కష్టాలు తెలిసిన నేత కెసిఆర్, కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ అని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ని అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తంటం నర్సింహా, బండి లక్ష్మీ రాంరెడ్డి, తూమ్ యమున శ్యామ్, మధుసూదనరెడ్ది, సగ్గు శ్రీనివాస్ యాదవ్, గుర్క కుమార్ యాదవ్ లకు ఓటు వేసి గెలిపించలని కోరారు.

బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బీర్తీ కమల మధునయ్య కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్తీ కమలను మధునయ్య 17వ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కావున వార్డు ప్రజలు అందరూ ఆలోచించి బీర్తీ కమల చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి వార్డు అభివృద్ధికి అందరూ సహకరించండి అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 17వార్డు ఇన్చార్జి టౌన్ యూత్ అధ్యక్షుడు పృథ్విరాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version