గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు రిమాండ్..

గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు రిమాండ్

తంగళ్ళపల్లి నేటి దాత్రి..

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి రూరల్ సిఐ కె మొగిలి . తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి.మాట్లాడుతూ. నమ్మదగిన సమాచారం ప్రకారం. తంగళ్ళపల్లి గ్రామ శివారులోని స్మశాన వాటిక వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా తెలిసిన సమాచారం ప్రకారం పోలీస్ సిబ్బంది. సంయుక్తంగా దాడి చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా వారిని పట్టుకుని విచారించగా. వారి పేర్లు. ఎండి సాదిక్. మైనారిటీ. గ్రామం బద్దెనపల్లిగా. రెండవ అబ్బాయి.తంగళ్ళపల్లి రాజేష్. కులం అవుసుల గా. గ్రామం . బద్దెనపల్లి. గ్రామానికి చెందిన వారిని.పట్టుకొని విచారించగా. వీరు గత కొంతకాలంగా తంగళ్ళపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో. గంజాయి తాగేవారికి గంజాయి.అమ్ముతున్నట్లుగా తెలిసిందని. ప్రస్తుతం వీరిద్దరి వద్దనుండి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని. విచారణ అనంతరం ఇద్దరు నేరస్థులను ఈరోజు సిఐ. గౌరవ సిరిసిల్ల కోర్టు కు. రిమాండ్కు తరలించడం జరిగిందని. అలాగే రూరల్ సిఐ మొగిలి మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో ఎవరైనా గంజాయి సేవించిన లేదా గంజాయిని విక్రయించిన. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవరైనా గంజాయి సేవించిన విక్రయించిన వారి వివరాలను. ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచు. వారి వివరాలను బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని.చట్ట వ్యతిరేకత చర్యలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. గంజాయి కేసులో నిందితులను . చాక. చక్యంగా. వ్యవహరించి పట్టుకున్న తంగళ్ళపల్లి . ఎస్సై. ఉపేంద్ర చారిని.ఏఎస్ఐ
ఆర్ రవీందర్ ని.. కానిస్టేబుల్. నరేందర్ ను. ప్రశాంత్. శ్రీకాంత్. అబ్బాస్. అలీ. రామ్మోహన్లను. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని రూలర్ సిఐ కే మొగిలి ప్రత్యేకంగా అభినందించారు

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు..

నాలుగు గంటల నీటి విడుదలకు నలుగురు మంత్రులు – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం రామడుగు మండలంలో మంత్రుల పర్యటన సందర్భంగా వచ్చిన మంత్రులకు కనీసం మండలంలోని మరియు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు పట్ల మంత్రులకు, ఇక్కడి శాసనసభ్యుడికి అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లాకపోవడం శోచనీయంశం అని, స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గ పరిధిలోని సమస్యల పట్ల కనీసం అవగాహన లేదని అన్నారు. మండల కేంద్రంలోని బ్రిడ్జికి ఇరువైపులా భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం కోసం మంత్రుల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పొలీస్ స్టేషన్ల చుట్టూ తింపరని, రైతులను నేరస్థులుగా చూడటం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి కోసం వారి భూములను ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు. ప్రతి పక్షాల పట్ల దురుసుగా మాట్లాడం కాదు, మీకు చాతనవుతే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపండి అని హితబోధ చేశారు. కేవలం నాలుగు గంటలు మాత్రమే నీటిని విడుదల చేసి ఆపడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు నీటి సరఫరా తిరిగి విడుదల చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెల్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, దయ్యాల వీరమల్లు, పురంశెట్టి మల్లేశం, లంక నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version