ముందస్తు సంక్రాంతి సంబరాలు
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
మండలంలోని వర్ష కొండలో మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఎంతో ఆనందోత్సాహాలతో నిర్వహించడం జరిగింది ఈ పండుగ వేడుకలకు గ్రామ సర్పంచ్ పొనకంటి వెంకట్ ఉప సర్పంచ్ తుమ్మల జయ,సామెల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు
భోగి పండుగ సందర్భంగా భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించి, చిన్నారులకు భోగి పళ్ళను పోయడం ద్వారా పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు
సంక్రాంతి పండుగ సందర్భంలో విద్యార్థులతో కలిసి రంగురంగుల గాలి పాటలను ఎగురవేసి, ఆనందాన్ని పంచుకున్నారు
కనుమ పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆవులను, లేగ దూడలను పూజించడం ద్వారా రైతు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించారు
ఈ విధంగా సంప్రదాయాలు, సంస్కృతి, ఆనందం కలిసిన సంక్రాంతి వేడుకలను విజయవంతంగా ముగించారు
ఈ సంబరాలు విద్యార్థుల్లో పండుగల పట్ల ప్రేమను, గౌరవాన్ని పెంపొందించాయి.
మరొక్కసారి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు అచ్చం విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
