ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్ళల్లో ఆనందం ఎమ్మెల్యే జీఎస్సార్…

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్ళల్లో ఆనందం ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు శనివారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలంలోని గొర్లవేడు గ్రామములో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న ఎడ్ల స్వప్న గృహ ప్రవేశం నిర్వహించుకోగా ఎమ్మెల్యే జీఎస్సార్ ముఖ్య అతిథిగా హాజరై, ఇళ్లు ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరుతుందన్నారు.అర్హులందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version