బతుకమ్మ నిధులలో అవకతవకలకు పాల్పడ్డ మున్సిపాలిటీ అధికారులు…

బతుకమ్మ నిధులలో అవకతవకలకు పాల్పడ్డ మున్సిపాలిటీ అధికారులు

గ్రీన్ బడ్జెట్ నిధులను పక్కదారి పట్టిస్తున్న మున్సిపాలిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి లోని కాకతీయ ప్రెస్ క్లబ్ ఎదురుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్పీకే సాగర్ పత్రిక మీడియా సమావేశం నిర్వహించారు అందులో భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం సద్దుల బతుకమ్మ గ్రీన్ బడ్జెట్ నిధుల విషయాలలో అవకతవకలకు మున్సిపాలిటీ కార్యాలయం పాల్పడిందని ఆరోపించారు సద్దుల బతుకమ్మ 2025 సంవత్సరం 30 లక్షల రూపాయలు మరియు గ్రీన్ బడ్జెట్ వనమహోత్సవం కొరకు 18 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము కేటాయించడం జరిగింది. మొత్తం 48 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ నిధులను సకాలంలో మున్సిపాలిటీ కార్యాలయం వినియోగించకుండా తప్పుదారి పట్టిస్తూ ప్రజలకు అధికారుల కల్లు కప్పి పనులు చేయని పనులు చేసినట్టుగా ఫోటోలను చిత్రీకరిస్తూ ఫోటోలను క్రియేట్ చేస్తూ బడ్జెట్ రిలీజింగ్ కొరకు కలెక్టర్ కి భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం లెటర్ పెట్టింది చేయని పనులు చేసినట్టుగా చిత్రీకరించి 48 లక్షల రూపాయలను ప్రజాసమము ప్రజల సొమ్మును దుర్వినియోగ పరుస్తున్న అధికారుల పట్ల తక్షణమే జిల్లాస్థాయి అధికారుల చేత సమగ్ర విచారణ జరిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు వాస్తవాలను తెలపాలని ఈ నిధులు ఏమయ్యాయో భూపాలపల్లి ప్రజలకు తెలుపాలని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే లోకల్ బాడీ కలెక్టర్ని తక్షణమే సమగ్ర విచారణ కొరకు సమర్థిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఎస్ పీ కే సాగర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గంధం రాకేష్ జష్వంత్ మామిడి శ్రీకాంత్ కళ్యాణ్ శ్రీకాంత్ రాజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..

బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రెస్ మీట్ లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వెల్లడిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టి తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంటను పండించి రైతులను డోకా చేశారు.
317 జీవోను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే.
మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది.
రైతుబంధు పేరుతో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాల్లకు,ప్రైవేట్ కాలేజీలకు ప్రజా సొమ్మును పంచిపెట్టినది బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది.
అమరవీరుల కుటుంబాలను,ఉద్యమకారులను గుర్తించకుండా వారిని మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వమే.
పదేళ్ల కాలంలో సర్పంచులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైనది బిఆర్ఎస్ ప్రభుత్వం.
మహిళలకు పావలా వడ్డీకే 10 లక్షల రుణం ఇస్తానని ఇవ్వకుండా దూకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పి మోసం చేసింది కెసిఆర్
తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని డోకా చేసింది బిఆర్ఎస్ పార్టీ.
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వము.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తానని డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
పది సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగులను డోకా చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం.
గ్రూప్.1 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం.
పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో హడావిడి చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి ధరణిని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు భూములను అక్రమంగా కాజేసినారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

243 సీట్లలో పోటీ చేస్తాం బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..

243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌ కూటమిలో సీట్ల పంపకం ఇంకా పూర్తి కాలేదు. కానీ శనివారం ఓ సభలో ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‌గా నిలిచారు.

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections 2025) సమీపిస్తున్న వేళ కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ జనతాదళ్ (RJD)నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఓ సంచలన ప్రకటన చేశారు. ముజఫర్‌పూర్‌ కాంతిలో జరిగిన బహిరంగ సభలో ఈసారి బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ధీమాగా ప్రకటించారు. తేజస్వి ముఖం చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు

దీంతోపాటు తేజస్వి యాదవ్ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కేవలం నినాదాలతోనే ప్రజలను మభ్యపెడుతోందన్నారు. బీహార్ నుంచి ఓట్లు, గుజరాత్‌లో ఫ్యాక్టరీలు.. ఇలాంటి ఎత్తుగడలు ఇక పని చేయవని వ్యాఖ్యానించారు. ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే ఉపాధి, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. కాంతిలో బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.

ప్రభుత్వం తమ ఒత్తిడితోనే పెన్షన్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రకటించిందని తేజస్వి అన్నారు. మేము ముందుంటాం, ప్రభుత్వం తమను అనుసరిస్తుందని సెటైర్ వేశారు. ఆర్‌జేడీ మై బెహన్ యోజనను కాపీ చేస్తూ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి మహిళకు లక్షన్నర రూపాయలు అందిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరం కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అవినీతిపై ఆరోపణలుఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ 80 వేల కోట్ల రూపాయల లెక్కలు చూపడం లేదని తేజస్వి ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎలుకలకు రక్షణ కల్పిస్తోందని ఎద్దేవా చేశారు. వంతెనలు కూలుతున్నాయని, ఆసుపత్రుల్లో రోగులకు రక్షణ లేదని విమర్శించారు. ఇలాంటి సమయంలో అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తేజస్వి ఆగ్రహం వ్యక్తం చేశారు.సీట్ల గందరగోళంమహాఘట్ బంధన్‌ కూటమిలో సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదు. 2020 ఎన్నికల్లో ఆర్‌జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ ఓటర్ల హక్కులపై ఓట్ల చోరీ అనే విషయంపై బలంగా పోరాడింది.ఈ క్రమంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలపడిందని కాంగ్రెస్ నమ్ముతోంది. దీంతోపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, లోక్ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా ఈసారి ఈ కూటమిలో భాగమయ్యాయి. ఈ క్రమంలోనే తేజస్వి యాదవ్ 243 సీట్లలోనూ పోటీ చేస్తామని చేసిన ప్రకటన కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది.

మాతో ఎవరూ సరితూగరు..

మాతో ఎవరూ సరితూగరు..

 

 

డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

చెన్నై: డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో, తిరునల్వేలిలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్‌ అప్పావుతో కలసి పాల్గొన్న మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ… వేళ్లతో సహా పీకి పారేసేందుకు డీఎంకే చెట్టు కాదని, కోట్లాది మంది ప్రజల మద్దతుతో నాలుగేళ్లకు పైగా సుపరిపాలన అందిస్తుందన్నారు. 15 ఏళ్లుగా తమకు గిట్టని పార్టీల ప్రభుత్వాలను వేళ్లతో పీకేయడమే బీజేపీ పని అని, డీఎంకే గురించి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు.

 

అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో ఇంకా స్పష్టత రాలేదని, ఇప్పటికి మూడు సార్లు రాష్ట్రానికి వచ్చిన అమిత్‌ షా ప్రతి సభలో, సంకీర్ణ ప్రభుత్వమేనని చెబుతున్నారే కానీ, అది ఏ పార్టీ నేతృత్వంలో ఉందో చెప్పకుండా దాటవేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్‌లాగే సీఎం స్టాలిన్‌కు కూడా మహిళల ఆదరణ పెరుగుతోందని, అందువల్ల వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారం కాపాడుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version