పూరీ రథయాత్ర దుర్ఘటన ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు.

పూరీ రథయాత్ర దుర్ఘటన ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు…

 

పూరీలో జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

పూరీలో జరిగిన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025)లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుండిచా ఆలయం సమీపంలో జరిగింది. ఇది ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీ మధ్య ప్రస్తుతం వాడీవేడి చర్చ కొనసాగుతోంది.
పట్నాయక్ ఏమన్నారంటే..

ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ చేసి స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వ అసమర్థతగా అభివర్ణించారు. రథయాత్రలో జన సమూహం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దుర్ఘటన భక్తులకు శాంతియుత పండుగను అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. రథయాత్ర రోజున నందీఘోష రథాన్ని లాగడంలో జాప్యం జరిగిందని, దీనిని ప్రభుత్వం మహాప్రభు ఇచ్ఛ అని సమర్థించుకుందని నవీన్ పట్నాయక్ ఆరోపించారు. ఈ జాప్యం ప్రభుత్వం బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందన్నారు.

విహర యాత్రల పోస్టర్ విడుదల.

విహర యాత్రల పోస్టర్ విడుదల

యాత్రల స్థలాలకు డిలక్స్,ఎక్స్ ప్రెస్ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నాం

డిపో మేనేజర్ రవిచందర్

పరకాల నేటిధాత్రి

 

టిజియస్ ఆర్టిసి పరకాలడిపో ఆద్వర్యంలో విహరయాత్రల వివరాల పోస్టర్ ను డిపో మేనేజర్ రవిచందర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున విడుదల చేశారు.అరుణాచలం (డీలక్స్),మల్లూరు,భద్రాచలం, పర్ణశాల,ధర్మపురి,బాసర,మల్లూరు,మేడారం,రామప్ప,వేములవాడ,కొండగట్టు,గూడెం గుట్ట(ఎక్స్ ప్రెస్) పై యాత్ర స్థలాలకు బస్సులు నడిపిస్తున్నట్టు తెలిపారు.పై స్థలాలకు కాకుండ భక్తులకు అనుకూలమైన ప్రదేశాట విహరయాత్రులకు బస్సులు సమకూరుస్తామని,చార్జీలు మరియు ఇతర వివరాలకు 9666919190 9705479088 సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ కుమారి,అసిస్టెంట్ ఇంజనీర్ రాజశ్రీ పాల్గొన్నారు.

బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం .!

బీసీ పల్లెబాట యాత్రని విజయవంతం చేద్దాం

బీసీ జే.ఏ.సీ నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున జరగబోయే గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను విజయవంతం చేయాలని బీసీ జే.ఏ.సీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ…. బిసి ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయా అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్రను గత కొన్ని రోజుల క్రితం కొండ లక్ష్మణ్ బాపూజీ స్వగ్రామమైన వాంకిడి,అసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారు.యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారీగా తిరుగుతూ బీసీ సబ్బండ వర్గాలను ఒకటి చేసి సభలను,రౌండ్ టేబుల్ సమావేశాలను ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.అలాగే ఈ యాత్ర మే10 తేదీ ఆదివారం రోజున మంచిర్యాల పట్టణానికి చేరుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. యాత్రకు స్వాగతం తెలిపి, సాయంత్రం 4:00 గంటలకు మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ నుంచి ఐ.బి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ యొక్క గ్రామ,గ్రామీన జాగృతికై మేమెంతో.. మాకంత పల్లేబాట యాత్ర కార్యక్రమానికి జిల్లాలో ఉన్న విద్యార్థిని,విద్యార్థులు, రాజకీయ నాయకులు,వివిధ కులసంఘాల నాయకులు,కవులు,కళాకారులు,ప్రజా సంఘనాయకులు,ప్రజాప్రతినిధులు బీసీ కుటుంబ సభ్యులు,బీసీ మద్దతుదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు పరికిపండ్ల అశోక్,వడ్డేపల్లి మనోహర్,గుమ్ములశ్రీనివాస్, విద్యార్థి నాయకులు చేరాల వంశీ,హరీష్ గౌడ్,బీసీ జిల్లా నాయకులు గజ్జలి వెంకన్న, బీసీ యువజన నాయకులు లతీఫ్,ఎర్రోళ్ల రాజు,సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు.

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం .

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మే 22న తేదీన జరిగే హిందూ ఏక్తా యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని హిందువుల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. ప్రతి ఒక్క హిందూ పార్టీలతో, కులలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరు సంఘటితమై స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. ప్రతి ఒక్క హిందూ హాజరై ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, కారుపాకల అంజిబాబు, బద్ధం లక్ష్మారెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేం కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ

జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ లో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నుండి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామిక ప్రజలు వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్, గాంధీనగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇంజిపెల్లి విక్రం, సాగర్, పవన్, సాంబయ్య  పాల్గొన్నారు

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి.

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి.

డి ఎస్ పి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మహారాజ్.

చిట్యాల, నేటిధాత్రి :

 

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ వి శారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున పదివేల కార్లతో అదిలాబాదులో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్, జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్, చిట్యాల మండల అధ్యక్షులు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి, నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టే వాడ కుమార్, నవాబ్ పేట గ్రామ అధ్యక్షులు చిలుముల శశి కుమార్,గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ మరియు బొడ్డు పాల్ చరణ్ పాల్గొన్నారు.

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన.

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర….

పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం….

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు…

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని అన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు గారు..

హాసన్పర్తి( నేటిదాత్రి ):

 

 

 

రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో
జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోకసభ సభ్యులు శ్రీ.రాహూల్ గాంధీ గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు హాసన్పర్తి మండల పరిధిలోని కొత్తపల్లి, మల్లారెడ్డి పల్లె అర్వపల్లి గ్రామాలలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర లో ముఖ్య అతిథులుగా పాల్గొని డప్పు సప్పుడు కొడుతూ నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరిచిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించి పరిరక్షణ యాత్ర ను ప్రారంభించి సుమారు 5 కిలోమీటర్ల వరకు ప్రజలకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముఖ్య ఉదేశం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.నేడు పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని,ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు,అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా గారు అంబెడ్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ టిఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు.గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యంగాన్నీ అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తుంది,ప్రజల సమాన హక్కులు,సమ న్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగo ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూన్న తీరు తీవ్ర ఆక్షేపనియంగా ఉంది ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు..అందుకే రాజ్యoగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతపాక సునీత, మహిళా అధ్యక్షురాలు జోరికపుల, నాయకులు వీసం సురేందర్ రెడ్డి, రామంచ ఐలయ్య, యూత్ నాయకులు జట్టి యుగేందర్, మంద రాజు, నితిన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…

మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర

త్వరలో ముహూర్తం ఖరారు ? -సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పూర్తి చేయాలని సంకల్పంతో యాత్ర

-ప్రాజెక్టు తో మూడు నియోజక వర్గాలకు ఒక్కొనియోజజవర్గనికి లక్ష ఎకరాల ఆయకట్టు కింద సాగు నీరు అందించలనే ఆకాంక్ష

-జిల్లాలో ఉన్న మంజీర నది ఉన్న రైతుకూ వర్షాధారం దిక్కు -ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వరం రోజుల పాటు పాదయాత్ర

-130 కి.మీ, పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో రోజుకో సభ. -చివరి రోజు సభకు కేసీఆర్ హాజరు?

జహీరాబాద్. నేటి ధాత్రి:

నారాయణ ఖెడ్, అందోల్, నియోజకవర్గాలకు సాగు నీరు కోసం,చేపట్టిన సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పథకం ప్రజాక్ట్ పనులను ప్రారంభించుటకు శంకుస్థావన పనులను అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో 2022 లో ఫిబ్రవరి 21 న నారాయణఖేడ్ లో అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ శంకు స్థాపన చేశారు, ఆర్థిక మంత్రి గా ఉన్న హరీష్ రావు, నేతృత్వంలో ఆయా ఎమ్మెల్యే లు మాణిక్ రావు, భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, చింత ప్రభాకర్ ల నేతృత్వం లో పైలాన్ ఆవిష్కరించి ప్రసంగించారు, కానీ ఆ తర్వాత అదే ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ను అందోళ్ నియోజక వర్గంలోనీ మునిపల్లి మండలం చిన్న చెల్మెడ గ్రామ శివారులో హరీష్ రావు శంకు స్థాపన చేశారు.. అందోల్ జహీరాబాద్ నియోజక వర్గ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్,సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ ఛైర్మెన్ ఎం శివకుమార్, తో కలిసి బూమి పూజ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆయా
నియోజకవర్గాల నాయకులు రైతులు పాల్గొన్నారు. టెండర్ పనులను కూడా ఖరారు చేసారు, కానీ హనుయంగా 2023 సం రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ అధికారం చేపట్టింది, అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జిల్లా మంత్రి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తి పోతాల పనులను మరుగున పడేశారు, అని ఇటీవల జహీరాబాద్ నియోజక వర్గం జరాసంగం మండలం లోని మేధపల్లి గ్రామ మాజీ సర్పంచ్ యువ నాయకులు పరమేశ్వర్ పాటిల్, అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలం అయింది అని ఉమ్మడి రాష్ట్రం లో ఉన్న రాష్ట్ర రైతుల పరిస్థితి ఇప్పుడు కూడా ఉన్నది అని సాగు నీరు లేక వర్షాధార పంటలు సాగుచేసి ఆకాశానికి వర్షపు బొట్టు కోసం ఎదురు చూస్తున్నారు ఎత్తిపోతల పథకం పనులుపూర్తి చేయాలని పూర్తి కావాలి అంటే అది కేసీఆర్ కే సాధ్యం అని ఎవరివల్ల కాదు, అని ఆ రెండు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, దానికోసం రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాధ్యం అని, ఝరాసంగం మండల కేంద్రం లోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రగా ఐదు రోజులు పాదయాత్ర చేసి గజ్వేల్ మీదుగా ఎర్రవల్లి వరకు 140 కి మీ, పాదయాత్ర చేసి ఆ ఉక్కు గుండెల వాడు, భక్కపలచని కేసీఆర్ ను కలుస్తా, రైతుల సమస్య లను వివరిస్త అని పాదయాత్ర పూర్తి చేసి కేసీఆర్ కు అత్తుకొని బోగోద్వేగానికి గురై పాదాభివందనం చేశారు, దీనికి చలించిన ముఖ్యమంత్రి 31 జనవరి 2025 రోజు జహీరాబాద్ నియోజక వర్గం నుండి పాదయాత్రగా వచ్చిన పరమేశ్వర్ పాటిలు మద్దతుగా వచ్చిన నియోజక వర్గ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ ఛైర్మెన్ ఎం శివకుమార్, సంఘీభావంగా మాజీ మంత్రి హరీష్ రావు, చింత ప్రభాకర్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. దీంతో పాదయాత్ర గా బయలు దేరిన పరమేశ్వర్ పాటిల్ గూర్చి మాట్లాడుతూ, రైతుల పక్షాన దేనికైనా సిద్ధం నీ పాదయాత్ర వృద్ధిపోదు, నీలాంటి యువకులు ముందుకు రావాలి. ఆ రోజు ఉద్యమం మొదలు పెట్టినరోజు ఒక్కడినే కానీ యువకులు, విద్యార్థులు,, అన్ని సంఘాల వారు ముందుకు వచ్చి నాకు మద్దతుగా నిలిచిన రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఉవ్వెత్తున ఎగసి రాష్ట్రం సాధ్యం అయింది, అని అన్నారు. చాలా రోజులకు మొట్టమొదటి సరిగా జహీరాబాద్ ప్రాంతం వారితో కలిసి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి బావోగ్వేధంగా ప్రసంగించారు.. అప్పుడు అక్కడే పక్కన ఉన్న హరీష్ రావుకి మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం కోసం మరో ఉద్యమం మొదలు పెట్టు దానికోసం నారాయణ ఖేడ్, జహీరాబాద్ , అందోల్ నాయకులతో కలిసి ప్రతేక సాగునీటి ఉద్యమం మొదలు పెట్టు అని పేర్కొన్నారు.
దానికోసం మాజీ మంత్రి హరీష్, ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేల జహీరాబాద్ ఎమ్మెల్యే తో మాట్లాడి ప్రతేక పోరాటానికి సిద్ధం అయి పాదయాత్రకు సిద్ధ పడ్డారు, దీనికోసం ప్రత్యేకంగా పాదయాత్ర చేయడానికి ఒక వారం రోజుల పాటు పడుతుంది అని, రోజు 18, నుండి 20 కి,మి, పాదయాత్ర కొనసాగుతుంది అని వారం రోజులు పాదయాత్ర చేస్తే 130, నుండి 140 కి. మీ
పాదయాత్ర కొనసాగవచ్చు అని తెలుస్తుంది, సంగారెడ్డి, జహీరాబాద్ అందోల్ నారాయణ ఖేడ్, నాల్గు నియోజక వర్గాలకు నాల్గు లక్షల ఎకరాలు సాగునీరు అందేలా చూడాలి అని దానికోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ల మరో సాగునీటి ఉద్యమం మొదలు పెట్టి రైతులకు సాగునీరు అందించడమే కేసీఆర్ లక్షం అని దానికోసం ఆయన అడుగుజాడల్లో దేనికైనా సిద్ధం అని అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో ఉంటే త్వరలో పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది, ఈ రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి అయితే 397 గ్రామాలకు సాగునీరు వచ్చి నాల్గు లక్షల ఎకరాలు ఆయకట్టు పూర్తి అవుతుంది అని బి ఆర్ ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం నుండి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది, ఇక్కడి నుండి పాదయాత్ర మొదలు పెట్టి నారాయణ ఖేడ్, పట్టణం లోని బసవేశ్వర మందిరం వరకు కొనసాగి పాదయాత్ర పూర్తి అవుతుంది, పాదయాత్ర లో నాల్గు నియోజక గ్రామాలు ఉండేలా రూట్ మ్యాప్ తయారు చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాదయాత్ర లో భాగంగా రోజుకొక గ్రామంలో ప్రతేక సభలు ఉండేలా రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు.. పాదయాత్ర ముగింపు రోజు కేసీఆర్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version