పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

*పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం*

*కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే*

శాయంపేట నేటిధాత్రి:

 

పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆడబిడ్డల వివాహా లకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకా లను అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అర్హులైన 57 మంది లబ్ధిదారు లకు రూ.57,06,612 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మరియు వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 32 మందికి రూ.10,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోం దని, సామాజిక సమానత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికా రులు చిత్తశుద్ధితో పనిచేయా లని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు శాయంపేట నియోజక వర్గంలో అమలు చేయను న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు మండలంలో ని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ కార్య క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

శాయంపేట గ్రామాల్లో వైకుంఠధామ సమస్యలు

*ఆఖరి మజిలీ లోను ఎన్నో కష్టాలు!*

*పట్టించుకోని అధికారులు*

*అంత్యక్రియలకు అవస్థలు*

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో పలు గ్రామాల్లో దహనసంస్కారా లకు ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు గత ప్రభు త్వం ప్రతి గ్రామ పంచాయతీకి వైకుంఠ ధామాలను నిర్మిం చింది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే తంతు నడు స్తుంది కనీస వసతులు లేక దహనసంస్కారాల్లో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని స్మశానవాటికల్లో దారి గుండా చెత్తాచెదారంతో ఉంది.

*విద్యుత్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు*

శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వైకుంఠధామానికి ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు పంచాయ తీరాజు విద్యుత్ శాఖ సమన్వయం లోపం కారణంగా విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది దీంతో అంతక్రియల నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతు న్నాయి ఊరికి దూరంగా ఉండడంతో విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు భారీగా నిధులు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించాలి

*అంత్యక్రియలకు ఇబ్బం దులు*

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన స్మశాన వాటికలు ఊరికి దూరంగా ఉండటంతో పాటు నీటి వసతి ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఊరికి సమీపంలో ఖాళీ స్థలంలో చెరువులు కుంటలు ఉన్న సమీపంలో అంత్యక్రియలకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి సౌకర్యాలు మెరుగుపరిచి వైకుంఠధామాలకు అందు బాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు

*స్మశానవాటికలు వినియో గంలోకి తీసుకురావాలి*

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో స్మశానవాటి కల్లో కనీస వసతులు లేక దహ న సంస్కారాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతు న్నారు మండలంలో నిర్మించిన స్మశాన వాటికలు విద్యుత్ నీటి మౌలిక వసతులు లేని కారణంగా ప్రజలకు తీవ ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి స్మశానవాటికలో కనీస వసతులు కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నారు

*వైకుంఠధామంలో అన్నీ సమస్యలే*

ప్రతి వైకుంఠధామంలో బోరు, విద్యుత్ గదిలో తలుపులు అన్ని సౌకర్యాలు ఉండాలి అవేమి పట్టించుకోకుండా అధికారులు వైకుంఠదామాన్ని వదిలేశారు చివరికి ఎవరైనా అంత్యక్రియలు తీసుకెళ్తే అన్ని సమస్యలే ఏర్పడుతున్నాయి ఎంపీడీవో ,ఎంపీ, పంచాయతీ రాజ్ అధికారులు పట్టించుకోని దాఖనాలు లేవు. నిర్మాణంలో నాణ్యత పాటించక పోవడంతో కొన్ని వైకుంఠ ధామాలు పగు లు తున్నాయి గ్రామానికి అనుకూలంగా చివరన వైకుంఠ దామాలను నిర్మించారు. పం చాయతీ వీటిని కొంతమేర ప్రజలకు నీటిని అందుబా టులోకి తెచ్చిన అది కూడా తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడుతుంది అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వైకుంఠధామాల నీటి వసతి మౌలిక వసతులు లేకపోవ డంతో ప్రజలకు వినియోగం లేకుండా పోతుంది ప్రతి గ్రామంలో అదే పరిస్థితి నెల కొంది వసతులు లేకపోవ డంతో వైకుంఠధామాలు ప్రజలకు అంతిమ కష్టాలు ఏర్పడుతున్నాయి.

 పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్..

 పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే

 

బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు.

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో పలువురు బూత్ లెవల్ అధికారుల (BLOs) మరణాలకు బీజేపీని కాంగ్రెస్ తప్పుపట్టింది. పని ఒత్తిళ్ల కారణంగా బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. హడావిడిగా ఎస్ఐఆర్ అమలు చేయాలనుకోవడం గతంలో పెద్దనోట్ల రద్దు, కోవిడ్ 19 లాక్‌డౌన్ పరిస్థితిని గుర్తుచేస్తోందని విమర్శించింది.
బీజేపీ ‘ఓట్ చోరీ’ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు. తీవ్రమైన పని ఒత్తిళ్లతోనే బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

‘ప్రాణాలు కోల్పోయిన అధికారుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. క్షేత్ర స్థాయిలో అందుతున్న సమాచారం బట్టి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఇది చాలా బాధాకరం. ఈ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు?’ అని ఖర్గే ప్రశ్నించారు. అధికారాన్ని తస్కరించిన ఆనందంలో బీజేపీ ఉంటే, ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా చూస్తోందని ఆయన ఆరోపించారు. హడావిడిగా, ఏమాత్రం ప్రణాళిక లేకుండా బలవంతంగా ఎస్ఐఆర్ అమలు చేస్తుండటం పెద్ద నోట్ల రద్దు, కోవిడ్-19 లాక్‌డౌన్ నాటి పరిస్థితిని తలపిస్తోందని విమర్శించారు. ‘జరిగిందేదో జరిగింది. ఇక చాలు. ఇప్పటికైనా మనం మేలుకోని ప్రజాస్వామ్య మూలస్తంభాలను కాపాడుకోకుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. అమాయక బీఎల్‌ఓల మరణాలకు ఎస్ఐఆర్‌, ఓట్ చోరీపై మౌనం వహిస్తున్న వారే బాధ్యులు. మీ గళం వినిపించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని ఖర్గే కోరారు.

పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో బీఎల్ఓగా పనిచేస్తున్న ఒక మహిళ శనివారంనాడు తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. ఎస్ఐఆర్‌ పని ఒత్తిళ్ల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు తెలిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగానే పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని అన్నారు. బీఎల్ఓ సూసైడ్ నోట్‌ను కూడా ముఖ్యమంత్రి షేర్ చేశారు. అయితే ఈ సూసైడ్ నోట్ అబద్ధమని బీజేపీ నేత రాహుల్ సిన్హా కొట్టివేశారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని రైసేన్, దమోహ్ జిల్లాల్లోనూ బీఎల్ఏ పనుల్లో ఉన్న ఇద్దరు టీచర్లు అస్వస్థత కారణంగా గత శుక్రవారం మరణించడం మరింత ఆందోళనకరంగా మారింది.

జోరుగా ఇందిరమ్మ చీరల పంపిణీ…

జోరుగా ఇందిరమ్మ చీరల పంపిణీ

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వ లక్ష్యం

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోమహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందని భూపాలప ల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. మం డల కేంద్రంలో హన్మకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీకార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు హాజరై ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహి ళల అభ్యున్నతికి సీఎం రేవం త్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఎన లేని ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తు న్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదా లు, లోటుపాట్లకు తావులే కుండా ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆడబిడ్డలకు చీర,సారె పెట్టడం

 

 

 

మనసంప్రదాయమని అన్నా రు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులకు వారిని యజమానులను చేశామని అన్నారు. స్కూల్స్ యూనిఫాం లు కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగిం చామని అన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్‌ తో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కూడా మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కుటుంబ అభ్యున్నతిలో మహి ళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని ఎమ్మె ల్యే హితువు పలికారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్య క్రమం అనంతరం మండ లంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 18 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారు లకు రూ.5,23,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గండ్ర దంపతులకు ఆహ్వానం…

గండ్ర దంపతులకు ఆహ్వానం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పసునూటి శ్రీదేవి-రాజయ్య దంపతుల కుమార్తె ఈ నెల 29 ఆది వారం సంధ్య- గణేష్ వివాహ మహోత్సవానికి పాల్గొనడాని కి పరకాలనివాసంలో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమ ణారెడ్డి కలిసి కొప్పుల గ్రామ ప్రధాన కార్యదర్శి పసునూటి రాజ య్య కూతురు పెళ్లికి రమ్మని ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది.ఈ కార్య క్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు, నాగార్జున్, మహేందర్ పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన..

మహాత్మ జ్యోతిరావు పూలే విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన

సృజనాత్మకత పెంపొం దించే దిశగా విద్యార్థులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలకేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు శనివారం స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. పోస్ట్ కార్డు రాసి పంపించే విధాన ము, డబ్బులు జమ, డబ్బు లను తీసే విధానంలో మెలు కువలు అవగాహన కల్పిం చారు. ప్రభుత్వ పథకాల లబ్దికోసం ప్రజలకు ఉపయోగ పడతాయని తెలిపారు అదే విధంగా బ్యాంకు వల్ల ప్రయో జనాలు, రేషన్ షాపు వల్ల ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు ఆలోచించే తత్వం, సృజనా త్మకత పెంపొందించే దిశగా నడవడం కోసం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేవతి, సుభాష్ చంద్రబోస్, పిఈటి దన్ పాల్, మల్లేశం, సుధాకర్ విద్యార్థులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం….

హెచ్ఐవి పై అవగాహన కార్యక్రమం

మొబైల్ ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం

శాయంపేట నేటిధాత్రి:

 

ఐసిటిసి ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గ్రామ స్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి హెచ్ ఐవి ఎయిడ్స్, టిబి, సిఫిలిస్, హెచ్ బీ ఎస్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ట వివక్ష చూపవద్దని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపవద్దని, వ్యాధిగ్ర స్తులకు అందించే చికిత్స గురించి తెలియజేశారు. హెచ్ఐవి వస్తే ఏఆర్ టి ద్వారా మందులు వాడి నిజజీవితాన్ని గడపవచ్చు. ప్రతి గర్భవతి దగ్గర ఉన్న ఐసీటీసీ సెంటర్ కు వెళ్లి హెచ్ఐవి పరీక్ష చేయించు కోవాలి.ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినందన్ రెడ్డి, ఏఎన్ ఎం సునీత, కుమార స్వామి, సిఎల్ డబ్ల్యూ స్వప్న, వీరన్న, మైలారం వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు…

ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు

నమస్తే తెలంగాణ ఆఫీస్ పై దాడి చేయడం సిగ్గు చేటు

మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడడం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలి స్టులపై దాడి హేయమైన చర్య మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా వారిపై దుర్భాష లాడుతూ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ప్రజాపాలన కొన సాగించాలని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రాబోయే కాలంలో విద్యార్థులు యువ కులు ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చ రించారు. ఇప్పటికైనా ఇటు వంటి చర్యలు మానుకోవాలని కొనియాడారు లేనిపక్షంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపు తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి సీనియర్ జిల్లా నాయకులు బెరుగుతరుణ్ గోపి కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు అభిలాష్ ,సిద్దు, శివకుమార్, ప్రశాంత్, వినయ్, వంశీ, సాయి కృష్ణ తేజ ,గణేష్ ,మున్ని, నాని మేఘనాథ్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి…

వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి?

వీధి కుక్కలకు వింతరోగా


లు…పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వింత రోగంతో సంచరిస్తున్నాయి. కుక్కల గురించి పలుమార్లు అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన పట్టిం చుకోని వైనం.. పగలు, రాత్రి గుంపులు గుంపులుగా తిరు గుతూ కుక్కలు,పిల్లలు ,వృద్దు లు, పశువుల పైన దాడులు భయాందోళనలో మండల ప్రజలు. మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య రోజుకి విపరీతంగా పెరిగి స్థాని కులకు భయాందోళనకు గురి చేస్తుంది అని ప్రజలు వాపోతు న్నారు ఈ క్రమంలో వీధి కుక్క ల నియంత్రణకు చర్యలు ఏవి అని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వీధిలో ఇండ్ల ముందు,పాఠశాలలు, అంగన్వాడి భవనాల ముందు గుంపులు గుంపులుగా తిరు గుతూ ఆందోళనకు గురిచేస్తు న్నాయని స్థానికులు వాపో తున్నారు గ్రామంలో సంచ రించే అన్ని కుక్కలకు వింత రోగం సోకినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో వింత రోగా నికి గురైన కుక్కలు చాలా మంది పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఇదివరకే చూసామన్నారు పిల్లలు వృద్దులు, పాదా చారులపై కూడా దాడి చేసి గాయపరిచాయని అన్నారు మనుషుల పైన కాకుండా పశువులు,కోళ్ళు, మూగజీ వులను సైతం గాయపరి చాయని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కల స్వేర విహారం

పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల వద్ద కుక్కలు తిరుగుతుండడం తల్లిదం డ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు వీధి కుక్కలకు సోకిన వ్యాధిని నియంత్రిం చేందుకు పశువైద్య, పంచా యితీ అధికారులు, కార్య దర్శిలు సంయుక్త చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అవసరమైతే కుక్కల నిర్బంధ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతు న్నారు ఒకవేళ సమస్య తక్షణమే పరిష్కరించక పోతే పెద్ద ప్రమాదాలు జరగవచ్చని అన్నారు కావున వీధి కుక్క లకు వింత రోగాలు నియంత్రిం చేందుకు తక్షణమే తగు చర్య లు చేపట్టాలని మండల ప్రజ లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

కుక్కలకు వింత రోగం చర్యలు తీసుకోండి.. మండ ల యువకుడు కందగట్ల సంతోష్

శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద విలక్షణ రహితంగా కుక్కల ఒంటిమీద పుండ్లు చీము కారుడు ఈగలు వారుట వాటివి చూసి ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు అదేవిధంగా పలు గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులు గుంపు లుగా సంచరిస్తున్నాయి అందులో కొన్ని కుక్కలకు వింత రోగం సోకి గ్రామస్తుల పైన పశువులు మూగజీవుల పైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని పంచా యితీ అధికారులకు పలు మార్లు సమాచారం అందించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కుక్కలకు కలిగిన వింత రోగాలపై రాష్ట్ర ప్రభు త్వము చొరవ తీసుకొని వాటి సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు.

*రాష్ట్రబందులో పాల్గొన్న బిజెపి నాయకులు…

*రాష్ట్రబందులో పాల్గొన్న బిజెపి నాయకులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనకై బీసీ జేఏసీ ఇచ్చినటు వంటి తెలంగాణ బందుకు మద్దతు తెలుపుతూ బందు లో పాల్గొన్న బిజెపి మండల నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామ కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బిసి డిక్ల రేషన్లు లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఆరోజు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలో వచ్చిన కాడి నుంచి బీసీలను మభ్యపెడుతూ బీసీలను మోసం చేసే కుట్ర పన్నుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాలని భారతీ య జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు గడువు పూర్తి అయి రెండు సంవత్సరాలు కావ స్తున్న ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మోసపూరిత హామీల తోటి బీసీలను 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మభ్యపెడు తూ కాలం వెళ్లబుచ్చుతుంది తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి అనేది లేదు అని ఏ రోజుకైనా బీసీలకి న్యాయం చేసే పార్టీ బిజెపి పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగి లి, సీనియర్ నాయకులు బూ ర ఈశ్వరయ్య, జిల్లా ఓబిసి మోర్చ నాయకులు ఉప్పు రాజు, మండల ప్రధాన కార్య దర్శి భూతం తిరుపతి, కురా కుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T110750.919.wav?_=1

 

 

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన చందాసంధ్య మరియు చంద ప్రశాంత్ గత నాలుగు సంవత్స రాల నుండి ఇంటి స్థలం విష యంలో గొడవలు జరుగు తున్నాయి ఈ విషయంలో పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసుకొని వారు చెప్పిన విధంగా విన్న కూడా వారు మాపై తరచూ గొడవలు పడుతూ మమ్మల్ని ఎప్పటి కైనా చంపేస్తామని బెదిరిస్తు న్నారు.ఇదే క్రమంలో నా భర్త సుధాకర్ ను మరియు నన్ను చంపాలని ఉద్దేశంతో వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చందా ప్రశాంత్ అతని తల్లి చంద విజయ అతని అక్క ఆకుతోట జ్యోతి అతని భావ ఆకుతోట పూర్ణచందర్ అతని మేనమామ చింతపట్ల రాజు కిట్టు మా ఇంటికి వచ్చి గొడ్డలి, రాడు, కర్రలు పట్టుకొని వచ్చి నా భర్త మా ఇంటి ముందు ఉండగా చంపుతా అంటూ ఒక్కసారిగా నా భర్త పై దాడి చేశారు. వెంటనే నా భర్త అరువగా బయటకు వచ్చి నేను చూసేసరికి చందా ప్రశాం త్ గొడ్డలితో నా భర్త తలపై గొడ్డలి కాటు, ఆకుతోట జ్యోతి ఇనుపరాడుతో మిగతావారు కర్రలతో కొట్టడం జరిగింది వెంటనే నేను నా భర్తను కొట్ట వద్దని అడ్డు వెళ్లాగా వారు నన్ను చేతులతో కొట్టారు.ఇట్టి గొడవను చూసిన నేను చుట్టు పక్కల వారైనా నరసయ్య, కోటయ్య, సత్యనారాయణ వచ్చి కొట్ట వద్దని ఆపబోతే వారిని అడ్డువస్తే చంపుతా మంటూ బెదిరించి వెళ్లిపో యారు వాళ్లు గాయపరచగా నా భర్తకు తలకు నాలుగు ఐదు చోట్ల రక్త గాయాలైనాయి మరియు కుడికాలు బలంగా గాయంతో అయినవి చుట్టుప క్కల వారి సహాయంతో నేను 108 లో చికిత్స కోసం వరంగ ల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్ళి నాని అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం శ్రీనివా స్ ఆసుపత్రి తీసుకుని వెళ్లాను ప్రస్తుతం నా భర్త చికిత్స పొందుతూ ప్రాణాపాయస్థితి లో ఉన్నందున చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు

బీసీలకు 42 శాతం రిజర్వే షన్లకు కట్టుబడి ఉన్నాo…

బీసీలకు 42 శాతం రిజర్వే షన్లకు కట్టుబడి ఉన్నాo

బీఆర్ఎస్,బిజెపిలే అడ్డు కున్నాయి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

న్యాయస్థానాల నుండి ఎలాంటి స్పందన ఉన్నా బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామని ఇచ్చిన హామీ పై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శుక్రవారంమండ లంలోని కొప్పుల జోగంపల్లి పెద్దకొడెపాక, గోవిందపూర్ హుస్సేన్ పల్లి ,పత్తిపాక గ్రామా లలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రం ఓటు చోరి కి పాల్పడుతుందని ప్రజల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల లో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయంగా కులగణన చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, శాసన సభలో బిల్లు పాస్ చేయించి గవర్నర్, రాష్ట్రపతికి పంపిస్తే బిజెపి అడ్డుకుందని ఆరోపిం చారు. అలాగే 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లను అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం 50 శాతం మించకుండా కుదించింది. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కులగననచేసి రిజర్వేషన్లు పెంచాల్సి ఉండగా ఎందుకు పెంచ లేదో బీసీలకు సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి, బీఆర్ఎస్ లు బీసీల వ్యతిరేక పార్టీలుగా మిగిలి పోయాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడు తూ ఓటు చోరీ చేస్తుందని, ఓటు చోరి ఆపాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పోరాటానికి మద్దతుగా ప్రజల వద్ద సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయ కులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి మారేపల్లి రవీందర్ చిందం రవి, చిట్టి రెడ్డి రాజిరెడ్డి డిటి రెడ్డి సామల మధుసూదన్ నిమ్మల రమేష్ వైనాల కుమార స్వామి హైదర్ కుమారస్వామి వెంకట్ రాజిరెడ్డి ఏరుకొండ శంకర్ కొమ్ముల సదానందం పైడి బిక్షపతి భద్రయ్య నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రౌడీషీటర్లు తీరు మారకుంటే పీడీయాక్ట్

రౌడీషీటర్లు తీరు మారకుంటే పీడీయాక్ట్

చట్టవ్యతిరేక కార్యక్రమా లకు పాల్పడితే కఠిన చర్యలు

శాయంపేట నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

శాయంపేట మండల పరిధి లోని రౌడీషీటర్లకు సిఐ రంజిత్ రావు ఎస్ఐ పరమేశ్వర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ,ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల వేళ ఎలాంటి చర్య లకు లోను కాకుండా, లైంగిక నేరాలకు పాల్పడకూడదు చట్టపరంగా జీవించాలని వారు తెలియజేశారు భవిష్య త్తులో పదేపదే ఇటువంటి నేరాలుగాని ఏ ఇతర నేరాలకు పాల్పడినచో తిరిగి రౌడీషీటర్ ఓపెన్ చేయడం జరుగుతుం దని పీడీ ఆక్టివ్ అమలు చేసి సంబంధిత చట్టాలను తీసు కొని మీకుకఠిన చర్యలు పడేవి ధంగా చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో పోలీస్ సిబ్బంది పాల్గొ న్నారు.

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి…

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మం డల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు తదనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మరిం చుకుంటూ మండల అధ్యక్షు డు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవిత సారాన్ని గుర్తు చేశారు.పండి ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ స్థాపకులలో ఒకరు. ఆయన జీవితం ఏకత్వం, మానవతా భావన, అంత్యో దయ సిద్ధాంతాల స్పష్టమైన ప్రతీక. విద్యార్థులు, యువత మరియు ప్రజల జీవితాలను మార్గదర్శకంగా మార్చిన ఆయ న సిద్ధాంతాలు, సూత్రాలు ప్ర స్తుత సమాజానికి స్ఫూర్తి ఇస్తాయని పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ విద్యారంగం లో చేసిన సేవలు, సామాజిక సదుపాయాల పట్ల ఆయన ఇచ్చిన దృష్టి, మానవతా సూత్రాలపట్ల ఆయన ప్రతిబద్ధ తపై ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పారు. పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజంలోని అసమానతల నివారణకు మార్గం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వంటి విలువలను ప్రతిబింబి స్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, యువర్ మోర్చా జిల్లా నాయ కులు కొత్తపల్లి శ్రీకాంత్ మండ ల ఉపాధ్యక్షుడు కోమటి రాజ శేఖర్, భూత్ అధ్యక్షులు బాసా ని నవీన్,గొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి…

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ సాయి కృష్ణ సూచించారు ఇటీవల కురు స్తున్న భారీ వర్షాలతో ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు లేకుండా చూసు కోవాలని నీరు నిలిచిన ప్రాంతా ల్లో ఈగలు దోమలు చెరి అనారోగ్యాల పాలవుతారని కచ్చి తంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు ప్రస్తుతానికి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్ దగ్గు జలుబు స్కిన్ ఇన్ఫెక్షన్లు విరోచనాలు వాంతులు రక్త కణాలు తగ్గడం లాంటి సమస్యలతో హాస్పిటల్ కు రోగులు వస్తున్నట్లు తెలి పారు ప్రజలు సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు

ఇసుక అక్రమ రవాణా ఫై ఉక్కు పాదం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T130950.896.wav?_=2

 

ఇసుక అక్రమ రవాణా ఫై ఉక్కు పాదం

ఇందిరమ్మ ఇండ్ల ఇసుక మొరం పై అధికారుల సమీక్ష

శాయంపేట నేటిధాత్రి:

 

 

పేదల సొంతింటి కలను నెరవేర్చే వారి జీవన ప్రయాణ మెరుగుపరచడానికి తెలంగా ణ ప్రభుత్వం ఇందిరమ్మ నిర్మా ణాన్ని అమలు చేసింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలైన సొంతింటి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి తగిన సహాయం చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మొరం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు చర్చించారు. శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఇందిరమ్మ గృహాల నిర్మాణం కొరకు కావలసిన ఇసుక మొరం వాటిపై ప్రభుత్వ అధికారులు చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల ఇసుక రవాణా పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వ నిబంధనలు అనుగు ణంగా సరఫరా వ్యవస్థను నిమిత్తం ఇసుక తరలించే వాహనాలకు లైసెన్సు కలిగి ఉండి కూపన్ల సహాయంతో సరఫరా చేయాలి ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మకూడదని తెలియజేశారు ఇట్టి నియమా లను పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో సీఐ రంజిత్ రావు ,ఎస్సై పరమేశ్వర్, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణిచంద్ర , గ్రామపంచాయతీ కార్య దర్శి అధికారులు పాల్గొ న్నారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ను అరెస్టు చేయడం సిగ్గు చేటు…

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ను అరెస్టు చేయడం సిగ్గు చేటు

వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి

శాయంపేట నేటిధాత్రి;

 

 

శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే రోడ్డె క్కి తమ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలంటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు లు నిన్న ధర్నా చేయడం, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఇసుక అక్రమ రవా ణాను అడ్డుకుంటానని బహిరం గంగా చెబుతూనే తన అనుచరులతో ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నా డంటూ కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారంటే, అక్రమ ఇసుక రవాణా ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవ చ్చు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారంటే వారికి ఏమైనా హామ్యామ్యాలు అందుతున్నాయా విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు కొమ్ముకోస్తున్నా రంటూ విమర్శలు వస్తున్నా యి, కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కారంటే అవినీతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు, ఇకనైనా నియోజకవర్గ ప్రజలు మన ఎమ్మెల్యే అవి నీతి అక్రమాలను అర్థం చేసుకోవాలని, నిన్న టేకుమట్ల మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అంటూ వారికి బేష రత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందివ్వ లేని అసమర్ధ ఎమ్మెల్యే ఇదే అదనుగా అక్రమంగా ఇసుక తరలిస్తూ పైసలు దండుకుం టున్నాడు. దీన్ని నిశితంగా పరిశీలిస్తున్న నియోజకవర్గ ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వంగల నారాయ ణరెడ్డి, రామ్ శెట్టి లక్ష్మారెడ్డి, మేకల శ్రీనివాస్, మారపెల్లి నందం, మారపెల్లి మోహన్, అరికెళ్ల ప్రసాద్ దైనంపల్లి సుమన్ , కుసుమ శరత్, మేకల వెంకటేశ్వర్లు, వల్పదా సు చంద్రమౌళి,గడిపే విజయ్, కరుణ్ బాబు, సౌల్ల కిష్టయ్య, నర్రరాజు, రంగు మహేందర్, కృష్ణారెడ్డి, కొమ్మల శివ, అజయ్ కుమార్, కుథాటి రమేష్, వినయ్ సోషల్ మీడి యా మండల కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

హనుమకొండలో ఆరోగ్య కేంద్రాల పరిశీలన…

హనుమకొండ జిల్లా పట్టణ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

 

 

 

 

హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య ఈరోజు పట్టణ పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు.
లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో టీబీ చికిత్స పొందుతున్నవారికీ దాతల సహకారంతో పోషకాహార కిట్ల ను అందించడం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్యనీ స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరికీ చికిత్స కాలంలో ఆరు నెలల వరకు పోషకార కిట్ లను అందించడానికి ముందుకు వచ్చిన నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి మేరీ కరుణను ఆయన అభినందించారు. ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు , రెడ్ క్రాస్,మనూస్ స్వచ్ఛంద సంస్థలు పోషకాహారకిట్లు అందిస్తున్నాయని, అలాగే తనతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది కూడా ముందుకు రావడం అభినందించ తగ్గదని ఆయన అన్నారు. డాక్టర్ హిమబిందు (1)వంగర వైద్యాధికారి డాక్టర్ ముతిర్ రెహమాన్ ( 2 ), నేరేడుపల్లి పల్లె దవఖాన వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ (4 ) , హెల్త్ సూపర్వైజర్ పి విప్లవ కుమార్ ( 5) వెంకటేశ్వర్లు(1) పోషకాహార కిట్లను అందిస్తున్నారని అన్నారు.
లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించి చికిత్స నిమిత్తం వచ్చిన వారితో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు అలాగే వాజ్పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు..కాలనీ లో పాత సామాను దుకానం లో నీరు నిలువ ఉన్న వస్తువు లను తొలగించాలని కోరారు. కొన్ని గృహాలను సందర్శించి వివరాలు ఇతర ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
శాయంపేట పట్టణ ఆరోగ్యకేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ ను సందర్శించారు. ఇప్పటివరకు 27 మందిని పరీక్షించినట్లు అందులో ఐదుగురికి రక్తపరీక్షలు సేకరించినామని అలాగే ఒకరిని మరిన్ని పరీక్షల నిమిత్తం రెపర్ చేసినట్లు గుర్తించడం జరిగింది.
ఇందులో అడిషనల్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ డి మదన్ మోహన్ రావు జిల్లా టీవీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు డాక్టర్ హైదర్ డాక్టర్ మౌనిక జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, సూపర్వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏఎన్ఎంలు ,ఆశాలు పాల్గొన్నారు.

చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

 

చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణం లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ల్ హాల్ లో ఆర్కే హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో పల్లె పల్లె కి వైద్య కార్యక్రమం లో భాగంగా చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 123వ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మునుగోడ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు వైద్య శిబిరం నిర్వహించినందుకు చావా ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కాదు, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ తోటి సామాజిక కార్యక్రమాలు చేయాలి. మా తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే  ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న చావా ఫౌండేషన్ కి మా ఫౌండేషన్ తరపున మా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది. నేను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక స్నేహితుడు లాగా ,వ్యక్తిగా సహాయం చేస్తా పదవి అనేది శాశ్వతం కాదు, కానీ మన వ్యక్తిత్వం సేవ చెయ్యాలని గుణం పుట్టిన నాటి నుండి మరణించే వరకు ఉంటుంది కానీ పదవి ఉండదు అన్నారు.

చెరువు నిండితేనే… పంటలు పండేది…

చెరువు నిండితేనే… పంటలు పండేది

చూస్తే వానలే.. చెరువు పూర్తిగా నిండలే

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కేంద్రంలోని దేవుని చెరువు నిండితేనే పంటలు పండు తాయి దేవుని చెరువు క్రింద ఉన్న పంట పొలాల దుస్థితి చెరువు వర్షం నీటి ఆధారంగా నిండుతుంది కానీ ప్రస్తుత చెరువు సగం మాత్రమే నిండింది. చెరువు నిండక పోతే భవిష్యత్తులో పంటల పరిస్థితి ఏమిటన్న బెంగ! దీంతో పంట పొలాలకు నీరు సరఫరా చేసేందుకు చాలా ఇబ్బందిక రంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.వాతా వరణ మార్పుల ద్వారా వర్షం పడితే నిండిన సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ దేవుని చెరువుకు వర్షపు నీరు చెరువు లోకి రాక నిడటం లేదు.

 

వర్షా లు కురవడంతో మండలం లోని చాలా చెరువులు మత్తడి పోస్తున్నాయి కానీ దేవుని చెరువుకు ఆధారం లేక నిడటంలేదు. చెరువుకు వచ్చే వరద రాక ఎస్సారెస్పీలో నీరు పడి వృధాగా పోతున్న వర్షపు నీరు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని చెరువు మత్తడి పోసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పాలకులు ఆ వైపుకు దృష్టి సాధించడం లేదు. దీంతో పొలాల రైతులు నీటి కొరత ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

అధికారులు స్పందించాలి

శాయంపేట మండల రైతు ముసికే అశోక్

మండలంలోని దేవుని చెరువు కింద పంట పొలాలు సుమా రుగా 600 ఎకరాలు సాగుతు న్నాయి. చెరువుకు ఏటా నీటి రావడం కోసం తిప్పలు పడు తున్నాం. వర్షపు నీరు చెరువు లోకి రాకుండా ఎస్సారెస్పీ కాలువలో పడి వృధాగా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టించుకోని పని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version