ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించిన వేముల మహేందర్ గౌడ్ దంపతులు

*ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వేముల మహేందర్ గౌడ్ దంపతులు*

మొగులపల్లి నేటి ధాత్రి

హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆ దంపతులు స్వామివారికి మొక్కులను సమర్పించారు. అనంతరం స్వామివారి సేవలో పరితపించారు. అనంతరం వేముల మహేందర్ గౌడ్ దంపతులు మాట్లాడారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ..భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ రాష్ట్రంలోని దేవాలయాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం..ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించడం, రాష్ట్రంలో ప్రజలంతా భక్తి మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ, సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడి పంటలతో కలకాలం వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

కొడవటంచ ఆలయ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

కొడవటంచ ఆలయ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం
కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకి స్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని గుత్తేదారులకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ ఆలయం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version