శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కావ్య..

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కావ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో ఈ నెల 21వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పున:ప్రతిష్ఠాపన నేపథ్యంలో గురువారం ఆలయానికి చేరుకున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణలో రెండవ యాదాద్రిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 12.15 కోట్ల భారీ నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టిందన్నారు. ఇటీవల ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అభివృద్ధి పనులను, అతిథి గృహాన్ని ప్రారంభించారని తెలిపారు. యాదాద్రి తరహాలో కొడవటంచను తీర్చిదిద్ది, గ్రామీణ పర్యాటక రంగాన్ని, ఆర్థిక ప్రగతిని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు, మాజీ వరంగల్ డిసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – వరద రాజేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి ప్రత్యేక పూజలు, ముగ్గుల పోటీలలో ఎమ్మెల్యే పాల్గొన్నాడు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో బోగి పర్వదినం సందర్భంగా కొత్తపల్లి(బి) గ్రామానికి చెందిన క్యాతం ఐలయ్య – వసంత మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే అట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముగ్గులు మన సంస్కృతి, సంప్రదాయాలకు మహిళల సృజనాత్మకతను ప్రతిబింబించే కళారూపమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సంప్రదాయాలు భావి తరాలకు చేరుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మహిళల భాగస్వామ్యంతో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరింత విస్తరించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కంది కొండ జాతర పనులు పరిశీలన

కంది కొండ జాతర పనులు పరిశీలన

డోర్నకల్ ఆర్సి నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం ఐన కురవి మండలంలోని కందికొండ గ్రామ శివారులో ఉన్న కందగిరి గుట్టపై కొలువు ఐన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి మహా జాతర సందర్భంగా ఈనెల 5వతేదీన కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించనున్న మహ జాతర నేపథ్యంలో జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టిన పనులు పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మాజీ జెడ్పీటిసి, కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, ఈ కార్యక్రమంలో మరిపెడ సిఐ రాజ్ కుమార్ గౌడ్, సిరొలు ఎస్సై సంతోష్, విద్యుత్ శాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version