వాగులు,వంకల అక్రమ కబ్జాలు.!

వాగులు,వంకల అక్రమ కబ్జాలు అవుతున్న అదికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రస్తుతం ఇది వర్షాకాలం వర్షపు నీటి ప్రవాహం ఇప్పుడున్న వాగులు వంకల ద్వారా పోవడం చాలా కష్టంగా మారింది ఆనీరంత ఇండ్లలోకి చేరే అవకాశం ఉంది ఎందుకంటే నీరు ప్రవహించే వాగులు వంకల విస్తిర్ణాన్ని చాలా చోట్ల కబ్జాలకు గురి అయింది ఇది అధికారుల నిర్లక్ష్యమే వర్షపు నీరు ప్రవాహామై పోతున్నప్పుడు వాటిని ఆపడం గాని దారి మళ్లించడం గాని చట్టరిత్య నేరం కానీ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి లంచాలకు మరిగి వర్షపు నీటి ప్రవాహాన్ని కుదించి మరలిస్తున్నారు లంచాలు తీసుకొని NOC లు ఇస్తున్నారు
దీనికి ఉ÷ దోబీ నాలా వాగు ఈ వాగు జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామం నుండి జహీరాబాద్ మండలం మరియు పట్టణ ప్రాంతాల నుండి పోయి చివరకు నారింజలో కలుస్తుంది దీని ప్రవాహం చాలా ఉదృతంగా ఉంటుంది ఈ వాగు పట్టణ శివారులో చాలా చోట్ల కుదించి కబ్జాలకు గురి అయింది డ్రీమ్ వ్యాల్యు కాలనీ దగ్గర కుదించారు వర్షాలు ఉదృతం అయినప్పుడు నీళ్ళన్ని కాలనిలోకి వస్తున్నాయి ఆతర్వాత ముందుకెళ్లే వాగునే దారి మళ్లించారు మరియు ఇంద్రప్రస్త కాలనీ వద్ద నీటి ప్రవాహాన్ని దారి మళ్లించారు ఇంకా ముందుకెళ్తే వాగు విస్తీర్ణాన్నే తగ్గించారు,అధికార పార్టీ నాయకులు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి వారే కబ్జాలకు పూనుకొంటున్నారు అధికారులపై వత్తిడులు తేచ్చి మామూళ్లు ఇచ్చి NOCలు తీసుకుంటున్నట్లు తెల్సింది అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు,ఈ వాగు ప్రవాహం వల్ల గతంలో డ్రీమ్ ల్యాండ్ కాలనీ,ఇంద్రప్రస్థ బై పాస్ ప్రక్కన గల కాలనీలు మొత్తం జలమయం అయ్యాయి, పట్టణ ప్రాంతం మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల భూముల ధరలు బాగా పెరిగినందువల్ల ఇక్కడో బయటి నుండి వచ్చిన రియల్ వ్యాపారులు నీటి ప్రవాహం గల వాగులు వంకలను కుదించి మూసివేస్తూ అధికార పార్టీ అండదండలతో అధికారులను లోబర్చుకొని వ్యాపారులు కోట్లు గడించాలన్న ఆలోచనతో సామాన్య ప్రజలకు నీటిలో మునిగే ప్లాట్లను విక్రయించి మోసగిస్తున్నారు దీనికి అధికారులు వంత పాడుతున్నట్లు అనిపిస్తున్నది అధికారులు గుర్తించుకోవాలి వారికిచ్చే జీతం ప్రజల సొమ్ము నిబంధనలను పాటించి నాళాలను కాపాడి జహీరాబాద్ జలమయం కాకుండా కాపాడాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది లేని ఎడల ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,నాయకులు శివకుమార్ లు ఉన్నారు.

గుట్టుచప్పుడు కాకుండా చెరువు ఆక్రమణ ?

గుట్టుచప్పుడు కాకుండా చెరువు ఆక్రమణ ?

*ప్రభుత్వ ఆస్తుల రక్షణ పట్టని అధికారులు..

పలమనేరు నేటి ధాత్రి

పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్దపంజాణి మండలం రాయలపేట సమీపం,గంకొండ రెవెన్యూ గ్రామం తురకవాని కుంట చెరువు సర్వేనెం 18-2 నందు 7ఎకరాల 50 సెంట్ల ప్రక్కనే ఉన్న ఓ అక్రమార్కుడు రాత్రికి రాత్రే చెరువు భూమిని అర్థానికి పైగా ఆక్రమించడమే కాకుండా భారీవాహనాలను ఉపయోగించి బండలను సైతం చెరువులోకి తోసి పూడ్చివేశారు.

కోట్లాది రూపాయల విలువైన భూములపై అక్రమార్కుల కన్ను

ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.పైగా అధికారపార్టీ పెద్దలతో బాటు అధికారుల ఆశీస్సులు కూడా మెండుగా ఉండడంతో ప్రభుత్వ భూములు కనిపిస్తేచాలు ఇలా ఆక్రమించి తమ ఆధీనంలో పెట్టుబడులు, వాటికి నకిలీ రికార్డులు సృష్టించి,ఏమీ తెలియని అమాయకులకు లక్షలాది రూపాయలు తీసుకుని కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరుగుతోంది..

రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల మొద్దునిద్ర

ప్రభుత్వ భూములు,చెరువు భూములు ఇలా అన్యాక్రాంతం అవుతున్నా సంబంధిత రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు.ఇంతజరుగుతున్నా ఈ అక్రమణలపై నోరు విప్పిన అధికారులపట్ల పలు అనుమానాలు కలుగుతున్నట్లు పలువురు గుసగుసలు ఆడుతున్నారు.ఇప్పటికైనా ఇటువంటి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి,కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.!

జర్నలిస్టు కాలనీ స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్య
లు తప్పవు బెల్లంపల్లి తహసిల్దార్ జోష్ణ.

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

 

బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదా
రిని ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీ స్థలంలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్లాటింగ్ చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేయడంతో రెవె
న్యూ అధికారులు బుధవారం తొలగిం
చారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల కిందట జర్నలిస్టు కాలనీ లోని స్థలంలోకొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా సిమెంటు పోల్స్ పాతిస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు(టేకు
లబస్తీ) జర్నలిస్టు కాలనీకి వెళ్లి క్షేత్ర
స్థాయిలో పరిశీలించి సంబంధిత తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్లను విషయాన్ని వివరించి స్థలాన్ని రక్షించి అర్హులైన జర్నలిస్టులకు సంబంధిత స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయడం జరి
గింది. స్పందించిన బెల్లంపల్లి తహసీల్ జోష్ణ ఆదేశాల మేరకు బెల్లంపల్లి రెవెన్యూ ఆర్ఐ మురళీదర్ రెవెన్యూ సిబ్బంది సహాయంతో స్థలంలో పాతిన సిమెంట్ పోల్స్ ను తొలగించారు. ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి జర్నలిస్టు కాలనీ స్థలాన్ని రక్షించినందుకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జోష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హామీ హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీసుకున్న వర్కింగ్ జర్నలిస్టు
లందరికీ జర్నలిస్టు కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version