అంగన్వాడీ కేంద్రం లోపిల్ల లకు అక్షరాభ్యసo..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T170957.745.wav?_=1

 

అంగన్వాడీ కేంద్రం లోపిల్ల లకు అక్షరాభ్యసo.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండలం లోని శాంతినగర్ లో మంగళవారం రోజున రజిత టీచర్ అంగన్వాడీ కేంద్రం లో చిట్యాల సెక్టార్ సమావేశం కు ఐ సి డి ఎస్ సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం లో తుమ్మల అనిల్ తేజ దంపతుల కూతురు అను అనే బాలికకు అక్షరాబ్యాసం చేయించి పిల్లలతో టీచర్స్ అందరూ కలిసి ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఆట పాట పిల్లలతో చేయించడం మరియు ఎజెండా అంశాలను చదివి వినిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 30 మంది అంగన్వాడీ టీచర్స్ ఆయా కోమల పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు : ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T142916.012.wav?_=2

 

మృతుల కుటుంబాలకు : ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రానికి చెందిన కోడేల సమ్మయ్య మరియు కల్వచర్ల కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం రోజున తెలంగాణ తొలి శాసనసభపతి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సార్ వారి పార్థివ దేహాలను సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు. వారితోపాటు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, గ్రామపుర ప్రముఖులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

భూభారతిలో వచ్చిన ప్రతి దరఖాస్తును వేగంగా పరిష్కరించాలి.

భూభారతిలో వచ్చిన ప్రతి దరఖాస్తును వేగంగా పరిష్కరించాలి.

జిల్లాఅదనపు కలెక్టర్ అశోక్ కుమార్

చిట్యాల, నేటిదాత్రి :

 

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తాహ సిల్దార్ కార్యాలయాన్ని సోమవారం రోజున జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ (రెవిన్యూ ) తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి నివేదిక పై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసంబంధిత రికార్డుల నవీకరణ, పెండింగ్ కేసుల పరిష్కారం, ఫీల్డ్‌ వెరిఫికేషన్ పురోగతిని తహసీల్దార్ తో పరిశీలించారు. భూభారతి నివేదికలో చూపిన అంశాలను సమయానుకూలంగా సవరించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. భూముల సమస్యలపై ప్రజలు అనవసరంగా కార్యాలయాలకు తిరగకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని తాసిల్దార్ ను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహ సిల్దార్ సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-01T154602.029.wav?_=3

 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ ను సోమవారం రోజున భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ సందర్శించడం జరిగింది, అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి బాయిలర్ ను ఉపయోగించుకోవాలని తేమశాతం 17 లోపు ఉండేటట్లు రైతులు చూసుకోవాలని అన్నారు అనంతరం బాయిలర్ పనితీరును పరిశీలించి రైతులు ఉపయోగించుకునేటట్లు

అధికారులు చెప్పాలని అన్నారు, రైతుల తమ ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దని గిట్టుబాటు ధర వస్తున్న దాన్యం కొనుగోలు సెంటర్ నే రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మార్కెటింగ్ అధికారులు, తాహసిల్దార్ ఇమామ్ బాబా ఐకెపి సిసి రమణాదేవి, అగ్రికల్చర్ ఏఈఓ సోనీ తదితరులు పాల్గొన్నారు.

పి డి ఎస్ యు దాడీ ని ఖండిస్తున్నాం.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-13T151215.162.wav?_=4

 

పి డి ఎస్ యు దాడీ ని ఖండిస్తున్నాం.

చిట్యాల,నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో ట్రస్మా ప్రైవేటు పాఠశాలల చిట్యాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందిహనుమకొండ పట్టణంలోని డిజి స్మైల్ స్కూల్ పైన బుధవారం రోజున పిడిఎస్యు విద్యార్థి సంఘ సభ్యులు చందా వసూళ్లకు పోయి ఆ పాఠశాల పైన దౌర్జన్యం చేసి పాఠశాల కరస్పాండెంట్ ను కొట్టడం జరిగింది దానికి నిరసనగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురు వారం రోజున పాఠశాల బంద్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ట్రస్మా గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ రాజ్ మహమ్మద్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రమేష్ టేకుమట్ల మండలం నుండి జిల్లా ఈసీ మెంబర్ మియాపూర్ హరీష్ జిల్లా మెంబర్ గొల్ల సతీష్ కుమార్ బండి సంపత్ కుమార్ శ్రీధర్ మొగుళ్ళపల్లి మండలం నుండి శ్రీనివాస్ రవికుమార్ మొదలగు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి…

అంగన్వాడి టీచర్లు ఆయాలు సమయపాలన పాటించాలి.

జిల్లా ఇన్చార్జి డి డబ్ల్యు ఓ మల్లేశ్వరి.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నైన్ పాక సెక్టార్ మీటింగ్ ఒడితల లక్ష్మి టీచర్ కేంద్రంలో జయప్రద సూపర్వైజరు సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి బీడబ్ల్యుఓ మల్లేశ్వరి హాజరై అంగన్వాడి కేంద్రాలలో జరుగు కార్యక్రమాల గూర్చి వివరించారు. టీచర్ ,ఆయా సమయపాలన కచ్చితంగా పాటించాలి. ప్రీస్కూల్ కార్యక్రమాలన్నీ ఆట ,పాట ,కథ ద్వారా నేర్పించాలి. మెనూ ప్రకారం పిల్లలకు, తల్లులకు వేడిగా రుచిగా భోజనం పెట్టాలి. ఆన్లైన్ వర్క్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేయాలి. కొత్తగా లబ్ధిదారులు వచ్చిన వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ , ఫేస్ క్యాప్చర్ అయిన తర్వాతనే ఫుడ్ ఇవ్వాలని సూచించారు తదుపరి ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. లక్ష్మి, ఉమాదేవి, సుజాత మిగతా 25 మంది టీచర్స్ హాజరైనారు.

ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు….

ఐసీడి ఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ లకు శ్రీమంతాలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలం లోని కాల్వపల్లి అంగన్వాడీ కేంద్రంలో తిరుమల, విజయ ఏర్పాటు చేసిన తల్లుల సమావేశానికి జయప్రద సూపర్వైజర్ హాజరై అంగన్వాడీ కేంద్రాలలో జరుగు కార్యక్రమాలు పూర్వ ప్రాథమిక విద్య, సంపూర్ణ భోజనం, పిల్లల బరువు, ఎత్తులు, లోప పోషణ, బాల్యవివాహాలు, దత్తత, కిశోర బాలికల చదువు, వృత్తి విద్య కోర్సులపై అవగాహన కల్పించనైనది. ఇందులో భాగంగా ఒక గర్భవతికి శ్రీమంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ సృజన మహిళలు, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి ,ఫర్జానా హాజరైనారు

చిట్యాల లో చందాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తున్న కలెక్టర్…

చిట్యాల లో చందాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ప్రొసీడింగ్స్ తీసుకొని నిర్మాణం చేపట్టని వారు త్వరగా నిర్మాణాలను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు శుక్రవారం జిల్లా కలెక్టర్ చందాపూర్, చిట్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోందని, పనులను నాణ్యవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురబి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నగదు పడే విధంగా చూడాలని, పెండింగ్ సమస్యలు ఏమైనా ఉంటే నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ఇసుకకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. చందాపూర్ గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, గృహ నిర్మాణ శాఖ డి ఈ విఠోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో,అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ సత్కారం

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

చిట్యాల, నేటిదాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది…ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయరాదని ఉన్న జీవోను రద్దు చేయించి ముగ్గురు పిల్లలు ఆ పైన ఉన్న కూడా స్థానిక సంస్థల పోటీ చేయొచ్చు అనే జీవోను ఇప్పించినందుకు గాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో *చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య,మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండెపరెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మట్టికి రవీందర్, *సీనియర్ నాయకులు సిరిపురం కుమారస్వామి ,కొర్రి సాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ జయశంకర్ కన్వీనర్‌గా ముక్క యుగంధర్ నియామకం

ఎన్ఎస్ఎస్ జయశంకర్ జిల్లా కన్వీనర్ గా ముక్క యుగేందర్ నియామకం.

చిట్యాల, నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ముక్క యుగంధర్ ను ను ఎన్ఎస్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా నియమించినట్లు ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ తెలిపారు. శుక్రవారం రోజున యుగేందర్ పూర్వపు కన్వీనర్ ప్రసన్నకుమార్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని, ఉత్సాహంగా రానున్న రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా కన్వీనర్ రాంబాబు, జనగాం జిల్లా కన్వీనర్ జంబు, ములుగు జిల్లా కన్వీనర్ ప్రసన్నకుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

సిపిఆర్ తో ప్రాణాలు కాపాడొచ్చు…

సిపిఆర్ తో ప్రాణాలు కాపాడొచ్చు.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిపిఆర్ పై అవగాహన వారోత్సవాల సందర్భంగా జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ సిబ్బంది చిట్యాల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నగేష్ కుమార్ స్వయంగా సిపిఆర్ చేసి విద్యార్థులకు చూపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఆర్ కార్డియో ఫల్మనరీ రీసెస్సిటేషన్ తో ప్రాణాలు కాపాడొచ్చు అన్నారు. సిపిఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని ఎవరికైనా శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సిపిఆర్ లో ప్రధానంగా చాతిని గట్టిగా వేగంగా నొక్కడం గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే అందించవలసిన అత్యవసర చికిత్స అని తెలిపారు. అకస్మాత్తుగా కార్డియాక్
అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడవచ్చు అన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయితే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూనే వాహనం వచ్చేవరకు సిపిఆర్ చేస్తే ప్రాణాలు దక్కుతాయి అని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసే విధానం పై విద్యార్థులకు నగేష్ కుమార్ అవగాహన కల్పించారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 108 టెక్నీషియన్ నగేష్ కుమారును పైలెట్ రాజు ను స్కూల్ యాజమాన్యం అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఉపాధ్యాయులు రాకేష్ 108 పైలెట్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం..

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం.

సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో *సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు సంతానం ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయుట అనర్హులని జీవో తీసుకువచ్చినప్పటి నుండి ముగ్గురు సంతానం కలిగిన వారు రాజకీయానికి దూరంగా ఉన్నారు,సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు పిల్లలుంటే పోటీకి అర్హులని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముగ్గురు పిల్లల జీవోను రద్దుచేసి ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలున్న ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో…..
ఈ రాష్ట్రంలో ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లలు సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులని జీవోను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కి మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకుశుక్రవారం రోజున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ జీవోను తీసుకొచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రివర్యులకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు రాజేష్ ఖన్నా, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టికే రవీందర్, నల్లబెల్లి విజేందర్ ,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిపురం కుమారస్వామి కొర్రి సాంబశివుడు ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండె పు రెడ్డి రవీందర్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ రావు ,బొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు…

ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

గుంపల్లి మునీశ్వర్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రైతు భవన్ లో ఏఐటీయూసీ హమాలి యూనియన్ అవగాహన సదస్సు కార్మిక యూనియన్ అధ్యక్షులు లంకదాసర అశోక్ అధ్యక్షతనలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంపల్లి మునీశ్వర్ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన కార్మికుల పరిస్థితి మరింత అద్వానంగా ఉన్నదని ఏఐటియుసి పోరాటాలతో 50 కిలోల బస్తాలు వచ్చాయని హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వం నుండి తగిన ఆదరణ లేకపోవడం దారుణమని అన్నారు.బరువులు మోసేటప్పుడు లారీల నుండి దించేటప్పుడు ఎత్తేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని కాళ్లు చేతులు విరిగిన ప్రాణాలు పోయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఠా జట్టు హమాలీల సంక్షేమ బోర్డును పునర్దించాలని మన మార్కెట్లో దడ్వాయిలు,కాంట్రవెస్తూ అటు రైతులకు హమాలి కార్మికులకు చేదోడు వాదోడుగా

ఉంటున్నారు.మార్కెట్లో ప్రధానంగా మార్కెట్ యార్డ్ లో పనిచేసే వారందరూ రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు ఎండి చాలీచాలని ఆదాయంతో బతుకుతున్నారని అన్నారు. మార్కెట్లో పనిచేసే హమాలీ దడువాయి,గంపకూలి కార్మికులకు పని భద్రత కల్పించాలని,రైతు ప్రజా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మికులకు ప్రమాద బీమా నష్టపరిహారం మూడు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని మార్కెట్లో పనిచేస్తున్న వారందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని మరియు కార్మికులందరికీ 3000 యూనిఫామ్ ను ప్రతి సంవత్సరం ఇవ్వాలని,మార్కెట్ యార్డ్ కార్మికుల లైసెన్స్ రెన్యువల్ చేసి 58 నుంచి 60 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మార్కెట్ యార్డుల పాలకవర్గంలో కార్మికుల నుంచి ఇద్దరికీ డైరెక్ట్ గా అవకాశం కల్పించాలని యార్డులో క్యాంటీన్ మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్,ఏ ఐ టి యు సి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్,కార్మిక నాయకులు కోడే పాక ఐలయ్య,కోకిల శంకర్, కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరే రవి,ధార్వా యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్,గంపకూలి లచ్చమ్మ తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు.

దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దు..

దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దు.

మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణంలో పత్తి సాగు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా విక్రయాలు చేసేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆవరణలో పత్తి విక్రయాలపై సూచనలతో కూడిన వాలు పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి రైతులు ముందస్తు కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ చేసుకొని సమీపంలో మిల్లుల వద్ద విక్రయించుకోవాలని పంట నమోదు తో పాటు బ్యాంకుకు తమ ఆధార్ కార్డును లింకు చేసుకోవాలని సూచించారు దళారులకు పత్తి అమ్మి రైతులు మోసపోవద్దని ఆమె తెలిపినారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి షరీఫ్ సూపర్వైజర్ రాజేందర్ రైతు సోదరులు మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది పడిదెల దేవేందర్ అల్లం సమ్మయ్య పాల్గొన్నారు.

శ్రీయుత పత్రిక విలేకరులకు నమస్కారాలు…

శ్రీయుత పత్రిక విలేకరులకు నమస్కారాలు…

ప్రచురణార్థం…

సిపిఆర్ తో ప్రాణాలు కాపాడొచ్చు.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిపిఆర్ పై అవగాహన వారోత్సవాల సందర్భంగా జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ సిబ్బంది చిట్యాల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నగేష్ కుమార్ స్వయంగా సిపిఆర్ చేసి విద్యార్థులకు చూపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఆర్ కార్డియో ఫల్మనరీ రీసెస్సిటేషన్ తో ప్రాణాలు కాపాడొచ్చు అన్నారు. సిపిఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని ఎవరికైనా శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సిపిఆర్ లో ప్రధానంగా చాతిని గట్టిగా వేగంగా నొక్కడం గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే అందించవలసిన అత్యవసర చికిత్స అని తెలిపారు. అకస్మాత్తుగా కార్డియాక్
అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడవచ్చు అన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయితే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూనే వాహనం వచ్చేవరకు సిపిఆర్ చేస్తే ప్రాణాలు దక్కుతాయి అని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసే విధానం పై విద్యార్థులకు నగేష్ కుమార్ అవగాహన కల్పించారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 108 టెక్నీషియన్ నగేష్ కుమారును పైలెట్ రాజు ను స్కూల్ యాజమాన్యం అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఉపాధ్యాయులు రాకేష్ 108 పైలెట్ రాజు తదితరులు పాల్గొన్నారు.

శ్రీయుత పత్రిక విలేకరులకు నమస్కారాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-17T144803.973-1.wav?_=5

 

శ్రీయుత పత్రిక విలేకరులకు నమస్కారాలు…

ప్రచురణార్థం…

సిపిఆర్ తో ప్రాణాలు కాపాడొచ్చు.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిపిఆర్ పై అవగాహన వారోత్సవాల సందర్భంగా జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ సిబ్బంది చిట్యాల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నగేష్ కుమార్ స్వయంగా సిపిఆర్ చేసి విద్యార్థులకు చూపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఆర్ కార్డియో ఫల్మనరీ రీసెస్సిటేషన్ తో ప్రాణాలు కాపాడొచ్చు అన్నారు. సిపిఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని ఎవరికైనా శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సిపిఆర్ లో ప్రధానంగా చాతిని గట్టిగా వేగంగా నొక్కడం గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే అందించవలసిన అత్యవసర చికిత్స అని తెలిపారు. అకస్మాత్తుగా కార్డియాక్
అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడవచ్చు అన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయితే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూనే వాహనం వచ్చేవరకు సిపిఆర్ చేస్తే ప్రాణాలు దక్కుతాయి అని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసే విధానం పై విద్యార్థులకు నగేష్ కుమార్ అవగాహన కల్పించారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 108 టెక్నీషియన్ నగేష్ కుమారును పైలెట్ రాజు ను స్కూల్ యాజమాన్యం అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఉపాధ్యాయులు రాకేష్ 108 పైలెట్ రాజు తదితరులు పాల్గొన్నారు.

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ…

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టై బ్యాడ్జి బెల్టుల పంపిణీ@
స్థానిక జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల కోసం దాతల సహాయంతో టై, బ్యాడ్జి బెల్టులను ఎంఈఓ రఘుపతి పంపిణీ చేశారు.
ఇందుకోసం పొగళ్ల మహేందర్ రెడ్డి, దేవ శ్రీధర్,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో విద్యార్థులకు ఎం ఈ వో రఘుపతి వీటినిపంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సదయ్య, కూచనపల్లి.శ్రీనివాస్, పిడి సూధం సాంబమూర్తి, రామనారాయణ, ఉస్మాన్ అలీ, నీలిమ రెడ్డి సరళ దేవి,కల్పన, విజయలక్ష్మి, సుజాత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందించిన తోటి స్నేహితులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T133358.203.wav?_=6

 

ఆర్థిక సహాయం అందించిన తోటి స్నేహితులు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన జాలిగపు సునీల్ గారి తల్లిగారు మరణించడంతో వారి కుటుంబానికి అండగా సునీల్ గారి స్నేహితులైన సన్రైజర్స్ చారిటబుల్ ట్రస్ట్ 99 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు 10000వేల రూపాయల చెక్ అందించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిని, మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ దశాబ్ద కాలం పైగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను సామాజికంగా మరియు రాజకీయంగా చైతన్య పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేయబోతుందని చిట్యాల మండల కేంద్రంలో భూపాలపల్లి జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్ అన్నారు.
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.

చిట్యాల, నేటిధాత్రి :

రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version