ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భగీరథ మహర్షి జీవిత విధానం, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి సేవలు ఆదర్శంగా తీసుకోవాలి అని ఎమ్మెల్యే సత్యనారాయణ
గురువారం ఐడిఓసి కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు కల్లు గీత కార్మికుల కోసం రక్షక కవచం శిక్షణ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భగీరథ మహర్షి జీవిత విధానం, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అలాగే కల్లు గీత కార్మికుల భద్రత ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, వారికి అవసరమైన రక్షణ పరికరాలు వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర సంబంధిత అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్లు ప్రజా సంఘాలు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version